బీజేపీతో టీడిపి పొత్తు వెనక చంద్రబాబు వ్యూహం ఏమిటి ???

 

చంద్రబాబు  ఊరకే పొత్తులకు వెళ్లరు. ఆయన జనసేనను చేరదీసినా బీజేపీతో దోస్తీ చేసినా పక్కాగా లెక్క ఉంటుంది. ఏపీలో బీజేపీతో పొత్తు టీడీపీకి ఏమి లాభం అన్న చర్చను అందరూ చేస్తున్నారు. వాస్తవంగా చూస్తే అదే నిజం అని కూడా అనిపిస్తుంది. అర శాతం ఓట్లు ఉన్న బీజేపీకి ఏపీలో నలభై శాతం ఓట్లు ఉన్న టీడీపీకి పొత్తు ఏమిటి అని ఆశ్చర్యం ప్రకటించేవారూ ఉన్నారు. కానీ చంద్రబాబు ఊరకే పొత్తులకు వెళ్లారు. ఆయన జనసేనను చేరదీసినా బీజేపీతో దోస్తీ చేసినా పక్కాగా లెక్క ఉంటుంది.  జనసేనతో పొత్తు వల్ల ఒక బలమైన సామాజిక వర్గం టీడీపీ వెంట నడుస్తుంది. అలాగే సినీ గ్లామర్ కలిగిన పవన్ వెంట ఉంటే కామన్ ఓటర్ ఒపీనియన్ చేంజ్ అవుతుంది. ఇక యూత్ ఓట్లు కూడా టీడీపీకి టర్న్ అవుతాయి. ఎలక్షనీరింగ్ లో జనసేన క్యాడర్ సాయం కూడా ఆయాచితంగా లభిస్తుంది.దాంతోనే ఎవరు ఏమి అనుకున్నా చంద్రబాబు జనసేనకు సీట్లు ఇస్తూ పొత్తులను కుదుర్చుకుంటున్నారు. ఈ రెండు పార్టీల పొత్తు ఓకే అయింది. ఇక ఇపుడు చూస్తే బీజేపీ విషయం. బాబు ఇటీవల స్వయంగా ఢిల్లీ వెళ్లి మరీ పొత్తులు పెట్టుకుని వచ్చారని టాక్. బీజేపీ కోరిన సీట్లు ఇచ్చేందుకు కూడా అంగీకరించారు అన్నది మరో ప్రచారం. ఇలా చేయవచ్చా అన్నది కూడా సొంత పార్టీతో పాటు బయట కూడా చర్చ సాగుతోంది. కానీ ఏపీలో జగన్ ని కట్టడి చేయాలంటే బీజేపీ సాయం తప్పసరి అని బాబు భావిస్తున్నారు. నిజానికి చూస్తే ఇదే కరెక్ట్ స్ట్రాటజీ అని కూడా అంటున్నారు. జగన్ అధికారంలో ఉన్నారు. ఎలక్షనీరింగ్ లో ఆయన్ని కొట్టడం టీడీపీకి ఈ టైం లో చాలా కష్టం. ఆయనకు తోడు బీజేపీ సెంటర్ లో పవర్ లో ఉంది. బీజేపీ ప్లస్ జగన్ అంటే అగ్నికి వాయువు తోడు అయినట్లే.  దాంతో పోల్ మేనేజ్మెంట్ లో టీడీపీ దారుణంగా దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి. అంతే కాదు బూతుల వద్ద టీడీపీకి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు వచ్చినా పట్టించుకునే నాధుడు ఉండడని అంటున్నారు. అందువల్ల కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీని తమ వైపు తిప్పుకుంటే జగన్ ని కట్టడి చేయవచ్చు అన్నదే టీడీపీ ఎత్తుగడ. అంతే కాదు మనీ ఫ్లో విషయంలో కూడా ఫ్రీ మూమెంట్ ఉండాలీ అంటే కేంద్రంలో పవర్ లో ఉన్న బీజేపీ అండ కావాలి. బీజేపీని తమ వైపు తిప్పుకుంటే అర్ధ బలం అంగబలం ఒకేసారి టీడీపీ జట్టులోకి వచ్చేస్తాయి. అందుకే చంద్రబాబు తెలివిగానే పావులు కదిపారు అని అంటున్నారు. అయితే బీజేపీ అడిగిన సీట్లు ఇచ్చేస్తే ఈ లాభం కాస్తా గూబల్లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుందని అంటున్నారు.  ఇపుడు చూస్తే బీజేపీని అవును అనిపించుకుంటే ఆ తరువాత చంద్రబాబు చాణక్యంతో సీట్ల సర్దుబాటులోనూ పై చేయి సాధిస్తారు అని అంటున్నారు. అంతేకాక బిజెపి ఈవీఎంల ద్వారా గోల్మాల్ చేసి అధికారంలోకి వస్తుందని, లేదంటే అవతలి పార్టీకి చెందిన   ఎమ్మెల్యేలను కొనుగోలు చేసో  అధికారంలోకి రావడం లేదా తమతో చేయి కలపని  పార్టీలు అధికారంలోకి వస్తే ప్రభుత్వాన్ని పడగొట్టడం వంటి అనేక కుట్రలకు పాల్పడుతుందని ప్రతిపక్షాలు కోడై కూర్చున్న విషయం తెలిసిందే . ఈ కిటుకులు తెలిసిన   వారు ఏపీలో ఇద్దరే ఇద్దరు. ఒకరు చంద్రబాబు. రెండవ వారు జగన్.తాము కానీ తమ ప్రభుత్వాలు గానీ మనుగడ సాధించాలంటే బిజెపి సాయం తప్పనిసరి కాబట్టి ఆ ఇద్దరు  అందుకే ఒకరి తరువాత ఒకరు ఢిల్లీ టూర్లు చేశారు అని అంటున్నారు.

7k network
Recent Posts

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్

👉జగన్ గురించి లోకేష్ ఏం చెప్పారంటే ? …👉 కాల్పుల విరమణను అతిక్రమించి బీరుట్ పై ఇజ్రాయిల్ దాడి…👉 మళ్లీ మొదటికి: లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో హోర్మూజ్ మూసివేత!…👉 కేరళలో కామ్రేడ్స్ గెలుస్తారా…కామ్రేడ్స్ ఉనికి నిలుస్తుందా ?… 👉 ఇండియాలో జాంబీ డ్రగ్ క‌ల‌క‌లం!😱…👉ఒంగోలులో డ్రగ్స్ పై అవగాహన…👉పోలీసులే డ్రంకెన్ డ్రైవ్ చేస్తే ఎలా..? నిలదీసిన యువకుడు – గుంటుపల్లి హైవేపై ఘటన*

👉పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనుల సమీక్ష కార్యక్రమం…👉బెంగాల్ లో మరో రచ్చ.. 91 లక్షల ఓట్లు అవుట్😲 …👉అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు*…👉మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుపుతాం.. ఎమ్మెల్యే కందుల…