కేసీఆర్ మహబూబ్ నగర్ కు ఏం చేశారు?.. సీఎం రేవంత్ రెడ్డి….దొంగ నోట్లు చలామణి ముఠాను అరెస్టు చేసిన తిరుపతి పోలీసులు….విజయవాడ లో నిర్వహిస్తున్న భిన్నత్వంలో ఏకత్వం కార్యక్రమానికి విచ్చేయనున్న శ్రీ శ్రీ రవి శంకర్ జి..

????కేసీఆర్ మహబూబ్ నగర్ కు ఏం చేశారు???..
సీఎం రేవంత్ రెడ్డి..
* గత పదేళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్ మహబూబ్ నగర్ కు ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
* ఆదివారం కురుమూర్తి స్వామిని దర్శించుకున్న రేవంత్ మీడియాతో మాట్లాడారు.
* త్వరలోనే మక్తల్ నారాయణ్ పేట్ కొండగల్ ప్రాజెక్టులు ప్రారంభిస్తాం.నాపై కోపముంటే రాజకీయంగా కాకుండా వేరే విధంగా చూపండి.* నా జిల్లాను అభివృద్ధి చేసుకోవనివ్వండి.ఇన్నాళ్లూ మీ నియోజక వర్గాలకు నిధులు తీసుకెళ్తే మేము పడి ఏడ్వలేదు.* ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది.మమ్మల్ని అభివృద్ధి చేసుకోనివ్వండని అన్నారు..

????నారాయణ్‌పేట్ – కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేసి త్వరలోనే మక్తల్, నాగర్‌కర్నూల్, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలను పారిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. “తెలంగాణ వచ్చి పదేళ్లవుతున్నా పాలమూరు నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ జిల్లా బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించదు” అని అన్నారు.
*శ్రీ కురుమూర్తి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు.ఆలయంలో లక్ష్మీదేవి,భూదేవి అమ్మవార్లను దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు.
*అంతకు ముందు శ్రీ కురుమూర్తి స్వామి ఆలయానికి రూ. 110 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఘాట్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
*ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించారు. దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు అంచనాలు రూపొందించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.ఇంకా ఏమన్నారంటే…*పాలమూరు జిల్లా వలసలకు మారుపేరు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ప్రజా ప్రభుత్వ భగీరథ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చూడొద్దు.
*వలసల నిరోధించడానికి జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేసి పాడి పంటలతో విలసిల్లేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి.
*ఈ జిల్లా బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించదన్నారు
*అడ్డుకోవాలని చూసే వారిని పాలమూరు జిల్లా ప్రజలు క్షమించరు. అలాంటివారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు.
*జిల్లాలో అమర్‌రాజా బ్యాటరీస్ కంపెనీలో 2 వేల మంది స్థానిక నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీ అంగీకరించిందనీ,ఈ ప్రాంతంలో ఏ కంపెనీలు వచ్చినా ఈ ప్రాంత నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.
*జిల్లాలో గ్రామ గ్రామానికి, తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత మాది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకుందాం అన్నారు..
*ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు…
???? దొంగ నోట్లు చలామణి ముఠాను అరెస్టు చేసిన పోలీసులు..!తిరుపతి జిల్లా, నగరి నియోజకవర్గంలోని, పుత్తూరులో శనివారం రాత్రి పలు దుకాణాల లో వస్తువులను కొంటూ దొంగ నోట్లును చలామణి చేస్తున్న అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
తిరుపతి చెర్లోపల్లి సర్కిల్‌ వద్ద నివాసం ఉంటున్న రమేష్‌, అతని భార్య సంధ్య, కూమార్తె ఇషా, వారి స్నేహితుడు మునికృష్టారావు ఇంటిలో పోలీసులు సోదాలు చేయగా వారి వద్ద దొంగనోట్లు ముద్రణకు కావాల్సిన వస్తువులను, ప్రింటర్స్‌, ప్రింట్‌ చేసి కట్‌ చేయడానికి సిద్దంగా ఉన్న 100, 500 నోట్లును స్వాధీనం చేసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా కు చెందిన మునికృష్టారావు, రమేష్‌తో పేస్‌ బుక్‌ యాప్‌ ద్వారా పరిచేయం చేసుకుని, తిరుపతిలోని రమేష్‌ ఇంటిలో షేర్‌ మార్కటింగ్‌ బిజినెస్‌ చేసేవారు అయితే భారీ నష్టాలు రావడంతో, యూ ట్యూబ్‌ లో దొంగనోట్లు ముద్రణ చూసి దాని ప్రకారం ఇంటిలోని కుటుంబసభ్యులంతా ముద్రణకు కావాల్సిన వస్తువులను తిరుపతిలో కొని, ఇంటిలో ముద్రించి, వాటిని చుట్టుప్రక్కల ఉన్న తిరుపతి, శ్రీకాళహస్తి, రేణిగుంట, పుత్తూరు వంటి ప్రాంతాలలో వస్తువులను కొంటున్నట్లు మార్పిడి చేసేవారని పుత్తూరు డీఎస్పీ రవికుమార్‌ తెలిపారు.
దొంగనోట్లు ముద్రణకు పాల్పడిన నలుగురిన అరెస్టు చేసి, వారు ఉపయోగించినా వస్తువులను, ఒక కారు స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు…
????ఈనెల 13వ తేదీన విజయవాడ లో నిర్వహిస్తున్న భిన్నత్వంలో ఏకత్వం కార్యక్రమానికి విచ్చేయనున్న శ్రీ శ్రీ రవి శంకర్ జి..
ఈనెల13వ తేదీన విజయవాడ మహా నగరం నందు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న *భిన్నత్వంలో ఏకత్వం* కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గౌరవనీయులు శ్రీ శ్రీ రవిశంకర్ జీ* విచ్చేస్తున్నారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏపీ స్టేట్ అపెక్స సభ్యులు సీత పెద్దింటి, కూన ఫాల్గుణ రావు, పోతురాజు రవికిరణ్ తెలియచేశారు.
గత 10 సంవత్సరాలుగా మతసామరస్యం కోసం పాటుపడు తున్న మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ గురూజి ని ఆహ్వానించటం జరిగింది,ఆయన ఆహ్వానాన్ని మన్నించి గురూజీ ఈ కార్యక్రమానికి విచేయటం జరుగుతుందన్నారు.భిన్నత్వం లో ఏకత్వం పోస్టర్లను విడుదల చేసారు.
ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ మాట్లాడుతూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవింకర్ మా రాష్ట్రానికి విచ్చేయటం రాష్ట్ర ప్రజలకు గౌరవప్రదం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు,న్యాయ & మైనారిటీ వ్యవహార శాఖ మాత్యులు పెద్దలు NMD ఫరూక్, పోలిట్ బ్యూరో సభ్యులు టిడిి జనార్ధన్ పాల్గొంటారన్నారు.
ఈ కార్యక్రమంలో జీ అనూప్, కౌన్సిల్ సభ్యులు కానన్ త్రివేది మాజీ ఐఏఎస్ అధికారిణి , మరో సభ్యులు సురేష్ కోరే, డాక్టర్ వినోద్ , డాక్టర్ కే హరిక, సీ హెచ్ మోహన్ వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు… స్టేట్ కోఆర్డినేటర్ రజాక్ భాష..

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!