👉వాణిజ్య యుద్ధం : రూపాయి పతనం.. 90 దాటే ప్రమాదం.. !!! …. భారతీయ రూపాయి మరోసారి చరిత్రాత్మక కనిష్ఠాన్ని తాకింది, ఇది భారత ఆర్థిక వ్యవస్థలో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.
*వాణిజ్య యుద్ధం : రూపాయి పతనం.. 90 దాటే ప్రమాదం… భారతీయ రూపాయి మరోసారి చరిత్రాత్మక కనిష్ఠాన్ని తాకింది, ఇది భారత ఆర్థిక వ్యవస్థలో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి డాలర్తో రూపాయి విలువ ₹89.66 వద్ద నిలిచింది. ఒకానొక దశలో ₹89.71 వరకు జారిపోవడం మార్కెట్లలో భయాన్ని సృష్టించింది. గురువారంతో పోలిస్తే ఒక్క రోజులో ₹1.03 పతనం నమోదు కావడం పెట్టుబడిదారులను కుదిపేసింది. రూపాయి 90 స్థాయిని దాటే ప్రమాదం అంచున నిలబడడం దేశ ఆర్థిక భవిష్యత్తుపై ప్రశ్నార్థకం వేస్తోంది.
*అమెరికా–ఇండియా వాణిజ్య చర్చల్లో నిలకడ లేకపోవడంతో తీవ్ర ప్రభావం.. రూపాయి విలువ ఇంతలా పడిపోవడానికి అమెరికా–భారత్ వాణిజ్య చర్చల్లో స్పష్టత లేకపోవడమే ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆగస్టులో అమెరికా విధించిన భారీ టారిఫ్లు ఇప్పటికీ భారత ఎగుమతులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. వాణిజ్య అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. వార్తల ప్రకారం ఇప్పటివరకు $16.5 బిలియన్ కంటే ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి బయటకు తీసినట్లు సమాచారం. ఇది రూపాయిపై ఒత్తిడిని మరింత పెంచింది.
*డాలర్ బలపడటం – ఆర్బీఐ మౌనం…ప్రపంచ మార్కెట్లలో డాలర్ బలోపేతం కావడం కూడా రూపాయి పతనానికి దోహదపడింది. అమెరికాలో ఉద్యోగాల సంఖ్య బలంగా రావడంతో డాలర్ మరింత బలపడింది. దీనితో పాటు, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల కోసం అమెరికా వైపు మొగ్గుచూపారు. మరోవైపు, గతంలో రూపాయిని పతనం కాకుండా అడ్డుకునేందుకు జోక్యం చేసుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈసారి మౌనం పాటించడం మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు పంపింది. రూపాయికి మద్దతుగా ఆర్బీఐ రంగంలోకి దిగకపోవడంపై విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
*మార్కెట్లలో ప్రతికూలత – సాధారణ ప్రజలపై ప్రభావం*… రూపాయి పతనం ప్రభావం వెంటనే భారత స్టాక్ మార్కెట్పై కనిపించింది. సెన్సెక్స్ ఒక రోజులోనే 400 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ సైతం 124 పాయింట్లు పడిపోయింది. బలహీన రూపాయి సాధారణ భారతీయుడిపై నేరుగా ప్రభావం చూపుతుంది. భారతదేశం అధికంగా దిగుమతులపై ఆధారపడిన నేపథ్యంలో దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు ఖరీదవుతుంది. చమురు, పెట్రోల్ ధరలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు మొబైల్స్, ల్యాప్టాప్లు మొదలైనవి, దిగుమతి అయ్యే నిత్యావసర వస్తువులు.. వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది, తద్వారా ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడిపై భారం పెరుగుతుంది. ఎగుమతిదారులకు తాత్కాలిక లాభాలున్నప్పటికీ, వినియోగదారులకు, దిగుమతిదారులకు ఇది తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.
*ముందు పరిస్థితి మరింత కఠినమా? … మున్ముందు పరిస్థితి మరింత కఠినంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా ఇండియా ట్రేడ్ టాక్స్లో తక్షణ పురోగతి లేకపోతే రూపాయి త్వరలోనే 90 స్థాయిని దాటే ప్రమాదం ఉందని విశ్లేషకుల అంచనా. ఫారెక్స్ రిజర్వుల పరిమిత ప్రభావం: భారతదేశం వద్ద పెద్ద మొత్తంలో ఫారెక్స్ రిజర్వులు ఉన్నప్పటికీ, ప్రస్తుత వాణిజ్య ఉద్రిక్తతలు మరియు ప్రపంచ డాలర్ బలాన్ని తట్టుకునేందుకు వాటి ప్రభావం పరిమితంగానే ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది.వాణిజ్య సమస్య త్వరగా పరిష్కార దిశలోకి రాకపోతే, భారత ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డాలర్ బలపడటం, వాణిజ్య ఉద్రిక్తతలు, ఆర్బీఐ నిర్లక్ష్యం ఈ మూడు శక్తులు కలిసి రూపాయిని కొత్త ప్రమాద స్థాయికి తీసుకెళ్తున్నాయి
👉 శ్రీ సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా ఒంగోలులో రిమ్స్ హాస్పిటల్ నందు శ్రీ సత్యసాయి సేవా సమితి వారు నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని, హాస్పిటల్ లోని పేషెంట్లకు దుప్పట్లు పంపిణీ చేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అయినాబత్తిన ఘనశ్యాం, బెల్లం సత్యం, ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి కమిటీ సభ్యులు.
👉వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా*
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేట్ పరం చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు నిరసనగా ఆ ఉత్తర్వులను వెనువెంటనే రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్మాణం,నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ* *కార్యక్రమంలో భాగంగా మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని 30వ బ్లాక్ నందు మాజీ ఎమ్మెల్యే,వైయస్సార్ సీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు పాల్గొన్నారు.కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు.*
👉 కార్మిక చట్టాలను 4లేబర్ కోడ్ గా మార్చి నందుకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో ఆదివారం పిసిపల్లి బ్యాంక్ సెంటర్లో నిరసన చేశారు.
👉 శిoగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ ఆటల పోటీలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ సచివాలయ వాలంటీర్ల వయోవృద్ధుల శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కనిగిరి శాసన సభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహ రెడ్డి రాష్ట్ర మారి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ప్రారంభోత్సవం చేశారు .

👉జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెక్కుముకి సైన్సు సంబరాలలో భాగంగా దర్శి లోని ఝాన్సీ విద్యాసంస్థలలో ఆదివారం జరిగిన బహుమతుల ప్రధాన ఉత్సవంలో ముఖ్యఅతిథిగా దర్శి డిఎస్పి బి లక్ష్మీనారాయణ పాల్గొని గెలుపొంది రాష్ట్రస్థాయికి వెళ్లే విద్యార్థులకు బహుమతులు అందించారు.
కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా మండల స్థాయి నాయకులు ప్రతినిధులు ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

