👉కేసీఆర్‌ ఓట్లడగలేదేం…జూబ్లీహిల్స్‌ ఓటర్లకు ఎందుకు విజ్ఞప్తి చేయలేదు?.. కాలేజీల రూల్‌ ప్రకారం పోదామంటే సిద్ధం: ధ్వజమెత్తిన సీఎం రేవంత్‌*… 👉విశాఖలో టీడీపీ నేత గోమాంసం గౌడౌన్ బట్టబయలు..👉 మొంథా తుఫాను నష్టాన్ని పరిశీలించేందుకు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న నలుగురు సభ్యుల కేంద్ర బృందం.👉ఏటీఎంల తనిఖీలు నిర్వహించిన కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జునరావు *👉 వాట్సప్‌ లోనూ వినియోగదారుల కమిషన్‌ కు ఫిర్యాదు చేయొచ్చు… 

👉కేసీఆర్‌ ఓట్లడగలేదేం*… *జూబ్లీహిల్స్‌ ఓటర్లకు ఎందుకు విజ్ఞప్తి చేయలేదు?*.. *ధృతరాష్ట్రుడిలా దుర్మార్గాల్ని భరిస్తున్నరు*… *పార్టీ కూలుతుంటే కుమిలిపోతున్నరు* *బీఆర్‌ఎస్‌ వ్యాలిడిటీ అయిపోయింది*.. *ఈసారి ఎన్నికలు 2029 జూన్‌లో..*…*2034 వరకూ కాంగ్రెస్సే అధికారంలో..*… *రానున్న పదేళ్లలో వందేళ్ల అభివృద్ధి చేసి చూపిస్తాం*.. *కేసీఆర్‌ పెట్టిన ఏ పథకాన్నీ ఆపలే* *గుజరాత్‌కు గులాముగా కిషన్‌రెడ్డి*… *కేటీఆర్‌తో చెడు సావాసాన్ని ఆపాలి*… *సెంటిమెంటా? డెవల్‌పమెంటా? జూబ్లీహిల్స్‌ ప్రజలు ఆలోచించుకోవాలి*.. *కాలేజీల నిబంధనల ప్రకారం పోదామంటే మేం సిద్ధం*.. *’మీట్‌ ద ప్రెస్‌’లో సీఎం రేవంత్‌రెడ్డి*

బీఆర్‌ఎస్‌ కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీ వ్యాలిడిటీ పీరియడ్‌ అయిపోయిందన్నారు. ఇదేమీ తాను రాజకీయ విమర్శ కోసం చెబుతున్నది కాదని, ఒకప్పుడు తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీ ఇప్పుడు ఇక్కడ లేకుండా పోయిందని గుర్తు చేశారు. కేసీఆర్‌తోనే ఆ పార్టీ పని అయిపోతుందన్నారు. కేసీఆర్‌కు గతమే తప్ప.. భవిష్యత్తు లేదని, ఆ బాధతోనే ఆయన బయటికి రావడంలేదని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థికి ఓటేయాలని నియోజకవర్గ ప్రజలకు ఈనాటి వరకూ కేసీఆర్‌ విజ్ఞప్తి చేయకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ”బయటికి వచ్చి ప్రచారం చేయడానికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. కానీ, పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కూడా విజ్ఞప్తి చేయడంలేదంటే కేటీఆర్‌, హరీశ్‌రావుపై ఆయనకున్న ఆలోచనేంటో అర్థం చేసుకోవచ్చు” అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన కళ్లముందు పార్టీ కూలిపోతుంటే కుమిలిపోతున్నారని, దుఃఖం, ఆవేదనతో కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను ప్రత్యర్థిగా కాకుండా సానుభూతితో చూడాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. ఆదివారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్‌ ద ప్రెస్‌’ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఆత్మహత్య చేసుకుని మరీ బీజేపీకి అవయవదానం చేసిందని ఆరోపించారు. దాంతో బీజేపీ గెలుచుకున్న 8 సీట్లే మోదీ మూడోసారి ప్రధాని కావడానికి ఉపయోగపడ్డాయన్నారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీన ప్రక్రియ మొదలైందంటూ కేసీఆర్‌ కూతురు కవితే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు.

*సీబీఐ కాళ్లకు బంధం వేసిందెవరు?*

కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలు గడిచినా ఇంతవరకు విచారణ ప్రారంభం కాలేదని, సీబీఐ కాళ్లకు బంధం వేస్తున్నది ఎవరని ప్రశ్నించారు. అలాగే ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్‌ అరెస్టుకూ గవర్నర్‌ నుంచి అనుమతి రాలేదన్నారు. సొంత చెల్లిని, మాగంటి తల్లిని కేటీఆర్‌ అవమానించారని ఆరోపించారు. మహిళలకు రక్షణ కల్పించలేని కేటీఆర్‌.. ప్రజల అభిమానం ఎలా చూరగొంటారని ప్రశ్నించారు. కేసీఆర్‌ ధృతరాష్ట్రుడిలాగా పిల్లల దుర్మార్గాలను భరిస్తున్నారని వ్యాఖ్యానించారు. తనది కార్యకర్త మనస్తత్వమని, హుజూరాబాద్‌, హుజూర్‌నగర్‌, సాగర్‌, మునుగోడు ఉప ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్‌ కంటే ఎక్కువగా ప్రచారం చేశానని తెలిపారు. 2034 జూన్‌ వరకు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటుందని, దీనిని రాసిపెట్టుకోవచ్చని ప్రకటించారు. రాబోయేవి జమిలి ఎన్నికలు అని, 2028 డిసెంబరుకు బదులుగా.. 2029 జూన్‌లో జరుగుతాయని అన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీయే విజయం సాధించి 2034 జూన్‌ వరకూ అధికారంలో కొనసాగుతుందని జోస్యం చెప్పారు. ఈ పదేళ్లలో.. వందేళ్ల అభివృద్ధి చేస్తామన్నారు.

*చరిత్ర కేసీఆర్‌ చెరిపేస్తే చెరగదు..*

2004 నుంచి 2014 వరకు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. రైతుల సంక్షేమం కోసం కృషి చేసిందని సీఎం రేవంత్‌ తెలిపారు. హైదరాబాద్‌ నగరానికి గోదావరి నీళ్లు రావడానికి సీఎల్పీ నేతగా పీజేఆర్‌ నడిపిన పోరాటమే కారణమన్నారు. ఐటీ, ఫార్మా, నాలెడ్జ్‌ హబ్‌గా హైదరాబాద్‌ మారిందంటే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేక పాలసీల వల్లనేనని పేర్కొన్నారు. జంటనగరాలకు నిరంతర విద్యుత్తు ఇవ్వాలని విధాన పరమైన నిర్ణయం తీసుకోవడంతో దిగ్గజ ఐటీ సంస్థలు తరలి వచ్చాయన్నారు. దేశానికి సరఫరా అవుతున్న బల్క్‌ డ్రగ్స్‌లో 40 శాతం హైదరాబాద్‌లో ఉత్పత్తి అవుతున్నవేనని చెప్పారు. పదేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేసిన ప్రణాళికలు, విధానపరమైన నిర్ణయాల కారణంగా వచ్చిన ప్రపంచ దిగ్గజ సంస్థలు.. హైదరాబాద్‌కు గ్రోత్‌ ఇంజన్లుగా మారాయన్నారు. తెలంగాణలో 65 శాతం ఆదాయం హైదరాబాద్‌ నగరం నుంచే వస్తోందని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు తదితర సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చి అభివృద్ధి, సంక్షేమాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం బ్యాలెన్స్‌ చేసిందన్నారు. ఈ చరిత్ర కేసీఆర్‌ చెరిపేస్తే చెరిగేది కాదన్నారు. ఆనాటి పదేళ్ల కాంగ్రెస్‌ పాలన, ఆ తర్వాత కేసీఆర్‌ పదేళ్ల పాలనతో పోల్చి చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

*గుజరాత్‌కు గులాం.. కిషన్‌రెడ్డి!*

సబర్మతీ, గంగా, యుమునా రివర్‌ ఫ్రంట్‌లను అద్బుతమంటూ ఓవైపు బీజేపీ ప్రచారం చేసుకుంటుంటే.. మూసీ రివర్‌ ఫ్రంట్‌ను మాత్రం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్‌ ఆరోపించారు. ఇక్కడి పెట్టుబడులు గుజరాత్‌కు తరలి పోవాలన్నదే కిషన్‌రెడ్డి ప్రణాళిక అని, ఆయన గుజరాత్‌కు గులాంగిరీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణకు వచ్చిన సెమీకండక్టర్లు, పెట్టుబడులను ప్రధాని కార్యాలయం నుంచే బెదిరించి గుజరాత్‌కు పట్టుకుపోతే కిషన్‌రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నా రు. ఆయన తనపై ఒంటి కాలిమీద లేస్తే ఏమొస్తుందని, చేతనైతే ప్రధాని మోదీ వద్దకు వెళ్లి నిలదీయాలని అన్నారు. లేదంటే మోదీ కాళ్లు పట్టుకుని కొన్ని ప్రాజెక్టులను తెలంగాణకు వదిలేయాలంటూ కోరాలన్నారు. కేటీఆర్‌తో చెడు సావాసాన్ని కిషన్‌రెడ్డి వదులుకోవాలని సూచించారు. బ్యాడ్‌ బ్రదర్స్‌ కేటీఆర్‌, కిషన్‌రెడ్డి అడ్డుకోని అంశాల్లో కేంద్రం ప్రభుత్వం తన వంతు సహకారం అందిస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా సీఎం చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి, బీజేపీ డిపాజిట్లు జప్తు కావడం ఖాయమన్నారు. బీఆర్‌ఎస్ ను వ్యతిరేకించే ఏ ఎంపీనీ కిషన్‌రెడ్డి ప్రచారానికి రానివ్వడంలేదని ఆరోపించారు.

*డ్రగ్‌ కల్చర్‌ ఎవరిదో ఆలోచించండి*

ఎవరిది పబ్‌ కల్చర్‌, ఎవరిది డ్రగ్‌ కల్చర్‌, గల్లీ గల్లీల్లో గంజాయి, డ్రగ్స్‌కు కారణం ఎవరు అన్నది జూబ్లీహిల్స్‌ ప్రజలు ఆలోచించాలని సీఎం రేవంత్‌ సూచించారు. వచ్చే పదేళ్లూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటుందని, సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తుందని చెప్పారు. నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమపై ఉందన్నారు. సెంటిమెంటా? డెవల్‌పమెంటా? అన్నది జూబ్లీహిల్స్‌ ప్రజలే తేల్చుకోవాలన్నారు. ఆర్కిటెక్చర్‌ చదువుకున్న యువకుడిని రౌడీ అనడం బీఆర్‌ఎస్‌ ఆలోచనా ధోరణికి అద్దం పడుతుందని మండిపడ్డారు. ”మా నాన్నను చూపించి నన్ను రౌడీ అంటున్నరు. పాస్‌పోర్టు బ్రోకర్‌ కొడుకును ఏమనాలి? అని నవీన్‌ యాదవ్‌ అందుకే ప్రశ్నించారు” అని రేవంత్‌ అన్నారు.

*కేసీఆర్‌ ప్రారంభించిన ఏ పథకాన్నీ ఆపలేదు..*

బీఆర్‌ఎస్‌ హయాంలో కొత్తగా ఒక్క యూనివర్సిటీ కూడా తేలేదని, కనీసం వీసీలను కూడా నియమించలేదని సీఎం రేవంత్‌ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేలకు పైగా స్కూళ్లను మూసేశారని, రైతులకు వ్యవసాయాన్ని, మహిళలకు రాజ్యాధికారాన్ని దూరం చేశారని ఆరోపించారు. కొత్తగా ఆస్పత్రులనూ నిర్మించలేదన్నారు. కేసీఆర్‌ హయాంలో నగరంలో చేపట్టిన ఏ ఒక్క ప్రాజెక్టయినా పూర్తయిందా? అని ప్రశ్నించారు. తన రెండేళ్ల ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాకుండా ఆర్టీసీని లాభాల బాట పట్టించామని తెలిపారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని, రూ.3 వేల కోట్లతో ఉస్మానియా ఆస్పత్రిని, వందెకరాల్లో హైకోర్టునూ నిర్మిస్తున్నామన్నారు. కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వడమే కాకుండా సన్నబియ్యం ఇస్తున్నామని, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రూ.21 వేల కోట్ల రుణమాఫీ అమలు చేశామన్నారు. కేసీఆర్‌ ప్రారంభించిన ఏ ఒక్క పథకాన్నీ ఆపకుండా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ, కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. ఏడాదిన్నరలో రాష్ట్రానికి 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. హైదరాబాద్‌ నగరానికి 20 టీఎంసీల గోదావరి జలాలు తెచ్చేందుకు ప్రణాళికలు తయారు చేశామని, వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో బెస్ట్‌ ఫైనాన్షియల్‌ పాలసీని తీసుకువస్తామని ప్రకటించారు.
*కాలేజీలు రూల్‌ ప్రకారం పోదామంటే సిద్ధం: సీఎం రేవంత్‌*
కాలేజీల నిర్వహణలో నిక్కచ్ఛిగా రూల్‌ ప్రకారం పోదామంటే తాను వంద శాతం సిద్ధంగా ఉన్నానని యాజమాన్యాలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. యాజమాన్యాలు రూపాయి కూడా డొనేషన్‌ తీసుకోవద్దని, మెరిట్‌ లేకుండా సీట్లు ఇవ్వవద్దని అన్నారు. విజిలెన్స్‌ డిపార్ట్‌మెంట్‌, కాలేజీ మేనేజ్‌మెంట్‌లతో నిజనిర్ధారణ కమిటీ వేసి ఒక్కో కాలేజీని పరిశీలించి ప్రక్షాళన చేద్దామన్నారు. ఆయా కాలేజీల్లో నిబంధనల ప్రకారం బోధనా సిబ్బంది, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉన్నాయా, లేదా అని పరిశీలిద్దామన్నారు. కొన్ని కాలేజీలైతే ఆయా కాలేజీల నుంచి వెళ్లిపోయిన విద్యార్థుల పేరుమీద కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వసూలు చేయడం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అర్బన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ అయితే కంప్యూటర్‌ సైన్స్‌ వంటి కోర్సులకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు డొనేషన్లు వసూలు చేస్తున్నారని, మెడికల్‌ కాలేజీల్లోనైతే ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఆయా సీట్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కేవలం రూ.35 వేల చొప్పున మాత్రమేనన్నారు. ”డొనేషన్లు లేని డిగ్రీ కాలేజీలకు మొదట చెల్లించి.. డొనేషన్లు తీసుకుంటున్న ఇంజనీరింగ్‌ కాలేజీలకు విడతల వారీగా చెల్లిస్తామంటే.. ‘లేదు ఒకేసారి కట్టాలి.. లేకుంటే బంద్‌ పెడతాం’ అంటున్నారు. కాలేజీలు బంద్‌ పెట్టినా ఆరు నెలల తర్వాత వారి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వారికి వస్తుంది. విద్యాసంవత్సరం కోల్పోయిన విద్యార్థికి ఎవరు జవాబుదారీ? విద్యను రాజ్యాంగం సేవగానే గుర్తించింది కానీ.. వ్యాపారంగా కాదు. కాలేజీలు బంద్‌ పెట్టడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకదు. పిల్లల కోణంలో ఈ సమస్యను చూడాలి” అని సీఎం రేవంత్‌ అన్నారు…..
👉 వాట్సప్‌ లోనూ వినియోగదారుల కమిషన్‌ కు ఫిర్యాదు చేయొచ్చు…  విజయవాడ : ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందు కోసం వాట్సప్‌ చాట్‌ బాట్‌ సేవలను తీసుకొచ్చింది.
వాట్సప్‌ నంబర్‌ 88000 01915 లో మొదట హాయ్‌ అని టైప్‌ చేయాలి. అక్కడి సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్‌ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు నమోదవుతుంది. అనంతరం కేసు పరిష్కారం కోసం ఈ వివరాలు ఆయా జిల్లా వినియోగదారుల కమిషన్‌కు పంపుతారు. కేసు పరిష్కారం అయ్యే వరకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు.దీంతో పాటు 1800114000 లేదా 1915 నంబర్‌కు కాల్‌ చేసి సైతం (ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు) ఫిర్యాదు చేయొచ్చు. ప్రతి రోజూ వేల ఫిర్యాదులు నమోదవుతుండగా, అందులో పరిష్కారమైన కేసులకు సంబంధించిన వివరాలను కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ
వెబ్‌సైట్‌లో ఎన్‌సీహెచ్‌ సక్సెస్‌ స్టోరీస్‌’ పేరుతో పొందుపరుస్తోంది.
👉విశాఖలో టీడీపీ నేత గోమాంసం గౌడౌన్ బట్టబయలు 😱😱😱
రాష్ట్ర వ్యాప్తంగా గోవుల్ని కొనుగోలు చేసి.. వాటి మాంసాన్ని గుట్టుగా విదేశాలకి విక్రయిస్తున్న బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుబ్రహ్మణ్య గుప్తా…
గోడౌన్‌లో 1.89 ల‌క్ష‌ల కేజీల గోమాంసం స్వాధీనం చేసుకున్న అధికారులు..ఏంటి ఈ ఘోరం అంటూ బాధపడుతున్న హిందూ ధార్మిక సంఘాలు..
మొన్న పిఠాపురంలో గోవుల మాంసంతో కల్తీ నెయ్యి.. ఇప్పుడు విశాఖలో గోమాంసం గోడౌన్.. ఏపీలో ఏం జరుగుతోంది చంద్రబాబు గారు ?

👉 మొంథా తుఫాను నష్టాన్ని పరిశీలించేందుకు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న నలుగురు సభ్యుల కేంద్ర బృందం.

*. కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్ష..*. నష్ట తీవ్రతను తెలియజేసేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ వీక్షణ..*. వీడియో ప్రదర్శన ద్వారా నష్టాన్ని వివరించిన కలెక్టర్ .పి.రాజాబాబు..*. జిల్లావ్యాప్తంగా నష్టం జరిగినట్లు వెల్లడించిన కలెక్టర్.* కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులుబి. ఎన్. విజయ్ కుమార్, రాష్ట్ర అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎం. శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు……     జిల్లా ఇన్చార్జ్ రెహమాన్..
👉ఏటీఎంల తనిఖీలు నిర్వహించిన కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జునరావు *

ప్రకాశం జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు కంభం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. మల్లికార్జునరావు ఒంగోలు పరిధిలోని వివిధ ఏటీఎంలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఏటీఎంల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, లైటింగ్ సదుపాయాలు, నగదు భద్రతపై పరిశీలన చేపట్టారు.ప్రజలు రాత్రి వేళల్లో ఎటిఎంలను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఏటీఎంల వద్ద భద్రతా సిబ్బంది విధులు నిర్వహించడాన్ని కూడా పరిశీలించి, అవసరమైన సూచనలు చేశారు.ప్రజల ఆర్థిక భద్రత కోసం నిరంతర తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!