👉2025 లో కూటమి పాలనపై మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు కామెంట్స్…*
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి చేస్తుంటే వైసీపీ ఓర్వ లేక పోతోంది…
2025లో రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబు మార్క్ స్పష్టంగా కనిపించింది…
సూపర్ సిక్స్ తో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం….
రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ ఒక్కటి ఆపలేదు …అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎక్కడ రాజీ పడడం లేదు…అమరావతి పునర్నిర్మాణం చేస్తున్నాం…గతంలో గ్రామాల్లో ఎక్కడ రోడ్లు లేని దుస్థితి…ఇప్పుడు రోడ్లకు మహర్దశ వచ్చింది…
విద్యా వ్యవస్థ లో సమూల మార్పులు తీసుకొచ్చాం
దేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి…గతంలో ఎక్కడ చూసినా గంజాయి డ్రగ్స్ కనిపించేది… దీనిని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది…రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని మార్పులు చేశారు…దీనిపై హర్షం వ్యక్తం చేయకుండా వైసిపి నాయకులు విమర్శలు చేస్తున్నారు …మాజీ మంత్రి శైలజనాథ్ పై ఎంఎస్ రాజు పరోక్ష విమర్శలు…మీ వైసిపి హయాంలో ఏం చేశారో ఒక్కసారి పునరాలోచించుకోవాలి
👉మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం…
తెలంగాణ ప్రభుత్వ నోటీసులపై స్పందించిన ఎల్ అండ్ టీ సంస్థ…డిఫెక్ట్ లయబులిటీ పిరియడ్ లోనే మేడిగడ్డ కుంగిందని, మరమ్మత్తులు చేయాలని డెడ్ లైన్ లేఖ రాసిన సర్కార్ …పెండింగ్ బకాయిలతో సంబంధం లేకుండా పునరుద్ధరణ పనులు చేయాలని సంస్థకు వార్నింగ్ ఇచ్చిన ప్రభుత్వం …పునరుద్ధరణ పనులు చేపడతామని పెండింగ్ బకాయిల్ని క్లియర్ చేయాలని మరోసారి గుర్తు చేసిన నిర్మాణ సంస్థ..
👉జాబ్ చేయడమే యమ డేంజర్ 😱😱😱 ఉద్యోగంమనిషి లక్షణం అంటారు కదా ఎందుకు ఈ మాట అని ఎవరికైనా సందేహం రావచ్చు. ఉద్యోగం మనిషి లక్షణం అంటారు కదా ఎందుకు ఈ మాట అని ఎవరికైనా సందేహం రావచ్చు. అయితే సంప్రదాయ ఉద్యోగాలు ఇపుడు తగ్గిపోతున్నాయి. డే అండ్ నైట్ చేసే జాబ్స్ ఉంటున్నాయి.
అందునా సాఫ్ట్ వేర్ రంగంలో చూసుకుంటే ఉద్యోగాలు బాగానే ఉంటాయని చేరుతున్నారు. కానీ గట్టిగా నలభై ఏళ్ళు రాకుండానే కూసాలు కదిలిపోయి సాంతం పడకేస్తున్నారు. కూర్చున్న సీటు నుంచి ఏ మాత్రం కదలికలు లేకపోవడంతో ఊబకాయం అధిక బరువు తీవ్రమైన ఒత్తిళ్ళు ఇలా అనేక శారీరక మానసిక సమస్యలతో సతమతం అవుతున్నారు అని అంటున్నారు. డాక్టర్ చెప్పిన నిజం : ఇదిలా ఉంటే పొగ తాగడం కంటే కూడా తీవ్ర ఒత్తిడి ఉద్యోగాలే యమ డేంజర్ అని ఒక డాక్టర్ చెప్పారుట. దానిని తన బ్లైండ్ యాప్లో స్వీయ అనుభవంగా పంచుకున్న ఓ టెక్కీ సంచలన విషయమే జనాలకు చేరవేశాడు. తన మీద పడిన తీవ్ర ఒత్తిడి కారణంగా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నట్లుగా సదరు టెక్కీ చెప్పడం గమనార్హం. ఈ విషయం మీద డాక్టర్ ని సంప్రదిస్తే చేసే ఉద్యోగానికి వెంటనే నిలుపుదల చేసి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు అని చెప్పుకొచ్చాడు. తాను ఉద్యోగంలో విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాను అని తన మొత్తం ఆరోగ్యం పరిశీలించిన డాక్టర్ అయితే ధూమపానం కంటే ప్రమాదకరమని తనను హెచ్చరించినట్లుగా చెప్పుకొచ్చాడు.
గతంలో ఆందోళన తగ్గేందుకు మందులు వాడాడట. ఇప్పుడు అధిక బరువుతో వెళ్ళాడని దానిని గమనించిన మీదటనే డాక్టర్ డేంజర్ లో నీ హెల్త్ పడింది అని వార్నింగ్ సీరియస్ గా ఇచ్చాడని అంటున్నారు. *సమస్యలు ఇవే : ఇక ఆ టెక్కీలో ఆరోగ్య సమస్యలు చూస్తే విధి నిర్వహణలో ఉన్నపుడు ఎదుర్కొంటున్న తీవ్ర ఒత్తిడి వల్ల జీర్ణవ్యవస్థ సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని డాక్టర్ చెప్పారని పేర్కొన్నాడు. ఆరోగ్యం సెట్ కావాలీ అంటే వెంటనే ఆ డ్యూటీకి గుడ్ బై కొట్టి విశ్రాంతి తీసుకోవాలని సూచించారుట. ఇక ఒత్తిడి ఎక్కువగా ఉంటే అది గుండె కణాల్లో వాపును కలిగిస్తుందని, అలాగే ప్రమాదకరమైన అణువులను విడుదల చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే జీవక్రియకు సంబంధించిన అనేక సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. మంచి పని వాతావరణం ఉండాలని శారీరకంగా మానసికంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.
విద్య కేవలం మార్కుల కోసం కాకుండా, పిల్లల అభివృద్ధి కోసం బాలకేంద్రితంగా ఉండాలి ఇది ఆధునిక విద్యాశాస్త్రం అప్పుడే ..
విద్యా హక్కు చట్టం 2009(RTE) సార్థకత.. PAAP అభిప్రాయం…విద్యా హక్కు చట్టం 2009 అమలు చేయవలసిన రాష్ట్ర విద్యా శాఖ ఉన్నతాధికారులే..
ప్రవైట్ విద్య వ్యాపారులా …. చట్ట వ్యతిరేక విధానాలు అమలు పూనుకోవడం పై..
మీరు ఏమంటారు…?
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ కమిషనర్ సమావేశం నిర్ణయాలపై.. ఫలితాల’ కోసం కాకుండా ‘పిల్లల భవిష్యత్తు’ కోసం విద్యా విధానాలలో మార్పులు చేయాలి..
1. విద్యార్థుల విభజన (Shining vs Rising Stars)
RTE చట్టం మరియు నేషనల్ కరికులమ్ ఫ్రేమ్వర్క్ (NCF) ప్రకారం, తరగతి గదిలో పిల్లలను వారి తెలివితేటల ఆధారంగా వేరు చేయడం (Labeling) లేదా విభజించడం మంచి పద్ధతి కాదు.
సానుకూల కోణం: వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ (Remedial Teaching) పెట్టడం చట్టబద్ధంగా అవసరమే. వారి స్థాయికి తగిన మెటీరియల్ ఇవ్వడం వల్ల వారు నేర్చుకోవడం సులభం అవుతుంది. కానీ పాఠ్యాంశాలను ఆధారంగా పిల్లలే నోట్స్ తయారు చేసే పద్ధతి అమలు చేస్తేనే పిల్లలలో మనో ధైర్యం సృజనాత్మకతను, విద్య కో సార్ధకత ఏర్పడుతుంది
ప్రతికూల కోణం: ఒకవేళ ఈ విభజన వల్ల “Rising Stars” (వెనుకబడిన వారు) అనే ముద్ర పిల్లల్లో ఆత్మన్యూనత భావాన్ని (Inferiority Complex) కలిగిస్తే, అది వారి మానసిక వికాసానికి ఆటంకం కలిగిస్తుంది. ఇది RTE.(సమానత్వం, భయరహిత విద్య) ఆశయాలకు విరుద్ధం…
2. నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE)
RTE చట్టం Continuous and Comprehensive Evaluation (CCE) ను ప్రోత్సహిస్తుంది.
LEAP యాప్లో ప్రతిరోజూ మార్కులు నమోదు చేయడం ద్వారా విద్యార్థుల ప్రగతిని నిరంతరం పర్యవేక్షించవచ్చు. ఇది చట్టం పరిధిలోకి వస్తుంది.
అయితే,…
నిరంతరం పరీక్షల ఒత్తిడి (Too many tests) పెంచడం పిల్లల బాల్యాన్ని మరియు సృజనాత్మకతను దెబ్బతీస్తుందని కొందరు నిపుణుల అభిప్రాయం.
3. హాజరు మరియు నామినల్ రోల్స్
విద్యార్థుల హాజరుపై దృష్టి పెట్టడం RTE చట్టం ప్రకారం ప్రభుత్వం మరియు పాఠశాలల బాధ్యత. బడి బయట పిల్లలు ఉండకూడదనేది చట్టం ప్రధాన లక్ష్యం.
ముగింపు:
విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయాలు విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి (Results oriented) తీసుకున్నట్లయితే. ఒకవేళ ఈ విభజన కేవలం వారికి అదనపు సాయం అందించడానికే పరిమితమైతే అది చట్టబద్ధమే. కానీ, దీని వల్ల విద్యార్థుల మధ్య వివక్ష పెరిగితే మాత్రం అది RTE స్ఫూర్తికి విరుద్ధం అవుతుంది.
ప్రవైట్ పాఠశాలలలో పిల్లల చదువు పేరు తో జరిగే విద్యా హక్కు చట్టం 2009 అతిక్రమణలు… మానసిక శారీరక ఒత్తిడి పై …
(అతిగా హోంవర్క్, ట్యూషన్స్, మానసిక/శారీరక ఒత్తిడి – ఇవన్నీ RTE Section 29 (no mental harassment)కు విరుద్ధం. కార్పొరల్ పనిష్మెంట్, స్క్రీనింగ్, క్యాపిటేషన్ ఫీజు నిషేధం)
బాలల హక్కుల పరిరక్షణ కమీషన్లు (APSCPCR ) ఏం సమాధానం… ఎన్ని పాఠశాలలు స్వయం పర్యవేక్షణ చేసిందో… చర్యలు తీసుకుందో …?
PAAP డిమాండ్: “విద్యా శాఖ తీసుకునే ఏ నిర్ణయమైనా పిల్లల మానసిక స్థితిని నిపుణుల ద్వారా అంచనా వేయించిన తర్వాతే అమలు చేయాలి”
-ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP)
(రిజిస్ట్రేషన్ నంబరు 6/2022)
ఆంధ్రప్రదేశ్ కమిటీ
ఫోన్: +91 63053 13558
ఈమెయిల్: parentsassociationap@gmail.com
👉 ఉత్తమ కార్యకర్తలకు ప్రసంశా పత్రాలు అందచేసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..
* గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోవర్గంలోని క్లస్టర్, యూనిట్, బూత్ లలో మై టీడీపీ ద్వారా ప్రతిభ కనపరచిన బూత్, యూనిట్, క్లస్టర్ ఇన్ఛార్జ్ లకు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ప్రసంశా పత్రాలు అందచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళిన వారిని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు మరియు యువ నాయకులు నారా లోకేష్ వారందరికి అభినందనలు తెలియచేస్తూ నియోజకవర్గంలోని 52 మందికి ప్రసంశా పత్రాలను అందచేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఉత్తమ కార్యకర్తలను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జ్ లు, గ్రామ నాయకులు, పాల్గోన్నారు.

