పదునైన ఈడీ చక్రం బీజేపీ మీద దూసుకెళ్లదేం…???

ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దశాబ్దం క్రితం దీని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు .

ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దశాబ్దం క్రితం దీని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఆ మాటకు వస్తే సీబీఐ గురించి కూడా తెలియదు. జగన్ కేసుల పుణ్యమాని సీబీఐ ఈడీ అంటే ఏంటో అందరికీ తెలిసాయి. బహుశా అప్పటి నుంచే రాజకీయ ప్రత్యర్ధుల మీద ఈడీ సీబీఐ వాడకం కూడా బాగా పెరిగింది అని విమర్శలు కూడా ఉన్నాయి. ఈ రెండూ కేంద్ర దర్యాప్తు సంస్థలు. ఎవరు కేంద్రంలో పాలిస్తూంటే వారి ప్రత్యర్ధుల పాపాలు పండినట్లే. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉంటే గుజరాత్ లో హోం మంత్రిగా ఉన్న అమిత్ షా సీబీఐ ద్వారా అరెస్ట్ అయి జైలు పాలు అయ్యారు. అదే అమిత్ షా కేంద్రంలో హోం మంత్రి కాగానే నాటి హోం మంత్రి చిదంబరం అచ్చంగా 105 రోజుల పాటు జైలులో మగ్గాల్సి వచ్చింది. ఇక ఈడీ చక్రం పదునుగా ఉంటుంది. అది దూసుకుని వస్తే ఇంతే సంగతులు. ఈడీ దాడులు అంటూ తరచూ వార్తలు వస్తున్నాయి. ఈడీ సీఎంలను వదలడంలేదు. ఇటీవలే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఈడీ బాధితుడిగా మారి అరెస్ట్ అయి తన సీఎం పదవిని కోల్పోయారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి ఈడీ పిలుపులు పదే పదే వస్తున్నాయి. ఈడీ కేవలం విపక్షాల మీదనే పనిచేస్తోందని, దాన్ని అలాగే ప్రయోగిస్తున్నారు అని ప్రతిపక్షాలు పార్లమెంట్ లోపలా బయటా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. దానికి పార్లమెంట్ లోనే ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ జవాబు పవర్ ఫుల్ గా ఇచ్చేశారు. అవినీతిని అంతం చేసేవరకు విశ్రమించేదిలేదు అని ప్రధాని అన్నారు. గొట్టిపాటి బుజ్జి’ మెజార్టీ మీదే లెక్క‌లు..! అంతే కాదు, కాంగ్రెస్‌ హయాంలో దర్యాప్తు సంస్థలను రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు అని ఆరోపించారు. దేశంలో అవినీతి నేతలకు విపక్షాలు సపోర్ట్‌ చేస్తున్నాయని హాట్ కామెంట్స్ చెశారు. ఇక మరో పోలిక కూడా చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో ఈడీ కేవలం 5 వేల కోట్ల రూపాయలే సీజ్‌ చేసిందని ఇక తమ హయాంలో లక్ష కోట్ల రూపాయల అక్రమ నగదు సీజ్‌ చేశామని ప్రధాని చెప్పుకున్నారు. అంతే కాదు విచారణ జరపడం దర్యాప్తు సంస్థల పని. వాటిపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఇలా ఈడీ పనితీరు మీద మోడీ సభలో గొప్పగా చెప్పారు అని అంటున్నారు. అయితే ఆయన చెప్పినట్లుగా అక్రమ నగదు లక్షల కోట్లలో ఈడీ సీజ్ చేయడం మంచి పరిణామమే. కానీ ఈడీ చక్రం ఎపుడూ విపక్షాల వైపే దూసుకుని వెళ్తోంది అన్నది కూడా ఒక ప్రచారంగా ఉంది. బీజేపీ నేతలలో అంతా మంచివారే ఉండరు కదా. రాజకీయం అన్న తరువాత నూరు శాతం పునీతులు ఉండే చాన్స్ లేదు కదా అని అంటున్నారు. అలా చూసుకుంటే బీజేపీ నేతల మీద ఈడీ దాడులు ఎందుకు లేవు అని అంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే చాలా మంది గతంలో ఒక పార్టీలో ఉన్నారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఓడాక బీజేపీ పంచన చేరారు. వారి మీద ఈడీ కేసులే లేవు. మరి ఇదేమిటి అన్న ప్రశ్న వస్తోంది. ఇది సగటు జనాల సందేహాలు. మరి వీటిని కూడా బీజేపీ పెద్దలు తీర్చాలి కదా. ఏది ఏమైనా ఈడీ సీబీఐ వంటి సంస్థలకు స్వంత్రంత్ర ప్రతిపత్తిని కల్పిస్తేనే తప్ప పూర్తి న్యాయం జరగదు అన్న వాదనలు ఉన్నాయి.

 

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*