👉 చేయి దాటిపోతున్న లాస్ ఏంజెలిస్.. ట్రంప్ సంచలన నిర్ణయం అమెరికా చేయిదాటిపోతోంది. అక్కడ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో వలసదారులు రోడ్డెక్కుతున్నారు. అమెరికా చేయిదాటిపోతోంది. అక్కడ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో వలసదారులు రోడ్డెక్కుతున్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. అమెరికాలో వలసదారులపై కఠిన చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ముఖ్యంగా లాస్ ఏంజెలిస్ నగరంలో పరిస్థితి అదుపుతప్పుతోంది. నిరసనకారులు కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడుతుండటంతో వాటిని నియంత్రించడానికి నేషనల్ గార్డ్ బలగాలను మోహరించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. “నిరసనలు ఆపకపోతే మిలిటరీ బలగాలను రంగంలోకి దించాల్సి వస్తుంది” అని ట్రంప్ స్పష్టం చేశారు. ఇందుకోసం ‘ఇన్సరెక్షన్ యాక్ట్ 1807’ను ఉపయోగించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ చట్టాన్ని ప్రయోగిస్తే దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఆర్మీని మోహరించవచ్చు. అయితే, ఈ చట్టం చరిత్రలో చాలా అరుదుగా మాత్రమే ఉపయోగించబడింది. ఇప్పుడు మళ్లీ దాన్ని ప్రయోగించనున్నారనే విషయంపై అమెరికాలో పెద్ద చర్చ మొదలైంది. లాస్ ఏంజెలిస్ నగర అధికారులు ఇప్పటివరకు 100 మందికి పైగా నిరసనకారులను అరెస్టు చేసినట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ కూడా విధించారు.దుకాణాలను ధ్వంసం చేయడం, వాహనాలకు నిప్పుపెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్న వారిని అడ్డుకునేందుకు పోలీసులు, నేషనల్ గార్డ్ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.అయితే, ట్రంప్ నిర్ణయాన్ని డెమొక్రాటిక్ నేతలు, పౌరహక్కుల కార్యకర్తలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆర్మీని మోహరించడం ద్వారా పరిస్థితి మరింత ముదుర్చే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ పరిణామాల మధ్య, అమెరికాలోని వివిధ నగరాల్లో ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రజలు న్యాయం, సమానత్వం కోసం గళమెత్తుతుండగా, ప్రభుత్వ విధానాలపై విమర్శలు, ప్రశ్నలు పెరుగుతున్నాయి. అమెరికాలో ఈ ఉద్రిక్త పరిస్థితులు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి.

👉డ్యాన్స్ తో దుమ్మురేపిన దువ్వాడ, మాధురి జంట.. వీడియో వైరల్! రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట ఎంత ఫేమస్ అనేది తెలిసిన విషయమే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట ఎంత ఫేమస్ అనేది తెలిసిన విషయమే. వీరిద్దరి ప్రేమ కథకు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారని చెబుతారు. వీరిద్దరూ కలిసి ఇచ్చే ఇంటర్వ్యూలు ఫుల్ ఫేమస్! అలాంటి జంట డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? పాటకు తగ్గ స్టెప్పులతో హల్ చల్ చేస్తే ఎలా ఉంటుంది? తాజాగా అదే జరిగింది! వారి డ్యాన్స్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అవును… దువ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురి స్టేజ్ పై డ్యాన్స్ తో అదరగొట్టారు. దివ్వెల మధురి పెద్ద కుమార్తె వాణి ఫంక్షన్ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ ఫంక్షన్ లో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట సందడి చేసింది. ఇందులో భాగంగా స్టెప్పులతో ఈ జంట చేసిన స్టేజ్ పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. సూపర్ కాస్ట్యూంస్ తో పాటకు తగ్గ స్టెప్పులతో స్టేజ్ ను షేక్ చేశారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్లు చేస్తున్నారు. కామెంట్ సెక్షన్ లో మెసేజ్ లతో కళకళలాడిపోతుంది.శంషాబాద్ శివారులోని ఓ రిసార్ట్ లో జరిగిన మాధురి కుమార్తె ఆఫ్ శారీ ఫంక్షన్ లో ఈ జంట స్టేజ్ పై అలరించింది. దువ్వాడ శ్రీనివాస్ ఈ ఫంక్షన్ లో అంతా తానై వ్యవహరించారు! ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సెలక్టెడ్ పర్సన్ ని ఆహ్వానించారు! కాగా… దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వచ్చి వస్త్ర వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వకుళ సిల్క్స్ పేరిట వస్త్ర వ్యాపారం మొదలుపెట్టారు.దీంతో.. ఇటీవల ఎకువగా ఈ జంట హైదరాబాద్ లోనే ఉంటుందని అంటున్నారు. పైగా దువ్వాడను వైసీపీ సస్పెండ్ చేయడంతో..ఆయన ఇప్పుడు పార్ట్ టైం పొలిటీషియన్ గా మారినట్లు చెబుతున్నారు!
👉APWJF ఆధ్వర్యంలో దర్శిలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దర్శి తహసిల్దార్ ఎం శ్రావణ్ కుమార్ కిమరియు డిప్యూటీ తాహసిల్దార్ వెంకటేష్ కి వినతి పత్రాన్ని అందజేశారు

👉 ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం పొదిలి తహసిల్దార్ ఎం. వి. కృష్ణారెడ్డి కి వినతి పత్రాన్ని అందజేశారు
👉పొదిలి లో ఈరోజు జరిగిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నదాతకు అండగా జగనన్న పోరుబాట పర్యటన విజయవంతం అయిందని,టి.డి.పి నాయకులు చేసిన దాడుల పై తాము తీవ్రంగా ఖండిస్తున్నామని నాయకులు అన్నారు.స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మార్కాపురం ఇంచార్జీ అన్నా రాంబాబు, మాజీ మంత్రి వర్యులు మేరుగ నాగార్జున, ఒంగోలు ఇంచార్జి చుండూరు రవి, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, పలువురు నాయకులు పాల్గొని టిడిపి నాయకులు కార్యకర్త తీరును తీవ్రంగా ఖండించారు
👉ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం కంభం తహసిల్దార్ ఎ. కిరణ్ కు వినతి పత్రాన్ని అందజేసారు. కార్యక్రమంలో కంభం ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఓ అల్లూరయ్య, ఎం ఎన్ బేగ్, మాదా. రమణయ్య,వి రమేష్, మైకేల్ తదితరులు పాల్గొన్నారు

