మోడీతో జగన్ ..అమిత్ షా తో చంద్రబాబు..మధ్యలో పవన్

మలుపులు తిరుగుతున్న ఏపీ రాజకీయం

ఏపీ రాజకీయాలు ఓవర్ టూ ఢిల్లీ అన్నట్లుగా మారాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. ఏపీ రాజకీయాలు ఓవర్ టూ ఢిల్లీ అన్నట్లుగా మారాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. ఆయన బుధవారం ఢిల్లీకి వెళ్లారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళారు. ఇపుడు సడెన్ గా జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఆయన గురువారం సాయంత్రం గన్నవరం నుంచి బయలుదేరి రాత్రికి ఢిల్లీకి చేరుకుంటారు. గురువారం రాత్రి జగన్ ఢిల్లీలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. ఈ భేటీ సందర్భంగా ప్రధానితో పోలవరం ప్రాజెక్ట్ కి రావల్సిన నిధులు, విభజన హామీల గురించి తెలంగాణా నుంచి ఏపీకి రావాల్సిన నిధుల బకాయిల గురించి ముఖ్యమంత్రి చర్చిస్తారు అని అంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో సవరించిన అంచనాల నిధులు కూడా రావాల్సిన అవసరం గురించి కూడా ప్రధానిని ముఖ్యమంత్రి కోరనున్నారు అని చెబుతున్నారు. ఇక షెడ్యూల్ 9 లో ఉన్న విభజన ఆస్తులు నిధుల పంపకాలు కూడా జరగక గత పదేళ్ళుగా అలాగే ఉన్నాయని అంటున్నారు. వీటి మీద కూడా ప్రధానితో చర్చిస్తారు అని అంటున్నారు. సరే ఇవన్నీ సర్వ సాధారణమైన విషయాలు మామూలే అనుకున్నా జగన్ ఈ కీలక సమయంలో ఢిల్లీ వెళ్ళడమే రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకోంది అని అంటున్నారు. ఏపీలో బీజేపీ టీడీపీ జనసేనల మధ్యకొత్త పొత్తులు పొడుస్తున్న వేళ జగన్ ఢిల్లీ వెళ్ళడంతో రాజకీయంగా దీనిని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. చూడబోతే గడచిన అయిదేళ్ళుగా ఢిల్లీలోని మోడీ ప్రభుత్వంతో జగన్ సఖ్యత నెరిపారు. వైసీపీ బీజేపీల మధ్య జాతీయ స్థాయిలో అయితే అంతా సాఫీగా సాగుతున్న వ్యవహారంగా ఉంది… బయటకు చెప్పకపోయినా ఎన్డీయేకి తెర వెనక మిత్రుడిగా జగన్ ఉన్నారని అంటారు. అలా సాగిన జగన్ బీజేపీ బంధం ఈ పొత్తులతో బీటలు వారుతుందా అలా జరిగే అవకాశాలు ఎంతవరకూ ఉన్నాయి అన్నది ఆసక్తికరంగా ఉంది. అంతే కాదు ఏపీలో బీజేపీ టీడీపీతో జత కట్టడం వల్ల జగన్ కి రాజకీయంగా కలిగే లాభాలు నష్టాలు ఎంతవరకూ ఏమిటి అన్నది కూడా చర్చకు వస్తోంది. వీటిని బేరీజు వేసుకుంటూనే జగన్ బీజేపీ పెద్దలతో వీటి మీద కూడా మాట్లాడుతారా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక ఇపుడు జగన్ ఢిల్లీ వెళ్ళి ప్రధానితో భేటీ సందర్భంగా ఏపీకి సంబంధించిన విభజన అంశాలతో పాటు రాజకీయ అంశాలు కూడా చర్చిస్తారని కూడా అంటున్నారు.మోడీతో పాటుగా అమిత్ షాను కూడా జగన్ కలిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పొత్తుల విషయంలో బీజేపీ కీలక దశలో చర్చలు ఉన్న నేపధ్యంలో జగన్ ఢిల్లీకి సడెన్ గా టూర్ పెట్టుకోవడం మాత్రం సంచలనంగా ఉంది. ఏది ఏమైనా జగన్ తనదైన రాజకీయాన్ని ఢిల్లీలో ఈ విధంగా చూపిస్తారు అని అంటున్నారు. ఢిల్లీ తెర పైన ఏ రాజకీయం ఆవిష్కృతం కానుందో వేచి చూడాల్సిందే!!!

 

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!