👉మోడీ ప్రకటన అలా.. రాహుల్ పోస్టు ఇలా.. పరువు పోయిందిగా ! ఇదేనా అభివృద్ధి అంటూ..ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “అభివృద్ధి అంతా భ్రమే. ఆచిన్నారులు న్యూస్ పేపర్లలో అన్నం తింటున్న దృశ్యం చూశాక.. నా హృదయం ముక్కలైంది. `దేశం అభివృద్ధి బాటలో దూసుకుపోతోంది..` అని ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత నియోజకం వారణాసిలో 4 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన సమయంలో శనివారం భారీ ప్రకటన చేశారు. అయితే.. ఆ తర్వాత 30 నిమిషాల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మోడీకి కౌంటర్గా తన ఎక్స్ ఖాతాలో కీలక పోస్టు చేశారు.“ఇదేనా అభివృద్ధి.. దూసుకుపోవడం“ అని ప్రశ్నించారు.
దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రధాని సహా.. మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. మధ్యప్రదేశ్లోని శ్యోపూర్ జిల్లాలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో శనివారం పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టారు. అయితే.. సహజంగా ఎక్కడైనా పళ్లాల్లో ఈ భోజనం వడ్డిస్తారు. కానీ, ఇక్కడ న్యూస్ పేపర్లపై చిన్నారులకు అన్నం వడ్డించారు. అంతేకా దు.. అత్యంత దారుణమైన పరిస్థితిలో వారు నేలపై కూర్చుని.. పేపర్లను మట్టిపై పెట్టుకుని వాటిలోనే భుజిస్తున్నారు. తింటున్న సమయంలో కొన్ని కాయితాలు చిరిగిపోయి.. మట్టి, దుమ్ము కూడా అన్నంలో కలిసిన దృశ్యాలు కనిపించారు. ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన రాహుల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదేనా అభివృద్ధి అంటూ..ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ….🌟“అభివృద్ధి అంతా భ్రమే. ఆచిన్నారులు న్యూస్ పేపర్లలో అన్నం తింటున్న దృశ్యం చూశాక.. నా హృదయం ముక్కలైంది. ఇంత దారుణమా? వీరంతా భావిభారత పౌరులు కాదా?“ అని రాహుల్ ప్రశ్నించారు. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని అధికార పీఠాలను ఎక్కుతున్న వారు..కనీసం చిన్నారులకు కూడా గౌరవ ప్రదమైన రీతిలో భోజనం పెట్టలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కాగా.. ఈ పోస్టు వెలుగు చూసిన తర్వాత.. బాధ్యులపై చర్యలు తీసుకున్నామని.. సదరు పాఠశాల ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేశామని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. కాగా.. మధ్యప్రదేశ్ లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉండడం గమనార్హం
👉ఒక్క దుంగ కూడా మిస్ కాకూడదు:Dy CM పవన్
తిరుపతి(D) మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గోడౌన్లను Dy.CM పవన్ పరిశీలించారు. 8 గోడౌన్లలోని ఎర్రచందనం లాట్లు.. A, B, C, నాన్ గ్రేడ్ల వారీగా దుంగల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఎర్రచందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పట్టుబడిన దగ్గరి నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవ్వకూడదని ఆయన ఆదేశించారు.. ఆపరేషన్ కగార్ తరహాలోనే ఎర్ర చందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం .. ఎర్ర చందనం స్మగ్లింగ్ లో నలుగురు కింగ్ పిన్స్ ను గుర్తించాం..స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనం చేసుకుంటాం .. ప్రజా సంక్షేమం ప్రకృతి సంపద రక్షణ కూటమి ప్రభుత్వ ధ్యేయం .. తిరుపతిలో మీడియాతో ఉప ముఖ్యమంత్రివర్యులు ..ఎర్రచందనం అనేది శేషాచలం అడవుల్లో తప్ప ప్రపంచంలోనే ఎక్కడా దొరకని అపురూపమైన అటవీ సంపద. *అందుకే ఈ అపురూప సంపద శేషాచలంలో తప్ప మరెక్కడా ఇంత నాణ్యతతో ఉండదు. *ఇక్కడ గొప్ప వృక్ష సంపద ఉన్నది దీన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత కావాలి’ అని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కోరారు.
👉 పవన్ కళ్యాణ్ పై అంబటి సెటైర్లు…పవన్ కళ్యాణ్ జీవితాంతం కూటమిలో ఉన్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ‘అసెంబ్లీలో మీ అన్నయ్యను బాలకృష్ణ అవమానిస్తే మాట్లాడలేదే? నువ్వు చెబితే నమ్మి కాపులంతా చంద్రబాబుకు ఓటేస్తే ఇప్పుడు వారినే చంపుతుంటే నోరెత్తలేదే? CBNను, లోకేశ్ను చెరో భుజంపై ఎత్తుకోండి. మాకేం అభ్యంతరం లేదు. జీవితాంతం కూటమిలో కలిసి ఉండాల్సిందిగా ఆయనను ఆశీర్వదిస్తున్నా’ అని ఎద్దేవా చేశారు~£
👉దొంగ-పోలీస్ గేమ్ ఆడుదామని అత్తను చంపేసింది!
దొంగ-పోలీస్ గేమ్ పేరుతో అత్తను కోడలు చంపేసిన ఘటన విశాఖ(D) పెందుర్తిలో జరిగింది. మహాలక్ష్మీ(63), ఆమె కోడలు లలిత మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఆమెపై పగ పెంచుకున్న కోడలు దొంగ-పోలీస్ ఆడుదామంటూ అత్త కళ్లకు గంతలతో పాటు కాళ్లు, చేతులు కట్టేసింది. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీపం అంటుకొని చనిపోయినట్లు PSకు సమాచారం అందించింది. అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది~£
👉రైతులను దోచుకుంటున్న మిల్లర్లు*..మద్దతు ధర చెల్లించకుండా అడ్డగోలుగా దోపిడీ.. తెలంగాణ ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్ కు రూ.2389..మిర్యాలగూడ ప్రాంతంలో సిండికేట్ అయి అడ్డగోలుగా రేటు చెల్లిస్తూ నిలువు దోపిడీ.. క్వింటాల్ కు రూ. 1800 నుంచి రూ.2150 మాత్రమే చెల్లిస్తున్న వైనం.. తరుగు పేరుతో మరో మోసం.. క్వింటాల్ కు మూడు నుంచి ఐదు కేజీల కటింగ్… అయినా అటువైపు కన్నెత్తి చూడని అధికారులు
కొంతమంది ఆకు రౌడీలు, గుండాలు.. కొంతమంది పోలీసులు నకరాలు ఎక్కువ చేస్తున్నారు.. 500 రోజుల్లో మన ప్రభుత్వం రాబోతుంది.. ఒక్కొకటి పేరు రాసి పెట్టుకుంటా.. ఎవడెవడు ఎగిరి పడుతున్నాడో వాడి తోక కట్ చేస్తా…రేవంత్ రెడ్డి కాదు, వాడి తాత వాడి అయ్య దిగొచ్చినా మిమ్మల్ని కాపాడలేడు – కేటీఆర్
👉తెలంగాణ ఎమ్మెల్యేల ఆస్తులు రూ.4637 కోట్లు*
ఎమ్మెల్యేల ఆస్తులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక ఇటీవలే విడుదలైంది. దేశవ్యాప్తంగా 119 మంది బిలియనీర్ ఎమ్మెల్యేలు ఉన్నారని ఇందులో వెల్లడించింది. వారిలో తెలంగాణ ఎమ్మెల్యేల ఆస్తులు రూ.4,637 కోట్లు అని ఇందులో ప్రస్తావించింది.
👉 అనంతపురం పట్టణంలో మెప్మా లో భారీగా అవినీతి..” *అనంతపురం జిల్లా: *అనంతపురం పట్టణంలో మెప్మా లో భారీగా అవినీతి..ప్రధాన కార్యాలయం నుండి ఇప్పటికీ చర్యలు శూన్యం. ఆందోళనలో డ్వాక్రా మహిళల సంఘాలు.*అనంత మెప్మా లో ఎవరికి వారే మహిళా సంఘాలు పేరుతో భారీగా పెరిగిన అవినీతి.*బినామీ పేరుతో మెప్మా లో లోన్లు తీసుకొని ప్రభుత్వానికి టోకరా…😲😲😲😲
🌟నాలుగు సంవత్సరాల నుండీ పోరాడుతున్న సాధారణ వ్యక్తీ..😱*మెప్మా ప్రధాన కార్యాలయం నుండీ రాయబారాలు చెస్తున్నాని విశ్వశనీయ వర్గాల సమాచారం. *అవినీతి ఫై విచారణ చెయ్యండి అంటూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోని ఉన్నత అధికారులు. ***ఇంకా పలు శాఖల్లో నకిలీ సర్టిఫికెట్స్ ఉద్యోగాలు ఉన్నారు అంటు సంచలన విషయాలు వెలుగులోకి*
👉హైదరాబాద్ నగరం కొత్తపెట చైతన్య పూరి లో మితి మీరుతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు..!*
హైదరాబాద్:- చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట మెట్రో పిల్లర్ 1629 వద్ద, గంజాయి మత్తులో పటాన్ చెరు నుండి ఏపీ వెళ్తున్న ప్రైవేట్ బస్సును ధ్వంసం చేసిన యువకులు..
తమ కారుకు బస్సు తగిలిందని, డ్రైవర్పై దాడి చేసి, బస్సును ధ్వంసం చేసిన యువకులు..
బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు…

