అర్చకుల గౌరవ వేతనం పెంచిన సీఎం చంద్రబాబు.. మూసీ ని అడ్డం పెట్టుకొని ఎన్నాళ్లు బ్రతుకుతారు.. నిప్పులు చెరిగిన సీఎం రేవంత్..”అక్కినేని అమలపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆగ్రహం..బిజెపి ఆర్ఎస్ఎస్ బాటలో పవన్ ?.”జగన్ పై ఉన్న కేసులను ఓసారి గుర్తుచేసుకోవాలి:..పవన్ పై భూమన వ్యంగ్యాస్త్రాలు..ఎన్‌ఆర్‌ఐ కోటా విస్తరణ విద్యావ్యవస్థపై మోసం:

???? అర్చకులకు ధూప దీప నైవేద్య పథకం కింద ఇచ్చే గౌరవ వేతనం 5000 నుండి 10000 కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం..
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలుపుకుంటూ అర్చకులకు ధూప దీప నైవేద్య పథకాన్ని 5 వేల నుండి పదివేలకు పెంచుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల వలన ఎందరో మధ్యతరగతి మరియు చిన్న చిన్న దేవాలయాలలో చేసే అర్చకులకు ఎంతో చేయూతను అందించినట్లుగా అవుతుంది ఈ సందర్భంగా అర్చకుల పక్షపాతిగా ఈ కూటమి ప్రభుత్వం ఉండటం ఎంతో ముదావహం ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి మరియు ,స్థానిక శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ కు బాపట్ల జిల్లా అర్చక సేవా సంఘం,తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
???? చెన్నై: ఆస్పత్రి నుంచి నటుడు రజినీకాంత్ డిశ్చార్జ్
అపోలో ఆస్పత్రిలో చికిత్స అందించిన వైద్యులు
వారంపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన
???? కొత్త పీఠాధిపతి పవనానంద స్వామి తిరుపతి వేంచేశారు: భూమన వ్యంగ్యం..
తిరుపతిలో పవన్ వారాహి డిక్లరేషన్ సభ..
జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు..
పవన్ స్పీచ్ కల్లు తాగిన కోతిలా ఉందన్న భూమన..
లడ్డూలో కల్తీ జరిగిందని వెంకన్న పాదాల సాక్షిగా ప్రమాణం చేయాలని సవాల్..!!!
ఇవాళ తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. కొత్త పీఠాధిపతి పవనానంద స్వామి తిరుపతి వేంచేశారు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇవాళ తిరుపతిలో పవన్ ప్రసంగం వినగానే తనకు ‘కెవ్వు కేక’ పాట గుర్తొచ్చిందని తెలిపారు.
పవనానంద స్వామి ప్రసంగం కల్లుతాగిన కోతిలా ఉందని, ఆయన ప్రసంగం పీఠాధిపతులు కూడా హడలిపోయేలా ఉందని ఎద్దేవా చేశారు. తన సభలో స్వామి పవనానంద న్యాయస్థానాలను సైతం హెచ్చరించారని భూమన తెలిపారు.
ఇప్పటివరకు సనాతన ధర్మాన్ని ఎవరూ పట్టించుకోలేదట… అసలు, పవన్ స్వామికి సనాతన ధర్మంలో ఓనమాలు అయినా తెలుసా? అని ప్రశ్నించారు. అయోధ్యకు పంపిన లడ్డూలు సైతం కల్తీవని పవన్ స్వామి చెబుతున్నారు… ఇప్పుడు చాలెంజ్ చేస్తున్నా… తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగితే మేం ఎలాంటి శిక్షకైనా సిద్ధం అని భూమన స్పష్టం చేశారు. లడ్డూలో కల్తీ జరిగిందని మీరు వెంకన్న పాదాల వద్ద ప్రమాణం చేయగలరా? అని సవాల్ విసిరారు.
పవనానంద స్వామి మనసంతా విషభావాలతో నిండిపోయిందని, చెప్పిన అసత్యాన్నే మళ్లీ మళ్లీ చెబుతున్నారని విమర్శించారు. బాప్టిజం తీసుకోవడం, గొడ్డు మాంసం తినడం సనాతన ధర్మమా? అని ప్రశ్నించారు.
సనాతన ధర్మాన్ని పాటించే వారైతే… తమ పిల్లలు పుట్టిన తొమ్మిది నెలలకే తిరుమల తీసుకువచ్చి తల నీలాలు తీయిస్తారని, కానీ పవన్ 14 ఏళ్ల తర్వాత తన కుమార్తెలను తిరుమల తీసుకువచ్చాడని విమర్శించారు. మరి పవన్ ఏ విధంగా సనాతన ధర్మ పరిరక్షకుడయ్యాడు అని మండిపడ్డారు.”మా నరనరాన సనాతన ధర్మం జీర్ణించుకుపోయి ఉంది. జగన్ హయాంలోనే అలిపిరిలో నిత్య హోమం ఏర్పాటు చేశాం. విద్యార్థులందరికీ భగవద్గీతను అందించాలనే నిర్ణయం చేసింది మేమే. గోవింద కోటి రాసిన వారికి బ్రేక్ దర్శనం కల్పించింది మేమే. 3,500 ఆలయాలు జగన్ హయాంలోనే నిర్మితమయ్యాయన్న విషయం గుర్తించాలి. శ్రీవాణి ట్రస్టులో అక్రమాలు జరిగాయంటున్నారు… ఒక్కరూపాయి దారి మళ్లినా సరే నేను శిక్షకు సిద్ధమే. నోటికొచ్చినట్టు మాట్లాడి వెళ్లిపోవడం కాదు… దేవుడిపై ప్రమాణం చేసి చెప్పాలి. అధికారం కోసం పవన్ సనాతన ధర్మం ముసుగు వేసుకున్నాడు” అంటూ భూమన ధ్వజమెత్తారు.
????జగన్ పై ఉన్న కేసులను జాతీయ మీడియా ఓసారి గుర్తుచేసుకోవాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్*..
తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభ..
జగన్ ఇవాళ అమాయకుడిలా నటిస్తున్నాడన్న పవన్..
జడ్జిలపైనా, కోర్టులపైనా వ్యాఖ్యలు చేయించిన వ్యక్తి అంటూ ఆరోపణలు..
తిరుపతిలో నిర్వహించిన వారాహి డిక్లరేషన్ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైసీపీ అధినేత జగన్ పై ధ్వజమెత్తారు. జగన్ ఇవాళ అమాయకుడిలా నటిస్తున్నాడని, కానీ గత ఐదేళ్లలో అతడు చేసిన పనులు, గతంలో అతడిపై ఉన్న అవినీతి కేసులను జాతీయ మీడియా ఓసారి గుర్తుచేసుకోవాలని సూచించారు.
కోర్టులను అవమానించిన వ్యక్తి, జడ్జిలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయించిన వ్యక్తి, ఎన్నికల అధికారిని దూషించిన వ్యక్తి జగన్ అని పవన్ కల్యాణ్ విమర్శించారు. జగన్ కు వ్యవస్థలంటే గౌరవం లేదని, ఎన్నోసార్లు కోర్టులతో చీవాట్లు తిన్నాడని వివరించారు.
మాజీ సీఎం జగన్ పై ఉన్న కేసులు చాలా తీవ్రమైనవని, చాలాకాలంగా పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. జగన్ పై 32 కేసులు ఉన్నాయి… అతడు జైల్లో 16 నెలలు ఉన్న వ్యక్తి… బెయిల్ పై బయట ఉన్న వ్యక్తి… అలాంటి వ్యక్తిని నమ్ముతామా? అని ప్రశ్నించారు. జగన్ కేసులపై త్వరగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గౌరవ న్యాయస్థానాలను కోరుతున్నానని తెలిపారు.
????ఎన్‌ఆర్‌ఐ కోటా విస్తరణ విద్యావ్యవస్థపై మోసం: ఎస్సీ
పంజాబ్‌లోని మెడికల్ కాలేజీలలో ఎన్‌ఆర్‌ఐ కోటాను విస్తరించడాన్ని సుప్రీంకోర్టు ఖండించింది, ఇది “మోసం” అని అభివర్ణించింది,
ఇది మరింత ప్రతిభావంతులైన విద్యార్థులను అడ్మిషన్ ప్రక్రియ నుండి తప్పించింది.పంజాబ్‌లోని మెడికల్ కాలేజీలలో నాన్ రెసిడెంట్ ఇండియన్ (ఎన్‌ఆర్‌ఐ) కోటాను విస్తరించడాన్ని సుప్రీంకోర్టు మంగళవారం ఖండించింది, ఇది “మోసం” అని పేర్కొంది, ఇది మరింత ప్రతిభావంతులైన విద్యార్థులను అడ్మిషన్ ప్రక్రియ నుండి తప్పించింది.భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ధనంజయ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పంజాబ్, హర్యానా హైకోర్టు ఉత్తర్వులను (ఏఎన్‌ఐ) సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.ఎన్‌ఆర్‌ఐల దూరపు బంధువులతో సహా ఎన్‌ఆర్‌ఐ కోటా ప్రమాణాలను విస్తృతం చేయాలన్న పంజాబ్ ప్రభుత్వ చర్యను రద్దు చేసిన పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లను భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) ధనంజయ వై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ కొట్టివేసింది.
“ఈ ఎన్నారై కోటా వ్యాపారాన్ని మనం ఇప్పుడే ఆపాలి! ఇది పూర్తి మోసం,మా విద్యావ్యవస్థకు మేము చేస్తున్నది ఇదే” అని న్యాయమూర్తులు జెబి పార్దివాలా మరియు మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది, మెరిట్ ఆధారిత అడ్మిషన్లను పక్కదారి పట్టించడానికి ఎన్‌ఆర్‌ఐ కోటాను దోపిడీ చేస్తున్నారని ఉద్ఘాటించారు.
ఎన్‌ఆర్‌ఐ అర్హతకు సంబంధించిన విస్తృత వివరణ, దూరపు బంధువులు కూడా అర్హత పొందేందుకు వీలు కల్పించడం, విద్యావ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే “డబ్బు-స్పిన్నింగ్ వ్యూహం” అని బెంచ్ పేర్కొంది.
“మూడు పిటిషన్లు కొట్టివేయబడ్డాయి. దీని మీద ఒక మూత పెడదాం. ఈ మోసానికి ముగింపు పలకాలి. ఈ NRI వ్యాపారం మోసం తప్ప మరొకటి కాదు. దీనికి ఇప్పుడు ముగింపు వస్తుంది.
వార్డు అంటే ఏమిటి? మీరు కేవలం ‘I am చూస్తున్న X’ అని చెప్పాలి. మూడు రెట్లు ఎక్కువ స్కోర్లు సాధించిన విద్యార్థులు ఓడిపోయారో చూడండి. కఠోరమైన చట్టవిరుద్ధమైన వాటికి మేము మా అధికారాన్ని ఇవ్వలేము” అని ధర్మాసనం పేర్కొంది.
“మేము పేటెంట్ మోసపూరిత వర్గానికి మా అధికారాన్ని ఇవ్వకూడదు,” ఆగస్ట్ 20న పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది, ఇది మామలు, అత్తలు, తాతలు మరియు కజిన్స్ వంటి బంధువులను చేర్చడానికి “NRI అభ్యర్థులను” పునర్నిర్వచించింది. ఈ విస్తరణను పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు సెప్టెంబరు 11న రద్దు చేసింది, ఈ చర్య “అన్యాయమైనది” మరియు NRI కోటా యొక్క అసలు ఉద్దేశ్యానికి విరుద్ధమైనది – ఇది నిజమైన NRIలకు భారతదేశంలో చదువుకోవడానికి అవకాశం కల్పించడం.
విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది షాదన్ ఫరాసత్ వాదిస్తూ, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్‌ఆర్‌ఐ కోటా యొక్క విస్తృత వివరణ ఉపయోగించబడుతోంది. అయితే, సుప్రీంకోర్టు ఈ వాదనలను గట్టిగా తిరస్కరించింది, విస్తృత నిర్వచనం మెరిట్‌ను పలుచన చేసిందని పునరుద్ఘాటించింది మరియు విద్యాపరమైన పనితీరు కంటే ఆర్థిక శక్తి మరియు కనెక్షన్‌ల ఆధారంగా తక్కువ అర్హత ఉన్న అభ్యర్థులు ప్రవేశం పొందేందుకు అనుమతించింది.
హైకోర్టులో నోటిఫికేషన్‌ను సవాలు చేసిన అసలు పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది అభిమన్యు భండారి, ఎన్‌ఆర్‌ఐ కోటాను ప్రజలు ఉపయోగించుకునే మార్గం కాదనే వాస్తవాన్ని పిఎ ఇనామ్‌దార్ తీర్పు (2005)లోని రాజ్యాంగ ధర్మాసనం విస్మరించిందని ఎత్తి చూపారు. ప్రవేశించడానికి డబ్బు శక్తి.భండారీతో ఏకీభవిస్తూ, ఎన్‌ఆర్‌ఐ కోటాలను నిజమైన ఎన్‌ఆర్‌ఐలకు మాత్రమే కేటాయించాలని, మెరిట్‌ను పక్కన పెట్టకూడదని బెంచ్ నొక్కి చెప్పింది.
సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని పంజాబ్ వైద్య విద్యా శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. “పూర్తి తీర్పును అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ప్రకటన చేయవచ్చు” అని కోరుతూ అధికారి తెలిపారు.
కేసు వివరాలు : పృథ్వాన్ష్ మల్హోత్రా వర్సెస్ పంజాబ్ రాష్ట్రం WP(C) నం. 000587 / 2024
???? బిజెపి ఆర్ఎస్ఎస్ బాటలో పవన్ ???.. సూడో సెక్యులరిజం గురించి బీజేపీయే ఎక్కువగా మట్లాడుతుంది. ఇపుడు పవన్ నోట ఆ మాటలు వచ్చాయి. పైగా సనాతన ధర్మానికి విఘాతం కలిగితే చూస్తూ ఊరుకోను అని ఆయన అన్నారు.
ఈ విషయంలో ఎంతకైనా వెళ్ళి తేల్చుకుంటామని చెప్పారు. తాను రాజకీయాలను సైతం పక్కన పెట్టి ముందుకు సాగుతానని కూడా స్పష్టం చేస్తున్నారు. ఏపీలో బీజేపీ ఈ విషయాల్లో బాగా తగ్గిపోతోంది. కానీ జనం బలం నిండుగా ఉన్న పవన్ ఇలాంటి ఇష్యూని టేకప్ చేశారు. చంద్రబాబు శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ ఉందని అనేసి ఊరుకుంటే గత అయిదేళ్ళుగా ఇలాగే వైసీపీ పాలనలో జరిగిందని ఏకంగా అయోధ్యకు పంపించిన లక్ష లడ్డూల విషయంలో కూడా కల్తీవే వెళ్లాయని పవన్ మరింతగా రాజేస్తున్నారు.సనాతన ధర్మం విషయంలో అన్యాయం జరుగుతూంటే మౌనంగా తాము కూర్చోవాలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.తాను ఉప ముఖ్యమంత్రిగా కాదు సనాతన ధర్మం అనుసరించేవాడిగా చెబుతున్నాను అన్నారు. మొత్తానికి చూస్తే పవన్ ధర్మాగ్రహం వెనక ఆయన ఆలోచనలు ఆయనకు ఉన్నాయి. దీనిని తప్పు పట్టాల్సింది లేదు. అయితే కూటమిలో ఉంటూ ప్రభుత్వంలో బాధ్యత తీసుకుని ఈ విధంగా వీర హిందూత్వ వాయిస్ ని వినిపించడం ద్వారా పవన్ కూటమికి ప్లస్ చేస్తున్నారా లేక మైనస్ చేస్తున్నారా అన్నదే చర్చగా ఉంది. మతానికి రాజకీయానికి ముడి పెట్టరాదు అన్నది రాజ్యాంగం చెబుతున్న మాట.ఇటీవల సుప్రీంకోర్టు కూడా అదే అంటోంది. రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్న వారు ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇస్తే అవి ప్రజలలోకి వెళ్తే ఇబ్బందులు వస్తాయని కూడా అంటున్న వారు ఉన్నారు.మరో వైపు చూస్తే టీడీపీ కూటమిలో కీలక మిత్రుడు అయిన పవన్ ని ఏమీ అనలేని పరిస్థితి ఉంటోంది. ఒక విధంగా పవన్ చేస్తున్న ప్రకటనలు అన్నీ బీజేపీకి ఆనందంగానే ఉంటాయి.కానీ టీడీపీయే ఇబ్బందులో పడుతోంది అని అంటున్నారు.చూడాలి మరి లడ్డూ ఇష్యూ కోర్టు తీర్పు తరువాత తగ్గిపోతుందా లేక పవన్ చెప్పినట్లుగా వారాహి డిక్లరేషన్ మీద మరింతగా జోరు చేస్తారా అన్నది. అదే కనుక జరిగితే ఏపీలో
కూటమికి ప్లస్ చేస్తున్నారా లేక మైనస్ చేస్తున్నారా అన్నదే చర్చగా ఉంది. మతానికి రాజకీయానికి ముడి పెట్టరాదు అన్నది రాజ్యాంగం చెబుతున్న మాట. ఇటీవల సుప్రీంకోర్టు కూడా అదే అంటోంది. రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్న వారు ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇస్తే అవి ప్రజలలోకి వెళ్తే ఇబ్బందులు వస్తాయని కూడా అంటున్న వారు ఉన్నారు.. మరో వైపు చూస్తే టీడీపీ కూటమిలో కీలక మిత్రుడు అయిన పవన్ ని ఏమీ అనలేని పరిస్థితి ఉంటోంది. ఒక విధంగా పవన్ చేస్తున్న ప్రకటనలు అన్నీ బీజేపీకి ఆనందంగానే ఉంటాయి. కానీ టీడీపీయే ఇబ్బందులో పడుతోంది అని అంటున్నారు. చూడాలి మరి లడ్డూ ఇష్యూ కోర్టు తీర్పు తరువాత తగ్గిపోతుందా లేక పవన్ చెప్పినట్లుగా వారాహి డిక్లరేషన్ మీద మరింతగా జోరు చేస్తారా అన్నది .అదే కనుక జరిగితే ఏపీలో సరి కొత్త రాజకీయాలనే చూస్తారని అంటున్నారు
????మూసీని అడ్డం పెట్టుకొని ఎన్నాళ్లు బ్రతుకుతారు.. నిప్పులు చెరిగిన సీఎం రేవంత్.
కేటీఆర్ , హరీష్ రావు , సబితా ఇంద్రారెడ్డిల ఫామ్ హౌజ్ లను కూల్చుతారనే పేదల అడ్డుపెట్టుకొని ధర్నాలు, దీక్షలు చేస్తున్నారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కిరాయి మనుషులతో కేటీఆర్ , హరీష్ రావులు హడావిడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. మూసీని అడ్డంపెట్టుకొని ఎంతకాలం బ్రతుకుతారు అని నిలదీశారు. హైడ్రాపై అసెంబ్లీలో చర్చించినప్పుడుమ్ బీఆర్ఎస్ , బీజేపీ నేతలు ఎందుకు సలహాలు, సూచనలు ఇవ్వలేదని ప్రశ్నించారు.
సికింద్రాబాద్ లోని సిఖ్ కాలనీలోని ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మూసీ సుందరీకరణపై వివాదాన్ని సృష్టిస్తోన్న బీఆర్ఎస్ నేతలు.. మూసీ బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కంటే ప్రత్యామ్నాయం ఏముంటుందో చెప్పాలన్నారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం..వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వండని కోరారు. కేటీఆర్ , హరీష్ రావు , సబితా కుమారుల ఫామ్ హౌజ్ ల కూల్చాలా వద్దా అని ప్రశ్నించారు.చిన్ననాటి వర్షానికి మునిగిపోతున్న నగరాన్ని కాపాడుకుందాం..కేటీఆర్ , హరీష్ రావు సచివాలయానికి రండి.. నగర అభివృద్ధి, మూసీ బాధితులను ఆదుకునే విషయంపై చర్చిద్దాం అని ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో చెరువులను ఆక్రమించింది ఎవరో తేల్చుదామన్నారు. ఈ ప్రభుత్వం పేదల కన్నీళ్లను చూడదల్చుకోలేదు. మూసీ నిర్వాసితులను ఖచ్చితంగా ఆదుకుంటామని , ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదని స్పష్టం చేశారు.కేటీఆర్ , హరీష్ రావు మాట్లాడిన మాటలను మరుసటి రోజు ఈటల రాజేందర్ మాట్లాడుతారని రేవంత్ రెడ్డి విమర్శించారు. పార్టీ మారిన ఆయనకు బీఆర్ఎస్ వాసన మాత్రం పోలేదన్నారు. మోడీ సబర్మతి రివర్ అభివృద్ధి చేసుకోవచ్చు..మేము మాత్రం మూసీని అభివృద్ధి చేసుకోవద్దా? ఇదేం లెక్క ఈటల అంటూ ప్రశ్నించారు. పేదలపై ప్రేమను ఒలకబోస్తున్న ఈటల రాజేందర్ నేతృత్వంలోనే నిధుల కోసం మోడీ వద్దకు వెళ్దాం.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ను తీసుకొని రండి.. 25వేల కోట్లు ఇప్పించండన్నారు రేవంత్ రెడ్డి.
???? అక్కినేని అమలపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆగ్రహం
రాహుల్ గాంధీ మానవత్వం గురించి మాట్లాడటం, రాజకీయ నాయకులందరిపై అక్కినేని అమల చెడు వ్యాఖ్యలు చేయడం తీవ్ర అభ్యంతరకరంగా ఉంది.
రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను అక్కినేని అమల ఉపసంహరించుకోవాలి – కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి.
???? యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా యర్రగొండపాలెం నియోజకవర్గం నుండి 50 కార్లతో ఒంగోలు కు ర్యాలీగా బయలుదేరిన వైసీపీ నాయకులు

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా