అమరావతి : తాడేపల్లిలో సీఐడీ సిట్ ఆఫీస్ సీజ్ .స్కిల్డెవలప్మెంట్ కేసులో గతంలో చంద్రబాబును అరెస్టు చేసి ఇక్కడే విచారించిన సీఐడీ పోలీసులు . ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే చంద్రబాబు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ కంపెనీ డాక్యుమెంట్లు దగ్ధం చేసిన సిట్ పోలీసులు .చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించేందుకే తప్పుడు డాక్యుమెంట్లను సిద్ధం చేశారని టీడీపీ నేతల ఆరోపణ .సిట్ ఆఫీస్ సమీపంలో హెరిటేజ్ డాక్యుమెంట్లు దగ్ధం చేయడంపై అప్పట్లో గవర్నర్ నజీర్కు టీడీపీ నేతల ఫిర్యాదు . ప్రభుత్వం మారుతున్న సమయంలో సిట్ ఆఫీస్ను సీజ్ చేయాలని ఆదేశాలు .ఇప్పటికే చీఫ్ సెక్రెటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రెటరీలు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు, సెక్రెటరీలు, విభాగాధిపతి ఆఫీస్లలో డాక్యుమెంట్లను భద్రపరచాలని గవర్నర్ ఆదేశం .గవర్నర్ ఆదేశాల్లో భాగంగానే తాడేపల్లి సీఐడీ సిట్ ఆఫీస్కు తాళాలు..
????పోలీసులపై చంద్రబాబు అసంతృప్తి.గుంటూరులో పోలీసులు చేపట్టిన ట్రాఫిక్ ఆంక్షలపై అసంతృప్తి..చంద్రబాబు అమరావతి నుంచి ఢిల్లీ బయల్దేరే సమయంలో ట్రాఫిక్ నిలుపుదల చేసిన పోలీసులు…తన కోసం ట్రాఫిక్ ఆపి ప్రజలను ఇబ్బందులకు గురిచేయెద్దన్న చంద్రబాబు.
????టీడీపీ దాడులు చేస్తోంది.. రక్షించండి: వైఎస్ జగన్..
ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయని జగన్ ట్వీట్ చేశారు. ‘సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు.అధికార పార్టీ ఒత్తిళ్ల నేపథ్యంలో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది అని ధ్వజమెత్తారు. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి అని ఆరోపించారు.తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. మరోవైపు టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతీ కార్యకర్తకు, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుర్తు చేశారు.గవర్నర్ జోక్యం చేసుకోవాలి…రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది.
???? ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చా??.. ఆంధ్రాలో అదే జరిగిందా..? ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చా.. ఆంధ్రాలో అదే జరిగిందా..? ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల ఫలితాలు ఈ నెల నాలుగవ తేదీన విడుదలయ్యాయి..అయితే ఈ ఫలితాలలో వైసిపి పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఎవరిని అడిగినా కూడా వైసిపి పార్టీకి ఓటు వేశామని చెబుతున్నారు.. ఒకవేళ ఓడిపోయిన కూడా ఒక్కొక్క కాండేట్ 70000 ,80000 ఓట్ల తేడాతో ఓడిపోయారా ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నామంటూ తెలియజేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్ ని మాత్రం ఎవరు నమ్మలేకపోతున్నారు. వైసీపీ నాయకుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు తమకు ఈవీఎంలు మ్యానుఫ్యాలెట్ జరిగిందని అనుమానం ఉందని కూడా తెలియజేశారు.అందుకే ఈ విషయం పైన కోర్టుకు వెళ్తామంటూ కూడా తెలియజేశారు. ఈవీఎం మ్యానుఫ్యాలెట్ 100కు 100% జరిగిందని కూడా తెలిపారు. బార్ కంట్రోల్ ను రిమోట్ కంట్రోల్ తో ఏవైనా మ్యానుఫ్యాలెట్ చేశారేమో అన్నట్లుగా తెలిపారు. అయితే ఈవీఎంలు దాచిపెట్టిన స్ట్రాంగ్ రూములో జరిగే అవకాశాలు లేవని.. రిమోట్ గా జరిగాయని అనుమానం ఉందంటూ తెలిపారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా నరేంద్ర మోడీ నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు అటు నుంచి బొంబాయికి వెళ్లారు.. ఆ తర్వాత ఏ దేశానికి వెళ్లారని విషయం తెలియదు.
కొంతమంది అమెరికా అన్నారు మరి కొంతమంది సింగపూర్ వంటి ప్రాంతాలు అన్నారు.. ఇక పవన్ కళ్యాణ్ కూడా మరి కొంతమంది అమెరికా అన్నారు మరి కొంతమంది రష్యాకు వెళ్లారని విధంగా కామెంట్స్ చేశారు. మరి ఈ గ్యాప్ లోనే రిమోట్ గా ఈవీఎంలను మ్యాని ప్లేట్ చేసి ఉంటారా అనే అనుమానం కూడా వినిపిస్తోంది. అసలు ఇది పాజిబులా.. చేయవచ్చా అనే విషయానికి వస్తే.. ఇలా అన్న ప్రతిసారి కూడా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే..
1). ఓటింగ్ మిషన్ కి ఈవీఎం మ్యానుఫ్యాలెట్ కి గాని, హ్యాకింగ్ గానీ జరిగేటువంటి టెక్నాలజీ కాదు.. చాలా స్ట్రాంగ్ టెక్నాలజీ అంటూ తెలిపారు.
2). ఈవీఎంలకు ఇంటర్నెట్ యాక్సెప్ట్ గాని.. ఏమీ ఉండదు. దీనిని హ్యాక్ చేయడం చాలా కష్టమని తెలిపారు. అయితే దీనిలకు ఇంటర్నెట్ ఉంటేనే రిమోట్ కంట్రోల్ వంటివి చేస్తాయి.. కానీ ఇలాంటి వాటిని చేయలేరని తెలుపుతున్నారు.????అయితే లింక్ డెంట్లో ఒక ఆర్టికల్ రాశారు.. రోహిత్ దాల్మియా అనేటువంటి ఒక వ్యక్తి రాశారు. ఈవీఎంలు మ్యానుఫ్లెట్ చేసే అవకాశం ఉందా లేదా అనే విషయం పైన రాశారు.. అతను రాసిన ఆర్టికల్ ప్రకారం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈవీఎంలను ఎలా తారుమారు చేయవచ్చని విషయాన్ని రాశారు. ఈవీఎంలను వివిధ మార్గాలలో మార్చవచ్చని పరిశోధకులు కనుగొన్నారని తెలిపారు. 2011లో యూఎస్ఏ లో మున్సిపల్ మరియు రాష్ట్ర ప్రైమరీ ఎలక్షన్ జరిగేటప్పుడు కొంతమంది నిపుణులు ఈవీఎంలను రిమోట్లతో కంట్రోల్ చేస్తున్నట్లుగా తెలిపారు. అయితే ఎక్కడో కూర్చుని వారి సిస్టంలో కంట్రోల్ చేస్తున్నారట. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఇంటర్నెట్ లేకుండా కేబుల్ కనెక్షన్ లేకుండా అక్కడ ఎలా సాధ్యమైంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.అయితే అతను తెలిపిన ప్రకారమే.. అయితే ఈవీఎంల యొక్క తయారీ పద్ధతి ప్రకారం ఇవి హ్యాక్ చేసే అవకాశం ఉంటుందట. మనకు బిహెచ్ఎన్ఎల్ సమస్త ఈవీఎంలను తయారు చేస్తోంది. ఈవీఎం యొక్క మదర్ బోర్డు.. మైక్రో ప్రాసెసర్ నీ, ఈ వైర్లను కనెక్ట్ చేయిస్తే అప్పుడు ఈజీగా హ్యాక్ చేయడానికి ఇదొక మార్గం అని తెలిపారు. అలాగే సాఫ్ట్వేర్ విషయంతో కూడా హ్యాక్ చేయవచ్చట.. ముఖ్యంగా అక్కడ ఎన్నికల తేదీ నీ బట్టి కూడా చేయవచ్చట. అంటే ఇక్కడ మీరు ఒక గుర్తు మీద వేసి ఉంటే మరొక గుర్తుకి అక్కడ పడ్డట్టుగా ఉంటుందట. ఈ విధంగా చేయవచ్చు అంటూ తెలిపారు.
????ఏపీ ఎన్నికలలో గ్యాంబ్లింగ్ జరిగిందా???.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం రోజున.. ఎవరు ఊహించని ఫలితాలు ఏపీ ప్రజలు ఇచ్చారు. 151 స్థానాలు గత ఎన్నికల్లో గెలుచుకున్న వైసీపీ పార్టీ…. ఈసారి మాత్రం అత్యంత దారుణంగా ఓడిపోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి కేవలం 11 స్థానాలే వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి కీలక నేతలు మాత్రమే వైసీపీలో గెలిచారు.మరో 9 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పెద్దగా ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది. అయితే తెలుగుదేశం పార్టీకి 135 స్థానాలు రావడం, జనసేన పార్టీ 21 స్థానాలకు 21 కొట్టడం… ఇటు 0.1% ఓట్ శాతం ఉన్న బిజెపి పార్టీ ఏపీలో 8 ఎమ్మెల్యేలను గెలుచుకోవడం పట్ల… వైసిపి నేతలు అలాగే వైసీపీ సానుభూతిపరులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై పలు అనుమానాలను కూడా వ్యక్తపరుస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో పెద్ద గ్యాంబ్లింగ్ జరిగిందని వైసిపి నేతలు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు.????ఈవీఎంలను కూడా మార్చేశారని కొంతమంది యూట్యూబ్ ఛానల్ లో చెబుతున్నారు. అసలు గ్లాస్ గుర్తు అంటే తెలియని ఓటర్లు, ముఖ్యంగా ముసలి వాళ్లు… జనసేనకు ఎలా ఓటు వేశారని వైసీపీ సానుభూతిపరులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేతలకు దిక్కులేని బిజెపి పార్టీకి.. 8 స్థానాలు రావడం ఏంటని నిలదీస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ మోడీతో కుమ్మక్కై… ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉంటారని పలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.ధర్మవరంలో కేతిరెడ్డి లాంటి కచ్చితంగా గెలువాల్సిన… వైసీపీ నేతపై బిజెపి నాయకులు సత్యకుమార్ ఎలా గెలుస్తారని ఫైర్ అవుతున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో కేతిరెడ్డికి మంచి పేరు ఉందని… అలాంటి నేతను కాదని బిజెపికి వెళ్లి ఓటు వేసేవారు ఉన్నారా? అని అంటున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద స్కాం జరిగిందని… ఇందుకే వైసీపీకి దారుణమైన ఓటమి ఎదురైందని అంటున్నారు. అధికారులను, ఎన్నికల సంఘాన్ని గుప్పిట్లో పెట్టుకుని తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఓడిపోయాక ఎవరైనా ఇలాగే చెబుతారని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లుబుచ్చుతున్నారు.
????రాష్ట్రపతికి ఎంపీ ల జాబితా అందజేసిన ఈసీ..
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా 18వ లోక్ సభ ఏర్పాటును ప్రారంభించడానికి కొత్తగా ఎన్నికైన ఎంపీల జాబితాను అందించారు. అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానించనున్నారు. ఈ లెక్కన.. ఎన్డీయే కూటమి తరుపున మోదీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
????గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా.. మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన వారి వివరాలను గవర్నర్ కు అందజేసిన ముఖేష్ కుమార్ మీనా..*
????మెగాస్టార్ నివాసానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్..
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆయన సోద రుడు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు.ఎమ్మెల్యేగా విజయం సాధిం చిన తర్వాత తొలిసారిగా ఈరోజు చిరంజీవి ఇంటికి వెళ్లారు జనసేనాని. మెగా కుటుంబ సభ్యులు పవన్ తో కేక్ కట్ చేయించారు.చిరు ఇంటికి పవన్ రావ డంతో మెగా అభిమానులు బాణసంచా కాల్చి సంబ రాలు చేసుకున్నారు. ఏపీ ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది..జనసేన. వందశాతం స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థు లు విజయం సాధించారు..
????వైసీపీ ఘోర ఓటమి.. AAG పొన్నవోలు రాజీనామా..
వైసీపీ ఓటమితో రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి అందించారు.ఆయనతో పాటు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి, అదనపు పీపీ దుష్యంత్ రెడ్డి రాజీనామాలు సమర్పించారు.ప్రస్తుతం వెకేషన్ కోర్టు నడుస్తుండటంతో ఏజీపీలు, ఏపీపీలు కొద్దిరోజుల తర్వాత రాజీనామా చేసే ఛాన్సుంది.
????హమ్మయ్య.. బూమ్ బూమ్కి బైబై.. నెట్టింట ఫన్నీ పోస్టులు..కొత్త ప్రభుత్వం వస్తే నిరుద్యోగులు నోటిఫికేషన్లు వస్తాయనో,కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ బిల్లుల చెల్లిస్తారనో.. ఇలా ఒక్కో వర్గం ఒక్కో అంశంపై ఆశలు పెట్టుకుంటుంది.అయితే ఏపీ లో మందుబాబులు బ్రాండ్ మద్యం దొరుకుతుందంటూ ఖుషీ అవుతున్నారు. ఇన్నాళ్లు నాసిరకం మద్యం అమ్ముతున్నారని వారు అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు.ఇక బూమ్ బూమ్.. ఆంధ్రా గోల్డ్ బైబై అంటూ నెట్టింట ఫన్నీ పోస్టులు పెడుతున్నారు.
????సంజామల వద్ద ఉప్పొంగిన పాలేరు వాగు..!! తప్పిన పెనుముప్పు..!!నంద్యాల జిల్లా బనగానపల్లె..
పాలేరు వాగు వంతెన పై వర్షపు నీరు..నాలుగు అడుగుల మేర వంతెన పై వరద నీరు ప్రవహిస్తుండడంతో తిమ్మనైనపేట నుండి వస్తున్న కోయిలకుంట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున వరద నీటిలో చిక్కుకున్న బస్సు .బస్సులో సుమారు 25 మందికి పైగా ప్రయాణికులు..వంతెన పైనుండి వాగులోకి ఒకవైపు ఒరిగిన బస్సు..ప్రమాదాన్ని గుర్తించి..బస్సును వెంటనే ఆపి నిలిపివేసిన డ్రైవర్.. ప్రయాణికులను బస్సులో నుంచి క్షేమంగా .. చాకచక్యంగా కిందికి చేర్చిన ఆర్టీసీ బస్సు డ్రైవర్…ప్రయాణికులు అందరూ క్షేమం..!!
???? *మహిళా కూలీని వరించిన వజ్రం..
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో మహిళా కూలీకి దొరికిన వజ్రం. రెండు లక్షల రూపాయల నగదు, తులం బంగారం ఇచ్చి కొనుగోలు చేసిన పెరవలి కి చెందిన వజ్రాల వ్యాపారి.
???? అమరావతి…సచివాలయం లోని ఐటీ విభాగం లో పోలీస్ అధికారుల తనిఖీలు..ఐటీ కమ్యునికేషన్ విభాగం లో ఉద్యోగుల కంప్యూటర్ లు, ల్యాప్ ట్యాప్ లు, ఇతర ఉపకరణాలను తనిఖీ చేసిన అధికారులు*ఐటీ విభాగంలోని కంప్యూటర్ ల నుంచి డేటా బయటకు వెళ్లొచ్చనే అనుమానంతో తనిఖీలు*ఉద్యోగుల నుంచి పెన్ డ్రైవ్, డేటా హార్డ్ డ్రైవ్ లను పరిశీలిస్తున్న అధికారులు..పోలీస్ శాఖలో ఐటీ విభాగం ఎస్పీ ప్రకాష్,తుళ్ళూరు డీఎస్పీ అశోక్ ఆధ్వర్యంలో తనిఖీలు.
????ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం అర్ధవీడులో శాన్వి రెడ్డి అనే మైనర్ బాలికను గొంతు కోసి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు..సమాచారం అందించడంతో విచారణ చేపట్టిన పోలీసులు
???? మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం మొదటసారిగా బ్రాహ్మణితో కలిసి సతీసమేతంగా గురువారం మంగళగిరి శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ మర్యాదలతో దేవస్థాన ఈవో రామకోటి రెడ్డి నారా లోకేష్ దంపతులకు స్వాగతం పలికారు


