షర్మిల లూజ్…బాబు గెయిన్…!!!
అదే టైం లో వైసీపీ వ్యతిరేక ఓట్లను గంపగుత్తగా సొమ్ము చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న టీడీపీకే ఇది మేలు చేస్తుందని లెక్క ఉంది. ఏపీలో రాజకీయం ఏదో అనుకుంటే మరేదో అవుతోంది అని అంటున్నారు. దానికి కారణం ఏపీలో అటూ ఇటూ మోహరించి అధికార వైసీపీ విపక్ష టీడీపీ ఉండడమే. ప్రజలు కూడా ఈ రెండు పార్టీల మధ్యనే ఫిక్స్ అయిపోయారు. అయితే కొత్తగా ఎన్నికల ముందు ఎవరు వచ్చి బిగ్ సౌండ్ చేసినా ప్రభుత్వ వ్యతిరేకత మరింతగా పెరుగుతుందే తప్ప వారికి ఏ మాత్రం లాభం చేకూరదు అని అంటున్నారు. అదే టైం లో వైసీపీ వ్యతిరేక ఓట్లను గంపగుత్తగా సొమ్ము చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న టీడీపీకే ఇది మేలు చేస్తుందని లెక్క ఉంది. ఇపుడు చూడబోతే అదే నిజం అవుతోంది అని అంటున్నారు. ఇప్పటికి పదిహేను రోజుల క్రితం ఏపీలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల మొదటి అడుగు మొదటి పలుకు నుంచి జగన్ మీదనే విమర్శలు చేస్తున్నారు. అవి వ్యక్తిగత స్థాయిలో కూడా ఉంటున్నాయి. ఇవి ఒక దశలో శృతి మించి రాగాన పడిన సందర్భాలూ ఉన్నాయి. జగన్ రెడ్డి అంటూ వైఎస్ షర్మిల సంభోదించిన తీరు కూడా కాంగ్రెస్ కి మైనస్ అయింది అన్న మాట ఉంది. మరో సందర్భంలో ఆమె తన ఆస్తుల విషయం ప్రస్తావనకు తెచ్చారు. కడపలో ఆమె మాట్లాడుతూ, సాక్షిలో తనకు వాటాలు ఉన్నాయని కూడా ప్రకటించి సంచలనం రేపారు అయితే ఈ వాటాలు ఆస్తులు ఇవన్నీ కూడా షర్మిల వర్సెస్ జగన్ వ్యక్తిగత వివాదాలు అని జనాలకు అర్ధం అయ్యాయి. అలా వారికి అర్ధం అయ్యేలా చేయడంతో షర్మిల ఎమోషనల్ స్పీచెస్ నే దోహదం చేశాయని అంటున్నారు. ఆమె ఎంతసేపూ జగన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల ఇది అన్నాచెల్లెల్లు వివాదం అని జనంలోకి వెళ్ళిపోయింది. నాకు జగన్ అన్యాయం చేశారు అని ఆమె మొదటి రోజునే కుండబద్దలు కొట్టారు. ఆ మీదట ఆమె ఏపీకి అన్యాయం జరిగింది అని మాట్లాడినా జనాల బుర్రలకు మాత్రం ఇదే ఎక్కేసింది. దాంతో ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు చూడలేకపోతున్నారు. పైగా కాంగ్రెస్ పాతాళం అంచులలో ఉంది. దాన్ని షర్మిల ఎన్నికల వేళకు వచ్చి ఎంత లేపినా లేచేది లేదు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే జగన్ ఇంటి మనిషి సొంత ఆడపడుచు ఆయన మీద చేస్తున్న విమర్శలు మాత్రం జనంలో చర్చకు దారి తీస్తున్నాయి, జగన్ పాలన బాగా లేదని విపక్షాలు చెప్పడం వేరు, షర్మిల చెప్పడం వేరు. వైఎస్సార్ పాలనకు జగన్ పాలనకు మధ్య నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని షర్మిల చెప్పినది కూడా జనంలోకి వెళ్ళిపోతోంది.
ఇక జగన్ పాలన బాగులేకపోతే ఆల్టర్నేషన్ గా ఉన్నది కాంగ్రెస్ అసలే కాదు, ఆ పార్టీ కంటే చాలా ముందు టీడీపీ ఉంది. పైగా జనసేనతో టీడీపీ పొత్తు ఉంది. బాబు కూడా వైసీపీని పూర్తిగా విమర్శిస్తున్నారు. ఇపుడు ఆయన మాటలను బలపరుస్తున్నట్లుగా షర్మిల కామెంట్స్ ఉన్నాయి. దాంతో జగన్ వ్యతిరేక ఓట్లు అన్నీ మరింతగా పెరిగి టీడీపీ ఖాతాలో పడుతున్నాయని అంటున్నారు. ఇది ముందే ఊహించి టీడీపీ దాని అనుకూల మీడియా షర్మిలకు మద్దతుగా ఉందని అంటున్నారు. ఇక షర్మిల ఓట్లు చీల్చేది ఏమీ ఉండదని అవి చీల్చినా కూడా వైసీపీకే భారీ నష్టం అంటున్నారు. అంటే షర్మిల ఏపీలో అగ్రెసివ్ మూడ్ లో చేసిన ప్రసంగాలు తటస్థ ఓటర్లలో కొత్త ఆలోచనలు తట్టిలేపాయని అంటున్నారు. వారు ఎవరికి ఓటు వేయాలా అన్నది ఇంకా డిసైడ్ కాలేదు ఇపుడు వారంతా టీడీపీతో ట్రావెల్ చేసే విధంగా షర్మిల రాజకీయ దూకుడు పనికి వచ్చింది అని అంటున్నారు. మొత్తానికి ఏదైతేనేమి షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ నాయకత్వం వైసీపీకి భారీ నష్టం టీడీపీకి మేలు అన్నట్లుగా బయటకు వస్తున్న విశ్లేషణలు ఉన్నాయి.
అదే సమయంలో తాను కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక హస్తం పార్టీ ఆకాశానికి అంటుతుందని, కొత్త కాంతులు ఆ పార్టీలో వస్తాయని షర్మిల ధీమా పడినా లేక ఆమె వెనక ఉన్న పార్టీ నేతలు అనుకున్నా అవన్నీ భ్రమలు అని చెప్పడానికి గట్టిగా రెండు వారాలు కూడా పట్టలేదు. సో రేపటి రోజున వైసీపీ కాంగ్రెస్ నష్టపోయి టీడీపీ అధికార పీఠం దిశగా దూసుకుపోతే తమ స్వయకృపాపధాదం అని అన్నాచెల్లెలు సమీక్షుకునే రోజు వస్తుందా అంటే 2024 రిజల్ట్ మాత్రమే అవి చెప్పగలవు అంటున్నారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*