👉కంభం లో ఆక్రమణలకు చెక్.. కంభం పట్టణంలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కంభం సిఐ కే మల్లికార్జునరావు, ఎస్సై బి నరసింహారావు పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో గురువారం కంభం బస్టాండ్ సెంటర్ నుండి బెస్తవారిపేట వైపు పంచాయితీ మార్జిన్ వరకు రోడ్డుకు రెండు వైపులా మార్కింగ్ ఇవ్వటమైనది కంభం పట్టణం పట్టణంలోని అన్ని రోడ్లకు కూడా ఈ మార్కింగ్ ను పంచాయతీ వారి సహకారంతో ఇస్తాము ప్రజలకు వాహనాల రద్దీ వలన ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు జరగకూడదని ఈ మార్కింగ్ ఇవ్వడమైనది కావున మీరందరూ పోలీస్ వారికి మరియు పంచాయతీ వారికి సహకరించి ఎవ్వరు కూడా మార్కింగ్ లోపల మీ వాహనాలను పార్కింగ్ చేయరాదు అలా చేసిన ఎడల మీ వాహనాలపై జరిమానా విధించబడును మరియు పెట్టి కేసులు బుక్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు..

👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కార్యాలయం మరియు సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో *ఈనెల 22వ తారీఖున ప్రభుత్వ జూనియర్ కళాశాల(స్కిల్ హబ్), కంభం నందు నిర్వహించబోతున్న సంకల్ప్ – మెగా జాబ్ మేళా కార్యక్రమం యొక్క ప్రచార గోడపత్రికలను విడుదల చేసినశాసనసభ్యులు గిద్దలూరు నియోజకవర్గం ముత్తుముల అశోక్ రెడ్డి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కార్యాలయం మరియు సీడ్ ఆఫ్ సంయుక్త ఆధ్వర్యంలో* ఈ నెల 22వ తారీఖున 20 కు పైగా బహుళ జాతీయ కంపెనీలతో ప్రభుత్వ జూనియర్ కళాశాల(స్కిల్ హబ్), కంభం నందు సంకల్ప్ – మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.ఈ జాబ్ మేళా కార్యక్రమం నకు గిద్దలూరు నియోజకవర్గం మరియు జిల్లాలోని పదవ తరగతి నుంచి పీజీ వరకు చదివిన 18 సంవత్సరముల నుంచి 30 సంవత్సరముల మధ్య గల నిరుద్యోగ యువతీ యువకులు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని తెలియజేశారు.ఈ జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు జీతం 12,000 నుంచి 20,000 వరకు ఇవ్వబడుతుందని, అదేవిధంగా జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద తెలుపబడిన వెబ్సైట్ లింక్ నందు రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జయ రవితేజ యాదవ్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టి నాదన్ బాబు, స్కిల్ హబ్ కోఆర్డినేటర్ మరియు గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ లింక్ https://naipunyam.ap.gov.in/మరిన్ని వివరములకు ఈ క్రింద తెలుపబడిన నెంబర్లను సంప్రదించగలరు.నాదన్: 7997151082⭐బెనర్జీ: 8008822821
🔹హైదరాబాద్ రూ. లక్ష లంచం తీసుకుంటూ తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బొప్పూరి ఆనంద్ కుమార్ను ACB అరెస్టు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. లంచం సంబంధిత ఫిర్యాదుల కోసం, ACB టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయండి. తెలంగాణ*
👉గిద్దలూరు అన్న క్యాంటీన్ కు విరాళం* ప్రకాశం జిల్లా గిద్దలూరు డాక్టర్. ఒన్నూరుశెట్టి కుటుంబ సభ్యులు అన్న క్యాంటీన్ కు 10,000₹ విరాళం గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.అశోక్ రెడ్డి కి అందించారు.
👉 ప్రకాశం జిల్లా కొండేపి మండలం తాటాకుల పాలెం గ్రామం దగ్గర AP 390b9512 నెంబర్ గల టాటా బలోరా వాహనంలో రాత్రి వేళల్లో అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల రేషన్ బియ్యం వాహనాన్ని పట్టుకున్న కొండేపి ఎస్ఐ ప్రేమ్ కుమార్..
👉పొదిలి పోలీస్ స్టేషన్ లో కూలింగ్ వాటర్ డిస్పెన్సనర్ ని అందజేసిన షేక్ అబ్దుల్ హమీద్ ఎలక్ట్రానిక్స్…..
షేక్ అబ్దుల్ హమీద్ ఎలక్ట్రానిక్స్ వేసవికాలం దృశ్య పొదిలి పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలకు,బాధితులకు మరియు ఫిర్యాదుదారులకు మంచినీటి సౌకర్యం కోసం కూలింగ్ వాటర్ డిస్పెన్సర్ను అందజేసిన అబ్దుల్ హమీద్ ఎలక్ట్రానిక్స్ యజమానిని అభినందించిన ఎస్సై వి. వేమన
👉 వెనక్కి వెళుతున్న ట్రంప్.. మోడీ హర్ట్ అయ్యాడని టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడా? భారతదేశంలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21 మిలియన్ డాలర్ల ఫండ్ను ఇటీవల అమెరికా డోజ్ విభాగం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఎక్కడా తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బాగా తెలుసు.. ముఖ్యంగా స్నేహం స్నేహ్నమే.. వ్యాపారం వ్యాపారమే అన్నట్టుగా ముందుకెళుతున్నాడు. నరేంద్ర మోడీ తనకు ఎంత జాన్ జిగ్రీ దోస్త్ అయినా సరే.. అమెరికా ప్రయోజనాలకు వచ్చేసరికి ట్రంప్ భారత్ కు షాకిచ్చేస్తున్నాడు. అదే సమయంలో తన ఫ్రెండ్ మోడీ హర్ట్ కాకుండా పుండుపై యాంటిమెంట్ రాసేలా వ్యవహరిస్తున్నాడు. మొత్తం నెపాన్ని గత జోబైడెన్ ప్రభుత్వంపై నెట్టేసి తాను ‘భారత్ కు నిధులు కట్ చేయడానికి కారణం జోబైడెన్ ’ అని కొత్త పల్లవి అందుకున్నాడు. ‘కర్ర విరగకుండా పాము చచ్చేలా’ కొత్త పాలసీని ట్రంప్ అమలు చేస్తున్న తీరు రాజకీయ విశ్లేషకుల్లో చర్చనీయాంశమవుతోంది. భారతదేశంలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21 మిలియన్ డాలర్ల ఫండ్ను ఇటీవల అమెరికా డోజ్ విభాగం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిధుల అంశం అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. – సంపన్న భారత్కు ఎందుకు నిధులు అన్న ట్రంప్? ట్రంప్ మాట్లాడుతూ, “భారతదేశంలో ఓటింగ్ శాతం పెంచేందుకు మనం 21 మిలియన్ డాలర్లు ఖర్చు చేయడం ఎందుకు? భారత్ దగ్గర చాలా డబ్బుంది.. వారు ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తారు. వారికి బయట నిధులు అవసరం లేదు. బహుశా బైడెన్ ప్రభుత్వం అక్కడ మరెవరినో గెలిపించడానికి ఈ నిధులను ఖర్చు చేసి ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేయాలి. అదే కీలక ముందడుగు అవుతుంది” అని వ్యాఖ్యానించారు. ట్రంప్ తన “అమెరికన్ ఫస్ట్” విధానాన్ని కొనసాగిస్తూ, అమెరికా బయటకు అందించే సాయాన్ని తగ్గించాలనే తన నినాదాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఆయన అధికారంలో ఉన్న సమయంలోనూ విదేశాలకు అమెరికా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని కట్ చేయడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం అధ్యక్ష పదవిలోకి వచ్చాక దాన్నే అమలు చేస్తున్నారు. మోడీ తన స్నేహితుడైనా కూడా భారత్ కు నిధులు కట్ చేసి అమెరికా ఫస్ట్ నినాదం విషయంలో తగ్గేదేలే అని నిరూపించుకున్నాడు. అదే సమయంలో మోడీని కూల్ చేయడానికి కొత్త పల్లవి అందుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ – మోడీ-ట్రంప్ సంబంధం: గతంలో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీతో సాన్నిహిత్యం కొనసాగించారు. ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అయితే, ఇప్పుడు మోడీ ప్రధాని పదవిలో దేశానికి వచ్చి వెళ్లాక.. భారత్పై విమర్శలు చేయడం, నిధుల అంశాన్ని ప్రస్తావించడం విశేషంగా మారింది. “భారత్కు మనం ఎందుకు 21 మిలియన్ డాలర్లు ఇవ్వాలి? వారివద్ద చాలా డబ్బు ఉంది. వారు ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాల్లో ఒకటి. వారు విధించే సుంకాలు చాలా ఎక్కువ” అని ట్రంప్ విమర్శించారు. దీంతో మోడీ ఉన్నప్పుడు సాఫ్ట్ గా మాట్లాడి.. వెళ్లిపోయాక ట్రంప్ తన అసలు నైజాన్ని బయటపెట్టినట్టైంది. అయితే, ఈ వ్యాఖ్యలతో మోడీ హర్ట్ అయ్యారని ట్రంప్ గ్రహించినట్టున్నారు. అందుకే తాజాగా ఆయన తన మాట మార్చారు. ఆయన తాజా ప్రకటనలో, “బైడెన్ ప్రభుత్వం భారతదేశంలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు నిధులు ఇచ్చింది, వాస్తవానికి అది వేరే ఎవరినో గెలిపించడానికి” అంటూ ఆరోపించారు. దీని ద్వారా ట్రంప్ తన ప్రాథమిక లక్ష్యం మోడీని ప్రసన్నం చేయడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ మొదటిగా నిధుల అంశాన్ని ఉద్దేశించి విమర్శలు చేసినప్పటికీ, మోడీ అసహనానికి గురయ్యారని అర్థం చేసుకున్న తర్వాత టాపిక్ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారని అనిపిస్తోంది. ఈ వ్యాఖ్యల ద్వారా ట్రంప్ తన మద్దతుదారులను సంతృప్తిపరచడమే కాకుండా, మోడీ అనుకూలంగా ఉండేలా తన వైఖరిని సవరించుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా చూస్తే, అమెరికా రాజకీయాల్లో కూడా భారతదేశంపై ఎఫెక్ట్ ఉండడం స్పష్టంగా తెలుస్తోంది. ట్రంప్, బైడెన్ మధ్య విభేదాలు అంతర్జాతీయ వ్యవహారాలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఆర్థిక సహాయం, ఎన్నికల వ్యూహాలు, విదేశాంగ విధానాలు కీలకంగా మారిన ఈ సమయంలో ట్రంప్ తాజా మాట మార్చే ధోరణి మరిన్ని రాజకీయ చర్చలకు దారి తీయొచ్చు.
👉ఎవరిని పడితే వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దు…! కాంగ్రెస్ పార్టీలో చేరే వారి విషయంలో తొందరపాటు వద్దు, పార్టీలో చేరే వారి గతాన్ని కూడా చూడాలి.. *గతంలో వారు ఏ పార్టీలో ఉన్నారు, ఆ..పార్టీ అధికారం కోల్పోగానే, ఆ..పార్టీని ఎందుకు వీడినారో పరిశీలించాలి..* అలాంటివారు ఏ పార్టీ అధికారంలోఉంటే ఆ పార్టీకే వెళ్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి…* అటువంటి వాళ్లను పక్కన పెట్టండి.., పార్టీకోసం కష్టకాలంలో పనిచేసిన వారికే ప్రాదాన్యత ఇవ్వండి..* కాంగ్రెస్ పార్టీ అంటే నిజంగా అభిమానించే వారిని, కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసేవారిని, గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి నిరాశతో ఉన్నవాళ్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోండి.. అధికారంలో ఏ..పార్టీ ఉంటే ఆ.. పార్టీలోకి మారే వారిని తొందరపడి చేర్చుకుంటే..!, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యతను, పదవులను ఇస్తూపోతే…!!.. *వాళ్లు మన..కష్ట సమయంలో మళ్లీ పార్టీని వదిలి పారిపోతారు.., జాగ్రత్త…* మల్లికార్జునఖర్గే.,* ఏఐసిసి అధ్యక్షులు.*
👉పేద ముస్లిం అమ్మాయిలకు అంజుమన్ ఆధ్వర్యంలో సాముహిక వివాహం చేసి రూ. 50,000/- కానుక*
*అంజుమన్ అధ్యక్షులు నశ్యం ఖుద్దూస్*నంద్యాల … గత పదిహేనేళ్ళుగా నంద్యాల అంజుమన్ కమిటి ఆధ్వర్యంలో పేద ముస్లీం యువతులకు సామూహిక వివాహాలు చేసి ఆర్థిక సహాయం అందించటం జరుగుతుంది. ఈ నేపధ్యంలో 10 ఏప్రెల్ 2025 గురువారం అంజుమన్ షాదిఖానాలో ఉచిత సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు అంజుమన్ అధ్యక్షులు నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ తెలిపారు. ఈ సంధర్భంగా నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ మీడియాతో మాట్లాడుతూ ఏప్రెల్ నెల 5 వ తేది నాటికి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల అంజుమన్ లో పొందిన ధరఖాస్తులు పూర్తి చేసి, వధూవరుల ఆధార్, బ్యాంక్ ఖాతా జిరాక్స్ , ఫోటోలు జత చేసి ఇవ్వాలని, వధువు నంద్యాలకు చెంది 18 ఏండ్లు నిండి ఉండవలెనన్నారు. అంజుమన్ షాది ఖానాలో సాముహిక వివాహ వేదికలో “నిఖా” చేసుకోవాడానికి సిద్ధం పడిన పేద ముస్లిం వనితలు దరఖాస్తులు ఇవ్వాలన్నారు. వివాహం రోజే వధువు పేర రూ.50,000/-నగదు చెక్కు ఇవ్వబడునని , వరుడి నిఖా ఫీజు కూడా అంజుమన్ భరిస్తుందని నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ తెలిపారు. ఈ సందర్భంగా జమాఆతె ఇస్లామీ నంద్యాల అధ్యక్షులు షేక్ అబ్దుల్ సమద్ అంజుమన్ సేవలు ప్రశంసిస్తూ నంద్యాల పేద ముస్లింలు వనితలకు ఇది మంచి అవకాశమని, తలిదండ్రులు తమ కూతూర్ల , బంధువులు అనాధల పెళ్ళిళ్ళు అంజుమన్ లో చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడా ఓ స్వచ్ఛంద సంస్థ అమ్మాయిల వివాహానికి ఇంత భారీగా నిర్వహించి యాభైవేల మొత్తం ఇవ్వటం లేదని, నంద్యాల అంజుమన్ పెద అవివాహిత వనితలకు పెద్ద వరం అన్నారు. ఎక్కడో యాచించడం కన్న ముస్లిం ప్రజా సంస్థ అయిన అంజుమన్ సేవలు సద్వినియోగం చేసుకొనుటకు ముందుకు రావాలని, “షాది సాదికరో” అన్నట్లు నిరాడంబరంగా కట్నకానుకలు లేని వివాహాలు చేసుకోవాలని ముస్లిం సమాజానికి సమద్ పిలుపు నిచ్చారు. మరిన్ని వివరాలకు … నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ 9866242742 సంప్రదించగలరు
👉 రంజాన్ మాసం లో ప్రత్యేక వసతులు కల్పించాలని – MHPS విజ్ఞప్తి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం (అమరావతి) నందు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ, రాష్ట్ర మైనారిటీ & న్యాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు NMD ఫరూక్ ని కలిసి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చెయ్యాలని, టిడిపి ప్రభుత్వ హయాంలో అన్ని మసీదులకు మరమ్మత్తుల కొరకు ప్రతి ఏటా ఇచ్చే 25000/- రూపాయలు మంజూరు చెయ్యాలని, శిక్ష అనుభవిస్తున్న ముస్లిం ఖైదీలకు సహారీ, ఇఫ్తార్ ఏర్పాటు కొరకు జైళ్ల శాఖకు ఆదేశించాలని, ప్రభుత్వం తరపున రంజాన్ ఉత్సవాలు (జష్నే రంజాన్) నిర్వహించాలని అలాగే రానున్న బడ్జెట్ లో మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేకంగా 3296 కోట్లు మంజూరు చెయ్యాలని విన్నవించటం జరిగింది.పై అంశాలపై సానుకూలంగా స్పందించిన మంత్రివర్యులు కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సానుకూలంగా స్పందిస్తూ భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో MHPS ఉలేమా వింగ్ అధ్యక్షులు మౌలానా అబ్దుల్ రషీద్, MHPS నాయకులు సగీర్ , ఖాజా, అర్షద్, భాష తదితరులు పాల్గొన్నారు.
👉 కబ్జా కేసులో సజ్జల దొరికినట్లేనా..?
వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు కనిపిస్తోంది. సజ్జల ఎస్టేట్లో అటవీ భూముల కబ్జాపై మరోసారి సర్వేకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం కడప ఆర్డీఓ, డీఎఫ్ఎ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని కూడా కలెక్టర్ ఏర్పాటు చేశారు. దీంతో ఈసారి కబ్జాపై అధికారుల బృందం సునిశిత పరిశీలన చేయనుంది. అక్రమాలు తేలితే సజ్జలను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
👉జగన్ కు ఏం భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్ ను కలిశారు.. గొట్టిపాటి రవికుమార్, విద్యుత్ శాఖ మంత్రి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ కు ఎలాంటి భద్రత తగ్గించలేదు..ముఖ్యమంత్రి గా పనిచేసిన వాడికి ఎన్నికల కోడ్.. ఉల్లంఘించకూడదనే విషయం తెలీదా..*ముఖ్యమంత్రిగా వ్యవస్థల్ని నాశనం చేసి ఎప్పుడూ లేనంత అధ్వాన్నంగా పరిపాలన చేశారు..*చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్లు కట్టిన రోజులు, ఎమ్మెల్యే ని దాడికి పంపిన రోజులు గుర్తుకు రాలేదా?*7వేల రూపాయల ఎమ్ఎస్పీ ఫిక్స్ చేసిన జగన్ కు మిర్చి రైతుల వద్దకు వెళ్ళే అర్హత ఎక్కడుంది..ప్రజలు 11సీట్లు ఇచ్చి సంవత్సరమైనా జగన్ బుద్ధి మారలేదు..జగన్ ఇప్పటికైనా బుద్ధిమార్చుకోవాలి*..ఇంకా అసత్యాలతో ప్రజల్ని తప్పుదోవపట్టించాలనుకోవటం తగదు..
👉 ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు అరెస్ట్..
హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు జోష్ పెంచారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరుశురాములను ఈరోజు (గురువారం) పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వంశీకృష్ణ గతంలో మాజీ మంత్రి హరీష్ రావు దగ్గర పని పనిచేశారు. ఈ క్రమంలో అతను ఫ్యోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
👉రాజలింగం హత్య వెనుక కేసీఆర్: మంత్రి కోమటిరెడ్డి ..భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త రాజలింగం హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాజలింగం హత్యలో మాజీ సీఎం KCR, KTR, హరీశ్రావు, గండ్ర వెంకటరమణ రెడ్డి పాత్ర ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో KCRతో పాటు ఐదుగురిపై రాజలింగం కోర్టులో కేసు వేశాడని, బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించినందుకే అతడిని చంపేశారన్నారు
**నకిలీ బంగారం ఇచ్చి అసలు బంగారం కొట్టేసిన కి’లేడీ’లు*..నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఘటన*.. ఉదయం బంగారం షాపుకొచ్చిన ఇద్దరు మహిళలు*.. 32 గ్రాముల నకిలీ బంగారం చైన్ ఇచ్చి.. కమ్మలు, తాళిబొట్టు తీసుకున్న మహిళలు..కిలేడీలు ఇచ్చింది నకిలీ బంగారం అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన షాపు యజమాని*

