👉జమ్ము కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం కుల మతాలకతీతంగా నిర్వహించిన సంఘీభావ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉగ్రదాడిలో చనిపోయినవారికి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పించారు…హైదరాబాద్ లోని పీవీ మార్గ్ (నెక్లెస్ రోడ్డు)లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు సాగిన కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రివర్గ సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, భారత్ సమ్మిట్ లో పాల్గొనడానికి వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు… సంఘీభావ ర్యాలీని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పహల్గామ్లో అమాయకుల ప్రాణాలను తీసిన ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై కఠినంగా చర్యలు తీసుకునే విషయంలో యావత్ దేశం కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
“ఈ భావోద్వేగ సమయంలో 140 కోట్ల మంది భారత ప్రజలంతా ఒక్కటిగా నిలబడాలి.. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. ఇది రాజకీయాలకు అతీతంగా ఐకమత్యం చాటుకోవాల్సిన సందర్భం. దాడికి బాధ్యులైన వారిని ఉపేక్షించకూడదు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు…1967లో చైనాపై, 1971లో పాకిస్తాన్పై నాటి ప్రధాని ఇందిరా గాంధీ నాయకత్వంలో మన దేశం చూపిన తెగువను గుర్తు చేస్తున్నాను.. ఇందిరా గాంధీ స్ఫూర్తితో ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో కలపే విశయంలోనూ ప్రధానమంత్రి గారికి మద్దతు ఇస్తాం. అలాగే, ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇస్తున్నాం” అని ఆయన అన్నారు.
👉 వైభవంగా ఎస్ వి కే పి వార్షికోత్సవ సంబరాలు .. ప్రకాశంజిల్లా కంభం : పట్టణము లోని ఎస్వి కేపి పాలిటెక్నిక్ కళాశాల లో వార్షికోత్సవ సంబరాలు వైభవంగా జరిగాయి.పాఠశాల మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శన ఉపాధ్యాయ సిబ్బందిని ఆకట్టుకుంది. శుక్రవారం రాత్రి కళాశాల వార్షికోత్సవ సంబరాల్లో పూర్వ విద్యార్థి, మార్కాపురం ఆర్టీసీ డిపో మేనేజర్, కళాశాల చైర్మన్ రావూరి జనార్దన్, డైరెక్టర్ జయరామి రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు. అతిధులు మాట్లాడుతూ కళాశాల లో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని,తల్లిదండ్రుల ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా విద్యార్థులు లక్ష్యం తో చదవాలని అన్నారు.విద్యార్థులు నృత్యాల తో అలరింపజేశారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ సాయిబాబా రెడ్డి, లెక్చరర్ లు, భోదనేతర సిబ్బంది పాల్గొన్నారు.
*నరసరావుపేట శివారు శాంతి నగర్ వద్ద రోడ్డు ప్రమాదం*.. అదుపుతప్పి బోల్తా పడిన ప్రయివేటు ట్రావెల్స్ బస్సు* *ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు..*క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.*హైదరాబాద్ నుండి చీరాల వెళుతుండగా జరిగిన ప్రమాదం.*ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, నరసరావుపేట డిఎస్పీ , నాగేశ్వరరావు,ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు.*
👉 *లారీ, కారు ఢీ – ఒకరు మృతి*..బి.మఠం మండలం కొత్తపల్లె వద్ద కారును ఢీకొన్న లారీ..
ప్రమాదంలో ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు .. మృతుడు మైదుకూరుకు చెందిన షేక్ ఖాదర్ బాషాగా గుర్తింపు.. మైదుకూరు మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సెలర్ గా ఉన్న ఖాదర్ బాషా..ప్రమాదం పై కేసు నమోదు చేసిన బి.మఠం పోలీసులు..

