👉 భారత ఎన్నికల సంఘంపై అమెరికాలో రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు!!!.. 👉జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. 27కు చేరుకున్న మృతుల సంఖ్య …👉త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర… 👉టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థిని.. *షాద్ నగర్ వాసికి సివిల్స్ లో 739 వ ర్యాంకు*.. 👉UPSC సివిల్స్.. తెలుగు అమ్మాయే టాపర్* .. 👉 టీడీపీ అధికార ప్రతినిధి  చౌదరిపై కత్తులతో దాడి !!!…ముస్లిం సోదరులు నిర్వహించిన ర్యాలీకి బహుజనవాది డాక్టర్ వివేక్ మద్దతు

👉 భారత ఎన్నికల సంఘంపై అమెరికాలో రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం రాజీ పడిందని, అందుకు మహారాష్ట్ర ఎన్నికలే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం బోస్టన్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గతేడాది జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో.. ఉన్న ఓటర్ల కంటే ఎక్కువ మందే ఓట్లు వేశారని రాహుల్‌ చెప్పారు. ‘‘మహారాష్ట్ర ఎన్నికల్లో సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల మధ్య 65 లక్షల ఓట్లు పోల్‌ అయ్యాయని ఈసీ వెల్లడించింది. కానీ ఇది అసంభవం. సగటున ఒక ఓటుకు 3 నిమిషాలు పట్టినా అన్ని ఓట్లు పోల్‌ అవ్వాలంటే అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్‌ జరిగి ఉండాలి. కానీ అలా జరగలేదు. మహారాష్ట్ర పోలింగ్‌ గురింగి మేం వీడియో కోసం మేం అడగగా అందుకు ఈసీ ఒప్పుకోలేదు. ఇప్పుడు వీడియో గురించి అడగడానికి వీలు లేకుండా చట్టాన్నే మార్చేశారు’’ అని పేర్కొన్నారు. దీనిని బట్టి ఈసీ రాజీ పడినట్లు స్పష్ఠమవుతోందని, ఈసీ వ్యవస్థలోనే లోపం ఉందని అన్నారు. భారత్‌ – అమెరికా సంబంధాలపై కూడా రాహుల్‌ మాట్లాడారు. అమెరికాతో మనకు భాగస్వామ్యం ఉందని, ఇరు దేశాలు కలిసి పనిచేయాలని కోరుకుంటున్నానని అన్నారు.
*రాహుల్‌ పౌరసత్వంపై బ్రిటన్‌కు లేఖ: కేంద్రం*
కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీకి బ్రిటన్‌ పౌరసత్వం ఉందన్న ఆరోపణలపై సమాచారం ఇవ్వాలంటూ ఆ దేశానికి లేఖ రాశామని కేంద్రం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన కేసుపై విచారణ జరుపుతున్న అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌కు సోమవారం ఈ విషయాన్ని తెలిపింది. దీనిపై పూర్తి వివరాలు ఇచ్చేందుకు మరికొంత సమయం కోరింది.
👉టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థిని..ఫోన్ తీసుకొని ఇవ్వలేదని టీచర్‌ని బూతులు తిడుతూ చెప్పుతో కొట్టిన విద్యార్థిని.. విజయనగరం – రఘు ఇంజనీరింగ్ కళాశాలలో టీచర్‌ ఓ విద్యార్థిని ఫోన్ తీసుకుందని.. టీచర్‌తో వాగ్వాదానికి దిగిన స్టూడెంట్‌. ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో.. ఆ ఫోన్ 12 వేలు ఇస్తావా లేదా అంటూ టీచర్‌ని బూతులు తిడుతూ చెప్పుతో కొట్టిన విద్యార్థిని

👉త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర..  మహారాష్ట్ర ప్రభుత్వం త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరి మూడో భాషగా చేసే నిర్ణయాన్ని రద్దు చేసింది. సీఎం ఫడ్నవిస్ మరాఠీ తప్పనిసరి అని, హిందీ ఐచ్ఛికమని స్పష్టం చేశారు. భాషా సలహా కమిటీ వ్యతిరేకత, విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

👉UPSC సివిల్స్.. తెలుగు అమ్మాయే టాపర్*

తెలంగాణలోని వరంగల్ నగరానికి చెందిన ఈటబోయిన సాయి శివాని UPSC సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 11వ ర్యాంక్ సాధించారు. ఈమె తండ్రి రాజు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నారు. TGPSC గ్రూప్స్ పరీక్షల్లోనూ ఈమె సత్తా చాటారు. తెలంగాణ ప్రభుత్వం ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ కింద అందజేసిన రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పొంది.. ఆ డబ్బుతోనే సివిల్స్ పరీక్షలకు ప్రిపేరై UPSC సివిల్స్‌లో ర్యాంక్ సాధించి తెలుగు రాష్ట్రాలకు పేరు తెచ్చారు.

***షాద్ నగర్ వాసికి సివిల్స్ లో 739 వ ర్యాంకు* సివిల్స్ లో 739 ర్యాంకు సాధించిన ఇంద్రార్జిత* *ఇంద్రార్జిత మంజుశ్రీ హోటల్ యజమాని కీ. శే. నారాయణరావు మనువరాలు, రఘు కుమార్తె*

*ప్రస్తుత యమ్మీ బేకరీ యజమాని ప్రశాంత్ చిన్న మేన కోడలు*.. ఒకప్పుడు షాద్నగర్ పట్టణ బస్టాండు ఎదురుగా ఎందరో ఆహార ప్రియులకు పసందైన రుచులతో వంటకాలు అందించి, మంజుశ్రీ ఉడిపి హోటల్ అంటేనే ఎందరో ఆహార ప్రియులకు ఈ రోజు కూడా గుర్తుండే విధంగా పట్టణంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఈనాడు మన మధ్యలో లేనటువంటి కీర్తిశేషులు నారాయణరావు జ్యేష్ట పుత్రుడు రాఘవేంద్రరావు, మమతా దంపతుల చిన్న కుమార్తె ఇంద్రార్జిత ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లో 739 వ ర్యాంకు సాధించడం షాద్నగర్ పట్టణానికి గర్వకారణం. ప్రస్తుతం టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న రాఘవేంద్రరావు మమతా దంపతుల కుమార్తె ఇంద్రార్జిత కేశంపేట మండలంలోని పాపిరెడ్డి కూడా హెరిటేజ్ పాఠశాలలో చదివి హైదరాబాదులోని సెంట్ మేరీస్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ఢిల్లీలో శిక్షణ తీసుకొని సివిల్స్ లో ర్యాంకును అందుకుంది. ఈ సందర్భంగా రఘుకు, వారి కుటుంబ సభ్యులకు వారి మిత్రులు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు.

👉జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. 27కు చేరుకున్న మృతుల సంఖ్య …

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఏడుగురు ఉగ్రవాదులు ఆర్మీ డ్రస్సులు వేసుకోవచ్చి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మొదట ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలుపగా తాజాగా 27 మంది టూరిస్టులు మృతి చెందినట్లు వెల్లడించారు. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది…

👉ప్రభుత్వ ఆసుపత్రి పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య*

గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రి భవనం పై నుండి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం జరిగింది. భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ సాధువు అనారోగ్యం కారణంగా రెండు రోజుల క్రితం గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. తోటి రోగులతో మాట్లాడుతూ తాను అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నానని ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు తోటి రోగులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

👉టీడీపీ అధికార ప్రతినిధి  చౌదరిపై కత్తులతో దాడి ! !   ప్రకాశం జిల్లా..

▪️టీడీపీ అధికార ప్రతినిధి వీరయ్య చౌదరిపై కత్తులతో దాడిచేసి హత్య చేసిన నలుగురు దుండగులు. ▪️ఒంగోలులోని తన కార్యాలయంలో ఉండగా కత్తులతో దాడి. ..▪️వీరయ్య చౌదరి మృతదేహం ఒంగోలు రిమ్స్‌కు తరలింపు..▪️దాడి జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు..▪️ముసుగులతో వచ్చి వీరయ్య చౌదరిపై దాడిచేసిన దుండగులు.

👉 మానుకోటలో వక్ఫ్ బోర్డు సవరణకు మద్దతుగా ముస్లిం సోదరులు నిర్వహించిన ర్యాలీలో బహుజనవాది డాక్టర్ వివేక్ పాల్గొన్నారు. ముస్లింలకు పూర్తి మద్దతుగా నిలుస్తామని, సెక్యులర్ భారత్‌ను కాపాడతామని వివేక్ అన్నారు. ఈ కార్యక్రమంలో LHPS రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్, DSFI నేతలు శాంతి కుమార్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు..

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..