ఏపీ ప్రజల గుండెల్లో గునపం .. నిధులు లేవని చేతులెత్తేసిన సీఎం చంద్రబాబు..!!! 😲😲
పథకాలు అమలు చేయడానికి ఖజానాలో డబ్బుల్లేవంటూ చేతులేత్తెసిన ముఖ్యమంత్రి..విశాఖ ఉక్కు, అమరావతి రాజధాని, పోలవరం కోసం కేంద్రం నిధులిచ్చిందని..పథకాల అమలు కోసం తాను ఆ నిధులను మళ్లించలేనంటూ సీఎం కుండబద్దలు… డబ్బులు ఉంటేనే.. పథకాలను అమలు చేస్తామన్నట్టు మాట్లాడిన చంద్రబాబు..అంటే.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ గంగలో కలిసినట్టేనా? అంటూ జనం ఆందోళన..
👉 భార్య వేధింపులు తట్టుకోలేక భర్త సూసైడ్..!!! భార్య వేధింపులతో మరో భర్త సూసైడ్ చేసుకున్న ఘటన కర్ణాటకలోని హుబ్లీలో చోటు చేసుకుంది. పీటర్, ఫిబీ(పింకీ)లకు రెండేళ్ల కిందట పెళ్లి అయింది. ఇటీవల వారి మధ్య మనస్పర్థలు రావడంతో 3నెలలుగా విడిగా ఉంటున్నారు. ‘నా భార్య నన్ను చంపుతోంది. నేను చనిపోవాలని ఆమె కోరుకుంది’ అని పీటర్ రాసిన సూసైడ్ నోట్ వైరలవుతోంది. విడాకుల కోసం ఫిబీ సోదరుడు రూ.20 లక్షలు డిమాండ్ చేశాడని, ఆఫీస్ మీటింగ్లో ఉండగా భార్య గొడవపడటంతో పీటర్ జాబ్ పోయిందని మృతుడి తండ్రి చెప్పారు.
👉 ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు..తనపై తప్పుడు కేసులు పెట్టి ఉద్యోగంలో నుండి తొలగించారని, తనపై కులపరమైన విమర్శలు, బెదిరింపులు చేశారని ఫిర్యాదు చేసిన మాజీ ఐఐఎస్సీ ప్రొఫెసర్ దుర్గప్ప..గిరిజన తెగకు చెందిన దుర్గప్ప ఫిర్యాదుతో క్రిస్ గోపాలకృష్ణన్తో పాటు మరో 17 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
👉హనుమకొండ జిల్లా. కనకదుర్గ చిట్స్ యజమాన్యం దారుణం.డిపాజిట్ డబ్బులు అడిగినందుకు వచ్చిన వ్యక్తిని కార్యాలయంలోనే ఉంచి తాళం వేసి వెళ్లిన యజమాన్యం..బాధితుడు కానిపర్తికి చెందిన ప్రతాప్.రాత్రి నుండి చిట్ఫండ్స్ లోనే బాధితుడు కాపాడంటూ మిత్రులకు బంధువులకు ఫోన్
👉 నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి షాక్.టిడిపికి చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు వైసీపీలో చేరిక.కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి.
👉*పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు* న్యూ ఢిల్లీ :వాట్సాప్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మోడ్ల ద్వారా నిందితులకు పోలీసులు నోటీసులు పంపించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సిఆర్పిసి, 1973/బిఎన్ఎస్ఎస్ ప్రకారం నిర్దేశించిన సర్వీస్ విధానం ద్వారా మాత్రమే నోటీసులు జారీ చేయడానికి అన్ని రాష్ట్రాలు/యుటీలు పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించింది. చట్టం ప్రకారం వ్యక్తిగతంగా నోటీసులు అందించాలని న్యాయమూర్తులు MM సుందరేష్, రాజేష్ బిందాల్ ధర్మాసనం పేర్కొంది.
👉 ప్రకాశం జిల్లా కనిగిరిలో మంత్రి డా. డోలా పర్యటన..
పీసీపల్లిలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవం, కనిగిరిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అదనపు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన.. యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది..7 నెలల కూటమి పాలనలో 6 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షల ఉద్యోగాలు..కనిగిరి నియోజక వర్గంలో 4 వేల ఎకరాల్లో రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం.. మంత్రి డోలా..
.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి సోమవారం ప్రకాశం జిల్లా కనిగిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో వెయ్యి ఎకరాల్లో భారత్ పెట్రోల్ రిఫైనరీ .. యువగళం పాదయాత్రతో లోకేశ్ నాటి వైసీపీ అరాచక పాలనపై పోరాటం చేశారు..*వై నాట్ 175 అని విర్ర వీగి 11 సీట్లకు ఎందుకు పరిమితమయ్యారో జగన్ కి ఇంకా బోధపడినట్లు లేదన్నారు..ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది జగన్ కాదా ?.. *నవరత్నాల్లో ఒక్క రత్నమైనా కోతల్లేకుండా అమలు చేశారా ? .. ఐదేళ్ల వైసీపీ పాలనలో కనీసం ఒక టీచర్ పోస్ట్ అయినా భర్తీ చేశారా ?..*మేం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ఇచ్చాం, చెప్పిన మాట ప్రకారం పింఛన్లు పెంచాం, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం..త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..రాష్ట్ర ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా అన్ని హామీలు అమలు చేస్తున్నాం..సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేసి జగన్ కి సూపర్ స్ట్రోక్ ఇస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి తెలిపారు.
👉 ఢిల్లీ ఓటరు షాక్ ఇస్తాడా ? ..అదే సమయంలో ఢిల్లీ ఓటర్లు మాత్రం పెద్దగా ఈ ఎన్నికల పట్ల ఆసక్తిని చూపించడం లేదు అని అంటున్నారు. దేశంలో ఇపుడు అందరికీ ఆకట్టుకుంటున్న ఎన్నికలు ఢిల్లీ శాసనసభకు ఫిబ్రవరి 5న జరిగేవిగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్నది దేశంలో రాజకీయాల పట్ల అవగాహన ఆసక్తి ఉన్న వారిలో ఉత్సాహం పెంచుతోంది. అదే సమయంలో ఢిల్లీ ఓటర్లు మాత్రం పెద్దగా ఈ ఎన్నికల పట్ల ఆసక్తిని చూపించడం లేదని అంటున్నారు.వారిలో ఒకింత ఎన్నికల వైరాగ్యం కూడా ఏర్పడింది అని అంటున్నారు. ఎవరు వస్తేనేమిటి అన్న భావనతో ఢిల్లీ ఓటరు ఉన్నారని అంటున్నారు. ఇంతలా నిరుత్సాహం ఎందుకు అంటే ఆప్ ప్రభుత్వం మీద కోటి ఆశలు పెంచుకుని పన్నెండేళ్ళుగా మోశారు. అయితే ఆప్ కొన్ని మంచి పనులు చేసినా ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ వాసులకు స్వచ్చమైన గాలి కావాలి. కాలుష్యం కోరలలో ఢిల్లీ చిక్కుకుంది. దానికి పరిష్కారం అయితే లేదు. అంతే కాదు ఆప్ అధినేత కేజ్రీవాల్ కొత్తగా ముఖ్యమంత్రి అయినపుడు సాదా సీదాగా కనిపించేవారు. అందరి మాదిరిగానే పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో ప్రయాణం చేసేవారు. అయితే ఆయన అత్యాధునికమైన శీష్ మహల్ భవనం కట్టుకున్నారు అని బీజేపీ ఆరోపిస్తోంది. జనాలు కూడా దాని మీద చర్చించుకుంటున్నారు. ఇక లిక్కర్ స్కాం ఉండనే ఉంది. దీనిని నమ్మే వారూ నమ్ముతున్నారు. ఏది ఏమైనా పూర్వం మాదిరిగా అయితే అరవింద్ కేజ్రీవాల్ క్రేజ్ అయితే లేదని అంటున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ఢిల్లీ కాలుష్యంతో పాటు స్థానిక సమస్యల మీద తన వంతుగా స్పందించలేదు అన్న ఆగ్రహం ఉంది. ఎంతసేపూ ఆప్ ని విమర్శించడం తప్ప తాము చేసింది ఏమిటి అని ప్రజలలో ఆగ్రహం ఉంది అంటున్నారు. అంతే కాదు ఢిల్లీలో గెలిచిన ఆప్ ని సరిగ్గా పాలించకుండా లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను పెంచేసారు అన్నది కూడా జనంలో చర్చగా ఉంది. బీజేపీ వచ్చినా ఏమి ఉంటుందన్న నిర్వేదం కూడా జనాలొలో ఉందట. సందట్లో సడేమియా అన్నట్లుగా కాంగ్రెస్ పోటీ చేస్తోందని అంటున్నారు. ఆ పార్టీ గెలుస్తుంది అని వారే అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా పెద్దగా ఫోకస్ చేయడంలేదు. ఇక జనాలు ఎందుకు ఆ వైపు చూస్తారు అని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఫలనా పార్టీని గెలిపించాలి.. వారితో తమ జీవితాలను బంగారం చేసుకోవాలన్న పట్టుదల కానీ కోరిక కానీ ఆకాంక్షలు కానీ పెద్దగా లేని ఈ ఎన్నికలు ఈసారి ఏ రకమైన ఫలితాన్ని ఇస్తాయో అని అంతా అంటున్నారు. మరి పోలింగ్ గతసారి కంటే మించుతుందా తగ్గుతుందా అన్నద్ దానిని బట్టి ఢిల్లీ ఓటరు తీర్పు అర్ధం అయిపోతుంది అని అంటున్నారు.

