దగా డిఎస్సి వద్దు.. కనిగిరిలో నిరసన

దగా డిఎస్సి వద్దు మెగా డీఎస్సీ కావాలి..  

మెగా డీఎస్సీ ద్వారా 25వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ కనిగిరి కమిటీ కార్యదర్శి అధ్యక్షతన కనిగిరి పట్టణంలోని సుందరయ్య భవనం నుంచి నిరుద్యోగులు భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. పామూరు బస్టాండు సెంటర్ లో మానవహారం నిర్వహించగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా చేయడానికి వీలు లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో డివైఎఫ్ఐ నాయకులకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ధర్నా వద్దకు వచ్చిన ఆర్డీవో ఆర్డిఓ జాన్ ఇర్విన్ కు వినతి పత్రం అందజేశారు . ప్రభుత్వం దృష్టికి నిరుద్యోగుల సమస్యలను నివేదిక రూపం ద్వారా పంపించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అందజేశారు.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న, యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు మీగడ.వెంకటేశ్వరరెడ్డి లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా అదిగో డీఎస్సీ ఇదిగో డీఎస్సీ అంటు నిరుద్యోగులను నిరంతరం మోసం చేసిందన్నారు.రాష్ట్రంలో 1.88లక్షల ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట కేవలం 1. 69లక్షలు మాత్రమే ఉన్నారని దాదాపు 18,520 ఖాళీగా ఉన్నాయని ఇవే కాక ఈనెల చివరి నాటికి మరో 5వేలమంది ఉపాధ్యాయులు రిటైర్డ్ అవుతున్నారని తెలిపారు. కేంద్రం చేబుతున్న లెక్కలు ప్రకారం 40వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 117జీవో పేరుతో మరో 10వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసిందని గుర్తు చేశారు. తెలుగు మిడియం తీసివేసి 15వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసిన ఘనత జగన్మోహనరెడ్డి ప్రభుత్వానిదే అన్నారు. జగనన్న ప్రభుత్వంలో 2వేల పాఠశాలలు మూసివేసిందని ఇప్పటికే రాష్ట్రంలో ఏకోపాద్యాయ పాఠశాలలు 9వేలు ఉన్నాయని ఇప్పుడు ప్రభుత్వం ఖాళీలు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె ఎఫ్ బాబు,అధ్యక్షులు కె వి పిచ్చయ్య , సిఐటియు జిల్లా కార్యదర్శి పీసీ కేశవరావు లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు డ్రాపౌట్ కావడం లేదా ప్రైవేటు స్కూళ్లలో జాయిన్ అవ్వడం జరుగుతుందని దాదాపు రెండేళ్లలో 6లక్షల మంది విద్యార్థులు ఇలా డ్రాపౌట్ అయ్యారని గుర్తుచేశారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించాలని దీక్షలు అనంతరం ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు నారాయణ, శ్రీను, మహమ్మద్ డీఎస్సీ అభ్యర్దులు కళ్యాణ్, రవి, జాస్మిని తదితరులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*