రాహుల్ గాంధీ ఇంక పాదయాత్రతో లాభం లేదు…!!!

కాంగ్రెస్ అగ్ర నేత, ఆ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్ధిగా రేసులో ఉన్న రాహుల్ గాంధీ పాదయాత్ర చేసుకుంటూ పోతున్నారు కాంగ్రెస్ అగ్ర నేత, ఆ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్ధిగా రేసులో ఉన్న రాహుల్ గాంధీ పాదయాత్ర చేసుకుంటూ పోతున్నారు. అయితే ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ ఆయన పాదయాత్ర చేయడం వల్ల ఏమైనా లాభం ఉందా అన్న చర్చ వస్తోంది. నిజానికి పాదయాత్రలైనా మరేమైనా ఎన్నికలకు మూడు నెలల ముందు పూర్తి చేసుకోవాలి.

ఆ మీదట ఎన్నికల వ్యూహాలు రచిస్తూ వార్ రూం లో ఫుల్ బిజీగా ఉండాలి. కానీ రాహుల్ 2022 సెప్టెంబర్ 7 నుంచి భారత్ జోడో యాత్ర చేపట్టారు. అది నాలుగు వేల కిలోమీటర్ల ద్వారా సాగింది. బాగా రెస్పాన్స్ వచింది. దాని వల్ల కర్నాటక తెలంగాణాలో పార్టీ గెలిచింది. అయితే రాజస్థాన్ లో అధికారం పోయింది మధ్యప్రదేశ్ దక్కించుకోలేకపోయింది. అయితే ఆ తరువాత దాదాపు సంవత్సరం గ్యాప్ ఇచ్చిన రాహుల్ గాంధీ ఈ ఈ ఏడాది జనవరి రెండవ వారం నుంచి భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో రెండవ విడత యాత్ర చేపట్టారు. ఈ యాత్ర మార్చి నెలాఖరుకు పూర్తి అవుతుంది. అయితే అప్పటికే ఎన్నికలు ఏకంగా ముంచుకునే వస్తాయి. ఇలాంటి కీలక సమయంలో రాహుల్ యాత్ర చేసినా ప్రయోజనం ఏమి ఉంటుందని అంటున్నారు. అయితే రాహుల్ గాంధీ పాదయాత్రకు అలవాటు పడ్డారని అంటున్నారు. కానీ ఇది ఈ టైం లో రాంగ్ డెసిషన్ అని అంటున్నారు. రాహుల్ గాంధీ లాంటి అగ్ర నేతలు రాష్ట్రాల వారీగా కీలక ప్రాంతాలను చూసి భారీ బహిరంగ సభలు పెట్టుకోవాలి. అదే విధంగా ఎక్కడికక్కడ యువతతో భేటీ కావడం వారిని పార్టీ వైపుగా ఆకర్షించడం చేయాల్సి ఉంది అంటున్నారు. ఇపుడు వ్యూహాలు అవసరం అని అంటున్నారు. పాదయాత్రలకు ఇది అసలు టైం కానే కాదు అని అంటున్నారు. ముఖ్యంగా సోషల్ ఇంజనీరింగ్ చేసుకోవాలి. ఎవరేమిటి అన్నది అంచనాలకు రావాలి. తమ బలాలు ఏమిటి ఎదుటి వారి బలహీనతలు ఏమిటి అన్నది కూడా మధింపు చేసుకోవాలి. సరైన ప్రణాళిక ప్రకారం సాగాలి. ఇండియా కూటమి చూస్తే రోజు రోజుకీ చిక్కిపోతోంది. రాహుల్ పాదయాత్రలో ఉంటే మరో వైపు నితీష్ కుమార్ ఎన్డీయే కూటమిలోకి వెళ్లిపోయారు. మరో వైపు ఆప్ సొంతంగా ఎంపీలను ప్రకటించేస్తోంది. మమతా బెనర్జీ గుర్రు మీద ఉన్నారు. ఈ నేపధ్యంలో ఇండియా కూటమిని పటిష్టం చేసుకుంటూ ఎన్డీయే కూటమితో ఢీ కొట్టాల్సి ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ మాత్రం అలా తనకు అలవాటు అయిన పాదయాత్రను చేసుకుంటూ పోతున్నారు. ఎన్నికలకు అసలు టైం లేదు. కచ్చితంగా రెండు నెలల సమయం కూడా లేదు. ఈ టైం లో దేశంలోని 543 ఎంపీ సీట్లలో పరిస్థితి ఏమిటి అన్నది కూడా అంచనా వేసుకోవాలి. ప్రతీ ఎంపీ నియోజకవర్గంలో ఏ కులం బలం ఎంత అలాగే రాష్ట్రాల వారీగా అంశాలు తీసుకోవాలి. అక్కడ ఉన్న సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు కూడా బేరీజు వేసుకోవాలి. ఒక విధంగా చూస్తే ప్రతీ రోజూ యుద్ధమే చేయాలి. కానీ ఈ కీలకమైన టైం లో రాహుల్ గాంధీ మాత్రం కాళ్ళకు పని చెబుతున్నారు. పాదయాత్ర ఏమి లాభం చేకూరుస్తుందో కాంగ్రెస్ పెద్దలకే తెలియాలి. రాజకీయాలలో ఎపుడూ వ్యూహాలే గెలిపిస్తాయి. దానికి తోడు ప్రజాభిమానం ఉండాలి. కానీ కేవలం యాత్రలు చేసినంత మాత్రాన గెలుపు సాధ్యం అవుతుంది అనుకుంటే మాత్రం అది ఇబ్బంది అవుతుందని అంటున్నారు. మరి మార్చి దాకా పాదయాత్రే అంటూ ముందుకు పోతున్న రాహుల్ గాంధీకు ఎవరు చెబుతారో తెలియదు కానీ ఆయన పాదాలు ముందుకు కదులుతూంటే కాంగ్రెస్ కి సరైన దిశా నిర్దేశం లేక వెనకబడిపోతోంది. 2024 ఎన్నికల యుద్ధంలో బీజేపీ ముందుకు పోతోంది. ఇదీ ప్రస్తుతం జాతీయ స్థాయిలో రాజకీయ ముఖ చిత్రం. మరి కాంగ్రెస్ కానీ రాహుల్ కానీ తమ యాక్షన్ ప్లాన్ మార్చుకుని ఎన్నికలకు రెడీ అవుతారా అంటే చూడాల్సిందే???

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్