🌟మల్లె సాగు పై, తెగుళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలతో శిక్షణ..
కంభం మండలము రావిపాడు గ్రామంలో సోమవారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మల్లె సాగులో సమగ్ర సస్య రక్షణా పద్ధతులపై రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్ ఎం. రవీంద్ర బాబు సీనియర్ శాస్త్రవేత్త, హార్టికల్చర్ రిసోర్స్ స్టేషన్ దర్శి వారు మల్లె పువ్వుల పంట సాగు చేసే రైతులకు మొక్కలలో మొగ్గ తొలచు పురుగు ఉదృతి ఎక్కువగా ఉందని అన్నారు. పురుగుల యొక్క లార్వా పువ్వు మొగ్గలోకి చొచ్చుకుపోయి మొగ్గ గులాబి రంగులోకి మారి తర్వాత ఎండిపోవడం జరుగుతుంది. దీని నివారణకు డెల్టామెట్రిన్-1 ఎంఎల్ లీటరు నీటికి లేదా ట్రైజోఫాస్ 1 ఎం ఎల్ లీటరు నీటికి లేదా థయామెథాక్సం 0.75 ఎంఎల్.లీ.నీటికి లేదా క్లోరోఫైరిఫోస్ మరియు సైపర్మెట్రిం -2 ఎం ఎల్ .లీ.నీటికి కలిపి పిచికారి చేయాలి అన్నారు. జాజి తోటలో నల్లిఎక్కువగా కనిపిస్తుంది అని దీని నివారణకు స్పైరోమెసిఫెన్ 1 ఎం ఎల్.లీ నీటిని లేదా ఓమిట్ 2 ఎంఎల్.లీ. నీటిని కలిపి లేదా ఫెనజాక్విన్ 1 ఎం ఎల్.లీ. నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. రసం పీల్చే పురుగుల తాకిడి కూడా కనిపిస్తుంది అని దీని నివారణకు రైతులు మాస్ ట్రాపింగ్ పద్ధతిలో జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవాలి అన్నారు. అంతే కాక ఫిప్రోనిల్ మరియు ఇమిడాక్లోప్రిడ్ 1.5 ఎంఎల్. లీటర్ నీటిని కలిపి పిచికారి చేయాలన్నారు. రాసయిన ఎరువులు వాడకం తాగించి సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలన్నారు. ఉద్యాన శాఖ అధికారి డి.శ్వేత మాట్లాడుతూ ఉద్యాన శాఖలో ఉన్న రాయితీల గురించి వివరించారు. ఈ కార్యక్రమం లో వి ఏ ఏ మల్లికార్జున్ మరియు రైతులు పాల్గొన్నారు.
🌟పాఠశాలలకు క్లీనింగ్ కెమికల్స్ పంపిణీ:ఎంఈవో🌟
కంభం: పాఠశాలల్లో పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ క్లీనింగ్ కెమికల్స్ పంపిణీ చేస్తున్నట్లు ఎంఈవో అబ్దుల్ సత్తార్ తెలిపారు.మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్లస్టర్ పరిధిలోని అన్ని పాఠశాలలకు టాయిలెట్ క్లీనింగ్,ఫ్లోర్ క్లీనింగ్, ఎయిర్ ఫ్రెషనర్స్ పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలకు అవసరమైన క్లీనింగ్ కెమికల్స్ అందిస్తున్నామని, పాఠశాలల్లో పారిశుద్ధ్య అవసరాలకు కెమికల్స్ వినియోగిస్తూ సద్వినియోగం చేయాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరనారాయణ, సుబ్రహ్మణ్యం, రవి కిషోర్ రెడ్డి, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

