*డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌…కేంద్ర మంత్రివర్గంలో చేరనున్నారా ?.. *కొమురవెల్లిలో అఘోరి హల్చల్! కత్తితో దాడి…👉  పోలీసులు వేధిస్తున్నారని సూసైడ్…కడప* .. *👉 *మాజీ అడిషనల్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుకి భారీ ఊరట*ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు మంచి అవకాశంపీఎం సూర్యఘర్‌ యోజన. **జనం ముందుకు రానున్న LTTE ప్రభాకరన్ ? 👉తిరుపతి… *ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య!!!.

👉ఢిల్లీ కి వచ్చేయి..నువ్వు లోకల్ కాదు నేషనల్*.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌…కేంద్ర మంత్రివర్గంలో చేరనున్నారా ? విజయసాయిరెడ్డి స్థానంలో…ఆయన రాజ్యసభకు వెళ్లనున్నారా ? ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కాకపోతే…ఇంకెపుడు బలపడుతామనే ఆలోచనలో కాషాయ పార్టీ నేతలు ఉన్నారా ?

2029 నాటికి బలమైన పార్టీగా అవతరించడానికి కమలం పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారా ? అందులో భాగంగానే పవన్‌ కల్యాణ్‌కు కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోనుందా ?

ఆంధ్రప్రదేశ్‌లో బలపడటమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి 175 స్థానాల్లో పోటీ చేసేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తెలుగుదేశం పార్టీపై ఎక్కువకాలం ఆధారపడితే..మనకే నష్టమనే ఆలోచనలో పడిపోయింది. అందులో భాగంగానే 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలంగా తయారు చేయాలన్న టార్గెట్‌గా పని చేస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను ఢిల్లీకి రావాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పవన్‌ కల్యాణ్‌ను రాజ్యసభకు పంపేలా మంత్రాంగం నడుపుతోంది. వైసీపీ తరపున ఎన్నికైన విజయసాయిరెడ్డి…రెండ్రోజుల క్రితం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఉపరాష్ట్రపతి జగదీప్‌ దన్కర్‌ ఆమోదించారు. ఆయన దారిలోని మరికొందరు ఎంపీలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీని పూర్తి వీక్‌ చేయాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన స్థానంలో పవన్ కల్యాణ్‌ను పెద్దల సభకు పంపేలా బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. దీనిపై ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకు పరిమితం అయింది. దీంతో పార్టీలోని మెజార్టీ నేతలు…పక్క చూపులు చూస్తున్నారు. కొందరు ఎన్నికల ముందు టీడీపీ, జనసేనలో చేరి…టికెట్లు తెచ్చుకున్నారు. అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మిగిలిన నేతలంతా ఎపుడెపుడు బయటపడాలనే ఆలోచనతో ఉన్నారు. దీన్ని కాషాయ పార్టీ నేతలు క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డారు. వైసీపీలోని అసంతృప్త నేతలను చేర్చుకొని బలపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే విశాఖ డెయిరీ ఛైర్మన్‌ అడారి ఆనంద్ కుమార్‌ బీజేపీలో చేరిపోయారు. మరికొందరు అదే దారిలో ఉన్నారు. మంచి తరుణం మించినా దొరకదనే ఆలోచనలో ఉంది బీజేపీ అగ్రనాయకత్వం. 2019 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ…2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తులతో 8 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. 2029లో ఈ సీట్లను మరింత గణనీయంగా పెంచుకోవాలని భావిస్తోంది.

పవన్‌ కల్యాణ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని…ఏపీలో డిప్యూటీ సీఎం పదవి తాను తీసుకోవాలనే వ్యూహంలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పవన్‌ కల్యాణ్‌కు ఢిల్లీకి రావాలని కబురు పంపినట్లు తెలుస్తోంది. 2029లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేసేలా…కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా వైసీపీని వీక్‌ చేసి…ఆ స్థానంలోకి బీజేపీ-జనసేన వెళ్లాలని చూస్తున్నాయి. అందుకే పవన్‌ ద్వారా తెరవెనుక రాజకీయం ప్రారంభించింది బీజేపీ.

👉తిరుపతి… ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య!!!.
మంగళం సమీపంలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఘటన.
కర్నూలు జిల్లా, డోన్ పట్టణానికి చెందిన శివప్రసాద్ (19)గా పోలీసులు గుర్తింపు.
సోమవారం మధ్యాహ్నం కళాశాలకు వెళ్లకుండా తానున్న రూమ్ లో ఫ్యాన్ ఉరివేసుకొని ఆత్మహత్య.
మృతదేహాన్ని తిరుపతి రూయా మార్చురీకి తరలింపు.
ఆత్మహత్య సంబంధించిన కారణాలపై విచారిస్తున్న తిరుచానూరు ఎస్సై జగన్నాథం.
👉  పోలీసులు వేధిస్తున్నారని సూసైడ్…కడప* *పులివెందుల: పోలీసుల వేధింపులు తాళలేక వ్యక్తి  ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుట జరిగింది. పులివెందుల మండలం మొట్నూతలపల్లె గ్రామానికి చెందిన గంగాధర్ పోలీసులు వేధిస్తున్నారంటూ స్టేషన్ ఎదుట పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉 కొమురవెల్లిలో అఘోరి హల్చల్! కత్తితో దాడి…
AP: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న ఆలయం వద్ద అఘోరి హల్ చల్ చేసింది. ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని ఆలయ సిబ్బందితో వారించింది. అయితే దుస్తులు ధరించి వస్తేనే స్వామి వారి దర్శనానికి అనుమతి ఇస్తామని అధికారులు సూచించారు. దీంతో ఆగ్రహించిన అఘోరి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో పలువురిపై దాడికి యత్నించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉*జనం ముందుకు రానున్న LTTE ప్రభాకరన్ ?*
లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE) పేరిట శ్రీలంకలో తమిళుల కోసం పోరాడిన ప్రభాకరన్ బతికే ఉన్నారా? ఈ ఏడాది మేలో జనం ముందుకు రానున్నారా? తమిళ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ప్రభాకరను తాము అంతం చేసినట్లు 2009లో శ్రీలంక సైన్యం ప్రకటించింది. అందుకు సంబంధించిన ఫొటోలనూ విడుదల చేసింది. అలాంటిది ఆయన బతికున్నారంటూ ఇప్పుడు వార్తలు రావడం సంచలనంగా మారింది.
👉 *ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త.. రూ .30వేల నుంచి రూ.78 వేల వరకు.. వెంటనే దరఖాస్తు చేస్కోండి*..ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు మంచి అవకాశంపీఎం సూర్యఘర్‌ యోజన పథకాన్ని అమలు చేస్తున్నారు..రాయితీపై ఇళ్లపై సోలార్‌ రూఫ్‌టాప్‌లను అమరుస్తున్నారు..ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మరో వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
కేంద్ర పథకమైన పీఎం సూర్యఘర్‌ యోజనను డ్వాక్రా మహిళలకు కూడా అమలు చేస్తోంది.
ఈ మేరకు రాయితీతో డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్‌ రూఫ్‌టాప్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా సోలార్ రూఫ్ టాప్‌లను ఏర్పాటు చేసే కార్యక్రమం కొనసాగుతోంది.
ఈ మేరకు సామర్థ్యాన్ని బట్టి రాయితీని అందిస్తోంది.
ఒక కిలోవాట్‌ సోలార్ రూఫ్ టాప్ వ్యయం రూ.70 వేలు ఉంటే.. అందులో రూ.30 వేల రాయితీ లభిస్తుంది. రెండు కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ రూ.1.40 లక్షలు కాగా రాయితీ రూ.60 వేలు ఉంటుంది. అదే మూడు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూఫ్‌టాప్‌ ఏర్పాటు కోసం వ్యయం రూ.1.95 లక్షలు కాగా.. రాయితీ రూ.78 వేలు వస్తుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు వారి ఇంటి విద్యుత్‌ వినియోగాన్ని బట్టి రూఫ్‌టాప్‌ సామర్థ్యాన్ని నిర్ణయించుకోవచ్చు.
పీఎం సూర్య ఘర్‌ యోజన పథకం కింద.. లబ్ధిదారు వాటా 10 శాతం పోనూ, మిగతా మొత్తాన్ని 7% వడ్డీపై బ్యాంకుల ద్వారా రుణం ఇస్తారు. ఈ రుణాన్ని అందించే బాధ్యత సెర్ప్‌ (గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ) అధికారులుది. ఒకవేళ లబ్ధిదారులు 10 శాతం వాటా కూడా చెల్లించలేని స్థితిలో ఉంటే.. ఆ మొత్తాన్ని బ్యాంకు, స్త్రీనిధి, పొదుపు మొత్తం నుంచి అందిస్తారు. డ్వాక్రా మహిళలకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరతున్నారు.
👉 *మాజీ అడిషనల్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుకి భారీ ఊరట*
▪️ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా క్రమబద్ధీకరించిన ఏపీ ప్రభుత్వం.
▪️ఆయన పై నమోదైన అభియోగాలు వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు.
▪️సస్పెన్షన్ కాలపు బకాయిలు మొత్తం చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు.
▪️గత ప్రభుత్వ హయాంలో 2 దఫాలుగా ఏబీవీపై సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..