👉ఎప్పుడు చూడని ప్రతిఘటన చూస్తావ్.. ట్రంప్ కు ఇరాన్ డెడ్లీ వార్నింగ్ !!!…అమెరికా, ఇరాన్ మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. పశ్చిమాసియాలో అమెరికా యుద్ధ నౌకలను మోహరిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనిని తొలగిస్తే.. అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్తుందో తెలియదని వ్యాఖ్యానించారు. సెనెట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ముందు మార్క్ రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. ఖమేనినీ తొలగిస్తే అధికారం ఎవరు చేపడతారో తెలియదని, అది ఒక బహిరంగ ప్రశ్న అని అన్నారు. ఇరాన్ పాలన ఖమేనీ, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తో పాటు, ఎన్నికైన ప్రతినిధుల మధ్య విభజించి ఉందని, వారంతా కూడా ఖమేని ఆదేశానుసారమే నడుచుకుంటారని పేర్కొన్నారు. సుప్రీం లీడర్ పాలన పడిపోతే ఏం జరుగుతుందో చెప్పడం కష్టమని అన్నారు.

ఇది వెనుజులా కంటే క్లిష్టంగా ఉంటుందని రూబియో తెలిపారు. అక్కడి ప్రభుత్వం పాతుకుపోయిందని, అలాంటి పరిస్థితులు ఎదురైతే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. *ట్రంప్ నిర్ణయం,, పశ్చిమాసియా అంతటా అమెరికన్ సైన్యాన్ని బలోపేతం చేయాలనే ట్రంప్ నిర్ణయంపైన కూడా మార్క్ రూబియో స్పందించారు. ఆ ప్రాంతంలో మోహరించిన సైన్యాన్ని కాపాడటమే ఈ చర్య లక్ష్యమన్నారు. సైనికచర్య అవసరం ఉండకూడదని తాను భావిస్తున్నట్టు రూబియో అన్నారు. అయితే అమెరికా బలగాలు, భాగస్వాములపై దాడి చేసేందుకు ఇరాన్ శక్తిని కూడగట్టుకుంటుదని అన్నారు.
*ట్రంప్ వార్నింగ్.. ఇరాన్ డెడ్లీ రియాక్షన్..
ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాతో న్యూక్లియర్ ప్రొగ్రాంపై ఒప్పందం కుదుర్చుకోవడానికి
ఇరాన్ కు ఉన్న సమయం గడిచిపోతోందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ వైపు అమెరికా సేనలు భారీస్థాయిలో వస్తున్నాయంటూ హెచ్చరించారు. దీనిపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఇరు దేశాల పరస్పర గౌరవం, ప్రయోజనాల కోసం చర్చించడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని, అలా కాదని రెచ్చగొడితే ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని రీతిలో ప్రతిఘటన ఉంటుందని హెచ్చరించింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతకు మరింత ఆజ్యం తోడైంది. ముఖ్యంగా ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదన్నది అమెరికా ఉద్దేశ్యం. ఆ ఒప్పందంపై తమతో చర్చించి, తాము చెప్పినట్టు వినాలని కోరుతోంది. కానీ ఇరాన్ మాత్రం ఒప్పుకోవడంలేదు.
* ఇరాన్ పై వెనుజులా అస్త్రం.. ఇరాన్ పై అమెరికా వెనుజులా అస్త్రం ప్రయోగించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను రాత్రికిరాత్రి గుట్టుచప్పుడు కాకుండా నిర్బంధించారు. ఇప్పుడు ఇరాన్ లో కూడా ఇదే తరహా ప్రణాళిక అమలు చేయాలని ట్రంప్ ఆలోచిస్తున్నారన్నది ప్రచారం. స్థానిక ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా, వ్యూహాత్మకంగా ఖమేనిని కిడ్నాప్ చేసి, ఇరాన్ లో తమకు సంబంధించిన వ్యక్తులను అధికార పీఠంపై కూర్చోబెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తద్వారా ఇరాన్ వనరులపై ఆధిపత్యం సాధించి, చైనాకు చెక్ పెట్టాలని అమెరికా భావిస్తోంది.
👉నేను తిరుపతి ఎస్పీ కార్యాలయంలో కంప్లైంట్ ఇస్తే ఇప్పటివరకు తీసుకోలేదు..జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు.
మొన్న సంక్రాంతికి నారావారి పల్లె వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం వివరంగా చెప్పాను.ఆయన అందరి దగ్గర అర్జీలు తీసుకున్నట్టే నా దగ్గర కూడా అర్జీ తీసుకొని గ్రీవెన్స్ నెంబర్ ఇచ్చారు
– జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు.
👉పట్టుదల ఉంటే అనుకున్నది సాధించ వచ్చని నిరూపించారు ఈ దంపతులు…గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు*…ఆంద్రప్రదేశ్
తాజా గ్రూప్-2 ఫలితాల్లో అనంతపురం జిల్లా
తాడిపత్రికి చెందిన వినీత, ప్రకాశం జిల్లా కంభం పట్టణానికి చెందిన హేమచంద్ర అనే భార్యాభర్తలు సబ్ రిజిస్ట్రార్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు సాధించారు.
గతంలో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వీరు.., నోటిఫికేషన్ రావడంతో ఉద్యోగాలకు రాజీనామా చేసి ప్రిపేర్ అయ్యారు. వీరిద్దరూ ఉద్యోగాలు సాధించడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. మొత్తం 891 మంది గ్రూప్-2 ఉద్యోగాలు సాధించారు.
👉 మార్కాపురం జిల్లా కొమరోలు మండలం గోపానిపల్లి గ్రామం నకు చెందిన గుర్రం ప్రభాకర్ బాబు ( లేటు) కుమారుడు గుర్రం ప్రభోద్ మహాజన్ గ్రూప్ 2 ఫలితాల లో విజయం సాధించారు. వీరు అగ్రికల్చర్ కమిషనరేట్ లో ఉద్యోగం సాధించారు.
👉రిలయన్స్ ఫైనాన్స్ పేరుతో రుణాలు ఇప్పిస్తానని ప్రసాదరెడ్డి అనేవాడు , తాను రిలయన్స్ ఫైనాన్స్లో ఎగ్జిక్యూటివ్ గా ఏం చేస్తున్నానని … రుణాలు ఇప్పిస్తానని, ఆఫీసు హైదరాబాదులో ఉందని ఇటీవల ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు.. లోను కావాలనుకున్నవారు ఆధార్ నెంబరు, పాన్ కార్డు నెంబర్ చెప్తే చాలు లేదా జిరాక్స్ కాపీలు పంపితే చాలు లోను మంజూరు చేస్తాను అని నమ్మించి… తర్వాత రిలయన్స్ లో లోన్ కావాలంటే రిలయన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ముందుగా మూడున్నర వేలు చెల్లించాలని తీసుకుంటున్నాడు..
అమౌంట్ కట్టిన తర్వాత ఇన్సూరెన్స్ కాపీ పంపడం లేదు …సమాధానం కూడా చెప్పడం లేదు .. ఆంధ్రాలోని ప్రకాశం జిల్లా కంభం లో కొందరికి లోను ఇస్తానని ఇన్సూరెన్స్ చేయించుకోవాలని 2000 రూపాయలు తీసుకొని ఇప్పటిదాకా ఇన్సూరెన్స్ కాఫీ తాలూకు ఫోటో పెట్టమని అడిగితే పెట్టడం లేదు… అమౌంట్ కూడా ఇవ్వలేదు.. వీడి సెల్ నెంబర్ 91 76330 68986 .. దయచేసి ఎవరు కూడా ఇటువంటి ప్రచారాలు నమ్మవద్దు. వీలైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ నెంబర్ను ట్రేస్ అవుట్ చేసి ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి…ప్రజలను ఇటువంటి మోసాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ..
👉విష గుళికలు తిని 30 గొర్రెలు మృత్యువాత…కన్నీరు మున్నీరు అవుతున్న గొర్రెల కాపరి*
గుంటూరు జిల్లా… పెదనందిపాడు మండలంలోని కొప్పరు గ్రామానికి చెందిన నక్క శ్రీనివాసరావు, కొమ్మనబోయిన హరిబాబులకు చెందిన 30 గొర్రెలు.., ఎడ్లపాడు మండలం కారసాలగ్రామంలో మృతి చెందాయి.
రైతు తన పత్తి పైరు ఈడు పోవడంతో, దాని స్థానంలో వేసిన జొన్న విత్తనాలతో పాటు ఉన్న విషపు గుళికలను గొర్రెలు తిన్నాయి. దీంతో అక్కడికక్కడే అవి మరణించాయి.
బాధితులైన రైతులు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కన్నీరుమున్నీరవుతున్నారు.
👉బస్సు కిటికీలోంచి ఉమ్మబోతే.. టోల్ప్లాజా గడ్డర్ తగిలి విద్యార్థి మృతి*
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అన్నంపల్లి టోల్ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ఇనుప స్తంభం (గడ్డర్)తగిలి ఓ విద్యార్థి తల పగిలి మృతి చెందాడు. ముమ్మిడివరం మండలం లక్ష్మీదేవిలంకకు చెందిన సోంపల్లి వెంకట రవీంద్ర(16) అమలాపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.
👉మూడు రూపాయల వడ్డీ ఇస్తానని ముంచేశాడు.. రూ.8 కోట్లతో పరారైన మోసగాడు*
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాయమాటలతో ప్రజల నుంచి రూ.8 కోట్లు వసూలు చేసి పరారైన మోసగాడు చివరకు పోలీసులకు దొరికిపోయాడు. కడపకు చెందిన ఆరిఫ్ తాడిపత్రిలో ఉంటూ బంగారు వ్యాపారినని స్థానికులను నమ్మబలికాడు. లక్షకు నెలకు రూ.3 వేలు వడ్డీ ఇస్తానని వారి నుంచి డబ్బులు వసూలు చేశాడు.
👉ప్రియుడి మోజులో పడి.. తల్లిదండ్రులను చంపిన కుమార్తె*
అల్లారుముద్దుగా పెంచారు. అడిగిందల్లా కొనిచ్చారు. కోరిందల్లా క్షణాల్లో ఆమె ముందు పెట్టారు. అదీ బిడ్డలపై తల్లిదండ్రులకు ఉండే ప్రేమ. కానీ.. ఈసారి ఆ యువతి కోరింది కాదన్నారు. అంతే.. ఆమెలో ఎక్కడలేని కోపం కట్టలు తెంచుకుంది. నేను అడిగిందే కాదంటారా అంటూ కక్ష పెంచుకుంది.

