⭐బీజేపీని ఎలా నమ్మాలి బాబూ.. !😲😲😲 బీజేపీని ఎలా నమ్మాలి? ఇదీ.. ఇప్పుడు కూటమిలోని టీడీపీ నాయకులు సంధిస్తున్న అంతర్గత ప్రశ్న. బీజేపీని ఎలా నమ్మాలి? ఇదీ.. ఇప్పుడు కూటమిలోని టీడీపీ నాయకులు సంధిస్తున్న అంతర్గత ప్రశ్న. కూటమిలో ఉంటూ.. మంత్రి పదవి తీసుకుని.. సర్కారులోనూ చక్రం తిప్పుతున్న పార్టీ.. కూటమికే.. ద్రోహం చేసేలా.. వ్యవహరించిందన్న వాదన అంతర్గత చర్చల్లో జోరుగా వినిపిస్తోంది. *దీనికి కారణం.. ఉత్తరాంధ్రలో కూటమి పార్టీలు మద్దతిచ్చిన పాకాలపాటి రఘువర్మ ఓడిపోవడం. ఇదేసమయంలో బీజేపీ నాయకులు క్షేత్రస్థాయిలో మద్దతు ప్రకటించిన గాదె శ్రీనివాసుల నాయుడు విజయం దక్కించుకోవడం. ఇదేమీ చాలా చిన్న విషయం అని అనుకుంటే పొరపాటే. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం దక్కించు కున్నాం కాబట్టి.. ఒకటి పోయినా ఫర్వాలేదని అనుకుంటే.. కూడా ఇబ్బందే. ఎందుకంటే..
ఇది ఎన్నికల కు మాత్రమే సంబంధించిన విషయం కాదు. రాజకీయంగా.. కూటమి పార్టీల మధ్య కలివిడి తనానికి.. పట్టుకు సంబంధించిన వ్యవహారం. ప్రాంతాల వారీగా రాజకీయాలు చేసుకుంటూ.. పోతే.. రేపు మరో ఎన్నిక వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఇలానే వ్యవహరిస్తారా? అన్నది ప్రశ్న. ఎందుకంటే.. కూటమిగా ఉండి.. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. వైసీపీ కంచుకోటలోనూ బీజేపీ విజయం దక్కించుకుందంటే.. దీనికి టీడీపీ మద్దతు కారణం. అలాంటి కూటమిలో సొంత నిర్ణ యం తీసుకుని ఉత్తరాంధ్రలో గాదెకు మద్దతు ఇచ్చారు. ఈ విషయం తెలిసి కూడా.. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కానీ.. రాష్ట్ర పార్టీ చీఫ్ పురందేశ్వరి కానీ.. ఎక్కడా ఎవరినీ వారించలేదు. ఇలా చేయడం కూటమికి ద్రోహమని కూడా భావించలేదు. దీంతో క్షేత్రస్థాయి నాయకులు.. తమ ఇష్టానుసారంగానే వ్యవహరించారు. ఇది టీడీపీ మద్దతు ప్రకటించి న రఘువర్మను చిత్తుగా ఓడించింది. ఇతర కారణాలు ఉన్నప్పటికీ.. బలమైన మద్దతు విషయంలో పైకి ఒక విధంగా అంతర్గతంగా మరో విధంగా వ్యవహరించడంతోనే ఇలా జరిగిందన్నది వాస్తవం. సో.. ఇలాంటి కారణాలే.. పొత్తును రేపు ప్రభావితం చేసే అవకాశం మెండుగా కనిపిస్తోంది. కాబట్టి.. ఇప్పటికైనా.. ఇలాంటి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం.. కలివిడిగా ఉండాల్సిన అవసరం ఉంది.
👉 ఏకంగా పోలీస్ స్టేషన్లోనే మందు పార్టీ చేసుకున్న పోలీసులు…😱😱😱. మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్ స్టేషన్లో ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి మందు పార్టీ చేసుకున్న హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ …పార్టీలు చేసుకుంటూ ఫిర్యాదుదారులకు అందుబాటులో లేని సిబ్బంది…జిల్లా ఎస్పీ విచారణ చేసి పోలీస్ స్టేషన్లో మందు పార్టీ చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజల డిమాండ్
* గురుకులంలో కీచక ఉపాధ్యాయుడు..తోటి మహిళా ఉద్యోగినికి లైంగిక వేధింపులకు గురిచేసిన ఉపాధ్యాయుడు… 😱😱😱 మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట ప్రభుత్వ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో తోటి మహిళా ఉద్యోగినిపై గురుకుల ఉపాధ్యాయుడు నైతం శ్రీనివాస్ లైంగిక వేధింపులు..మహిళా ఉద్యోగినిపై దాడి చేసి గాయపరిచిన నైతం శ్రీనివాస్..గతంలో కూడా విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేశాడని శ్రీనివాస్ పై పలు ఆరోపణలు …రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు కుటుంబ సభ్యులు
*వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం* కూలి పనులకు వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా.. ఒకరు మృతి, 28 మందికి గాయాలు ..వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జీడిగడ్డ తండా కు చెందిన కూలీలు పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళుతుండగా వాహనం బోల్తా..
* నర్సంపేట మండలం ఇటుకాల పల్లి వద్ద ప్రమాదం.. తెల్లవారుజామున జరిగిన ఘటన ..పరిమితికి మించి వాహనంలో ఎక్కించుకున్న డ్రైవర్.
/🔴అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి*
*రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన గంప ప్రవీణ్ (27) MS చదివేందుకు అమెరికా వెళ్లి అక్కడ విస్కాన్సిన్ మిల్వాకీలో నివాసం ఉంటున్నాడు.. అయితే అతడి ఇంటికి సమీపంలోని బీచ్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ప్రవీణ్ మరణించాడు.. దీంతో తీవ్ర విషాదంలో ఉన్న ప్రవీణ్ కుటుంబ సభ్యులు..
*నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాప్ కలకలం…* మూడేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగుడు.. 4వ తేదీన మధ్యాహ్నం సమయంలో బాలుడిని ఎత్తుకెళ్లిన దుండగుడు.. కిడ్నాప్ జరిగినా పట్టించుకోని ఆసుపత్రి సిబ్బంది ..గత మూడేళ్ళుగా ఆసుపత్రి ఆవరణలోనే నివాసం ఉంటున్న బాధిత కుటుంబం.. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేస్తున్న పోలీసులు
*లుంజల వారి నూతన గృహ ప్రవేశ మహోత్సవనికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యేలు అన్నా,కె.పి*
*మార్కాపురం టౌన్ ఎన్.ఎస్.నగర్,ఆర్టీసీ బస్టాండ్ దగ్గర లుంజల వారి నూతన గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమనవ్యయకర్త అన్నా రాంబాబు ,మార్కాపురం మాజి శాసనసభ్యులు కె.పి.కొండారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
*బాదం వారి వివాహ నిశ్చితార్థ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా*ఒంగోలు టౌన్ లింగారెడ్డి కల్యాణ మండపం లో బాదం వెంకటేశ్వరరెడ్డి, శారదల కుమారుడు వివాహ నిశ్చితార్థ మహోత్సవనికి హాజరు అయి కాబోయే వధూవరులు అయిన మంజునాథరెడ్డి,వైష్ణవి లను ఆశీర్వదించిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమనవ్యయకర్త అన్నా వెంకట రాంబాబు పాల్గొన్నారు.*

