👉ఆగిపోయిన ఇండియా- పాక్ వార్….రష్యాకు క్యూ కడుతున్న దేశాలు !..
భారత్ , పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. రష్యా కు మంచి డిమాండ్ పెరుగుతుంది. దీనికి కారణం ఇండియా వాడుతున్న S 400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్. ఈ S 400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ దెబ్బకు పాకిస్తాన్ డ్రోన్లు అన్ని చిత్తుచిత్తు అయ్యాయి. పాకిస్తాన్ తమ ఆయుధాలు అన్నిటిని… కోల్పోయింది. దీనంతటికి కారణం రష్యా దేశం తయారుచేసిన S 400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ మాత్రమే.
ఈ S 400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ దెబ్బకు చైనా అలాగే టర్కీ దేశాలకు సంబంధించిన ఆయుధాలు ఏమాత్రం పనిచేయలేదు. తునాతునకలైపోయాయి. ఓవరాల్ గా పాకిస్తాన్ పై ఇండియా యుద్ధం గెలిచిందని చెప్పవచ్చు. పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావడంతో…. ఇండియా కూడా కాల్పుల విరమణకు ఒప్పుకుంది.
అయితే ఇలాంటి నేపథ్యంలోనే.. రష్యా తయారు చేసిన S 400 మిస్సైల్ ఆయుధాలకు మంచి డిమాండ్ పెరిగింది. ఆఫ్రికన్ దేశాలు మొత్తం ఇప్పుడు రష్యా దగ్గరికి వెళ్తున్నాయని ఈ సమాచారం అందుతుంది. ఇండియాకు ఇచ్చిన S 400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ తమకు కూడా ఇవ్వాలని అంతర్జాతీయ దేశాలు ఆర్డర్స్ పెట్టుకుంటున్నాయని తెలుస్తోంది. వీటితోనే ఇండియా గెలవడంతో… రష్యాకు మంచి డిమాండ్ పెరిగిందని అంటున్నారు.
👉నమ్మించి.. హైదరాబాద్ రప్పించి.. విద్యార్థినిపై స్నేహితుల అత్యాచారం! చెన్నైకి చెందిన 20 ఏళ్ల బయోమెడికల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థినిపై ఆమె స్నేహితుడు, అతని మరో మిత్రుడు కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు వివరాల్లోకి వెళితే… స్నేహాన్ని నమ్మి వచ్చిన ఓ యువతిపై ఇద్దరు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన నిజాంపేటలో చోటుచేసుకుంది. చెన్నైకి చెందిన 20 ఏళ్ల బయోమెడికల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థినిపై ఆమె స్నేహితుడు, అతని మరో మిత్రుడు కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళితే… బాధితురాలు చెన్నైలో బయోమెడికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. హైదరాబాద్లోని ఓ ఫార్మా కంపెనీలో ఇంటర్న్షిప్ ఇప్పిస్తానని ఆమె స్నేహితుడైన అజయ్ నమ్మబలకడంతో ఆమె నగరానికి వచ్చింది. నగరానికి వచ్చిన యువతి కూకట్పల్లిలోని ఓ మహిళా హాస్టల్లో నివాసం ఉంటోంది. కొన్ని రోజుల క్రితం, అజయ్ తన స్నేహితుడైన హరి ఫ్లాట్లో పార్టీ ఉందని బాధితురాలిని ఆహ్వానించాడు. స్నేహితుడి పిలుపు కావడంతో నమ్మిన యువతి, నిజాంపేటలోని రాజీవ్ గృహకల్పలో ఉన్న హరి ఫ్లాట్కు వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత, అజయ్, హరి కలిసి యువతిని బలవంతంగా మద్యం తాగించారు. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత, అజయ్ , హరి ఇద్దరూ కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. – పోలీసులకు ఫిర్యాదు, దర్యాప్తు ప్రారంభం ఈ దారుణమైన బాధాకరమైన సంఘటన జరిగిన తర్వాత తేరుకున్న బాధితురాలు ధైర్యం కూడగట్టుకుని బచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులైన అజయ్, హరి కోసం గాలిస్తున్నారు. సమాజంలో ఆందోళన స్నేహం ముసుగులో ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడటం, నమ్మిన స్నేహితులే కాలయముళ్లుగా మారడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అత్యంత రద్దీగా ఉండే నిజాంపేట వంటి జనసమ్మర్థ ప్రాంతంలో ఇలాంటి దారుణం జరగడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అమాయక యువతుల జీవితాలతో ఆడుకుంటున్న ఇలాంటి మృగాళ్లను కఠినంగా శిక్షించాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.
👉ప్రకాశం జిల్లా ఎస్పి ఏ.ఆర్. దామోదర్ ఆదేశాల మేరకు, మార్కాపురం పట్టణ డిఎస్పి డాక్టర్ యు. నాగరాజు ఆధ్వర్యంలో, మార్కాపురం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. సుబ్బారావు సమన్వయంతో మార్కాపురం పట్టణంలోని సుందరయ్య కాలనీలో ముందస్తు చర్యల్లో భాగంగా దుకాణాలను తనిఖీ చేసి చట్ట వ్యతిరేకమైన, సమాజానికి హాని కలిగించేటువంటి వస్తువులను అమ్మ వద్దని తెలియపచి, ముఖ్యంగా వేసవికాలంలో చిన్న పిల్లలు తినుబండారాలు కోసం వచ్చినప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన తినుబండారాలను అమ్మటం వల్ల చిన్నపిల్లలు వాటిని తిని అనారోగ్యంనికి గురి అయ్యే ప్రమాదం ఉందని దుకాణాల యజమానులకు తెలిపారు…
👉 ప్రకాశం జిల్లా….ఈరోజు మధ్యాహ్నం పలు కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు…..ఒంగోలు నగరంలోని 15వ డివిజన్ అన్నవర్రపాడులో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత టైలరింగ్ శిక్షణ సెంటర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కుటుంబ సమెంతగా పాల్గొన్నారు..
అనంతరం ఒంగోలు నగరంలోని 4వ డివిజన్ నందు ముస్లిం నాయుకురాలు షేక్ అరిఫా నివాసం నందు వారి కుటుంబ సభ్యులు హజ్ యాత్రకు వెళ్తున్న సందర్బంగా ఏర్పాటు చేసిన అదిల్ దావత్ లో పాల్గొన్నారు.
👉ఆగిపోయిన ఇండియా – పాక్ వార్….రష్యాకు క్యూ కడుతున్న దేశాలు !…👉నమ్మించి.. హైదరాబాద్ రప్పించి.. విద్యార్థినిపై స్నేహితుల అత్యాచారం! ..*పలు కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు..*మార్కాపురం పట్టణంలోని సుందరయ్య కాలనీలో ముందస్తు చర్యల్లో భాగంగా దుకాణాల తనిఖీ..
Recent Posts

