???? గుంటూరు : ఫారిన్లో ఎడ్యుకేషన్ పేరుతో మోసాలు. బోగస్ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఫిలిప్పీన్స్ దేశంలో ఎంబీబీఎస్ సీటుతో పాటు పాస్పోర్ట్, వీసా సమకూర్చుతామని మోసం. బాధితుల నుంచి రూ.21,59,000 డబ్బులు వసూలు.
???? నాకు న్యాయస్థానంపై నమ్మకముంది. పాపం నన్ను ఏదోరకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోంది. నాపై ఇది ఆరో ప్రయత్నం.. రేవంత్కు ఏమీ దొరకటం లేదు. రూ.600 కోట్ల సంగతి అటుంచితే..ఒక్క పైసా కూడా అవినీతి లేదు..కేటీఆర్
???? మాదాపూర్ పేస్ హాస్పిటల్లో దారుణం. ఠాగూర్ సినిమాను తలపించేలా వైద్యం చేసిన పేస్ హాస్పిటల్ సిబ్బంది. రెండు రోజుల క్రితం లివర్ ప్రాబ్లంతో బాధపడుతూ పేస్ హాస్పిటల్లో చేరిన లింగంపల్లికి చెందిన ఎల్లమ్మ (60). హాస్పిటల్ చేర్చుకునే సమయంలో రెండు లక్షల 20 వేలు కట్టించుకున్న పేస్ హాస్పిటల్ యజమాన్యం… నిన్న ఉదయం ఎల్లమ్మ ఆరోగ్యం మెరుగుపడింది అని తెలిపిన పేస్ హాస్పిటల్ డాక్టర్లు. ఈరోజు ఉదయం ఎల్లమ్మ పరిస్థితి విషమంగా ఉందని ఇంకా మూడు లక్షలు చెల్లించాలని తెలిపిన పేస్ హాస్పిటల్ సిబ్బంది. హాస్పిటల్లో డబ్బు డిపాజిట్ చేయడానికి వెళ్ళగా ఎల్లమ్మ చనిపోయిందని తెలిపిన హాస్పిటల్స్ సిబ్బంది…
మహారాష్ట్ర మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణు భార్య లొంగుబాటు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయిన తారక్క. తారక్కపైన రెండు కోట్లకుపైగా రివార్డ్. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న మల్లోజుల వేణు.
????2024లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు చారిత్రక విజయం ఇచ్చారు..⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం
⭐ఐదేళ్ల పాటు గత పాలకులు అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు⭐గత ప్రభుత్వ పాలన నేరాలు, ఘోరాలకు అడ్రస్గా మారింది*⭐ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి..ఒక్కోటి విప్పుకుంటూ అభివృద్ధితో ముందువెళ్తున్నాం*
⭐1995 నాటి ముఖ్యమంత్రిని మీరు మళ్లీ చూస్తారు*
⭐మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు⭐

*అమరావతి :-* మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ చిట్చాట్లో సీఎం చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
⭐‘జగన్ రెడ్డి ఐదేళ్ల ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎంతో భరోసా కలిగింది. జగన్ అరాచక విధానాలతో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు.
⭐ అమరావతి, పోలవరం, ఇతర సాగునీటి ప్రాజెక్టులను సమస్యల వలయంలో నెట్టివెళ్లాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు సార్లకుపైగా ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి నిధులు తేవడంతో పాటు సాంకేతిక పరమైన సమస్యలను పరిష్కరించుకున్నాం. ఉన్మాదంతో సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిని కట్టడి చేస్తున్నాం. సమస్యల సుడిగుండంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ను గట్టెక్కించేందుకు ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం.
⭐జగన్ రెడ్డి ప్రభుత్వ తప్పిదాలు రాష్ట్ర ప్రజలకు శాపాలుగా మారాయి. వాటిని సరిచేసేందుకు ఈ ఆరు నెలల పాటు కసరత్తు చేశాం. గత ఐదేళ్ల పాలన నేరాలు ఘోరాలకు అడ్రస్గా మారింది. కూటమి ప్రభుత్వం రాగానే శాంతి భద్రతలను సక్రమంగా అమలు చేస్తూ నేరాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
⭐గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం*..‘మా ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే మేం పాలన సాగిస్తున్నాం. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చరిత్రాత్మక విజయం సాధించింది. రాష్ట్రంలో ప్రజానికంతో పాటు వివిధ పార్టీల నాయకులు గత ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మేము వచ్చాక ఆరు నెలల్లో ప్రజలకు ఒక నమ్మకం కలిగింది. వారి భవిష్యత్పై నమ్మకం కలిగేలా మేం పనిచేస్తున్నాం. ధ్వంసమైన వ్యవస్థలను రిపేర్ చేసుకుంటూ వేళ్తూ ప్రజల ఆశలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నాం. పోలవరం ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణానికి జగన్ అనేక చిక్కుముడులు వేశాడు.వాటిని విడదీస్తూ అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం.పోలవరం ప్రాజెక్టుకు టెక్నికల్ కమిటీ ఫిజుబిలిటీ రిపోర్ట్ ఇచ్చింది.
⭐కేంద్రం నుంచి నిధులు రాబట్టి త్వరలో పోలవరం ప్రాజెక్ట్ పనులు ప్రాంభించి అనుకున్న సమయానికే పూర్తి చేస్తాం. ప్రజలు కూటమి ప్రభుత్వంపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకానికి అనుగుణంగా పని చేస్తాం.
⭐నేను ఎప్పుడూ రాజకీయ కక్షలు తీర్చుకోను…తప్పు చేసిన వారిని మాత్రం వదిలేది ప్రసక్తి లేదు. ఎంతటి వారైనా చట్టం ముందు నిలబడాల్సిందే’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
⭐1995 నాటి ముఖ్యమంత్రిని మీరు మళ్లీ చూస్తారు*
‘1995లో సీఎంగా నా పనితీరు చూశారు. ఇక ముందుకు కూడా ఆనాటి సీఎంను చూస్తారు.సోషల్ మీడియాలో ఇదివరకు లాగా ఇష్టమొచ్చినట్టు అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయి.
⭐సెకీ ఒప్పందం మాకు లడ్డూలా దొరికిన విషయం వాస్తవమే. చట్టం ప్రకరామే ముందుకు వెళ్తాం. రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. 2004లో నన్ను ఎవరూ ఓడించలేదు.హైదరాబాద్ను అభివృద్ధి చేశా. నేను చేసిన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయాం.ఈ సారి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ప్రజలను నాతోపాటే తీసుకెళ్తాను.ఆరు నెలలల్లో వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు రాలేదన్నారు.
⭐ఇచ్చిన హామీలైన సీపీఎస్ రద్దు,మద్య నిషేధం అమలు చేస్తామని అబద్ధాలు చెప్పాడు.
⭐అధికారంలోకి వచ్చాక నాకు తెలియదు,ఇంత ఖర్చు అవుతుందని అనుకోలేదు అంటూ మాట మార్చారు. ఎంతమంది ఉన్నా అమ్మఒడి ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదు.మేము మాత్రం ఇచ్చిన సూపర్ 6 హామీలను కచ్చితంగా అమలు చేస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
????గుంటూరు జిల్లా పోలీస్… *తక్కువ ఖర్చులో విదేశాల్లో ఉన్నత విద్య అందిస్తామని చెప్పే కన్సల్టెన్సీ సంస్థల పట్ల జాగ్రత్త వహించండి.*
*ఫిలిప్పీన్స్ దేశంలోనీ మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తామని నగదు తీసుకుని మోసం చేసిన రైట్ ఛాయిస్ జెఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రై లిమిటెడ్ కన్సల్టెన్సీ సంస్థ.*సంస్థకు చెందిన 7 మందిపై కేసు నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన వట్టిచెరుకూరు పోలీసులు..*నకిలీ కన్సల్టెన్సీల పట్ల జాగ్రత్త వహించాలని విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించిన పోలీస్ అధికారులు.*
???? *గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు సౌత్ డిఎస్పి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముద్దాయిల అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించిన సౌత్ డిఎస్పి మల్లికార్జునరావు,వట్టిచెరుకూరు సిఐ రామనాయక్
???? శీలంనేని.శ్రీనివాసరావు గురజాల గ్రామం, పల్నాడు జిల్లా అనే అతను తన కొడుకు అయిన అనిల్ కుమార్ ని మెడిసిన్(MBBS) చదివించాలని కన్సల్టెంట్స్ ని సంప్రదించే క్రమంలో, గుంటూరు పట్టణంలోని అరండల్ పేట 6/2, లో గల రైట్ ఛాయిస్ JS ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ PVT LTD. ఫౌండర్, డైరెక్టర్ అయిన కన్నా రవితేజ S/o శౌరీలు అను అతను, పిర్యాది వాళ్ళని సంప్రదించి ఫిలిప్పీన్స్ లోని పర్పెట్చువల్ హెల్ప్ (PERPETUAL HELP) మెడికల్ కాలేజీలో సీటు ఇప్పిస్తామని మరియు వారి సంస్థ ద్వారా చాలా మంది విద్యార్దులను ఉన్నత చదువుల కోసం పంపించామని చెప్పడం జరిగినది.
* హైదరాబాద్ లో కూడా తమకు బ్రాంచి ఉందని, అక్కడ లోహిత మరియు రవి కుమార్ అను వారు పనిచేస్తున్నారని, స్టూడెంట్ వీసా దగ్గర నుండి కాలేజీలో & హాస్టల్ లో చేర్పించడం వరకు మొత్తం వారే చూసుకుంటామని చెప్పి నమ్మించి బాధితుడి వద్ద నుండి సుమారు రూ.21,59,000/- నగదును కట్టించుకుని, సదరు కాలేజీలో నగదు కట్టకుండా బాధితులను మోసం చేస్తూ, కాలేజీలో నగదు కట్టమని అడిగినందుకు బాధితుని కొడుకును భయబ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితుడు శీలం.శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వట్టిచెరుకూరు పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగినది.
*పోలీస్ వారి దర్యాప్తులో మొత్తం 7 మంది ముద్దాయిలు ఈ మోసానికి పాల్పడ్డారని తేలినది. వారి వివరాలు :-*
1).కన్నా. బాల రవితేజ, ముట్లూరు గ్రామం, వట్టిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా.
2).కన్నా. బాల శౌరయ్య, ముట్లూరు గ్రామం, వట్టిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా,
3).పెరమల.పల్లి లోహిత..4).పార.రవి కుమార్, జగన్నాధ పురం గ్రామం,వీరులపాడు మండలం, NTR జిల్లా. 5).మురుపాల గీతికా,
6).నారాయణ పవన్ కళ్యాణ్,
7).పొలిమేర శివ…పైన తెలిపిన 5,6,7గురు నిందితులు ఫిలిప్పీన్స్ దేశంలో ఉంటూ కార్యకలాపాలు నిర్వహిస్తారని సమాచారం.*
???? (01.01.2025) ముట్లూరు గ్రామంలో కన్న. బాల రవితేజ, కన్నా. బాల సౌరయ్య, పారా.రవికుమార్ అనే ముగ్గురిని వట్టిచేరుకూరు పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగినది.
???? ఈ కేసులో మిగిలిన నలుగురు నిందితులు అయిన పెరమలపల్లి.లోహిత( హైదరాబాద్ బ్రాంచ్ నందు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఫిలిప్పీన్స్ దేశం వెళ్లి వస్తూ ఉంటుంది) , అదేవిధంగా ఫిలిప్పీన్స్ లో ఉంటున్న మురుపాల.గీతిక నారాయణ.పవన్ కళ్యాణ్, పొలిమేర.శివ అనే వారి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డిఎస్పి మల్లికార్జున రావు తెలిపారు.
???? *నిందితులు బాధితుల వద్ద నుండి ఫీజుల కోసం నగదును కట్టించుకుని, సదరు కాలేజీల వారికి కట్టకుండా వారి సొంతానికి వాడుకుంటూ, విద్యార్దుల యొక్క పాస్ పోర్ట్ మరియు వీసాలను వీరివద్దనే ఉంచుకొని, కాలేజి ఫీజులు కట్టమని అడిగిన విద్యార్దులపై తప్పుడు కేసులు పెడతామని పిల్లల తల్లిదండ్రులను నిందితులు బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మా దర్యాప్తులో తెలినదని తెలిపారు.*
???? కావున ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు నకిలీ కన్సల్టెన్సీల బారినపడి మోసపోరాదని, ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఎవరైనా ఎటువంటి బెదిరింపులకు పాల్పడిన వెంటనే పోలీసు వారిని సంప్రదించాలని డిఎస్పీ సూచించారు.
???? *నిందితులు కన్సల్టెన్సీ సంస్థ నందు ఉపయోగించిన ఒక లాప్టాప్, మూడు సెల్ ఫోన్లు,ఒక పాస్పోర్ట్ ను పోలీస్ వారు సీజ్ చేయడం జరిగినది.*
???? నిందితులను అరెస్టు చేయడంలో కృషిచేసిన వట్టి చెరుకూరి సిఐ రామానాయక్ ని, హెడ్ కానిస్టేబుల్ B. శ్రీనివాసరావు,కానిస్టేబుళ్లు శేఖర్, ప్రకాష్ బాబు,ప్రసాద్, పోతురాజులను డిఎస్పీ అభినందించారు.
వాట్సాప్ అడ్డాగా సైబర్ నేరాలు.._*
* *సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*
* సైబర్ నేరాలు పెరుగుతున్న ఈ డిజిటల్ యుగంలో, మెసేజింగ్ యాప్లు నేరగాళ్లకు వేదికగా మారాయి.._
* _హోంశాఖ నివేదిక ప్రకారం, 2024 తొలి మూడు నెలల్లో వాట్సాప్లో 43,797, టెలిగ్రామ్లో 22,680, ఇన్స్టాగ్రామ్లో 19,800 మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి.
* _గూగుల్ సేవలతో పాటు అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్లు కూడా ఈ మోసాలకు ఉపయోగించబడుతున్నాయి.._
* _సైబర్ మోసాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొంది.
*డిజిటల్ లెండింగ్ యాప్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఆయా సామాజిక మాధ్యమాలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది..
* తిరుపతి జిల్లా..”నగరంలో మత్తు వదిలించిన పోలీస్”..డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర సంబరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తిరుపతి నగరంలో పోలీసులు పగడ్బందీ చర్యలు చేపట్టారు.
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు నాయకత్వంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు జరిగాయి.
ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగుతూ సంబరాల్లో సురక్షిత వాతావరణాన్ని కొనసాగించారు.
ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపడంపై కఠిన చర్యలు తీసుకున్నారు. *సుమారు 250 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి,* నిబంధనలను ఉల్లంఘించిన వారి పై కేసులు నమోదు చేశారు.
పోలీసుల ఈ ప్రయత్నం వల్ల ప్రజలు తమ వేడుకలను ప్రశాంతంగా జరుపుకుని నూతన సంవత్సరాన్ని సంతోషంగా ప్రారంభించారు.
???? తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ : న్యూ ఇయర్ వేళ సీఎం చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలకు దశలవారీగా కౌన్సెలింగ్ చేస్తున్నానని తెలిపారు. తప్పుడు పనులు చేయొద్దని ఎమ్మెల్యేలకు పదే పదే హెచ్చరిస్తున్నా అని స్పష్టం చేశారు. సమాజానికి హానికరమైన వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు.
???? గుంటూరు జిల్లా..యాపిల్ పండ్ల వ్యాపారం మాటున పక్క రాష్ర్టాల మద్యం తరలింపు వ్యవహారం గుట్టురట్టు
మినీ లారీలో యాపిల్ పండ్ల చాటున పక్క రాష్ర్టాల మద్యం అమ్ముతూ పట్టుబడిన ముగ్గురు సభ్యుల ముఠా
మంగళగిరి మానస సరోవర్ వద్ద మాటు వేసి నిందితులను పట్టుకున్న పోలీసులు
ప్రధాన నిందితులు పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామానికి చెందిన బొడ్డపాటి బాలక్రిష్ణ,ముండ్రు మస్తాన్ రావు,అనపర్తి ఏసోబు ని అరెస్ట్ చేసిన స్పెషల్ ఎక్సైజ్ పోలీసులు..నిందితులను పట్టుకోవడం కోసం గతంలో అనేక సార్లు మాటు వేసిన ఎక్సైజ్ పోలీసులు
చండీగఢ్ ,పంజాబ్ రాష్ర్టాల నుండి గతంలో అనేక సార్లు మినీ లారీలో తెచ్చి అమ్మినట్లు ఉన్నతాధికారుల విచారణలో ఒప్పుకున్న ముఠా కీలక సూత్రధారులు బొడ్డపాటి బాలక్రిష్ణ,ముండ్రు మస్తాన్ రావు.
???? ఎస్పీ ఇంటి వద్ద నిప్పంటించుకున్న వ్యక్తి ..
యూపీలోని బదౌన్లో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. గుల్ఫామ్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసుల ముందే ఎస్సీ ఇంటి వద్ద నిప్పంటించుకున్నాడు. పోలీసులు తన జీవనాధారమైన రిక్షా లాక్కున్నారని బాధితుడు ఆరోపించాడు. రెండు రోజులుగా స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు మంటలు ఆర్పి, బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
???? అమరావతి: నూతన సంవత్సరం తొలి రోజున ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధించిన ఫైలుపై ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 1,600 మందికి రూ.24 కోట్లు విడుదల కానున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 9,123 మంది బాధితులకు రూ.124.16 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధుల్ని అందజేశారు.
???? వైసీపీ నుంచి వలసలు.. కూటమిలో కుంపట్లు.. ఎన్నికల ముందు తమను ఇబ్బంది పెట్టిన వారిని కూటమిలోకి ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు నుంచి ఒక్కటిగా కలిసి నడుస్తున్న మూడు కూటమి పార్టీల నడుమ వైసీపీ వలస నేతలు కుంపట్లు రాజేస్తున్నట్లు కనిపిస్తోంది.ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ, జనసేన పార్టీల్లో చేరికలను టీడీపీ నేతలు బాహటంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల ముందు తమను ఇబ్బంది పెట్టిన వారిని కూటమిలోకి ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అయితే వైసీపీ నుంచి వలసలను వద్దని టీడీపీ నేతలు ఎంత గొంతు చీల్చుకున్న మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ మాత్రం వలస నేతలకు రెడ్ కార్పెట్ స్వాగతం పలకడమే చర్చనీయాంశమవుతోంది. ఏపీలో రాజకీయం హాట్ హాట్ గా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కూటమి కట్టిన టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య ఇన్నాళ్లు మంచి సమన్వయమే కనిపించింది. అయితే ఇప్పుడు జనసేన, బీజేపీల్లో నేతల చేరికలు కూటమిలో విభేదాలకు కారణమవుతున్నట్లు చెబుతున్నారు. పాలనలో సమన్వయం చూపుతున్న అధికార పార్టీ నేతలు తమ స్వీయ రాజకీయ అకాంక్షలతో ఎవరికి వారే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో మూడు పార్టీల్లో ఎవరు చేరినా ముందుగా చర్చించి సమన్వయం కుదిరాకే నిర్ణయం జరగాలనే ఒప్పందానికి తూట్లు పొడిచినట్లు కనిపిస్తోంది. ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా టీడీపీ కుదరకపోతే జనసేన, బీజేపీల్లో చేరేలా పావులు కదుపుతున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఈ చేరికనలు ప్రోత్సహించరాదని కూటమి పార్టీలు నిర్ణయించాయి. ఎవరైనా వస్తామంటే వారి గత చరిత్రపై మూడు పార్టీలు చర్చించి ఏకాభిప్రాయం కుదిరితేనే ఆయా పార్టీలు చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించాయి. అయితే వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.క్రిష్ణయ్య ఆ పార్టీకి, పదవులకు రాజీనామా చేసి టీడీపీ, బీజేపీలో చేరిన తర్వాత పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. మోపిదేవి, బీద మస్తాన్ రావు టీడీపీలో చేరడాన్ని బీజేపీ కానీ, జనసేన కాని వ్యతిరేకించలేదు. కానీ, వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కిలారు రోశయ్య, బీజేపీలో చేరిన విశాఖ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ విషయంలో టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అదేవిధంగా తాజాగా జనసేనలో చేరిన గంజి చిరంజీవి, జయమంగళం వెంకటరమణ విషయంలోనూ టీడీపీ వ్యతిరేకిస్తోంది.
వైసీపీ నుంచి వలస వచ్చిన వారిలో బాలినేనితో ఒంగోలు టీడీపీ నేతలు ఇప్పటికీ దూరం పాటిస్తున్నారు. అక్కడి ఎమ్మెల్యే, టీడీపీ నేత దామచర్ల జనార్దన్, బాలినేని రాజకీయంగా ప్రత్యర్థులు. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. దీంతో ఇప్పటికీ బాలనేనిని కలుపుకుని వెళ్లలేకపోతున్నారు. అదేవిధంగా తాజాగా బీజేపీలో చేరిన విశాఖ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ విషయంలోనూ టీడీపీ నేతలు తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు. ఆనంద్ కుమార్ వైసీపీలో ఉండగా, అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని అటువంటివారిని ఏలా చేర్చుకుంటారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిలదీస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ పెద్దలకు తమ నిరసన తెలపాలని సీఎం చంద్రబాబును కోరారు అయ్యన్న. అదేవిధంగా పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్యతో సిట్టింగ్ ఎమ్మెల్యే ధూళిపాల్ల నరేంద్రకుమార్ చాలా గ్యాప్ మెంటైన్ చేస్తున్నారు. తన కుటుంబ సభ్యుల పట్ల సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగుల వెనుక రోశయ్య ఉన్నారనేది ఎమ్మెల్యే ధూళిపాల్ల ఆరోపణ. దీనిపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో ఇక్కడ ఇరువురు నేతలు కలవడం లేదు.ఇక తాజాగా జనసేనలో చేరిన గంజి చిరంజీవి ముందు టీడీపీలో ఉండేవారు. ఎన్నికల ముందు యువనేత లోకేశ్ పై పోటీ కోసమని ఆయనను వైసీపీ చేర్చుకుంది. టికెట్ ఇవ్వకపోయినా, ఎన్నికల సమయంలో వైసీపీలో కొనసాగిన చిరంజీవి ఇప్పుడు అక్కడ లైఫ్ లేదని జనసేనలో చేరారు.అదేవిధంగా ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ సైతం టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఇప్పుడు అధికారం పోవడంతో మళ్లీ కూటమి పార్టీలో చేరారు. వీరు అధికారం కోసం కూటమిలో చేరుతున్నారని,ఎన్నికల్లో వీరికి వ్యతిరేకంగా పనిచేసిన వారికి ఏం సమాధానం చెప్పాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే జనసేన, బీజేపీ మాత్రం తమ పార్టీలను బలోపేతం చేయడానికి చేరికలు ప్రోత్సహించక తప్పడం లేదని చెబుతున్నారు. దీంతో పరిస్థితి ఇలానే కొనసాగితే కూటమి గోడకు బీటలు వచ్చే పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.

