3ఎఫ్‌ ఆయిల్‌పామ్‌ ప్రైవేట్‌ లిమిడెట్‌ కంపెనీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం..వైసీపీని వీడనున్న ఇద్దరు మహిళా నాయకురాళ్ళు!..కేటీఆర్ బ్లడ్ శాంపిల్ కూడా టెస్ట్ చెయ్యాలని డిమాండ్..మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీకి ఆప్‌ దూరం..తెలంగాణలో 10 మంది బెటాలియన్‌ కానిస్టేబుల్స్‌ డిస్మిస్.. పలు వివాహ కార్యక్రమాలలో మాజీ ఎమ్మెల్యే అన్నా.. కంభంలో బాణాసంచా స్వాధీనం

????వరద బాధితుల సహాయార్థం 3ఎఫ్‌ ఆయిల్‌పామ్‌ ప్రైవేట్‌ లిమిడెట్‌ కంపెనీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళంగా ఇచ్చింది. ఆదివారం సీఎం చంద్రబాబును కలిసిన కంపెనీ ఎండీ సంజయ్‌ గోయంకా, డైరెక్టర్‌ ఆశీష్‌ గోయెంకా విరాళం చెక్కు అందజేశారు. వరద బాధితులను ఆదుకొనేందుకు ఉదారంగా రూ.కోటి విరాళం అందించిన ప్రముఖ ఆయిల్‌పామ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీ 3ఎఫ్‌కు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. రూ.300 కోట్ల పెట్టుబడితో తూర్పుగోదావరి జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్‌ ఫెసిలిటీతో ఆంధ్రప్రదేశ్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించాలని ఈ కంపెనీ యోచిస్తోందని సీఎం పేర్కొన్నారు.
????తెలంగాణలో 10 మంది బెటాలియన్‌ కానిస్టేబుల్స్‌ డిస్మిస్.. ఆందోళన చేస్తున్నవారిపై పోలీసుశాఖ చర్యలు..
క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడ్డారని తొలగిస్తూ ఆదేశాలు..
బెటాలియన్స్‌లో అశాంతికి 10 మంది కానిస్టేబుల్స్‌ కారణమని ఆరోపణ..ఇటీవలే 39 మందిని సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు..
????కొండాపూర్ 8వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల క్యాండిల్ ర్యాలీ..
రాష్ట్ర వ్యాప్తంగా సస్పెండ్ చేసిన కానిస్టేబుల్‌లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కానిస్టేబుల్ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ తీసిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు, వారి పిల్లలు…
???? జన్వాడ ఫాంహౌ్‌సలో పార్టీ వ్యవహారంపై స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు దాడి చేస్తే.. అందులో తాగి దొరికిన దొంగలు తమ తప్పును సమర్థించుకునేందుకు ప్రభుత్వాన్ని బద్నామ్‌ చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో పోలీసులను దాడికి పంపలేదని, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఎవరూ పోలీసులను ప్రతి ఫాంహౌ్‌సలో ఏం జరుగుతుదో చూడమని చెప్పలేదన్నారు. అర్థరాత్రి వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడి జరిగిందన్నారు. ‘మీరు నిర్దోషులైతే చట్టం ద్వారా నిరూపించుకోవాల’ని కేటీఆర్‌ను ఉద్దేశించి సూచించారు.
???? మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీకి ఆప్‌ దూరం.. మిత్రపక్షాల కోసం కేజ్రీవాల్ ప్రచారం..!!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) నిర్ణయించింది. అయితే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ-ఎస్పీ, కాంగ్రెస్‌తో కూడిన మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమికి ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు.
ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఈ విషయాన్ని శనివారం తెలిపారు. ‘పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంవీఏ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ మహారాష్ట్రలో పోటీ చేయదు’ అని ట్వీట్‌ చేశారు.
కాగా, మహారాష్ట్రలో అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం కోసం శివసేన (యూబీటీ), ఎన్సీపీ-ఎస్పీ తమ పార్టీని సంప్రదించినట్లు ఆప్‌ వర్గాలు తెలిపాయి. అలాగే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) తరపున కూడా అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేస్తారని చెప్పారు.
మరోవైపు మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరుగనున్నది. జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 23న రెండు రాష్ట్రాల్లో ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
???? గుంటూరు జిల్లాలో ఎక్కడైనా బాణసంచా సామాగ్రి అక్రమ విక్రయాలు, అక్రమ నిల్వలు సంబంధించిన సమాచారం ఉంటే జిల్లా పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 8688831568 గాని 100, కు సమాచారం తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపిఎస్ తెలిపారు.
????వివాహ మహోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా*
*కొనకన మిట్ల మండలం గొట్లగట్టు గ్రామంలో ఆదివారం నాగం లక్ష్మయ్య,చెన్నా లక్ష్మమ్మ ల కుమారుడి వివాహ మహోత్సవానికి హాజరు అయి నూతన వధూవరులు అయిన గురుకృష్ణ,వెంకటరజని లను ఆశీర్వదించినారు.

????ఒంగోలు టౌన్ బృందావనం కల్యాణ మండపం నందు ఆళ్ల రవీంద్రరెడ్డి, నాగలక్ష్మిల కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరు అయి నూతన వధూవరులు అయిన రమ్యశ్రీ,అచ్యుత్ రెడ్డిలను ఆశీర్వదించినారు *
????అన్నపురెడ్డి కాశిరెడ్డికి నివాళులు అర్పించిన మాజి ఎమ్మెల్యే అన్నా*
తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామం నందు అనారోగ్యంతో బాధపడుతు అన్నపురెడ్డి కాశిరెడ్డి మరణించగా విషయం తెలుసుకున్న ఆయన కాశిరెడ్డి పార్ధీవదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు*జిల్లా ఇంచార్జ్ ఎస్ రెహమాన్..
????డ్రగ్ పార్టీ ముఠా నాయకుడు కేటీఆర్.. ప్రతిపక్షాల ఆరోపణలు..▪️జన్వాడ లో ఉన్న కేటీఆర్ బావమరిది ఫార్మ్ హౌస్ లో దొరికిన ఇండియన్ బాటిల్స్ మరియు ఫారం బాటిల్స్.▪️రేవ్ పార్టీలో 14 మంది మహిళలు మరియు 21 మంది పురుషులు పాల్గొన్నారు.▪️తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి రేవ్ పార్టీలను ప్రోత్సహించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ.
▪️నిన్న జరిగిన రేవు పార్టీలో కేటీఆర్ ఉన్నాడో లేడో మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి.
▪️కేటీఆర్ బ్లడ్ శాంపిల్ కూడా టెస్ట్ చెయ్యాలి.
▪️ప్రభుత్వం మీద విమర్శించే కేటీఆర్ ఇప్పుడు మీ బామ్మర్ది ఫామ్ హౌస్ రేవ్ పార్టీ మీద ఎందుకు స్పందించడం లేదని ప్రతిపక్ష నాయకులు బహిరంగంగా విమర్శిస్తున్నారు.
????కంభంలో పట్టుబడ్డ బాణాసంచా సీజ్*. కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్లో అమరావతి – అనంతపురం జాతీయ రహదారిలోని ఒక రూములో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ దీపావళి బాణాసంచాను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.ఆ బాణాసంచా విలువ సుమారు రూ.3,75,000 ఉంటుందని ఎస్సై బి నరసింహ రావు తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసంచారం మధ్యలో ఇలా అక్రమంగా బాణాసంచా నిలువ ఉంచడం నేరమన్నారు.
????జ‌గ‌న్‌ను టెన్ష‌న్ పెడుతోన్న వైసీపీలో ఆ ఇద్ద‌రు మేడమ్స్‌…! గతంలో ర‌జ‌నీ ప్రెస్‌మీట్ల‌తో పాటు మీడియాలో చేసే హ‌డావిడి ఒక రేంజ్‌లో ఉండేది.. ఇప్పుడు ర‌జ‌నీ ఫుల్ సైలెంట్ అయిపోయారు. వైసీపీ అధినేత‌.. మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ఇప్పుడు వైసీపీలో ఇద్ద‌రు మేడమ్స్ బాగా టెన్ష‌న్ పెట్టేస్తున్నార‌ట‌. జ‌గ‌న్ రాజ‌ధాని ప్రాంతంలో కీల‌క న‌గ‌రం అయిన గుంటూరులో ఎప్పుడు పర్యటించినా పక్కన మాజీ మంత్రి విడదల రజనీ ఉంటున్నారు. అయితే పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట‌ల తూటాలు పేల్చే ర‌జ‌నీ ఇప్పుడు ఒక్క మాట మాట్లాడటం లేదు. గతంలో ర‌జ‌నీ ప్రెస్‌మీట్ల‌తో పాటు మీడియాలో చేసే హ‌డావిడి ఒక రేంజ్‌లో ఉండేది.. ఇప్పుడు ర‌జ‌నీ ఫుల్ సైలెంట్ అయిపోయారు. ఇక ఇప్పుడు వైసీపీలో బాగా హైలెట్ అవుతోన్న శ్యామ‌ల జోరు ముందు ర‌జ‌నీ పూర్తిగా బేజారు అవుతున్నార‌ని పార్టీలోనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సీసీ ఫుటేజ్ లో సంచలన దృశ్యాలు! ఇక గుంటూరుకే చెందిన మ‌రో కీల‌క మ‌హిళానేత‌.. మాజీ హోం మంత్రి మేకతోటి సుచ‌రిత సైతం సైలెంట్ అయిపోయారు. అస‌లు ఆమెను ఎన్నిక‌ల‌కు ముందే జ‌గ‌న్ నానా ఇబ్బందులు పెట్టారు. ఆమె ప్ర‌త్తిపాడు సీటు కోరుకుంటే అది కాకుండా రాజ‌ధాని ప్రాంతం అయిన తాడికొండ సీటు ఇచ్చారు. అక్క‌డ పోటీ చేయ‌డం ఆమెకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇక ఇప్పుడు ఈ ఇద్ద‌రు మేడ‌మ్స్ జ‌గ‌న్‌ను బాగా టెన్ష‌న్ పెట్టేస్తున్నార‌ట‌. విడ‌ద‌ల ర‌జ‌నీ అయితే జ‌న‌సేన‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ట‌. ఆమె భ‌ర్త‌ది కాపు సామాజిక వ‌ర్గం.. ర‌జ‌నీ భ‌ర్త కుమార‌స్వామి ఎప్ప‌టి నుంచో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ట‌చ్‌లో ఉన్నారంటున్నారు. ఆయ‌న లాబీయింగ్‌తోనే ర‌జ‌నీ జ‌న‌సేన ఎంట్రీకి లైన్ క్లీయ‌ర్ అయ్యిందంటున్నారు. ఇక మేక‌తోటి సుచ‌రిత కూడా జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల్లో క‌న‌ప‌డ‌డం లేదు. సుచ‌రిత అయితే జ‌గ‌న్‌కు దూరం జ‌ర‌గ‌డం.. వైసీపీకి బైబై చెప్ప‌డం ఫిక్స్ అని.. అయితే ఆమె ఏ పార్టీలో చేర‌తారు ? అన్న‌ది అంతు ప‌ట్ట‌డం లేదంటున్నారు. ఇక ఈ ఇద్ద‌రు కీల‌క మ‌హిళా నేత‌లు పార్టీ మారిపోతే గుంటూరు వైసీపీలో జ‌గ‌న్‌కు మిగిలేది ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్ లాంటి వాళ్లు మిన‌హా ఎవ్వ‌రూ ఉండ‌ర‌న్న గుస‌గుస‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరి కూడా గుడ్ బై చెప్పారు. ఇక పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు వెంక‌ట రోశ‌య్య కూడా జ‌న‌సేన‌లో చేరిపోయారు. ఓవ‌రాల్‌గా చూస్తే గుంటూరు వైసీపీలో జ‌గ‌న్ మిగిలేది బ‌ల‌హీన నాయ‌కులే అన్న‌ట్టుగా క‌నిపిస్తున్నారు.

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా