తెలంగాణ రాజకీయాలలో ట్విస్టులపై ట్విస్టులు ..ఫామ్ హౌస్ కేసును బయటకు తీస్తున్న రేవంత్.. నాగపూర్ రోడ్ షోలో సీఎం రేవంత్- నాందేడ్ లో షబ్బీర్ అలీ ప్రచారం.. ఉర్స్ షరీఫ్ కు ముఖ్య అతిథిగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి.. హైదరాబాదులో నటి కస్తూరి అరెస్టు.

తెలంగాణ రాజకీయాలలో ట్విస్టుల పై ట్విస్టులు..
హైదరాబాద్:
తెలంగాణ రాజకీయాలు ఢిల్లీ మీదుగా మళ్లీ హైదరాబాద్ చేరుకున్నాయి. రేవంత్, పొంగులేటిని జైలుకు పంపిస్తా అని కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి ఓ టెండర్ల అంశంపై కేంద్ర మంత్రి ఫిర్యాదు చేశారు. టెండర్లలో అవినీతి గురించి చెప్పాలంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అనేకానేక టెండర్ల గురించి.. కథలు కథలుగా కాంగ్రెస్ నేతలు చెబుతారు. ఇంత మాత్రానికే రేవంత్, పొంగులేటిని జైలుకు పంపుతారా అన్నది సందేహం. అసలు విషయం మాత్రం కేటీఆర్ జైలుకు వెళ్లకుండా బీజేపీ నేతలతో మాట్లాడుకుని వచ్చారని కాంగ్రెస్ నేతలంటున్నారు.
తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్‌దే అయినా ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్ని అరెస్టు చేయాలంటే బీజేపీ అనుమతి తప్పని సరి. గత ప్రభుత్వంలో అవినీతి అంటూ కేసులు పెట్లాలంటే గవర్నర్ అనుమతి ఉండాలి. కేటీఆర్ ప్రభుత్వానికి సంబంధం లేని తప్పులు చేసి ఉంటే అవినీతి చేసి ఉంటే.. కేసులు పెట్టి అరెస్టు చేయడానికి గవర్నర్ పర్మిషన్ అక్కర్లేదు.కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపైనా చర్యలు తీసుకునేందుకు గవర్నర్ అనుమతి కోసం కాంగ్రెస్ ఎదురు చూస్తోంది.
ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో రూ. 55 కోట్లు లెక్కాపత్రం లేకుండా పంపేశారు. అంటే.. ఆ నగదు దొంగతనానికి గురయిందని అనుకోవచ్చు. ఏసీబీ అధికారుల దర్యాప్తులో ఇది కేటీఆర్ నోటి మాట ద్వారా ఇచ్చారని తేల్చారు. అందుకే ఆయనను ప్రశ్నించేందుకు అవకాశం కావాలని దరఖాస్తు చేశారు. గవర్నర్ అనుమతి ఇస్తే అరెస్టు కూడా చేసుకోవచ్చు. ఇంకా అక్కడ్నుంచి అనుమతి రాలేదు. రాకపోతే బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ల అగ్రెసివ్ గా ఎదురుదాడి చేస్తుంది. వస్తే కేటీఆర్ ను వెంటనే జైల్లో వేస్తారు. అంతటితో అది ఆగదు. ప్రస్తుతం బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయాలతో వారిని అలా వదిలేయకూడదని రేవంత్ అనుకుంటారు. అందుకే వచ్చే వారంలో తెలంగాణ రాజకీయాలు కీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది.
????ఫామ్ హౌస్ కేసును బయటకు తీస్తున్న రేవంత్ !????????
హైదరాబాద్..
ఫోన్ ట్యాపింగ్ అంశంలో బీజేపీ నేతల్ని కేసీఆర్ ఇరికించిన ఫామ్ హౌస్‌ కేసును రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా బయటకు తీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ నలుగురు మాజీ ఎమ్మెల్యేలతో పాటు మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇందులో చిరుమర్తి లింగయ్య తనకు అనారోగ్యమని చెప్పి డుమ్మాకొట్టారు. కానీ ఇవాళ కాకపోతే రేపు ఆయన హాజరు కావాల్సి ఉంటుంది. మిగిలిన వారినీ ప్రశ్నించనున్నారు. వారు ఫామ్ హౌస్ కేసులో ఫీల్డ్ లో ఉన్న నలుగురు మాజీ ఎమ్మెల్యేలే.
ఫామ్ హౌస్ కేసు సీబీఐకి వెళ్లింది. ఆ కేసు విచారణ మాత్రం సీబీఐ చేయడం లేదు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. సీబీఐ విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. కానీ విచారణ వద్దన్నట్లుగా ఆదేశాలిచ్చింది. దాంతో సీబీఐ సైలెంట్ అయిపోయింది. అది కేవలం ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు. ట్యాపింగ్ వరకూ రాలేదు. ఇప్పుడు రేవంత్ ట్యాపింగ్ కోణంలో ఆ కేసును వెలుగులోకి తెస్తున్నారు. ఆ కేసు మొదట ట్యాపింగ్‌తో ప్రారంభమయిందని బీఆర్ఎస్ లో గుసగుసలు ఉన్నాయి.
ట్యాపింగ్ చేసి దొరికిపోయిన పోలీసులు కూడా అదే స్టేట్ మెంట్ ఇచ్చారు. ట్యాపింగ్ చేస్తున్న సమయంలో బీజేపీతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేల గురించి తెలిసిందని వారిని ట్రాప్ చేసి.. బీజేపీ పెద్దల్ని ఇరికించేందుకు కేసీఆర్ కుట్ర ఉన్నారని అంటున్నారు. కేసీఆర్ అధికారికంగా చాలా కీలకమైన డాక్యుమెంట్లు రిలీజ్ చేశారు. అవి ట్యాపింగ్ చేసి సేకరించినవేనని అంటున్నారు. ఈ క్రమంలో ఈ నలుగురు ఎమ్మెల్యేల విచారణ తర్వాత వేరే కోణంలో ఫామ్ హౌస్ కేసు వెలుగులోకి రానుంది.
దీన్ని ఇప్పుడు బయటకు తీసుకు రావడం వెనుక రేవంత్ వ్యూహాత్మక ప్రయత్నాలు ఉన్నాయని అంటున్నారు. కేసీఆర్, కేటీఆర్ లపై చర్యలు తీసుకోకుండా బీజేపీ అడ్డుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదు. ఈ క్రమంలో కేసీఆర్, కేటీఆర్ ఎంత ప్రమాదకర వ్యక్తులో గుర్తు చేయాలని అనుకుంటున్నారని బీఎల్ సంతోష్ ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక విమానంలో పోలీసుల్ని పంపారనే సంగతిని మర్చిపోవద్దని రేవంత్ గుర్తు చేయబోతున్నారని అనుకోవచ్చు.
???? నాగ్ పూర్ రోడ్ షో లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ..
????ఈరోజు నాందేడ్ నార్త్ నియోజకవర్గం పీర్ బుర్హన్ నగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
నాందేడ్ నార్త్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ సత్తార్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని షబ్బీర్ అలీ ప్రజలను కోరటం జరిగింది.
???? ఉర్స్ షరీఫ్ కు ముఖ్య అతిథిగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డికి ఆహ్వాన పత్రిక ||*
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 128 డివిజన్ HMT కాలనీ వాసులు ఉర్స్ షరీఫ్ కు ముఖ్య అతిథిగా పాల్గొనాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు. కార్యక్రమంలో 127 మాజీ వర్డ్ మెంబర్ భాస్కర్ రెడ్డి,ఖదీర్,బాబుమియ తదితరులు పాల్గొన్నారు.. స్టేట్ ఇంచార్జ్ హైదర్ అలీ
????నటి కస్తూరి అరెస్ట్‌.. హైదరాబాద్ లోని
గచ్చిబౌలిలో అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు.
తెలుగు మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కస్తూరి.
కస్తూరిని చెన్నైకి తరలిస్తున్న పోలీసులు.

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!