👉సామాన్యుల వెతలు: టిడిపి లో ఆ తప్పులే జరుగుతున్నాయా ..!
వైసీపీ పాలనలో జరిగిన తప్పులు సరిచేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అప్పటి తప్పులు ఇప్పుడు జరగకుండా చూస్తున్నామని వ్యాఖ్యానిస్తోంది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నా రు. అంతేకాదు.. గత తప్పులు పునరావృతం కాకుండా కూడా చూస్తున్నామని అంటున్నారు. కానీ, ఏమాట కు ఆమాట చెప్పాల్సి వస్తే.. గత తప్పులే ఇప్పుడు కూడా జరుగుతున్నాయన్నది సామాన్యులు చెబుతు న్న మాట. ప్రజల నుంచి అనేక విషయాల్లో ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న సర్కారుకు ఈ వ్యవహారం బోధపడాల్సిన అవసరం ఉంది…ప్రధానంగా మూడు విషయాల్లో ప్రజలు ముఖ్యంగా సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు…* పోలీసులు అందుబాటలో ఉండకపోవడం: సాధారణంగానే పోలీసులు సామాన్యులకు అందుబాటులో ఉండరు. ఇది గత ప్రభుత్వంలోనూ తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇక, ఇప్పుడు సిట్ల పేరుతో ప్రతి విషయంలోనూ ప్రత్యక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సాధారణ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పోలీసులకు సమయం చిక్కడం లేదు. దీంతో స్టేషన్లకు వెళ్లిన ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. * సామాన్యులకు ప్రభుత్వ బాసట: గతంలో వలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ప్రజలకు ఏ చిన్న అవసరం ఏర్పడినా.. వారు తమ సమస్యలను వలంటీర్లకు చెప్పుకొనేవారు. ఫలితంగా ప్రజలకు ప్రభుత్వం తమతో నే ఉందన్న బావన ఉంది. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎమ్మెల్యేల కార్యాలయాలకు వెళ్తున్నా.. వారికి ఊరట లభించడం లేదు. పనులు కావడమూ లేదు. ఈ పరిస్థితిపై మానిటరింగ్ చేసేవారు కూడా కరువ య్యారు. దీంతో సామాన్యులు తమ సమస్యలు చెప్పుకొనేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
*ప్రతి పనికీ..: ఔను! ఇది వాస్తవం. టీడీపీ సానుభూతిపరులు కూడా చేస్తున్న వ్యాఖ్య. ప్రతి పనికీ చేతు లు తడపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఏ చిన్న పనికి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినా.. ఏ చిన్న వ్యా పారం ప్రారంభించినా.. చేతులు తడపాల్సిన దుస్థితి ఏర్పడిందన్నది టీడీపీ నాయకులే చెబుతున్నారు. ఈ పరిస్థితిని సీఎం చంద్రబాబు సమీక్షించాలి. పరిస్థితిని చక్కదిద్దాలి. లేకపోతే.. మార్పు మాట ఏమో కానీ.. ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి మాత్రం ఉండదని అంటున్నారు పరిశీలకులు. ఆ దిశగా సర్కారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
👉వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా*
*ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేట్ పరం చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు నిరసనగా ఆ ఉత్తర్వులను వెనువెంటనే రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్మాణం,నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ* *కార్యక్రమంలో భాగంగా మార్కాపురం పట్టణంలోని 1వ బ్లాక్ తూర్పు వీధి నందు మాజీ ఎమ్మెల్యే,వైయస్సార్ సీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు పాల్గొన్నారు.కోటి సంతకాల ప్రజా ఉద్యమం* ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు.*
🌟వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా*
*ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేట్ పరం చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు నిరసనగా ఆ ఉత్తర్వులను వెనువెంటనే రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్మాణం,నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ* *కార్యక్రమంలో భాగంగా మార్కాపురం పట్టణంలోని 4వ బ్లాక్ కోనేటి వీధి నందు మాజీ ఎమ్మెల్యే,వైయస్సార్ సీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు పాల్గొన్నారు.కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు.
🌟నూతన గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా**కంభం మండలం హాజరత్ గూడెం గ్రామ పంచాయతీ శివప్రియ నగర్ నందు లింగిజిపల్లి గ్రామ వాసి జగన్ నూతన గృహ ప్రవేశ మహోత్సవానికి హాజరుఅయిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు తదితరులు పాల్గొన్నారు..*
🌟నూతన గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా*గిద్దలూరు పట్టణంలోని స్థానిక పద్మావతి గార్డెన్ నందు వైస్ ఎంపీపీ దూదేకుల బాలయ్య,నాగమ్మ ల నూతన గృహ ప్రవేశ మహోత్సవానికి హాజరుఅయి వారికి శుభాకాంక్షలు తెలియజెసిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు తదితరులు పాల్గొన్నారు…*
👉 *పల్నాడు జిల్లా :- నరసరావుపేట శివారు స్వర్గపురి2 లో మర్డర్.*
*స్వర్గపురి2లో కాటికాపరగా పనిచేస్తున్న గాడిపర్తి ఎఫ్రాన్(31)నీ అతి కిరాతకంగా గొడ్డలితో నరికిన గుర్తు తెలియని వ్యక్తులు…* 18 నెల నుంచి స్వర్గపురిలో కాటికాపరిగా పనిచేస్తున్న గాడిపర్తి ఎఫ్రాన్…* ఎఫ్రాన్ ది నరసరావుపేట క్రిస్టియన్ పాలెంలో నివసిస్తాడు…పాతకక్షల నేపథ్యంలో మర్డర్ జరిగుంటదని బంధువులు ఆరోపణ…ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు* *
👉కడప: తాళ్ల పొద్దుటూరు ఎస్సై సస్పెండ్!!
కడప జిల్లాలో మరో ఎస్సై సస్పెండ్ అయ్యారు. విచ్చలవిడి అవినీతి, ప్రవర్తన సరిగ్గా లేవనే ఆరోపణలతో పెండ్లిమర్రి ఎస్సై మధుసూధర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ డీఐజీ కోయా ప్రవీణ్ ఉత్తర్వులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే రీతిలోనే తాళ్ల ప్రొద్దుటూరు ఎస్సై హృషికేశవరెడ్డిపై కూడా ఆరోపణలు రావడంతో ఆయనని కూడా సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
👉 పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి తప్పించుకున్న హంతకుడు రియాజ్ను పట్టుకున్న పోలీసులు..సారంగపూర్ వద్ద ఓ లారీలో వెళ్తుండగా గుర్తించిన కానిస్టేబుళ్లు..పోలీసులను చూసి లారీ నుంచి దూకి పరుగు అందుకున్న నిందితుడు..అతడిని పట్టుకునే క్రమంలో ఓ వ్యక్తిని కత్తితో గాయపరిచిన రియాజ్ ..వెంటనే, అప్రమత్తమై తుపాకులు ఎక్కుపెట్టడంతో దొరికిపోయిన రియాజ్..
👉గుంటూరు:-నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో మహిళల ఆందోళన ….పదుల సంఖ్యలో బాధితులకు కోట్ల రూపాయలు కుచ్చి టోపి పెట్టిన (చిన్నారి) అన్నపూర్ణ ..తమకు న్యాయం చేయాలంటూ పీఎస్ లో వాపోతున్న బాధితులు ..
- 👉గుంటూరు పట్టణంలో. 2 కోట్లరూపాయలకు టోకరా ..
2 కోట్ల రూపాయల మేర చిట్టీల కట్టిన బాధితులు ..చిట్టీల నిర్వాహకులు ఇళ్లకు తాళాలు వేసి పరార్ అయ్యారని బాధితులు వెల్లడి ..నిర్వాహకులు..నర్సమ్మ అన్నపూర్ణ. నాని .సాయి అనే నలుగురు తమని మోసం చేశారని పిర్యాదు ..ఏటి అగ్రహారం 13 వ లైన్ కి చెందిన బాధితుల నగరంపాలెం స్టేషన్ కి క్యూ కట్టిన వైనం ..భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు చేరుకున్న మహిళలు పురుషులు బాధితులు …
👉 నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ పబ్లిక్ అకౌంట్స్ సభ్యులు , గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*కంభం మండలం, ఎల్ కోట గ్రామంలో ముత్తుముల వీరాభిమాని టీడీపీ కార్యకర్త షేక్ మస్తాన్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు మరియు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చేసిన గార్మి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
*కంభం మండల పార్టీ అధ్యక్షుడు తోట వెంకట శ్రీనివాసరావు మాతృమూర్తి కీ.శే. లక్ష్మీదేవి స్వర్గస్తులవ్వగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన గిద్దలూరు శాసనసభ్యులు అశోక రెడ్డి

