👉 భారత్ దగ్గర బోల్డంత డబ్బుంది.. ఆ సాయం అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్..
భారత్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు రూ. 182 కోట్ల నిధులు…వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన మస్క్..
సారథ్యంలోని ‘డోజ్’ నిధులు రద్దు చేయడాన్ని సమర్థించుకున్న ట్రంప్..
భారత్లో ఓటరు శాతాన్ని పెంచేందుకు ఉద్దేశించిన రూ. 182 కోట్ల (21 మిలియన్ డాలర్లు) సాయాన్ని రద్దు చేయాలన్న డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్స్ (డీవోజీఈ) నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ పెరుగుతోందని, పన్నులు కూడా భారీగానే వసూలు చేస్తోందని, కాబట్టి దానికి (భారత్) ఆర్థికంగా ఎలాంటి సాయం అవసరం లేదని నొక్కి చెప్పారు.
‘‘భారత్కు మేం 21 మిలియన్ డాలర్లు ఎందుకివ్వాలి? వారి వద్దే బోల్డంత డబ్బుంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు కలిగిన దేశం అదే. వారి టారిఫ్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. భారత్ అన్నా, దాని ప్రధాని అన్నా నాకు చాలా గౌరవం. అయితే, ఓటింగ్ను పెంచేందుకు 21 మిలియన్ డాలర్లు ఇచ్చే అవసరం మాత్రం లేదు’’ అని ట్రంప్ పేర్కొన్నారు.

భారత్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఉద్దేశించిన 21 మిలియన్ డాలర్ల నిధులను రద్దు చేస్తున్నట్టు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ‘డోజ్’ ఈ నెల 16న ప్రకటించింది. అమెరికా ప్రజల పన్నుల ద్వారా వస్తున్న సొమ్మును ఇలాంటి వాటికి ఖర్చు చేయడం తగదని, కాబట్టి ఇకపై ఇలాంటి వాటన్నింటినీ రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. అమెరికా చేసిన ఈ ప్రకటన బీజేపీ, కాంగ్రెస్ మధ్య విమర్శలకు కారణమైంది. భారత ఎన్నికల్లో అమెరికా జోక్యానికి అవకాశం కల్పించారంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు.
👉కేంద్రమంత్రికి మిర్చి కొనుగోలు పై లేఖ రాసిన సీఎం చంద్రబాబు..
ఏపీలో మిర్చి రైతుల దుస్థితిపై కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కేంద్రం వెంటనే మిర్చిని కొనుగోలు చేయాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం లేఖ రాశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వెంటనే మిర్చిని కొనుగోలు చేయాలని కోరారు.మిర్చి రైతుల పరిస్థితి, మార్కెట్లో ధరల పతనంపై ఈ నెల14 వ తేదీన ఢిల్లీలో జరిగిన సమావేశం వివరాలను లేఖలో పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను కూడా సమర్పించిందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మార్కెట్ ఇంటర్వేన్షన్ పథకం కింద మొత్తం వ్యయంను కేంద్రమే భరించాలని ఈ సందర్భంగా సీఎం కోరారు.ఈ యేడాది మిర్చి విస్తీర్ణం పెరిగి ఉత్పత్తి కూడా అధికంగా ఉందని తెలిపారు. గతంలో ప్రత్యేక వెరైటీ మిర్చి క్వింటాల్ 20 వేల రూపాయలు ఉండగా నేడు ఆ ధర 13 వేలకు పడిపోయిందని పేర్కొన్నారు. సాధారణ రకం మిర్చి క్వింటాల్కు 11 వేల రూపాయలకు పడిపోయిందని వివరించారు. పలు దేశాలకు ఎగుమతి తగ్గడం వలన ఈ పరిస్థితి నెలకొందని వెల్లడించారు. రైతులు ధరలు పడిపోవడం వలన తీవ్ర ఆర్థిక నష్టాలకు గురవుతున్నారన్నారు. వెంటనే కేంద్ర మార్కెట్ ఇంటర్వేన్షన్ పథకం కింద కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖలో కోరారు.
👉: రైతుకు గిట్టుబాటు ధర చర్యలు చేపట్టకపోతే తీవ్ర పరిణామాలుంటాయి :వైఎస్ జగన్..
రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు ఏ రైతు కూడా సంతోషంగా లేడు.. రైతుల దీన స్థితికి కారణం కూటమి ప్రభుత్వం కాదా ? కూటమి ప్రభుత్వానికి మాజీ సీఎం జగన్ సూటి ప్రశ్న.. వైస్సార్సీపీ హయాంలో రైతే రాజు కానీ, కూటమి ప్రభుత్వం రైతును దగా చేస్తుంది..చంద్రబాబు ప్రభుత్వం రైతులను దళారులకు అమ్మేసింది. మేము తీసుకొచ్చిన RBK వ్యవస్థ,ఈ క్రాప్ వ్యవస్థ ఈరోజు నిర్వీర్యమైపోయింది..మిర్చి రైతుల ఇబ్బందులు సీఎం చంద్రబాబుకు పట్టడం లేదు. ప్రస్తుతం క్వింటాకు రూ.10-12 వేలు కూడా రావడం లేదు..మా హయాంలో రూ.21 నుంచి 27 వేల వరకు ధర వచ్చేది..రైతులు పండించిన పంట అమ్ముకోలేని పరిస్థితి..ఇప్పటికైనా రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చంద్రబాబు చర్యలు చేపట్టకపోతే తీవ్ర పరిణామాలుంటాయి…ఒక ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తే కనీసం పోలీసు భద్రత కూడా చంద్రబాబు ఇవ్వలేదు. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు.. రేపు మేము వచ్చినప్పుడు మీకు పోలీసు భద్రత ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలని హితవు పలికారు.. రాబోయే రోజుల్లో రైతుల తరఫున ఉద్యమిస్తామని జగన్ స్పష్టం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..
👉 గుంటూరు… జగన్మోహన్ పర్యటనలో అభిమానుల అత్యుత్సాహం…గుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటనలో మీడియా వారిపైకి ఒక్కసారిగా దూసుకువచ్చిన వైసీపీ అభిమానులు.. కెమెరాలు స్టాండ్లు, లోగోలను సైతం కిందపడవేసి తొక్కుకుంటు నెట్టుకుంటు వెళ్లిన వైనం…మిడియవారి కెమెరా స్టాండ్లు విరిగిపోయిన పరిస్థితి…కార్యకర్తలను అభిమానులను సైతం కంట్రోల్ చేయలేని స్థితిలో పోలీసులు..ఎన్నికల కోడ్ అమలులోవున్న జగన్మోహన్ రెడ్డి యార్డ్ వద్దకు రావడం ఒకవంతైతే మరోపక్క అభిమానుల అత్యుత్సాహాo ఎక్కువ కావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట..కవరేజ్ కి వచ్చి భయబ్రాంతులకు గురైన మీడియా సిబ్బంది.
👉ఫైర్ గేమ్ కోసం గొడవపడి నడి రోడ్డుపై కొట్టుకున్న విద్యార్థులు..
ఏలూరు నగరంలో ఫ్రీ ఫైర్ గేమ్ విషయంలో తలెత్తిన వివాదంలో రెండు వర్గాలుగా విడిపోయి వీధి రౌడీల్లా కొట్టుకున్న విద్యార్థులు.వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
👉అక్రమ మైనింగ్ పై విజిలెన్స్ దాడులు..*
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కొండ కావూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 219 నందు అక్రమంగా మైనింగ్ పెద్ద ఎత్తున జరుగుతుందని ఫిర్యాదు పై జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి సూర్య శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం పల్నాడు జిల్లా మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులతో కలిసి పల్నాడు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్కడ అక్రమ మైనింగ్ కొరకు వినియోగిస్తున్న ఒక జెసిబి, రెండు టిప్పర్లను లారీలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తదుపరి చట్టపరమైన చర్యల కొరకు జిల్లా మైనింగ్ అధికారులకు అప్పజెప్పడం జరిగినది.
👉జగన్ వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం.. మా మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలు.
*ఏపీలో శాంతిభద్రతలు దిగజారిపోయాయనడం సరికాదు ఏపీ పోలీసులను కించపరిచేలా మాట్లాడటం దుర్మార్గం.. అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా వారిని తీసుకొచ్చి బట్టలూడదీసి నిలబెడతాననడం సమంజసమా?*..ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న పోలీసులు గత 8 నెలల క్రితం వైసీపీ ప్రభుత్వంలో పనిచేసినవారే..ఆ విషయం జగన్ మరిచిపోయినట్లున్నారు..*జగన్ వ్యాఖ్యలు అత్యంత బాధాకరం.. జగన్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి..జగన్ తన రాజకీయ లబ్ధి కోసం పోలీసులను కించపరుస్తూ మాట్లాడటం దురదృష్టకరం.* *మేము నాలుగు సింహాలకే సెల్యూట్ చేస్తాం తప్ప.. చట్టాలను గౌరవించని వారికి చేయం.*బెదిరింపు వ్యాఖ్యలు చూస్తుంటే ప్రజాస్వామ్యం, చట్టాలపై జగన్కు గౌరవం లేదని తెలుస్తోంది.*ఇప్పటికైనా బెదిరింపు వ్యాఖ్యలు మానుకోవాలి : పోలీస్ అధికారుల సంఘం.*
👉విజయవాడ: సివిల్ సప్లైస్ అధికారులతో నాదెండ్ల భేటీ.. ఇకపై పేపర్లెస్ అడ్మినిస్ట్రేషన్..కచ్చితంగా ప్రక్షాళన జరగాలి-మంత్రి నాదెండ్ల..
వచ్చే ఖరీఫ్కు దేశంలో నెం.1గా ఉండేలా..సివిల్ సప్లైస్ డీఎస్వోలు, డీఎంలు సిద్ధంకావాలి…అధికారులంతా టీమ్ స్పిరిట్తో పనిచేయాలి…రైతులకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పించింది…దీపం-2 పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం..మంత్రి నాదెండ్ల మనోహర్
👉జగన్ కు ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు: కేంద్ర మంత్రి పెమ్మసాని..వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్కు ఆ 11 సీట్లు కూడా రావని, ఒక్క సీటుకే పరిమితమవుతారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ‘జగన్ భాష, వ్యవహారంతో వైసీపీకి కష్టాలు తప్పవు. ఆయన హయాంలో వైసిపి నేతలతో చేయకూడని పనులు చేయించారు. వాటిపైనే ఇప్పుడు వారిపై కేసులు పెడుతున్నారు. ఇందులో తప్పేముంది? రాష్ట్రం అప్పుల్లో ఉన్నా సీఎం చంద్రబాబు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.
👉 *అక్రమ మైనింగ్ పై విజిలెన్స్ దాడులు..*
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కొండ కావూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 219 నందు అక్రమంగా మైనింగ్ పెద్ద ఎత్తున జరుగుతుందని ఫిర్యాదు పై జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి సూర్య శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం పల్నాడు జిల్లా మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులతో కలిసి పల్నాడు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్కడ అక్రమ మైనింగ్ కొరకు వినియోగిస్తున్న ఒక జెసిబి, రెండు టిప్పర్లను లారీలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తదుపరి చట్టపరమైన చర్యల కొరకు జిల్లా మైనింగ్ అధికారులకు అప్పజెప్పడం జరిగినది.
👉గుంటూరు… జగన్మోహన్ పర్యటనలో అభిమానుల అత్యుత్సాహం…
గుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటనలో
మీడియా వారిపైకి ఒక్కసారిగా దూసుకువచ్చిన వైసీపీ అభిమానులు
కెమెరాలు స్టాండ్లు, లోగోలను సైతం కిందపడవేసి తొక్కుకుంటు నెట్టుకుంటు వెళ్లిన వైనం…
మిడియవారి కెమెరా స్టాండ్లు విరిగిపోయిన పరిస్థితి…
కార్యకర్తలను అభిమానులను సైతం కంట్రోల్ చేయలేని స్థితిలో పోలీసులు..
ఎన్నికల కోడ్ అమలులోవున్న జగన్మోహన్ రెడ్డి యార్డ్ వద్దకు రావడం ఒకవంతైతే మరోపక్క అభిమానుల అత్యుత్సాహాo ఎక్కువ కావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట.
కవరేజ్ కి వచ్చి భయబ్రాంతులకు గురైన మీడియా సిబ్బంది
👉జగన్ వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం.. మా మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలు.*
*ఏపీలో శాంతిభద్రతలు దిగజారిపోయాయనడం సరికాదు ఏపీ పోలీసులను కించపరిచేలా మాట్లాడటం దుర్మార్గం.*
*అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా వారిని తీసుకొచ్చి బట్టలూడదీసి నిలబెడతాననడం సమంజసమా?*
*ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న పోలీసులు గత 8 నెలల క్రితం వైసీపీ ప్రభుత్వంలో పనిచేసినవారే..ఆ విషయం జగన్ మరిచిపోయినట్లున్నారు.*
*జగన్ వ్యాఖ్యలు అత్యంత బాధాకరం.. జగన్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి..జగన్ తన రాజకీయ లబ్ధి కోసం పోలీసులను కించపరుస్తూ మాట్లాడటం దురదృష్టకరం.*
*మేము నాలుగు సింహాలకే సెల్యూట్ చేస్తాం తప్ప.. చట్టాలను గౌరవించని వారికి చేయం.*
*బెదిరింపు వ్యాఖ్యలు చూస్తుంటే ప్రజాస్వామ్యం, చట్టాలపై జగన్కు గౌరవం లేదని తెలుస్తోంది.*
*ఇప్పటికైనా బెదిరింపు వ్యాఖ్యలు మానుకోవాలి : పోలీస్ అధికారుల సంఘం.*

