👉మా చెల్లి అక్రమాలకు అమ్మ అండ: జగన్..
తల్లి విజయమ్మను ముందు పెట్టుకుని తన పంతం నెగ్గించుకోవడానికి చెల్లి షర్మిల అక్రమ చర్యలకు పాల్పడుతున్నారని మాజీ సీఎం జగన్ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ హైదరాబాద్ బెంచ్కు నివేదించారు. సరస్వతి పవర్ వాటాల వివాదంలో తల్లి ఆవేదనను అర్థం చేసుకోగలమని, అయితే చెల్లి షర్మిల వెనకుండి చేయిస్తున్న అక్రమాలను అడ్డుకోవడానికే ఈ పిటిషన్ వేశానని పేర్కొన్నారు. వాటాదారుల పేర్లు సవరించి, తమ వాటాలు పునరుద్ధరించాలని జగన్ కోరారు.
👉వైఎస్ వివేకానందరెడ్డి కేసులోని సాక్షుల మరణాలు విస్తుగొలుపుతున్నాయి : వైఎస్సార్ జిల్లా ఎస్పీ.. రెండు రోజుల క్రితం వాచ్మన్ రంగన్న మృతి..అంతకుముందు మరో నలుగురు సాక్షుల మృతి..సాక్షుల మరణం వెనుక కారణాల కోసం దర్యాఫ్తు చేస్తున్నామన్న ఎస్పీ..వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని ప్రధాన సాక్షులు వరుసగా మృతి చెందడం విస్తుగొలిపే అంశమని, వీరి మరణం వెనుక నిందితుల ప్రమేయం ఉందా? అనే కోణంలో లోతుగా దర్యాఫ్తు చేస్తామని వైఎస్సార్ జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తెలిపారు. వివేకానంద హత్య కేసులో సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న ఇటీవల మృతి చెందాడు. అంతకుముందు, శ్రీనివాసులు రెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, నారాయణ మృతి చెందారు.ఐదేళ్లలో ఐదుగురు కీలక సాక్షులు మృతి చెందారని ఎస్పీ వెల్లడించారు. సాక్షులు ఏయే కారణాలతో, ఏ పరిస్థితుల్లో చనిపోయారో దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. వారికి ఏమైనా ఆనారోగ్య సమస్యలు ఉన్నాయా? లేక ఈ మరణాలకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు. సమగ్ర విచారణ కోసం డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాఫ్తు బృందాన్ని ఏర్పాటు చేశామని ఎస్పీ వెల్లడించారు.సాక్షులు చనిపోయినప్పుడల్లా సీబీఐ వల్లే వారు చనిపోయారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి ప్రచారాన్ని ఎందుకు, ఎవరు చేస్తున్నారనే కోణంలోనూ దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు.వాచ్మన్ రంగన్న బుధవారం సాయంత్రం మృతి చెందాడని, రంగన్న మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ అతని భార్య ఫిర్యాదు చేశారని ఎస్పీ వెల్లడించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మృతి చెందిన సాక్షులకు సంబంధించిన కేసులన్నింటిని దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.
👉ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ..కీసర ప్రభుత్వ పాఠశాలలో కనికరం లేని ఉపాధ్యాయుడు,విద్యార్థులను కరెంటు వైర్ తో చితకబాదిన పీఈటి ఆనంద్, కీసర :దమ్మాయగూడా మున్సిపాలిటీ కీసర ప్రభుత్వ పాఠశాలలో PET ఆనంద్ అరాచకం,ఒంట్లో బాగాలేదన్నా వినకుండ 8 మంది విద్యార్థినిలను చితకబాదిన పిఈటి.8వ తరగతి చదువుతున్న ప్రణతి , వైశాలి , కావ్య , నవ్య , చరన్య , అర్చన , బ్లేస్సి , కీర్తన లను గేమ్స్ పీరియడ్ లో ఆట లు ఆడేందుకు విద్యార్థినిలు రాలేదని ఏ మాత్రం కనికరం లేకుండా కరెంట్ వైర్ తో చితకబాదడు PET ఆనంద్.ఇంటికి వచ్చిన విద్యార్థినులకు జ్వరం రావడంతో గమనించిన తల్లిదండ్రులు,ఒంటి పై గాయాలు చూసి షాక్ గురయ్యారు.జరిగిన విషయం తెలుసుకొని , ఆడపిల్లల పై విచక్షణ మరచి కరెంట్ వైర్ తో కొట్టడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పీఇటి ఆనంద్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు….
👉ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్నా.. దాటాక బోడి మల్లన్నలా ఉంది కూటమి ప్రభుత్వ తీరు..వైఎస్ షర్మిలా రెడ్డి.. ఏపీసీసీ చీఫ్..మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ..ఫ్రీ అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి ఓట్లు వేయించుకొని, ఇప్పుడు కండీషన్ అప్లై అనడం దారుణం..జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామని చెప్పడం మోసం.
అమలు చేయాలన్న చిత్తశుద్ది లేక చెప్పే సాకులు..ఆదిలోనే యూటర్న్ తీసుకోవడం అంటే ఇదే మరి..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 9 నెలలు దాటినా ఉచిత ప్రయాణం కల్పించకుండా మహిళలను మోసం చేశారు..కమిటీల పేరుతో కాలయాపన చేశారు. రాష్ట్రాల పర్యటన పేరుతో విహార యాత్రలు చేశారు. పథకం అమలుకు ముందే ఇన్ని నిబంధనలు పెట్టే ఈ ప్రభుత్వం.. రేపు అమల్లోకి తెచ్చే సరికి నియోజక వర్గం, మండల స్థాయి వరకే ఫ్రీ అంటారేమో.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో …మహిళలకు రాష్ట్రమంతా ఉచిత ప్రయాణమే..పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కడినుంచి ఎక్కడికైనా అంతా ఉచితమే..ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఎంతదూరమైనా జీరో టికెట్..ఇలాంటి మంచి పథకాన్ని, అతి తక్కువ ఖర్చుతో మహిళలకు మేలు జరిగే హామీని .. అమలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఇంకా మనసు రావడం లేదు..నెలకు రూ.350 కోట్లు మహిళల కోసం ఆర్టీసికి ఇవ్వడానికి ధైర్యం చాలడం లేదు..మహిళలకు భద్రత కల్పించే విషయంలో కూడా లాభనష్టాలు చూడాలా ? ..ఇదేనా కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న మహిళా సాధికారిత ? తక్షణం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని..రాష్ట్రం అంతా ఉచిత ప్రయాణం సౌకర్యం ఉండాలని …రాష్ట్రంలోని మహిళల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
👉వైఎస్ జగన్ హయాంలో మొత్తం అప్పులు రూ.3,39,580 కోట్లు మాత్రమే..అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్…అసెంబ్లీ సాక్షిగా అప్పు లపై దొరికిపోయిన టీడీపీ..జగన్ హయాంలో చేసిన పబ్లిక్ అప్పులు రూ.2,34,225కోట్లు మాత్రమే…వైఎస్ జగన్ హయాంలో కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు రూ. 1,05,355 కోట్లు మాత్రమే..అసెంబ్లీలో వైఎస్ఆర్ ల ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధానంలో ప్రకటన..గత ప్రభుత్వం దిగిపోయేనాటికి ఏపీ అప్పులు రూ.5,19,192 కోట్లే..ప్రభుత్వ రంగ సంస్థల అప్పు లు రూ.1,58,657 కోట్లు అని ప్రకటన..
👉*ఏసీబీ వలలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్…*ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉ఫ్రీ బస్సు వల్ల ఆటో నడువక.. అప్పులు తీర్చలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య..ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు మండలం రాంనగర్కు చెందిన భగత్ సంతోష (36) అనే ఆటో డ్రైవర్ రూ.4 లక్షల అప్పు చేశాడు.ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో మీద ఆదాయం రాకపోవడంతో, అప్పులు తీర్చలేనని బాధతో, ఇంటి సమీపంలోని చెట్టుకి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

