👉ఆడబిడ్డలను మోసగిస్తే తాటతీస్తాం: చంద్రబాబు… *👉 *వరి, జొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి..అంగన్వాడీల డిమాండ్లు న్యాయబద్ధమైనవి : వైఎస్ షర్మిల ….*జొన్నపంటకు మద్దతు ధర కల్పించాలి:*వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు వినతి*..👉గిద్దలూరు, శ్రీ సాయి చైతన్య డిగ్రీ కళాశాల లో 19 న జాబ్ మేళా… పరీక్షా కేంద్రాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై బి నరసింహారావు

👉 ఆడబిడ్డలను మోసగిస్తే తాటతీస్తాం: చంద్రబాబు….

హత్యా రాజకీయాల మరక అంటకుండా 42 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నానని సిఎం చంద్రబాబు తెలిపారు. నేరాలు – ఘోరాలు చేసి రాజకీయాలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. కొందరు ఆడబిడ్డలను మాయమాటలతో మోసగిస్తున్నారని, వారి తాటతీస్తామని హెచ్చరించారు. ఆకతాయిలు వేధిస్తుంటే ‘శక్తి’ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారన్నారు. వైసీపీ తీసుకొచ్చిన దిశ యాప్ దిక్కుమాలిన యాప్ అని మండిపడ్డారు.

👉 *వరి, జొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి*

*అమరావతి మార్చి 11*..  వరి, జొన్నపంటలకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్న క్రమంలో.. మద్దతు ధర ప్రకటించి అన్నదాతలను ఆదుకోవాలని కోరుతూ నంద్యాల జిల్లా ప్రజా ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు విన్నవించడం జరిగింది. నేడు అసెంబ్లీలో ముఖ్యమంత్రిని, మంత్రులు ఎన్ ఎండీ ఫరూఖ్, బీసీ జనార్థన్ రెడ్డి.. నంద్యాల జిల్లా ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, భూమా అఖిలప్రియ, గిత్త జయసూర్య కలిసి నంద్యాల జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి వివరించారు.. ప్రస్తుతం నంద్యాల జిల్లాలో వరి, జొన్న పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ముఖ్యమంత్రి దృష్టికి జిల్లా నాయకులు తీసుకురావడం జరిగింది.. ప్రస్తుతం జిల్లాలో క్వింటా జొన్నలకు రూ. 2400 మాత్రమే గిట్టుబాటు ధర చెల్లిస్తున్నారని, కాబట్టి మద్దతు ధరను రూ. 3400 కు పెంచి జొన్న రైతులను ఆదుకోవాలన్నారు.. అలాగే ప్రస్తుతం జిల్లాలో క్వింటా వరి పంటకు రూ. 1200 మాత్రమే గిట్టుబాటు ధర చెల్లిస్తున్నారని, గిట్టుబాటు ధరను రూ. 1800 కు పెంచి వరి పండించే రైతులను సైతం ఆదుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు…   ఈ సందర్భంగా వరి, జొన్న పంటల గిట్టుబాటు ధర పెంపుపై నంద్యాల జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేయడం జరిగింది.. నంద్యాల జిల్లాలో వరి, జొన్న పంటకు మద్దతు ధర పెంపుపై మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సైతం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

👉మాట తప్పి మోసం చేయడం అంటే ఇదే మరి: షర్మిల..ఏపీలో ఆందోళనల బాటపడుతున్న అంగన్వాడీలు..అంగన్వాడీల తరఫున గళం వినిపించిన షర్మిల..అంగన్వాడీల డిమాండ్లు న్యాయబద్ధమైనవని స్పష్టీకరణ..  అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు వారికి తీరని అన్యాయం చేస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.  రాష్ట్రంలో అంగన్వాడీలు ఆందోళనల బాటపడుతుండడం పట్ల ఆమె స్పందించారు. మాట తప్పి మోసం చేయడం అంటే ఇదేనని, తమ గోడు వినిపించాలనుకున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనమని ఆమె విమర్శించారు. వారి గొంతు నొక్కి, ఆందోళనలను అణిచివేయడం కూటమి ప్రభుత్వ నియంతృత్వ చేష్టలకు పరాకాష్ఠ అని పేర్కొన్నారు. అంగన్వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవని, వెంటనే వారిని పిలిచి ప్రభుత్వం చర్చలు జరపాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

అంగన్వాడీల ప్రధాన డిమాండ్లు…నెలకు గౌరవ వేతనం రూ.26 వేలు ఇవ్వాలి.గ్రాట్యూటీ చెల్లింపు హామీని అమలు చేయాలి.మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా పరిగణించాలి.హెల్పర్ల పదోన్నతిపై నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి. పెండింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. విధి నిర్వహణలో అంగన్వాడీలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగంతో పాటు మట్టి ఖర్చుల కింద రూ.20 వేలు ఇవ్వాలి. వీటితో పాటు ఇతర 12 డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై ప్రకటన చేయాలని వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం” అని హెచ్చరించారు.

👉*పోసానికి బిగ్ రిలీఫ్..* నేడు ఆదోని, విజయవాడ కోర్టుల్లో బెయిల్ మంజూరు..*ఇప్పటికే రాజంపేట, నరసరావుపేట కోర్టుల్లో పోసానికి బెయిల్ మంజూరు.. మిగతా కేసుల్లో BNS చట్టం 353 సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం..*గతంలో నాలుగు కేసుల్లో పోసానికి రిమాండ్..*ప్రస్తుతం కర్నూలు జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళి..*అన్ని కేసుల్లో రిలీఫ్ రావటంతో రేపు విడుదల అయ్యే అవకాశం

👉*జొన్నపంటకు మద్దతు ధర కల్పించాలి* *వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు వినతి* నంద్యాల జిల్లా రైతుల సమస్యను వివరించిన మంత్రులు ఫరూక్, బిసి, ఎమ్మెల్యేలు బుడ్డా,గౌరు, గిత్తా, భూమా అఖిల ప్రియ*.   అమరావతి మార్చి 11*

*నంద్యాల జిల్లాలో జొన్న పంటకు గిట్టుబాటు ధర లేక రైతుల నష్టపోతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కే. అచ్చెన్నాయుడు దృష్టికి నంద్యాల జిల్లా ప్రజా ప్రతినిధులు తీసుకువెళ్లారు.మంగళవారం అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడుని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య లు కలిశారు. నంద్యాల జిల్లాలో జొన్న పంట సాగు విస్తీర్ణం విస్తారంగా ఉందని పేర్కొన్నారు. క్వింటా జొన్నలకు రూ. 2400 మాత్రమే చెల్లిస్తున్నారని, రూ.3400 కు మద్దతు ధర పెంచి రైతులను ఆదుకోవాలని వ్యవసాయ మంత్రిని మంత్రులు ఫరూక్,బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోరారు. జొన్న రైతులకు సంబంధించిన సమస్యను పరిష్కరిస్తామని, మంత్రులు, ఎమ్మెల్యేల ప్రతిపాదనపై మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చి సానుకూలంగా స్పందించారు.

👉రైతులకు మద్దతు ధర కల్పించండి*…ముఖ్యమంత్రిని కలిసిన నంద్యాల జిల్లా ప్రజాప్రతినిధులు…*నంద్యాల జిల్లాలో వరి, జొన్న పంటలకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన మంత్రులు ఎన్ ఎండీ ఫరూఖ్, బీసీ జనార్థన్ రెడ్డి*

• నంద్యాల జిల్లాలో ప్రస్తుతం క్వింటా జొన్నలు ధర రూ. 2400* … • వరి మద్దతు ధరను రూ. 3400 కు పెంచి రైతులను ఆదుకోవాలని కోరిన ప్రజాప్రతినిధులు* *నంద్యాల జిల్లాలో ప్రస్తుతం క్వింటా వరి ధర రూ. 1800**మద్దతు ధరను రూ. 1800 కు పెంచి రైతులను ఆదుకోవాలని కోరిన ప్రజాప్రతినిధులు*

👉ఎస్ఐబి నరసింహారావు మంగళవారం కంభం మరియు తురిమెళ్ళ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాల వద్ద చేసిన భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.

👉గిద్దలూరు, శ్రీ సాయి చైతన్య డిగ్రీ కళాశాల లో 19 న జాబ్ మేళా…ఈ జాబ్ మేళాలలో (Greentech Industries,Apollo Pharmacy Limited,Hetero Labs Ltd )కంపెనీలు పాల్గొంటారని డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ జె .రవితేజ యాదవ్ తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత యువకులు పదో తరగతి నుంచి పీజీ అర్హత కలిగి 19 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు హాజరు కావచ్చని తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కార్యాలయం మరియు సీడ్ ఆఫ్ సంయుక్త ఆధ్వర్యంలో* ఈ నెల 19 న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ జె .రవితేజ యాదవ్ తెలిపారు. మరిన్ని వివరములకు ఈ క్రింద తెలుపబడిన నెంబర్లను సంప్రదించగలరు.7997151082,8019311043,90149 16791

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..