👉ఈడి కార్యాలయం ముందు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ధర్నా*హైదరాబాద్..
నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో సోనియా గాంధీ,రాహుల్ గాంధీ పై బీజేపీ రాజకీయ వేధింపులకు నిరసనగా ఈడి కార్యాలయం ముందు ధర్నా.. మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ అగ్రనేతల పై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ వ్యతిరేక నిరసన..ధర్నా లో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్,జూపల్లి కృష్ణారావు ,ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు..
👉ఛార్జ్ షీట్, *ఇది పూర్తిగా బోగస్ ఛార్జ్ షీట్, బోగస్ కేసు – టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం .*
నేషనల్ హెరాల్డ్ కేసులో కక్షపూరితంగా ఏఐసిసి అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ చార్జిషీట్ లో నమోదు చేయడాన్ని నిరసిస్తూ టిపిసిసి ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నా కార్యక్రమానికి కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వై జంక్షన్ లో మీడియా మిత్రులతో మాట్లాడి, ర్యాలీగా బయలుదేరిన నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్, టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శేరి సతీష్ రెడ్డి, సాధు ప్రతాప్ రెడ్డి, ఏ, బి బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
👉 ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందానికి జపాన్ లో ఘన స్వాగతం లభించించి. టోక్యోలోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియా హౌస్లో జపాన్లోని భారత రాయబారి శిబు జార్జ్ తెలంగాణ ప్రతినిధి బృందాన్ని స్వాగతించి, వారికి ఘనంగా విందు ఇచ్చారు. జపాన్ లోని భారత రాయబారితో ముఖ్యమంత్రి సమకాలీన అంశాలపై చర్చలు జరిపారు. కార్యక్రమంలో తమిళనాడు ఎంపీ కనిమొళి కరుణానిధి , నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి,మాజీ ఎంపీ నెపోలియన్, అధికారులు పాల్గొన్నారు..
👉అపాచీలో ఉద్యోగి దాడి కలకలం*.. తిరుపతి జిల్లా తడ మండలంలోని మాంబట్టు SEZలో ఘటన..అపాచీ షూ కంపెనీలో ఓ ఉద్యోగి దాడికి పాల్పడిన ఘటన..అపాచీలో పనిచేస్తున్న భార్యను, సహా ఉద్యోగితో అనుమానించిన కంఫార్ కంపెనీలో పనిచేస్తున్న భర్త ఆగ్రహంతో అపాచీలో ఇద్దరిపై దాడి చేశాడు..ఇద్దరికి గాయాలు కాగా, వారి పరిస్థితిపై స్పష్టత లేదు.*యాజమాన్యం ఘటనను దాచిపెట్టేందుకు యత్నించినట్లు సమాచారం.*ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది..బుధవారం కంపెనీలో దాడి జరిగినట్లు సమాచారం..ఇదే కంపెనీలో ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయని స్థానికులు చెబుతున్నారు..అయినా యాజమాన్యంలో ఎలాంటి మార్పులు కనిపించకపోవడం ఆందోళనకరం.*ఉద్యోగుల భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
👉తిరుపతి…నర్సింగ్ విద్యార్థుల ర్యాలీ. వర్మ కాలేజ్ ప్రిన్సిపాల్ విద్యార్థులతో అసభ్య ప్రవర్తన.మాకు న్యాయం చేయాలంటూ వర్మ కాలేజీ నుండి అలిపిరి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ.విద్యార్థి నుండి ఫిర్యాదు తీసుకున్న అలిపిరి పోలీసులు. కేసు నమోదు చేసి తగు న్యాయం చేస్తామంటూ విద్యార్థులకు హామీ. అలిపిరి సిఐ రామ కిషోర్,హామీ ఇవ్వడంతో వెనుదిరిగిన విద్యార్థులు.
👉 మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నోటీస్లు..
ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా సంచలనం సృష్టిస్తోన్న మద్యం కుంభకోణంలో అధికారుల విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో కసిరెడ్డి రాజ్శేఖర్ రెడ్డి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.ఇవాళ విజయసాయిరెడ్డి విచారణకు హాజరవుతున్నారు. ఇదే టైంలో వైసీపీ ఎంపీకి నోటీసులు ఇవ్వడం కేసులో కీలక మలుపుగా చెప్పవచ్చు..వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మద్యం కుంభకోణంలో సిట్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. రేపు(శుక్రవారం, 18 ఏప్రిల్ 2025) విజయవాడలోని సిట్ ఆఫీస్లో జరిగే విచారణకు హాజరవ్వాలని ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది..ఈయన్ని విచారిస్తే కీలక సమాచారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. మద్యం ఉత్పత్తిదారులు, సరఫరాదారులు, వ్యాపారలను కూడా విచారణకు పిలుస్తున్నారని బాగొట్టా. అందర్నీ కలిపి విచారించబోతున్నారని సమాచారం..ఈ కుంభకోణంలో ఇప్పటికే కీలక సమాచారం సేకరించిన దర్యాప్తు అధికారులు నేడు విజయసాయిరెడ్డిని విచారించనున్నారు. ఇప్పటి వరకు వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారాన్ని ముందు పెట్టి విజయసాయిరెడ్డిని ప్రశ్నించనున్నారు. వాస్తవంగా శుక్రవారం మిథున్, సాయిరెడ్డిని కలిసి విచారించాలని భావించారు. కాని తనకు వేర్వేరు పనులు ఉన్నందున ముందుగానే వచ్చి విచారణకు హాజరవుతానని విజయసాయిరెడ్డి చెప్పడంతో ఇవాళ ప్రశ్నిస్తున్నారు.
👉 తిరుపతిలో హైటెన్షన్.. టీటీడీ గోశాల అంశంలో టీడీపీ వైసీపీ పరస్పర సవాళ్లు..భూమన కరుణాకర్ రెడ్డి పలువురు ఎస్సార్సీ నాయకులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు..ఉ.10 గంటలకు కచ్చితంగా గోశాలకు వస్తానంటున్న భూమన కరుణాకర్ రెడ్డి.కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు. భూమన హౌస్ అరెస్ట్ అంటూ ప్రచారం..ఎవరినీ హౌస్ అరెస్టు చేయలేదంటున్న పోలీసులు. సమాధానం చెప్పలేక హౌస్ అరెస్ట్ డ్రామా ఆడుతున్నారని టీడీపీ విమర్శ..అధికార పార్టీనే రమ్మంటుంది.. మళ్లీ వాళ్లే పోలీసులు పెట్టి అడ్డుకుంటున్నారు” అంటూ మండిపడుతున్న వైఎస్సార్సీపీ.
👉మహిళ పై అత్యాచారం!..ఏలూరు జిల్లా*
చింతలపూడి మండలం రేచర్ల గ్రామానికి చెందిన జినుగు లక్ష్మీ (55) మహిళ ఎర్రగుంటపల్లి గ్రామ శివారు కనక దుర్గమ్మ గుడికి కు వెళ్లి వస్తుండగా మార్గమధ్యంలో తారసపడిన అదే గ్రామానికి చెందిన చందు అనే యువకుడు లిఫ్ట్ ఇస్తానని ఆమెను ద్విచక్ర వాహనం పైన ఎక్కించుకొని యర్ర కాలువ వద్ద నిర్మానుష ప్రదేశానికి తీసుకుని వెళ్లి కొట్టి,అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం.. బాధితురాలు ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం..దీనిపై పూర్తి వివరాలు తెలియవలసి ఉంది*
👉 పౌష్టికాహార పక్షోత్సవాలు సందర్భంగా కనిగిరి ఎంపిడిఓ కార్యాలయంలో గర్భవతులకు నిర్వహించిన సామూహిక శ్రీమంతాల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, శాసన సభ్యులు డా ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, ఎపి పర్యటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డా నూకసాని బాలాజీ, కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫూర్, ఎంపిపి ప్రకాశం, ఆర్ డి ఓ కేశవర్ధన్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.
*మద్దిపాడు తహసిల్దార్ కార్యాలయ పై ఏసీబీ దాడులు*..మద్దిపాడు మండలం దొడ్డవరం వీఆర్వో ద్వారా 90,000 లంచం తీసుకుంటున్న మద్దిపాడు మండల తహసిల్దార్ సృజన్ కుమార్ ను బుధవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు…
👉బెల్ షాపులపై మరియు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడంపై దాడులు నిర్వహించిన కంభం ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్..10 క్వార్టర్ బాటిళ్లు సీజ్.. ఒకరు అరెస్టు… ప్రకాశం జిల్లా బేస్తవారిపేట గ్రామంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు అక్రమంగా మద్యం కలిగి ఉండగా ఒక మహిళను ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి అదుపులోకి తీసుకోవడం జరిగినది.ఈ దాడుల్లో సింగరపల్లి గ్రామానికి చెందిన ఎన్. రామలక్ష్మమ్మ అనే మహిళను అదుపులోకి తీసుకుని ఆమె వద్ద నుండి 10 క్వార్టర్ (180 ఎంఎల్) బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా బేస్తవారిపేట గ్రామం యందు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించుచుండగా పి బాలకోటిరెడ్డి అనే వ్యక్తిని అదుపులో తీసుకొని అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కొండారెడ్డి మాట్లాడుతూ ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహించినా, అక్రమంగా మద్యం తరలించినా, అక్రమంగా మద్యం కలిగి ఉన్నా, అమ్మినా మరియు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ వారికి వెంటనే సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
👉ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం మోడం పల్లె సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని సుందర్ అనే దిగువమెట్ట చెక్పోస్ట్ లో కాంట్రాక్ట్ బేసిగ్గా పనిచేస్తున్నా వ్యక్తి మృతి… పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
👉పొదిలి టౌన్ పొగాకు బోర్డ్ ను సందర్శించి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని స్థానిక నాయకులు,రైతులతో కలసి అధికారులతో మాట్లాడుతున్న గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైస్సార్సీపీ సమనవ్యయకర్త అన్నా రాంబాబు…*

