👉 కొండమీద 4 సార్లు ఎర్రచందనం పట్టుబడ్డా…దానిమీద చర్యలే తీసుకోవడం లేదు ఈ ప్రభుత్వం. ఆలయాల మీద దాడులు జరుగుతుంటే పట్టించుకోవడం లేదు. వేలాది మందికి అన్నప్రసాదాన్ని అందించే పవిత్ర పుణ్యక్షేత్రాన్ని నేలకూల్చారు. అటవీశాఖా మంత్రి పవన్ కళ్యాణ్కు తెలియకుండానే అధికారులు ఈ పనిచేస్తారా? ఒట్లు పెట్టడం, మెట్లు కడగడం తప్ప ఆలయాల పరిరక్షణకు పవన్ కళ్యాణ్ చేసేదేమీ లేదు. భూమన కరుణాకర్ రెడ్డి , టీటీడీ మాజీ ఛైర్మన్…
👉జనసేన పార్టీని ‘ఆంధ్ర మత సేన’గా మార్చారు: పవన్ కల్యాణ్ పై షర్మిల విమర్శలు… ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో పవన్ వ్యాఖ్యలపై స్పందించిన షర్మిల..
పవన్ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నరనరానా జీర్ణించుకున్నట్టుందని ఆరోపణ.. జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆమె స్పందించారు.
పవన్ కల్యాణ్ … చేగువేరా, గద్దర్ అన్న సిద్ధాంతాలకు నీళ్ళొదిలేశారని… ఇప్పుడు ఆయన మోదీ, అమిత్ షా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారని విమర్శించారు. పవన్ మాటలు చూస్తుంటే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. జనసేన పార్టీని ‘ఆంధ్ర మత సేన’ పార్టీగా మార్చారని వ్యాఖ్యానించారు. “జనసేన… జనం కోసం పుట్టిన పార్టీ అని చెప్పి ఒక మతానికి అజెండాగా మార్చడం దారుణం. సర్వమత సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఆంధ్ర రాష్ట్రంలో విభజించు పాలించు అన్నట్లుగా మీ వైఖరి ఉండటం విచారకరం. పార్టీ పెట్టి 11 ఏళ్లు పోరాడి, ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టి, మతం రంగు పూసుకుని, ఒకరి ప్రయోజనాలే లక్ష్యం అన్నట్లుగా మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నామన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలతో పుట్టిన పార్టీ అని చెప్పి, మత పిచ్చి బీజేపీ ఆశయాలను అలవరుచుకోవడం దురదృష్టకరం. ఉప ముఖ్యమంత్రి పవన్ ఇప్పటికైనా మేల్కొని, బీజేపీ మైకం నుంచి బయట పడాలి” అని షర్మిల హితవు పలికారు.
👉పవన్ కళ్యాణ్ బిజెపి ఇచ్చిన స్క్రిప్ట్ చదివాడు..CPI రామక్రిష్ణ.. తెలుగువారిపై హిందీ భాషను రుద్దడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం..పెద్ద బొట్టు పెట్టుకొని కాషాయం కండువా వేసుకుని సనాతన ధర్మం కోసం మాట్లాడుతావని ఎద్దేవా చేశారు.
👉*పెడన మెయిన్ రోడ్డు నవరంగ్ టీ స్టాల్ వద్ద మారణ ఆయుధాలతో సులేమాన్ భాష (టీడీపీ భాష) దాడి.**పుంగనూరు లో టిడిపి నేత హత్యాయత్న ఘటన మరువక ముందే అదే తరహాలో ఎన్నడూ లేని విధంగా పెడన నడిరోడ్డుపై హత్యాయత్నం దాడి. తృటిలో ప్రాణాపాయాన్ని తప్పించుకున్న భాషని 108 హుటాహుటిన మచిలీపట్నం సార్వజనిత ఆసుపత్రికి తరలింపు.దాడి ఘటనపై ఆరా తీస్తున్న పెడన పోలీసులు..
👉హర్ష సాయిపైనా కేసు –శ్యామలను మరచిపోతారా ?
బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న కారణంగా పలువురు యూట్యూబర్లు, ఇన్ ఫ్లూయన్సర్లపై కేసులు పెడుతున్నారు. విశాఖలో లోకల్ బాయ్ నానిని జైలుకు పంపారు. ఇప్పుడు హైదరాబాద్ హర్ష సాయిపైనా కేసులు పెట్టారు. పేదలకు సాయం చేస్తున్నట్లుగా పబ్లిసిటీ చేసుకుని యూట్యూబర్ గా ఫాలోయింగ్ పెంచుకున్న హర్ష సాయి .. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున డబ్బు సంపాదించినట్లుగా తెలుస్తోంది. పైగా తాను చేయకపోతే వేరే వారు చేస్తారని సమర్థించుకున్నాడు.. ఈ క్రమంలో పలువురు హర్షసాయి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. ఇంతకు ముందు ఓ సినిమా హీరోయిన్ ఫిర్యాదు చేయడంతో ఆయన పారిపోయి..బెయిల్ వచ్చాక బయటకు వచ్చారు. ఇప్పుడు కూడా పారిపోతారో లొంగిపోతారో చూడాల్సి ఉంది. ఇప్పటికే బయ్యా సన్నీ యాదవ్ అనే యూట్యూబర్ పై కూడా కేసులు నమోదయ్యాయి. ఆయన పరారీలో ఉన్నారు. అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.. ఈ లిస్టులో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. ప్రస్తుతం వైసీపీ అధికార ప్రతినిధిగా చెలామణి అవుతున్న శ్యామల కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయ అండ లేని వారిపైనే కేసులు పెడతారా.. శ్యామల లాంటి వారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే పట్టించుకోరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. శ్యామలపై కూడా కేసు నమోదు చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
*సానికొమ్ము వారి వివాహ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా*.. *పొదిలి టౌన్ సయ్యద్ ఖాదర్ వలి కళ్యాణమండపం నందు సానికొమ్ము వెంకటరెడ్డి,తిరుపతమ్మ కుమారుడు వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులు అయిన రాజశేఖరరెడ్డి,విజయలక్ష్మి గార్లను ఆశీర్వదించిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమనవ్యయకర్త అన్నా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
*మార్కాపురం శ్రీ అల్లూరి పోలేరమ్మ తల్లి కలశం బండి ఉత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నా … *వైఎస్సార్సీపీ నాయకులు బట్టగిరి శేఖర్ రెడ్డి కుటుంబీకులు వారి మొక్కు మేరకు మార్కాపురం శ్రీ అల్లూరి పోలేరమ్మ తల్లికి కలశం బండి ఉత్సవం నిర్వహించారు.వారి ఆహ్వానం అందుకున్న మార్కాపురం వైకాపా సమన్వయకర్త,మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కలశం బండి ఉత్సవ ఊరేగింపులో పాల్గొని,అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
👉 *మార్కాపురం శ్రీ అల్లూరి పోలేరమ్మ తల్లి కలశం బండి ఉత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నా .. మార్కాపురం మండలం నాగులవారం గ్రామనికి చెందిన గోవిందయ్య మెస్త్రి కుటుంబీకులు వారి మొక్కు మేరకు మార్కాపురం శ్రీ అల్లూరి పోలేరమ్మ తల్లికి కలశం బండి ఉత్సవం నిర్వహించారు. వారి ఆహ్వానం అందుకున్న మార్కాపురం వైకాపా సమన్వయకర్త,మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కలశం బండి ఉత్సవ ఊరేగింపులో పాల్గొని,అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు… స్టాఫ్ రిపోర్టర్ ఎస్ రహేమాన్..
*నూతన గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా*..మార్కాపురం మండలం నాయుడుపల్లె గ్రామంలో పొందుగుల శ్రీనివాసరెడ్డి, కాశిలాక్ష్మి మరియు పొందుగుల నారాయణరెడ్డి,సుమతి గార్ల నూతన గృహప్రవేశ మహోత్సనికి హాజరుఅయి శ్రీ రామాసహిత సత్యనారాయణస్వామివారి వ్రతంలో పాల్గొన్న గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం వైస్సార్సీపీ సమనవ్యయకర్త అన్నా రాంబాబు పాల్గొన్నారు..*
👉 *బత్తెం వారి వివాహ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా*గిద్దలూరు మండలం యన్. బయనపల్లె గ్రామంలో చిన్న ఓబులేసు,అరుణ గార్ల కుమారుడు వివాహ మహోత్సవానికి హాజరు అయి నూతన వధూవరులు అయిన ప్రణయ్,స్వాతి గార్లను ఆశీర్వదించిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమనవ్యయకర్త అన్నా రాంబాబు పాల్గొన్నారు.*
👉*పునూరు వారి వివాహ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా*..కనిగిరి టౌన్ పవిత్ర కళ్యాణమండపం నందు పునూరు బాలసత్యంరెడ్డి,పద్మ గార్ల కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరు అయి నూతన వధూవరులు అయిన మేఘన రెడ్డి,సుబ్బారెడ్డి గార్లను ఆశీర్వదించిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమనవ్యయకర్త అన్నా రాంబాబు వైకాపా పాల్గొన్నారు.*

