👉తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ.*
*రోహిత్ వేముల చట్టాన్ని చేయాలంటూ రాహుల్ లేఖ.*
*కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు, హిమాచల్ ప్రదేశ్ సీఎంకు ఇప్పటికే లేఖ రాసిన రాహుల్ గాంధీ.*
*తాను ఎదుర్కొన్న అవమనాలు, వివక్షతను గతంలో అంబేద్కర్ స్వయంగా చెప్పారు.*
*ఇప్పటికీ దేశంలో అనేకమంది దళిత గిరిజన ఓబీసీ విద్యార్థులు అవమానాలు, వివక్షతను ఎదుర్కొంటున్నారు.*… *ఇప్పటికైనా వీటికి ఫుల్స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది.*..*దళిత ఆదివాసి ఓబీసీ విద్యార్థుల కోసం రోహిత్ వేముల చట్టాన్ని చేయాలని లేఖ రాసిన రాహుల్.*
👉 సెక్యూరిటీ ‘ఎస్ఓ’ పై అత్యాచారం కేసు నమోదు! అరెస్ట్?*
తిరుపతి జిల్లా శ్రీ సిటీ హైటెక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పరిశ్రమలో సెక్యూరిటీ ఎస్ఓగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ చెందిన కులదిప్ (26) పై తడ మండలం చిన్నమంబుట్టు గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్యాచారం కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు? కులదిప్ వ్యవహార శైలి పై ఆది నుంచి వివాదాలు ఉన్నాయి, పరిశ్రమ ఉద్యోగులతో నడుచుకునే విధానం , అత్యుత్సాహమైన అహంకారపూరితమైన ప్రవర్తనతో నిత్యం చర్చలో ఉండేవాడు ఈ నేపథ్యంలోనే ఇలా కారాగార వాసం వెళ్ళాడు.
👉సింగిల్ నెంబర్ లాటరీ నిర్వహిస్తే కఠిన చర్యలు**
ఇకపై లాటరీ కొనసాగిస్తే నిర్వహకులపై పీడీ యాక్ట్ నమోదుచేసి, నగర బహిష్కరణ చేస్తాం**
అవనిగడ్డ డీఎస్పీ టి.విద్యశ్రీ..
చల్లపల్లి : సింగిల్ నంబర్ లాటరీ జూదం నిర్వహణపై కఠిన చర్యలు తీసుకుంటామని అవనిగడ్డ డీఎస్పీ టి.విద్యశ్రీ స్పష్టం చేశారు. చల్లపల్లి పోలీసు స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో చల్లపల్లి సిఐ, స్పెషల్ టీమ్ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహకులపై దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. చల్లపల్లి ప్రాంతంలో లాటరీ జూదం నిర్వహిస్తున్న నిర్వాహకులు పసుపులేటి లీలాప్రసాద్, మహమ్మద్ మస్తాన్ (చినబాబు), ముచ్చు రామ సుబ్బారావు, పఠాన్ ఫరీద్ బాబా, మెండు వీరబాబు, కుంభా నాగ మల్లేశ్వరరావు(చమురు)లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
రూపాయికి 60 రూపాయలు ఇస్తామని ఆశ చూపి ప్రజల నుంచీ డబ్బులు వసూలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారనీ.. ఇందుకోసం కొంతమందిని నియమించుకున్నట్లు చెప్పారు. ఈ జూదంలో పేదలు, కుటుంబాలు దెబ్బతిన్నాయన్నారు. తమ విచారణ అనంతరం 19 మందిపై కేసు నమోదు చేసి రెండు ఫోన
👉నయా ఘరాన మోసాలకు కేరాఫ్ గా ఉండవల్లిలోని ఓ ముఠా…*తాడేపల్లి*
*రాజధాని ముఖ్యమంత్రి, మంత్రుల నివాసాల ప్రాంతంలో ఉద్యోగాల పేరిట ఘరానా దందాలు..*
*అనేక మంది నిరుద్యోగులకు ఉపాది దుర్గగుడి, సివిల్ సప్లైస్ శాఖలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి వసూళ్ల పర్వంకు తెరలేపారని సమాచారం…*
*కొందరు వారిని ప్రశ్నించగా తమ వెనుక జనసేన మంత్రి, ఎంపీ ఉన్నారంటు బుకాయించారంటు తెలిపిన స్థానికులు…*సమాచారం తాడేపల్లి పోలీసులకు తెలియజేయటంతో రంగంలోకి దిగి సదరు ఉండవల్లి సెంటర్ లోని ఓ నివాసంలో జరుగుతున్న ఈ ఉధ్యోగుల ముఠాను అదుపులోకి తీసుకున్న తాడేపల్లి పోలీసులు..*
👉*ఒంగోలులోని 24వ డివిజన్ ముస్లిo షాదీఖానా నందు హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరి సోదరీమణులుకు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ , నగర మేయర్ గంగాఢ సుజాత మరియు కమిటీ సభ్యులు హనీఫ్ ఖాన్, కపిల్ భాష, మౌలానా అబిద్, ముస్తి అసద్, సాధిక్ , రషీద్ , కాలీషా మరియు తదితరులు పాల్గొన్నారు. 
* ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నందు నేషనల్ హైవే అధికారులతో ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ మీటింగ్ లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మరియు గోల్డ్ శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ ,ఎస్.ఎన్.పాడు శాసనసభ్యులు బి.న్ విజయకుమార్, నగర మేయర్ గంగాడ సుజాత , మరియు తదితర అధికారులు పాల్గొన్నారు.
*ఈరోజు మార్కాపురంలోని శ్రీ లక్ష్మి చెన్నకేశవస్వామి వారి రధోత్సవం సందర్బంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. కార్యక్రమంలో ఆయనతోపాటు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, ఆలయ చైర్మన్ ఎక్కలి కాశీ విశ్వనాథం, AV రమణారెడ్డి, మరియు గోపి తదితరులు పాల్గొన్నారు 👉వక్ఫ్ చట్ట సవరణకు నిరసన గా కంభం లో ముస్లిం సోదరుల ర్యాలీ.. వక్ఫ్ చట్ట సవరణకు నిరసన గా కంభం లో ముస్లిం సోదరులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని జామియా మసీదు నుండి చౌక్ సెంటర్ , ఆంధ్ర బ్యాంక్ ,ప్రభుత్వ జూనియర్ కళాశాల మీదుగా తహసీల్దార్ కార్యాలయం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి సిపిఎం ఆవాజ్ కమిటీ ఎమ్మార్పీఎస్ తదితర సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో ముఫ్తీ సయ్యద్ యాసిన్ సాహెబ్, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం భాష, మాజీ జడ్పిటిసి సయ్యద్ జాకీర్ హుస్సేన్, చిన్న కంభం సర్పంచ్ షేక్ రసూల్, మాజీ కోఆప్షన్ సభ్యులు హుస్సేన్ భాష , ముస్లింం పెద్దలు సయ్య సయ్యద్ అజీజ్ సాహెబ్ ,షేక్ హబీబుల్లాసాహెబ్ తో పాటు పలువురు ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

