🌟రాజకీయ ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్పై పవన్ కల్యాణ్ ప్రశంసలు..రాజకీయ ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్పై పవన్ కల్యాణ్ ప్రశంసలు.. సినిమా తనకు అమ్మ లాంటిదని స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం.. సెట్లో రాజకీయాలు వద్దని మాత్రమే షరతు పెట్టానన్న పవన్.. ప్రకాశ్ రాజ్ను ‘బ్రిలియంట్ యాక్టర్’ అని కొనియాడిన జనసేనాని.. ‘ఓజీ’ బ్లాక్బస్టర్ వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు.. రాజకీయ రంగంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకునే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్.. వెండితెరపై మాత్రం అద్భుతమైన కెమిస్ట్రీ పండించారు. వీరిద్దరూ కీలక పాత్రల్లో నటించిన ‘ఓజీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన చిత్ర విజయోత్సవ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రకాశ్ రాజ్తో తన వృత్తిపరమైన సంబంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విబేధాలను పక్కనపెట్టి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. “సినిమా నాకు అమ్మ లాంటిది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది సినిమానే. ఎవరి రాజకీయ అభిప్రాయాల కారణంగా నేను నటనకు దూరం కాను. ‘ఓజీ’ సినిమా షూటింగ్ సమయంలో ప్రకాశ్ రాజ్తో కలిసి నటిస్తారా? అని అడిగినప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాను. కేవలం ఒకే ఒక్క షరతు పెట్టాను. సెట్లో రాజకీయ అంశాలు చర్చకు రాకూడదని కోరాను. ఆయన తన వృత్తిని గౌరవిస్తే, నేను కూడా అలాగే ఉంటానని స్పష్టం చేశాను” అని తెలిపారు.ప్రకాశ్ రాజ్ను ‘బ్రిలియంట్ యాక్టర్’ అని అభివర్ణించిన పవన్, “మా మధ్య ఏమైనా ఉంటే అవి బయట చూసుకుంటాం కానీ, సినిమా సెట్లో కాదు. ఈ సినిమాకు ఆయన అందించిన సహకారానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని అన్నారు. సాధారణంగా సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండే పవన్, ఈ కార్యక్రమానికి హాజరై తన రాజకీయ ప్రత్యర్థిని ప్రశంసించడం అందరి దృష్టిని ఆకర్షించింది. రాజకీయంగా ఎన్ని విమర్శలు ఎదురైనా, వృత్తిధర్మానికి కట్టుబడి ఉంటానని పవన్ తన మాటల ద్వారా స్పష్టం చేశారు. ‘ఓజీ’ సినిమాలో ప్రకాశ్ రాజ్ పోషించిన సత్యదాదా పాత్రకు, పవన్ పోషించిన గంభీర్ పాత్రకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే.
👉మధ్యప్రదేశ్లో టమాటా వైరస్ కలకలం…*రాజధాని భోపాల్లో పాఠశాల పిల్లల్లో వ్యాప్తి చెందుతోన్న వైరస్.. 12 ఏళ్ల లోపు చిన్నారులలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న వైరస్..ఇది సోకిన చిన్నారుల చేతులు, పాదాలు, అరికాళ్లు, మెడ కింద, నోటిలో దద్దుర్లు..ఈ లక్షణాలతో బాధ పడే చిన్నారులను ఇంటి వద్దే ఉంచాలని అప్రమత్తం చేస్తున్న పాఠశాలల యాజమాన్యాలు.👉మహాత్మా గాంధీజీ వ్యక్తిత్వం, చూపిన మార్గం అందరికీ అనుసరణీయం. .. ఆయన స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు. *. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖా మాత్యులు డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి వెల్లడి.
👉ఒంగోలులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. హాజరైన కలెక్టర్ పీ.రాజాబాబు, ఎంపీ .మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శాసన సభ్యులు .దామచర్ల జనార్దన రావు, బీ.ఎన్.విజయ కుమార్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, మాల కార్పొరేషన్ చైర్మన్ పీ.విజయ్ కుమార్, పీ.డీ.సీ.సీ. బ్యాంక్ చైర్మన్ కే.సీతా రామయ్య, మేయర్ గంగాడ సుజాత, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు.
*. రూ.40 లక్షలతో నిర్మించే గ్రామ చావిడికి శంఖుస్థాపన.
*. స్వచ్ఛతహీ సేవ కార్యక్రమంలో భాగంగా పదిమంది పారిశుధ్య కార్మికులకు సన్మానం.
👉అహింస మార్గంలో నడవండి*.. మార్కాపురం ప్రకాశం జిల్లా..
సమాజంలో ప్రతి ఒక్కరు గాంధీ చూపిన అహింసా మార్గంలో నడవాలని మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యానల్ న్యాయవాది మొగల్ అన్వర్ బేగ్ పేర్కొన్నారు. గురువారం గాంధీ జయంతి పురస్కరించుకొని న్యాయమూర్తుల ఆదేశాల మేరకు మార్కాపురం పట్టణంలోని ఉప కారాగారంలోని విచారణ ఖైదీలతో ఆయన మాట్లాడారు. క్షణికావేశంలో చేసే నేరాలతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయన్నారు. ప్రతి ఒక్కరు గౌరవ మర్యాదలతో జీవించాలంటే ఎదుటివారి హక్కులకు భంగం కలిగించకూడదన్నారు. అనంతరం ఖైదీలకు ఫలహారాలు అందించారు. కార్యక్రమంలో సబ్ జైల్ పర్యవేక్షణ అధికారి వెంకటరమణ, న్యాయవాదులు పైడిమర్రి రామచంద్ర, కడియం రామయ్య యాదవ్, జైలు సిబ్బంది పాల్గొన్నారు.

