👉 కోటి రూ, విలువ గల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ.. జిటి ఎక్స్ప్రెస్ లో అగ్రా నుండి విజయవాడకి తీసుకొచ్చిన 107 కేజీలు వెండి .. బిల్లు లేని కారణంగా జీఎస్టీ అధికారులకు అప్పగించామన్న రైల్వే పోలీసులు
👉 *జీబీఎస్తో గుంటూరులో మరో మహిళ మృతి*.. గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్)తో బాధపడుతూ గుంటూరు సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్న మరొకరు బుధవారం మృతి చెందారు.. జీబీఎస్ లక్షణాలతో ఈనెల 2న ఆసుపత్రిలో చేరిన షేక్ గౌహర్ జాన్ బుధవారం మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇటీవల ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ ఇదే వ్యాధితో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ వ్యాధి బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య పెరుగుతుండడంతో కలకలం రేగుతోంది. జీబీఎస్తో మరి కొందరు బాధితులు గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు..
👉మిస్టర్ యోగి.. ఆ నీటిని తాగి చూపించు’.. ప్రశాంత్ భూషణ్ సవాల్..
ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా నీటిలో ఫేకల్ బ్యాక్టీరియా ఉందన్న CPCB రిపోర్ట్ సంచలనంగా మారింది. ఈ నివేదికను యూపీ సీఎం యోగి ఖండించారు. ఆ నీరు తాగొచ్చని కూడా ప్రకటించారు. దీనిపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సీఎంకు సవాల్ విసిరారు. ‘యోగి, ఆయన మంత్రివర్గానికి ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మహా కుంభమేళాలో ఓ గ్లాస్ నీటిని తాగి చూపించండి’ అని ఛాలెంజ్ చేశారు.
👉*పోర్టు కబ్జాలో మాజీ ఏజీ, సుప్రీం రిటైర్డ్ జడ్జిని ఇరికిస్తున్న జగన్ గ్రూప్ !*
జగన్ మోహన్ రెడ్డి క్రిమినాలిజీ ఎంత భయంకరంగా ఉంటుందో..ఆయన ఇతరులను వాడుకునే విధంగా ఎంత జుగుప్సాకరంగా ఉంటుందో మరోసారి బయటపడింది. కాకినాడ పోర్టును అధికారం అడ్డం పెట్టుకుని మాఫియాలాగా కబ్జా చేసిన వ్యవహారంలోకి మాజీ ఏజీ. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలను కూడా భాగస్వామ్యం చేసేందుకు ఏ మాత్రం ఆలోచించకుండా వారి పేర్లు వాడేశారు.. పోర్టును కబ్జా చేయడానికి ముందుగా ఓ ప్రైవేటు ఆడిటింగ్ సంస్థను దింపి.. అక్రమాలకు పాల్పడ్డారని రూ. 965 కోట్లు జరిమానా వేశారు. తర్వాత డీల్ పూర్తయిన తర్వాత దాన్ని 9 కోట్లుగా మార్చారు. ఇక్కడే అసలు గ్యాంబ్లింగ్ జరిగింది. ఎందుకు ఇలా చేశారని.. అంటే.. ఇప్పుడు మాజీ ఏజీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సలహా తీసుకుని అలా తగ్గించామని .. జగన్ గ్రూపు తరపు లాయర్ నిరంజన్ రెడ్డి వాదించారు. అసలు ఇలాంటి ఆర్థిక పరమైన వ్యవహారాల్లో వారికేం సంబంధం?.. అంటే.. పోర్టును కబ్జా చేయడానికి ఓ ప్రణాళిక ప్రకారం వారిని కూడా ఉపయోగించుకున్నారు. ఏదైనా తేడా వస్తే వారిని కూడా ఇరికించేలా ముందుగానే ప్లాన్ చేసుకున్నారన్నమాట. అడ్జగోలు దోపిడీ చేసింది కాకుండా.. జగన్ పంచన చేరినందుకు ఏజీని.. సుప్రీంకోర్టు రిటైల్డ్ జడ్జీని కూడా ఇందులోకి లాగుతున్నారు. ఇంతకీ ఆ ఏజీ.. సుప్రీం రిటైర్డ్ జడ్జిలు ఎవరన్నది సస్పెన్స్ గా మారింది.
👉 థర్డ్ క్లాస్ నా కొడుకువి అంటూ తిరుమలలో బూతు పురాణం.. శ్రీవారి సన్నిదిలో టీటీడీ ఉద్యోగిపై బూతులతో రెచ్చిపోయిన టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్..
మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్, అనంతరం తమవారితో కలిసి మహాద్వారం వద్దకు చేరుకున్నారు..అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి బాలాజీ మహాద్వారం గేటు ద్వారా ఎవరినీ పంపడం లేదని, అభ్యంతరం ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలని సమాధానమిచ్చాడు. దీంతో సహనం కోల్పోయిన బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ థర్డ్ క్లాస్ నా కొడుకువి, నిన్ను ఇక్కడ పెట్టిందెవరు, ఏమనుకుంటున్నావు? ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? ఏయ్ ముందు నువ్వు బయటకు పో అంటూ ఉద్యోగిని బూతులు తిట్టాడు…
👉ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేశారని మాజీ సిఎం జగన్ తో మరో ఏడుగురు పై కేసు నమోదు..గుంటూరు.. ఎన్నికల కోడ్ .పోలిస్ యాక్ట్ నీ ఉల్లంఘన చేశారని వెస్ట్ నియోజకవర్గ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి శ్రీనివాస్ నల్ల పాడు పోలిస్ స్టేషన్లో పిర్యాదు..మాజీ మంత్రులు అంబటి రాంబాబు .పెర్ని నాని .కొడాలి నాని .తో పాటు మేయర్ కావటి మనోహర్ మాజీ ఎంఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.ఎమ్మెల్సీ అప్పిరెడ్డి. మో దు గుల వేణుగోపాల్ రెడ్డి మరి కొంత పై కేసు నమోదు.. ఎన్నికల కోడ్ ఉండగానే “ఈ సి “నుంచి అనుమతులు తీసుకోకుండానే పర్యటన పై చర్యలు.. మిర్చి యార్డు లో కి వెళ్ళే రైతులను అసౌకర్యం.ఆటంకం కలిగించినట్లు ఫిర్యాదులో వెల్లడి.. ఎన్నికల నిబంధనలు పాటించని కారణంగా చర్యలు తీసుకోవాలని అధికారులు పిర్యాదు..
👉ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన ఎప్పుడు…..!?
*విభజన ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలతో ఏర్పాటు, ఆ తర్వాత 26 జిల్లాలుగా మార్పు….*చిరకాలంగా డిమాండ్ వున్నా… మార్కాపురం జిల్లా ఏర్పాటు గురించి పట్టించుకోని ప్రభుత్వాలు …?2024 అసెంబ్లీ ఎన్నికల సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ నెరవేరేది ఎన్నడో…?? ప్రజల ఆకాంక్ష నెరవేరేది ఎప్పుడో???
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 13 జిల్లాలతో ఏర్పడింది. మొదటి ఐదేళ్లు అధికారంలో వున్న టీడీపీ కొత్త జిల్లాల ఏర్పాటు జోలికి పోలేదు.. ఆ తరువాత, 2019 ఎన్నికల సమయంలో పరిపాలనా సౌలభ్యం కోసం పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని వైసీపీ ప్రకటించింది.కానీ, ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా వైసీపీ అధికారంలోకి రాగానే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది.
*కొత్త జిల్లాల ఏర్పాటు సక్రమంగా లేదని మార్కాపురం, రాజంపేట, మదనపల్లి తదితర అనేక చోట్ల ప్రజల నుంచి తీవ్రంగా అభ్యంతరాలు, ఉద్యమాలు వచ్చినా వైసీపీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు.ముఖ్యంగా, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం డివిజన్లో వున్న గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లోని ప్రాంతాలు జిల్లా కేంద్రం ఒంగోలుకు 100 కి. మీ.పైగా వున్నాయి.ఈ కారణంగా మార్కాపురం డివిజన్ ప్రాంత ప్రజలకు జిల్లా విభజనతో ఏ విధంగా కూడా ఉపయోగం లేదు.. ఇతర అనేక జిల్లాల్లో కూడా జిల్లా కేంద్రాలు ఇప్పటికీ చాలా దూరంగా ఉన్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు..ఈ కారణంగా , ప్రజల డిమాండ్ మేరకు జిల్లాలను పునర్విభజన చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు 2024 – ఎన్నికల సభల్లో హామీ ఇచ్చారు..టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో జిల్లాల పునర్విభజన అంశంపై ప్రభుత్వ నిర్ణయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు..ఈ మేరకు, అంతర్గతంగా కూడా కూటమి ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన పై చర్చ జరుగుతూనే వుంది..పోలవరం ముంపు మండలాలను కలిపి ఓక కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. అలాగే మార్కాపురం, డోన్, మదనపల్లె పట్టణాలు ” జిల్లా కేంద్రాలు” గా కొత్త జిల్లాలు ఏర్పాటు కావాలనే డిమాండ్ ఉంది. ప్రజల డిమాండ్స్ ను పరిగణనలోకి తీసుకోవాల్సిన రాజకీయ అవసరం, భాద్యత కూటమి పార్టీలపై వుంది.. జిల్లాల పునర్విభజనను 2025 లోనే పూర్తి చేస్తారని, దాదాపు 32 జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని మరో వైపు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు..ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ భూభాగం,జనాభా ఉన్న తెలంగాణలో (Telangana) 33 జిల్లాలుండగా…..ఆంధ్రప్రదేశ్ లో 32 జిల్లాలు ఉండడం సబబే అని వివిధ వర్గాలకు చెందిన మేధావులు, సామాజిక, ప్రజా సంఘాల వారు వాదిస్తున్నారు.

