సోనియాతో పీవీకి విభేదాలు ఎందుకు వచ్చాయి…????

ఎంత చెప్పుకున్నా పీవీ గురించి తక్కువే. ఆయన రాజకీయ జీవితంలో ఎక్కని మెట్లు లేవు. ఆయనకు రాని బిరుదులు లేవు . పీవీ నరసింహారావు గ్రేట్ లీడర్. అందులో నో డౌట్. ఆయన లాంటి రాజకీయ వైతాళికుడిని ఈ దేశం గతంలో చూసి ఉండదు, భవిష్యత్తులో అసలు చూడదు. ఆయన బహు ముఖ ప్రజ్ఞాశాలి. ఆయన పదహారు భాషలలో పట్టు సాధించిన వారు. రాజకీయ నాయకుడు కాదు రాజకీయ వేత్త. మేధావి అపర చాణక్యుడు. మౌనం కూడా ఒక నిర్ణయమే అన్న కొత్త సూత్రాన్ని కనిపెట్టి లోకానికి పరిచయం చేసిన జ్ఞాని.
ఇలా ఎంత చెప్పుకున్నా పీవీ గురించి తక్కువే. ఆయన రాజకీయ జీవితంలో ఎక్కని మెట్లు లేవు. ఆయనకు రాని బిరుదులు లేవు. ఇపుడు ఆయన భారత రత్నం అయ్యారు. నిజంగా ఆ అవార్డుకు ఆయన నూటికి నూరుపాళ్ళూ అర్హుడు. ఎందుకంటే తొలి ప్రధాని పండిట్ నెహ్రూ దేశాన్ని ఒక దశలో దిశలో నడిపించారు. అలా నాలుగున్నర దశాబ్దాల ప్రయాణం తరువాత దేశం గమనం ఇబ్బందులలో పడినపుడు ఈ దేశం బంగారాన్ని సైతం అమ్ముకునే స్థితి ఏర్పడినపుడు ఆర్ధిక సంస్కరణలతో కొత్త మలుపు తిప్పి ఈ రోజు నవీన భారతానికి పునాది వేసిన మహనీయుడు పీవీ కాకుండా భారత రత్నం మరెవరు అవుతారు పీవీకి పదవుల మీద వ్యామోహం లేదు. ఆయన రాజకీయాల్లో ఉన్నా తామరాకు మీద నీటి బొట్టు చందంగా ఉండేవారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదు. కానీ ఉమ్మడి ఏపీలో ఆయన ముఖ్యమంత్రి అయి కొన్నాళ్ళు ఆ పదవిలో ఉన్నారు. ఇక కేంద్ర రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. విదేశాంగ శాఖ నుంచి మానవ వనరుల శాఖ నుంచి హోం శాఖ వరకూ ఎన్నో చేపట్టి అన్నింటికీ వన్నె తెచ్చారు. ఆయన చేపట్టని ఒకే ఒక పదవి ప్రధాని అని అప్పట్లో అంతా అనుకునేవారు. అలాంటి పీవీ తట్టా బుట్టా సర్దుకుని ఇక ఈ రాజకీయం చాలు అని హైదరాబాద్ కి వెళ్ళిపోదామని అనుకుంటున్న వేళ రాజీవ్ గాంధీ దారుణ హత్య జరిగింది. అది 1991 మే 21. అప్పటికి కొన్ని దశల లోక్ సభ ఎన్నికలు ముగిసాయి. ఆ దుర్ఘటన తరువాత కాంగ్రెస్ పార్టీ అంతా కలసి పీవీనే కాంగ్రెస్ కి నాయకత్వం వహించమని కోరింది. అలా ఆయన తాను వద్దనుకున్న బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. అదే ఏడాది జూన్ లో కాంగ్రెస్ నాయకత్వంలో మైనారిటీ ప్రభుత్వానికి ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు అలా అయిదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడపడంలో ఆయన సమర్ధత చాలా గొప్పది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ లో ప్రధానిగా ఏఐసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు ఒక్కరే నిర్వహించడం నెహ్రూ ఇందిర రాజీవ్ తరువాత పీవీకే దక్కింది వారంతా ఒకే కుటుంబం. కానీ నెహ్రూ గాంధీ కుటుంబేతరుడు ఇలా కీలక బాధ్యతలు మోస్తూ జాతీయ స్థాయిలో అయిదేళ్ల పాటు గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ కి లీడర్ గా ఉండడం అంటే అది గొప్పగా చూడాలి. ఆ సమయంలో సోనియాగాంధీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ లో ఉన్న వర్గ పోరు నాటి సీనియర్ నేతలు కొందరు పీవీ మీద పనిగట్టుకుని సోనియాగాంధీకి చాడీలు చెప్పేవారు అని ప్రచారంలో ఉన్న మాట. పీవీ సైతం తన రాజకీయ ఠీవిని ఏనాడూ కోల్పోలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడుగా ఉన్నారు. పార్టీ మేలు కోసం పనిచేశారు. ఆయన భజన బృందాల మాదిరిగా వ్యవహరించలేదు. బహుశా ఈ కారణాలే ఆయనకు సోనియాగాంధీకు మధ్య గ్యాప్ ని పెంచాయని అంటారు. ఎంతలా అంటే సోనియా గాంధీకి పీవీ పొడ గిట్టనంత అని చెబుతారు. పీవీకి రాజకీయాల మీద వ్యామోహంలేదు. పార్టీని తన వారసులకు ఇవ్వాలన ఆశ అంతకంటే లేదు. కానీ ఆయన కాంగ్రెస్ ని కష్టకాలంలో నిలబెట్టి తాను కష్టాల పాలు అయ్యారు. ఆయన గాంధీ కుటుంబానికి గిట్టని వారు అని భజన బృందాలు చేసిన ప్రచారానికి బలి అయ్యారు. కాంగ్రెస్ ని నిలబెట్టడం కోసం ఆయన మైనారిటీ ప్రభుత్వాన్ని రక్షించడానికి చూస్తే చివరికి అదే ఆయనకు ఇబ్బందిగా మార్చాయి దశాబ్దాల బంధం కాంగ్రెస్ తో ఉన్న పీవీ చివరికి అదే కాంగ్రెస్ లో ఒంటరి అయ్యారు. దేశాన్ని పాలించిన ప్రధానులు చనిపోతే ఢిల్లీలో వారికి అంత్యక్రియలు జరిపిస్తారు. కానీ పీవీకి మాత్రం ఆ అవకాశం దక్కలేదు. ఆయన చనిపోయేనాటికి దేశంలో కాంగ్రెస్ నాయకత్వాన యూపీయే వన్ ప్రభుత్వం ఉంది. అయినా ఆయన భౌతిక కాయాన్ని సొంత స్టేట్ అయిన ఏపీకి తీసుకుని వెళ్లేలా కొన్ని పరిణామాలు జరిగాయి. ఇంతకీ ఆయన కాంగ్రెస్ పెద్దలకు చేసిన అపకారం ఏమిటి అన్నది చూస్తే జవాబు ఏమీ లేదు. ఎందుకంటే ఏమీ చేయలేదు కాబట్టి. కానీ రాజకీయాల్లో ఎంతటి మహా శిఖరం అయినా కొన్నింటికి ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అలా పీవీ రాజకీయాలలో చివరి పుటలను చూడాలి.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్