👉చనిపోయినవాళ్లతో చాయ్ తాగాను’.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు ఆయన ఈ వ్యాఖ్యను కేవలం హాస్యాత్మకంగా కాకుండా, తీవ్ర రాజకీయ ఆరోపణగా వినిపించారు. బిహార్ ఓటరు జాబితాలో ‘మరణించినవారు’గా చూపించబడిన కొందరితో తాను ఢిల్లీలో కూర్చొని చాయ్ తాగానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నీయాంశమయ్యాయి.
ఆయన ఈ వ్యాఖ్యను కేవలం హాస్యాత్మకంగా కాకుండా, తీవ్ర రాజకీయ ఆరోపణగా వినిపించారు. రాహుల్ గాంధీ స్పష్టంగా ఎన్నికల సంఘం (EC) , భారతీయ జనతా పార్టీ (BJP)పై వేళ్లుపెట్టారు. బిహార్లో వేలాదిమంది జీవించి ఉన్నవారిని ‘మరణించినవారు’గా చూపించడం యాదృచ్ఛికం కాదని, ఇది ఒక ప్రణాళికాబద్ధమైన కుట్ర అని ఆయన ఆరోపించారు. దళితులు, వెనుకబడిన వర్గాలు, పేద ప్రజల ఓటు హక్కును తొలగించేందుకు ఈ చర్యలు చేపడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ ప్రకారం.. ఈ రకమైన తప్పుడు ఎంట్రీలు , పేర్ల తొలగింపులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి తీవ్ర ముప్పు. “ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలగాలి. కానీ ఇక్కడ అధికార పార్టీ, ఎన్నికల సంఘం సహకారంతో ప్రజల హక్కులను తుంగలో తొక్కుతోంది,” అని ఆయన మండిపడ్డారు. -రాజకీయ సమీకరణాలపై ప్రభావం బిహార్లో రాబోయే ఎన్నికల ముందు ఈ ఆరోపణలు రావడం గమనార్హం. దళితులు, వెనుకబడిన వర్గాలు బిహార్లో కీలక ఓటు బ్యాంక్గా పరిగణించబడతాయి. ఈ వర్గాల ఓటు హక్కును అడ్డుకోవడం ద్వారా, రాజకీయ సమీకరణాలను మారుస్తారని రాహుల్ గాంధీ సూచించారు. ఇది కేవలం బిహార్కే పరిమితం కాకుండా, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా చర్యలు జరుగుతున్నాయనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. -ప్రతిస్పందనల కోసం ఎదురుచూపు ఈ ఆరోపణలపై BJP లేదా ఎన్నికల సంఘం నుండి అధికారిక ప్రతిస్పందన రావాల్సి ఉంది. అయితే, రాజకీయ వర్గాల్లో మాత్రం రాహుల్ వ్యాఖ్యలు వేడి చర్చకు దారితీస్తున్నాయి.
👉మసీదుకు నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు..
ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామంలో ని అతి పురాతన మసీదును బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మసీదులో అక్రమంగా ప్రవేశించి నిప్పంటించారు. మసీదు తలుపుల తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించి మసీదుకు నిప్పంటించారు. ఈ సందర్భంగా మసీదులోని పలు విలువైన వస్తువులు కాలిపోయినట్లు మసీదు పెద్దలు తెలిపారు. మత కల్లోలాలను సృష్టించడానికే ఈ దుశ్చర్య కు పాల్పడి ఉంటారని ఆరోపణలు వినవస్తున్నాయి.
👉30 ఏళ్లలో తొలిసారి.. పులివెందులలో టీడీపీ చారిత్రక విజయం దశాబ్దాలుగా కొనసాగుతున్న వైఎస్ కుటుంబ ఆధిపత్యానికి తొలిసారి టీడీపీ బ్రేక్ వేసింది. పులివెందుల కోటలో మూడు దశాబ్దాల తర్వాత టీడీపీ ఘన విజయం సాధించింది. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా మారిన పులివెందులలో పసుపు జెండా ఎగరేయడంతో ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటోంది.
కడప జిల్లాలోని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం అంటే వైఎస్ కుటుంబం కంచుకోటగా భావిస్తారు. ఈ నియోజకవర్గ పరిధిలో ఏడు మండలాలు ఉండగా, దాదాపు అన్నిచోట్ల వైఎస్ కుటుంబమే శాసిస్తోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న వైఎస్ కుటుంబ ఆధిపత్యానికి తొలిసారి టీడీపీ బ్రేక్ వేసింది. ఏకంగా నియోజకవర్గ కేంద్రం పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుని సరికొత్త రికార్డు స్థాపించింది. అంతేకాకుండా ఎదురేలేదు అన్న చోట వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ లేకుండా చేసింది. సరైన రీతిలో ఎన్నిక నిర్వహించలేదని, అసలు ఇది ఎన్నికే కాదని వైసీపీ చెబుతున్నా, అధికారిక రికార్డుల్లో మాత్రం టీడీపీ గెలుపు చిరస్థాయిగా నిలిచిపోతుందని అంటున్నారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన నుంచి ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యమే కొనసాగింది. 1955 నుంచి 2011 వరకు జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి మినహా మిగిలిన అన్నిసార్లు కాంగ్రెస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2011లో వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ వైసీపీయే విజయబావుటా ఎగురవేసింది. 1962లో ఒకసారి మాత్రమే ఇండిపెండెంట్ పులివెందుల నుంచి గెలిచారు. ఇక 1983లో టీడీపీ ఆవిర్భవించిన నుంచి ఇక్కడ కనీసం ఖాతా తెరవలేదు. 1983, 1985, 1994, 1999, 2014, 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ పులివెందుల ఎమ్మెల్యేను మాత్రం గెలిపించుకోలేకపోయింది. అదేసమయంలో మండల వ్యవస్థ ఆవిర్భవించిన నుంచి పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 1995లో ఒకసారి మాత్రమే పులివెందులలో టీడీపీ జడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన 2001, 2006, 2014, 2021 ఎన్నికల్లో పులివెందుల ఏకగ్రీవం అవుతూనే వచ్చింది. అయితే 2021లో పులివెందుల స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకున్న వైసీపీ, జడ్పీటీసీ మహేశ్వరరెడ్డి మరణంతో తాజాగా ఉప ఎన్నికను ఎదుర్కోవాల్సి వచ్చింది.
👉జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టుకు వైసీపీ … ఉమ్మడి కడప జిల్లాలో జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలపై ప్రతిపక్షం వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఉమ్మడి కడప జిల్లాలో జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలపై ప్రతిపక్షం వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. రెండు చోట్ల కేంద్ర భద్రత బలగాల బందోబస్తు మధ్య రీ పోలింగ్ నిర్వహణకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అప్పటివరకు ఎన్నికల ప్రక్రియపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. దీంతో కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు జడ్పీటీసీ స్థానాలపై ఈ రోజు కౌంటింగ్ జరుగుతుండగా, హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యే సమయానికి పులివెందల ఫలితం బయటకు వచ్చేసింది. ఒంటిమిట్ట స్థానం ఓట్ల లెక్కింపు మధ్యలో ఉంది. మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులతోపాటు ఆయన సొంత జిల్లాకు చెందిన ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 12న పోలింగ్ జరిగింది. అయితే ఓటింగ్ సందర్భంగా అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడిందని, వైసీపీ ఏజెంట్లను అనుమతించలేదని, స్థానికులను ఓటు వేయకుండా అడ్డుకోవడమే కాకుండా పక్క నియోజకవర్గాలకు చెందిన వారిని తీసుకువచ్చి ఓట్లు వేయించారని వైసీపీ ఆరోపించింది. రెండు చోట్ల ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై కోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు విచారణ ప్రారంభానికి ముందే పులివెందల ఫలితం రావడంతో కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందన్న విషయం ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ అభ్యర్థన మేరకు ఎన్నికల ఫలితంపై స్టే ఇస్తారా? లేక మళ్లీ పోలింగు నిర్వహణకు ఆదేశిస్తారా? అనే చర్చ జరుగుతోంది. వైసీపీ పిటిషన్లపై ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తరఫున కూడా అఫిడవిట్లు దాఖలు చేయాల్సివున్నందున హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
👉ఆపదలో ఉన్నబాధితులను అదుకోవడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు… గురువారం టంగుటూరు మండలం, తూర్పునాయుడుపాలెం లోని తన క్యాంపు కార్యాలయంలో 121 మంది లబ్ధిదారులకు రూ.60.77 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. వీటితో పాటుగా బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖను కూడా బాధితులకు మంత్రి అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్దిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రజల ఆరోగ్యం పట్ల అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సి.ఎం.ఆర్.ఎఫ్) నుంచి చేస్తున్న సహాయమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కొండపి నియోజకవర్గంలో 631 మంది లబ్ధిదారులకు రూ.5.73 కోట్ల ఆర్థిక సహాయం అందించామన్నారు. పేదలకు ఆరోగ్య పరంగా ఆర్థిక తోడ్పాటు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా సిఎం సహాయ నిధి నుండి 450 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆగష్టు 15 న మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు విరివిగా పడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ప్రజలకు సూచించారు..అనంతరం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో జరుగుమల్లి మండలం, చతుకుపాడు గ్రామంలోని తారక రామ సి.హెచ్.సి గ్రూపుకు కిసాన్ డ్రోన్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్వయంగా కిసాన్ డ్రోన్ ను ఆపరేట్ చేసి డెమో కార్యక్రమంలో పాల్గొన్నారు. కిసాన్ డ్రోన్ యూనిట్ విలువ రూ.9.80 లక్షలు కాగా, ఇందులో రూ. 7.84 లక్షలు సబ్సిడీ పోనూ, గ్రూప్ వాటాగా రూ.1.96 లక్షలు అని ఆయన తెలిపారు.
👉*వెలుగొండ తూర్పు ప్రధాన కాలువ నుంచి పాలేరు, ముసికి నీటి కేటాయింపులు..*ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నిమ్మలకి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి*
తూర్పు నాయుడుపాలెం..వెలుగొండ తూర్పు ప్రధాన కాలువ నుంచి పాలేరు, ముసికి నీటి కేటాయింపులు చేసినందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నిమ్మల రామనాయుడుకి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….దీని వల్ల కనిగిరి పరిసర గ్రామాలతో పాటు పొన్నలూరు, మర్రిపూడి, జరుగుమల్లి, సింగరాయకొండ ప్రాంత రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దీంతో పాటు పాలేరుపై ఉన్న సంగమేస్వర ప్రాజెక్ట్, ఈవీ చానల్ కి ఇది ఉపయోగకరమన్నారు. ఈ నీటి కేటాయింపులతో వర్షాభావ ప్రాంతాలకు సాగు, త్రాగు నీటి సమస్య పరిష్కారానికి కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ ప్రాంత రైతుల తరపున కృతజ్ఞతలు తెలుపున్నట్టు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.
👉జగన్ అడ్డ లో టీడీపీ విన్… పులివెందుల జడ్పీటీసీ..టీడీపీ కైవసం..*
*టీడీపీ అభ్యర్థి మా రెడ్డి లతా రెడ్డి 6,735 ఓట్లు..*
*వైస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి 685.ఓట్లు.
👉పులివెందుల జడ్పీటిసిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ద్వారా అధికారిక పత్రాన్ని అందుకున్న మారెడ్డి లతా రెడ్డి
పులివెందుల జడ్పీటీసీగా గెలుపొందడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. నా గెలుపులో పాలుపంచుకున్న టిడిపి, జనసేనా, బిజెపి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు..నాకు కొండంత ధైర్యంగా ఉండి నా గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన కూటమి నాయకులకు,కార్యకర్తలకు నా ప్రత్యేక ధన్యవాదాలు.
👉చిరుత దాడిలో గాయపడిన చిన్నారిని పరామర్శించి చేయూతనందించిన పెద్ద దోర్నాల ఎస్ఐ. వి. మహేష్*
ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం చిన్నారుట్ల గూడెంలో మూడేళ్ల చిన్నారిపై చిరుతపులి దాడి చేసింది. తండ్రి అంజయ్య కేకలతో చిరుత పాపను వదిలేసింది. గ్రామ పెద్ద మంతన్న సాయంతో బాలికనుతొలుత సుండిపెంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తరువాత ఎస్ఐ వి. మహేష్ పోలీస్ సిబ్బంది మెరుగైన చికిత్స కోసం దోర్నాల ఆసుపత్రికి తరలించి ఆర్థికసాయం, పండ్లు అందించారు. చిన్నారి పరిస్థితిని అటవీ శాఖ అధికారులు, పెద్ద దోర్నాల పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
👉ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దూపాడు లో జరిగినటువంటి మసీదు సంఘటన చాలా బాధాకర మైనటువంటి సంఘటన.. ఈ దురాగతానికి పాల్పడినటువంటి మతోన్మాదులను పట్టుకొని శిక్షించాలని మార్కాపురం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్ ఖండించారు. మతసామరస్యానికి నిలయం అయిన మన రాష్ట్రంలో ఇక్కడ అన్ని మతాలు ప్రజలు సోదర భావంతో ప్రశాంతంగా జీవిస్తున్న ఆంధ్ర ప్రజల్లో ఒక విషపూరితమైనటువంటి వాతావరణం సృష్టించడానికి మతోన్మాదులు ప్రయత్నాలు చేస్తున్నారు కావున ఇలాంటి సంఘటనలు ఇంకొక్కసారి మరి ఏ ప్రాంతంలో జరగకుండా ప్రభుత్వ అధికారులు వీరిని పట్టుకొని శిక్షించాలని మేము ప్రభుత్వానికి మరియు ప్రభుత్వ అధికారులకు డిమాండ్ చేస్తున్నామన్నారు.
👉అనకాపల్లి జిల్లా..లంచం తీసుకుంటు అనిషా అధికారులకు పట్టుబడ్డ టౌన్ ఎస్ ఐ దాసరి ఈశ్వరరావు..50 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ ఐ ఈశ్వరరావు..సీజ్ చేసిన షాప్ తెరపించే విషయంలో 50 వేలు లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ..మొదటిగా రెండు లక్షలు డిమాండ్ చేసిన ఎస్.ఐ..

