👉 ఇరాన్ లో జెన్ జీ విప్లవం!.. ఖోమైనీ ని గద్దె దింపేందుకు అమెరికా కుట్ర???
జెన్ జీ.. ఈ పేరు వింటేనే పాలకులు ఉలిక్కిపడే పరిస్థితి.. అనేక దేశాల్లో పీఠాలను కదిలించిన తరం ఇది.. ఇప్పుడు మరో దేశంలోనూ జెన్ జీ ఉద్యమిస్తోంది. జెన్ జీ.. ఈ పేరు వింటేనే పాలకులు ఉలిక్కిపడే పరిస్థితి.. అనేక దేశాల్లో పీఠాలను కదిలించిన తరం ఇది.. ఇప్పుడు మరో దేశంలోనూ జెన్ జీ ఉద్యమిస్తోంది. కుంకుమ పువ్వుకు పేరుగాంచిన ఆ దేశంలో శీతాకాలంలోనూ వేడి రగిలిస్తోంది. దాదాపు మూడున్నరేళ్ల కిందట ఇదే దేశంలో ఓ యువతి మరణంపై ప్రజలు తీవ్ర స్థాయిలో నిరసనలకు దిగారు. మళ్లీ అంతలా కాకున్నా.. ఆర్థిక పరిస్థితులపై తమ గళాలు వినిపిస్తున్నారు. ఒకవైపు హద్దు లేని ధరల పెరుగుదల, మరోవైపు రెండేళ్లుగా పడిపోతున్న కరెన్సీ విలువ..! దీంతో జీవితం భారమై యువత వీధుల్లోకి వస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటిలాగానే జోక్యం చేసుకుంటోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగి.. అమాయక పౌరుల ప్రాణాలు పోతే తాము రంగంలోకి దిగుతామంటూ ఏకంగా అమెరికానే హెచ్చరించింది. *** నెమ్మదిగా పాకుతున్న ఉద్యమం ఇరాన్.. పశ్చిమాసియాలోని ఈ కీలక దేశంలో గత ఆదివారం నుంచి ప్రజల నిరసనలు పెరుగుతున్నాయి. ప్రపంచంలో పండే కుంకుమ పువ్వులో 90 శాతం ఇరాన్ లోనే. 1970కి ముందు పాశ్చాత్య దేశాల తరహాలో ఉండేది. ఇస్లామిక్ విప్లవం అనంతరం సంప్రదాయ దేశంగా మారింది. అయితే, పాలనలో వైఫల్యాలు ఇరాన్ ను దెబ్బతీస్తున్నాయి… అధిక ధరలు, కరెన్సీ విలువ పతనం కూడా ప్రజలలో ఆగ్రహానికి దారితీస్తోంది. దీంతో పలు ప్రావిన్సుల్లో వీధుల్లోకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. పోలీసుల కార్లకు నిప్పు పెట్టారు. భద్రతా బలగాల కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు, చాలామంది కూడా గాయపడినట్లుగా కథనాలు వస్తున్నాయి. రెండేళ్లుగా ఆర్థిక సంక్షోభం… ఇరాన్ కరెన్సీ రెండేళ్లుగా పతనం అవుతోంది. దీంతో ఆర్థిక సంక్షోభం తలెత్తుతోంది. దీనికి అడ్డుకట్ట ఎంతకూ లేదు. అందుకని ప్రజలు నిరసనలకు దిగుతున్నారు. 👉అయితే, వీరిపై భద్రతా దళాలు గనుక కాల్పులు జరిపితే తాము జోక్యం చేసుకుంటాం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ పౌరులను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే కుట్ర ఉందని పలువురు మేధావులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రకటనను ఇరాన్ సుప్రీం లీండర్ అయతుల్లా అలీ ఖమేనీ సీనియర్ సలహాదారు లార్జాని తప్పుబట్టారు. అమెరికా జోక్యం చేసుకుంటే ఈ ప్రాంతం అంతా ఘర్షణలు చెలరేగుతాయని హెచ్చరించారు. ** ముల్లాలు వెళ్లిపోవాలి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలకు దిగుతూ.. ముల్లాలు వెళ్లిపోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. గత ఆదివారం రాజధాని టెహ్రాన్ లో మొదలైన నిరసనలు దేశమంతా వ్యాపించాయి. చాలా నగరాలు,పట్టణాల్లో ప్రజలు భద్రతా దళాలతో ఘర్షణలకు దిగుతున్న వీడియోలు బయటకు వస్తున్నాయి. 2022లో అమిని మరణం తర్వాత ఇరాన్ లో జరుగుతున్న పెద్ద నిరనసనలు ఇవేనని పరిశీలకులు చెబుతున్నారు.
👉బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్…⭐ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు…
⭐ నేడు హైదరాబాద్ గాంధీ భవన్ లో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భుక్య మురళి నాయక్ ఆధ్వర్యంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్,బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు నీలం దుర్గేష్ ముదిరాజ్ , బిఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచ్లు,మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, సుమారు 500 మంది నాయకులు, కార్యకర్తలు,నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ,రాష్ట్ర పశుసంవర్థ, క్రీడా శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి ,మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ ,మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ రెడ్డి *ఈ కార్యక్రమంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా సంజీవ రెడ్డి ,కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంకర అయ్యప్ప రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి,డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి, మాజీ పిఎస్ఈఎస్ చైర్మన్ బండారు వెంకన్న,బండారు దయాకర్, పిసిసి మెంబర్ దస్రు నాయక్,మేకల వీరన్న యాదవ్,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం గణేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు,యూత్ కాంగ్రెస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు….*
👉 థానేలో భారీ డ్రగ్ రాకెట్ బట్టబయలు..!!!… తెలంగాణ వాసి అరెస్ట్* థానే: మహారాష్ట్ర థానే జిల్లాలో పోలీసులు భారీ డ్రగ్ రాకెట్ను గుట్టు రట్టు చేశారు. ముంబై–నాసిక్ జాతీయ రహదారిపై ఖరేగావ్ టోల్ ప్లాజా సమీపంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు 638 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.2.04 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.ఈ కేసులో తెలంగాణకు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని మహబూబ్నగర్ జిల్లా నివాసి చిన్న ఠాగూర్ లక్ష్మణ్ నాయక్గా గుర్తించారు. ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుంచి ముంబైకి గంజాయి రవాణా చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.లక్ష్మణ్ నాయక్పై NDPS చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, డ్రగ్ నెట్వర్క్ వెనుక ఉన్న ఇతరులపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో డ్రగ్ మాఫియాపై పోలీసుల నిఘా మరింత కఠినంగా మారింది.
👉మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం😲😲😲
కొంతకాలంగా తగ్గిన బర్డ్ ఫ్లూ మళ్లీ వ్యాపిస్తోంది. కేరళలోని అలప్పుళ, కొట్టాయం జిల్లాల్లో అవైన్ ఇన్ఫ్లూయెంజా వైరస్ను గుర్తించారు. దీంతో వైరస్ కట్టడికి చర్యలు చేపట్టినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అటు నీలగిరి, కోయంబత్తూరు సహా కేరళ సరిహద్దు గల జిల్లాల్లో తమిళనాడు ప్రభుత్వం స్పెషల్ చెకోపోస్టులు ఏర్పాటు చేసింది. వైరస్ వ్యాపించకుండా కోళ్ల వ్యాన్స్ను వెటర్నరీ టీమ్స్ తనిఖీ చేస్తున్నాయి~£
👉“మటన్ ముక్క వేసుకోండి సార్!” – కాంగ్రెస్ నేతలకు వడ్డించిన నకిరేకల్ సీఐ*
నకిరేకల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఖాకీ గౌరవంపై తీవ్ర చర్చకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. పోలీస్ అధికారిగా విధులు నిర్వహించాల్సిన నకిరేకల్ సీఐ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేశం సహా అధికార పార్టీ నాయకులకు స్వయంగా భోజనాలు వడ్డించడం వివాదాస్పదంగా మారింది. కార్యక్రమంలో సీఐ క్యాటరింగ్ సిబ్బంది మాదిరిగా వ్యవహరించడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి…***ఒక పోలీస్ అధికారి రాజకీయ కార్యక్రమాల్లో ఈ విధంగా పాల్గొనడం నిబంధనలకు విరుద్ధమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీఐ ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఖాకీ మర్యాదపై చర్చ మొదలైంది. ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందిస్తారా? శాఖాపరమైన విచారణ చేపడతారా? అన్నది వేచి చూడాల్సి ఉంది.

