👉🏻సర్ (ఎస్ ఐ ఆర్) కి సలాం కొట్టలేం ! .. ఎక్కడైనా అమలు అయ్యే విధానం ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితాను మరింతగా నవీకరణ చేయడం అని ఆయన గుర్తు చేస్తున్నారు చట్టాలు కూడా పూర్తి క్లారిటీగా అదే విషయం చెబుతున్నాయని ఆయన అంటున్నారు. సర్ అంటే దేశంలోని విపక్షానికి చిర్రెత్తుకుని వస్తోంది. సర్ అన్నది షార్ట్ కట్ పదం. ఇది మర్యాదపూర్వకంగా ఇంగ్లీష్ లో అనిపించినా సర్ కి అసలైన అర్ధం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ . కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా 12 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో సర్ ని అమలు చేయడానికి రెడీ అయిపోతోంది. ఆ వివరాలు అన్నీ కూడా కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ ఢిల్లీలో మీడియా ముందు వెల్లడించారు. ఇక ఈసీ రెండవ విడతలో భాగంగా సర్ ని అమలు చేయబోయే రాష్ట్రాల జాబితాలో కేరళ కూడా ఉంది.
అదే విధంగా కేరళకు కూడా 2027లో ఎన్నికలు ఉన్నాయి దాంతో ప్రస్తుతం కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ కూటమి సర్ మీద కారాలూ మిరియాలూ నూరుతోంది… **దేశంలో రెండో విడతగా అమలు చేయబోతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ అన్నది ప్రజాస్వామ్యానికి పెను ముప్పు అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు. కేరళతో పాటు ఇతర రాష్ట్రాలలో దీనిని చేపడతామని ఈసీ ప్రకటించిన కొద్ది గంటలలోనే ఆయన నుంచి పూర్తి వ్యతిరేకతతో ప్రకటన విడుదల అయింది. ఈ విధంగా ఈసీ కనుక వ్యవహరించ దలచుకుంటే అది ఈసీ ఉనికి మీదనే సరికొత్త సందేహాలకు కారణం అవుతుందని కూడా ఆయన అంటున్నారు. అదే విధంగా దేశంలో ఎన్నికల వ్యవస్థ మీద కూడా జనాలలో ఎన్నో అనుమానాలకు పూర్తి స్థాయిలో తావిస్తుందని కూడా పినరయి విజయన్ అంటున్నారు. ప్రజల విశ్వాసాన్ని దీబ్బతీస్తుందని గుర్తుంచుకోవాలని ఆయన ఘాటుగానే హెచ్చరించారు. ఈసీ చెబుతున్న దానిని బట్టి చూస్తే 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టం అలాగే 1960 నాటి ఓటర్ల జాబితా సవరణలకు వాటి నిబంధనలకు పూర్తి స్థాయిలో ఉల్లగించడమే అని కూడా విజయన్ అన్నారు. సర్ పేరుతో ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాకు బదులుగా 2002 నుంచి 2004 వరకూ ఉన్న ఓటర్ల జబితాల ఆధారంగా సవరణ చేయడానికి ఈసీ సన్నాహాలు చేస్తోందని కేరళ ముఖ్యమంత్రి విమర్శిస్తున్నారు. దీనిని ఎవరూ అంగీకరించే ప్రసక్తి ఉండదని ఆయన స్పష్టం చేస్తున్నారు.
**అదే కరెక్ట్ విధానం : ఎక్కడైనా అమలు అయ్యే విధానం ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితాను మరింతగా నవీకరణ చేయడం అని ఆయన గుర్తు చేస్తున్నారు చట్టాలు కూడా పూర్తి క్లారిటీగా అదే విషయం చెబుతున్నాయని ఆయన అంటున్నారు. ఆ విధంగానే ఈసీ వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇక చూస్తే కేరళలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు ఆ సమయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ని అమలు చేయడం అన్నది అసాధ్యమని విజయన్ అన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి ఇప్పటికే ఈసీకి తెలియచేశారని అయినా కూడా ఈసీ సర్ ని అమలు చేస్తామని చెప్పడం మీద ముఖ్యమంత్రి మండిపడుతున్నారు. ఇవన్నీ చూస్తూంటే ఏకంగా ఈసీ వ్యవహరిస్తున్న తీరు మీదనే పూర్తి స్థాయిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని విజయన్ అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈసీ దేశంలో రెండో విడతగా అమలు చేయాలనుకుంటున్న సర్ అంత సులువుగా కనిపించడం లేదని అంటున్నారు. మరి ఏ విధంగా ఈసీ అమలు చేస్తుందో చూడాలి ఉంది.
👉కార్మికులకు వాటా ఇస్తేనే సినిమా టిక్కెట్ల ధరల పెంపు: సీఎం రేవంత్ రెడ్డి ..
సినీ కార్మికులకు కలెక్షన్లలో వాటా ఇచ్చే పని అయితే టిక్కెట్ల రేట్ల పెంపుకు ఆమోదం తెలియచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సినీ కార్మికులు అంతా కలసి సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్లో అభినందన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెంచే టికెట్ రేట్ లో 20% కార్మికులకు ఇస్తేనే ఇకపై జీవో ఇస్తామని ప్రకటించారు. టికెట్ రేట్లు పెరిగితే నిర్మాతకు డబ్బులు వస్తాయి కానీ కార్మికులకు ఏమీ రాదు..అందుకే ఇకపై టికెట్ రేట్లు పెంచే జీవో ఇవ్వాలంటే 20 శాతం కార్మికులకు ఇవ్వాలన్నారు. అధికారంతో తన కళ్లు మూసుకుపోలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. సినీ కార్మికులకష్టాలు తెలుసన్నారు. మిమ్మల్ని పట్టించుకోనంత ఎత్తుకు తాను ఎదుగలేదని కార్మికులకు భరోసా ఇచ్చారు. మీ కష్టాలన్నీ తీరుస్తానని చెప్పలేను కానీ.. తన చేతుల్లో ఉన్నంత వరకూ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నటుడు ప్రభాకర్ రెడ్డిని రేవంత్ గుర్తు చేసుకున్నారు. సినీ కార్మికుల ఆత్మబంధువు ప్రభాకర్ రెడ్డి అని..ఆయన కార్మికుల కోసం తన సొంత స్థలం పది ఎకరాలు ఇచ్చారన్నారు.సినీ కార్మికుల అభినందన సభలో.. టిక్కెట్ రేట్ల ప్రస్తావన తీసుకు రావడం.. కార్మికులకు ఇరవై శాతం వాటా ఇవ్వాలనడం సంచలనంగా మారింది.ఈ ప్రతిపాదన ఎలా కార్యరూపంలోకి వస్తుందో చెప్పడం కష్టమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వం కొన్ని సినిమాలకు.. రేట్లు పెంచుతూ జీవో ఇచ్చినా న్యాయస్థానాల్లో నిలబడలేదు. అయితే ఇలా కార్మికులకు ఇరవై శాతం వాటా ఇస్తే రేట్లు పెంచుకునే చాన్స్ ఇస్తామని చట్టం చేస్తే సమస్యలు ఉండవు.
👉 ‘హాలీవుడ్ను హైదరాబాద్కు తీసుకువస్తా’: ప్రపంచ సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక కావాలనేది తన సంకల్పమని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. సినీ కార్మికులు ఏర్పాటు చేసిన అభినందన సభలో మాట్లాడుతూ.. ‘ఐటీ, ఫార్మా పరిశ్రమలు ఎలాగో.. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అంతే. మీరు అండగా ఉంటే హాలీవుడ్ను హైదరాబాదు తీసుకువస్తా. కార్మికుల కష్టాలు తెలియనంతగా నాకు కళ్లు మూసుకుపోలేదు. సినీ కార్మికుల కోసం వెల్ఫేర్ ఫండ్ను ఏర్పాటు చేస్తున్నాం’ అని సీఎం అన్నారు.
👉రూ 30/ లు ఉన్న రిజిస్టర్ పోస్టు సేవలు నిలిపివేసి,
రూ 67/ లు ఉన్న స్పీడ్ పోస్ట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎంత అభివృద్ధో కదా!
👉 నెలకు రూ.50,000 జీతంతో ఉద్యోగాలు
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL).. లికాం స్ట్రీమ్, ఫైనాన్స్ స్ట్రీమ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా 120 ఖాళీలను భర్తీ చేయనుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం నెలకు ₹.24,900 – ₹.50,500 ఉంటుంది
👉ఒంగోలు నగరంలోని నీటి మునిగిన సుజాత నగర్, సమతా నగర్, పిటీసి ప్రాంతాలలో స్ధానిక ఎమ్మెల్యేతో కలిసి పర్యటించిన జిల్లా ఎస్పీ వి హర్ష వర్ధన్ రాజు..తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఒంగోలు పట్టణంలో పరిస్థితులు పరిశీలించిన జిల్లా అధికారులు..
తుఫాన్ కారణంగా ఒంగోలు నగరంలో పలు ప్రాంతాలు భారీ వర్షాల ప్రభావంతో నీట మునిగిన నేపథ్యంలో ఒంగోలు సుజాతనగర్ పరిసర ప్రాంతాల్లో నీరు ఎక్కువగా చేరి, పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (PTC) ప్రాంగణంలో కూడా నీరు ప్రవహించిన పరిస్థితిని జిల్లా అధికారులు పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, PTC ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ రాధిక, , ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ , ఓడా చైర్మన్ షేక్ రియాజ్ , మేయర్ సుజాత , మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర రావు ప్రత్యక్షంగా ప్రదేశాన్ని సందర్శించి పరిస్థితిని అంచనా వేశారు.నీరు ఎలా బయటకు పంపించాలనే అంశంపై సంబంధిత శాఖలతో సమీక్ష నిర్వహించి, తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.వాటర్ ఎక్కడకు అవుట్ ఫ్లాలో అవుతుందనే.. దానిపై ఎమ్మెల్యే తో చర్చించడం జరిగినది.అంతే కాకుండా పిటిసిలోకి కుడా వాటర్ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రధాన డ్రైనేజి నుండి వాటర్ అవుట్ ఫ్లో పై మున్సిపల్ అధికారులను సమన్వయం చేసుకుని చర్చించడం జరిగింది.
వేంటనే స్ధానిక ఎమ్మెల్యేతో పాటు అధికారులందరూ సమన్వయంతో వర్మ హోటల్ సమీపంలో ఉన్న డివైడర్ ను బద్దలు కొట్టి వాటర్ ను పోతురాజు మేజర్ కాలువలోకి మళ్ళించడం జరిగినది.ఇలా చేయడం ద్వారా సుజాత, సమతా నగర్లలో నిలువ ఉన్న వాటర్ అవుట్ ప్లోను తొలగించడం జరిగిందన్నారు.జిల్లా ఎస్పీ ప్రజలను ఉద్దేశించి విజ్ఞప్తి చేస్తూ, ప్రజలు తుఫాన్ సమయంలో అనవసరంగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ మరియు పోలీస్ శాఖ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనూ పోలీస్ కంట్రోల్ రూమ్ లేదా సమీప పోలీస్ స్టేషన్ను వెంటనే సమాచారం తెలియజేయాలని సూచించారు.
👉 ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు ఆర్టీసీ గ్యారేజ్ లో తుఫాను ప్రభావంతో చెట్టు విరిగి అక్కడే నిలిచిన ఉన్న కారు మీద పడింది కారులో కానీ చుట్టుపక్కల కానీ సిబ్బంది లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నా అధికారులు..గిద్దలూరు ఆర్ టీ సి డిపో
👉ఒంగోలు పట్టణంలో మొంథా తుఫాన్ నేపథ్యంలో ప్రకాశం జిల్లా యంత్రాంగం చేపడుతున్న ఏర్పాట్లు, చర్యలు , తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాత్రికేయుల సమావేశంలో వివరించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి,జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు. ఈ పాత్రికేయుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. .
👉మోంతా తుఫాన్ నేపధ్యంలో జిల్లాలోని ముంపు ప్రాంతాలను సందర్శించిన జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,నెల్లూరు జిల్లా
తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను స్వయంగా సందర్శించి, పునరావాసం మరియు సహాయక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న జిల్లా యస్.పి. .ఇందుకూరుపేట పరిధిలోని ముదివర్తిపాలెంలోని పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న ప్రజలకు ఆహారం, వైద్య సేవలు, నీరు అందిస్తున్న ఇతర వసతులను స్వయంగా ఆరా తీసిన యస్.పి. .
తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పరిస్థితులను నేరుగా గమనించి, అధికారులకు తగు సూచనలు మరియు ఆదేశాలు జారీ చేశారు.ముమ్మరంగా సహయక చర్యలలో నిమగ్నమై ఉన్న నెల్లూరు పోలీసులుజిల్లా వ్యాప్తంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు.జిల్లా వ్యాప్తంగా తుపాను పరిస్థితిని ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
ప్రజలకు పునరావాస కేంద్రాల్లో తగిన మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. రక్షణ సహాయక చర్యలకు పోలీస్ శాఖ తరఫున ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పోలీస్ వారు సిద్ధంగా ఉంటారని, ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు.
వర్షపు నీరు చేరే కాలనీల లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే చర్యలు వెంటనే చేయాలని ఆదేశాలు.24×7 అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, భారీ వర్షాలు, వరదల వలన ఏమైనా ఘటనలు తలెత్తినా, అత్యవసర పరిస్థితి వచ్చినా, సమస్యలకు గురైనా ప్రజలు, వెంటనే డయల్- 112 లేదా పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్స్ 9392903413, 9440796383, 9440796370 లకు సమాచారం తెలపాలని సూచించారు.
👉భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం జిల్లా కంభం మండలంలోని గుండ్లకమ్మ వాగు, కంభం చెరువు అలుగులను కంభం ఎస్సై బి నరసింహారావు నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి సందర్శించి ప్రజలకు తగు సలహాలు సూచనలను ఇచ్చారు.


