ఓట్లు చీల్చాలని, చంద్రబాబును గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర: సీఎం జగన్..వివేకా హత్య జరిగింది అందుకే..భారతిపై సునీత తీవ్ర వ్యాఖ్యలు!.. విస్తృత ప్రచారంలో కుందూరు కుటుంబం (గిద్దలూరు)

????మన ఓట్లు చీల్చాలని, చంద్రబాబును గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర: కడప బహిరంగ సభలో సీఎం జగన్*

చంద్రబాబు పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్ తో కాపురం చేస్తున్నాడు- మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి చనిపోయిన ఇన్ని సంవత్సరాలు కోసం నేడు ఎన్నికల కోసం నాన్న సమాధి దగ్గరకు ఢిల్లీ నుంచి వస్తారట- కాంగ్రెస్ కు ఓటు వేస్తే మన కళ్లను మనం పొడుచుకున్నట్లే, చంద్రబాబును గెలిపించేందుకు ఏపీలో కాంగ్రెస్ రంగప్రవేశం చేసింది. కాంగ్రెస్ కి ఓటు వేస్తే మన ఓట్లను చీల్చి ఎన్డీయేను గెలిపించడం కాదా? – చంద్రబాబు పగలు బీజేపీతో రాత్రి కాంగ్రెస్ తో కాపురం చేస్తారు. – రాజకీయాలు ఎంతగానో దిగజారిపోయాయి.

???? వివేకా హత్య జరిగింది అందుకే… భారతిపై సునీత తీవ్ర వ్యాఖ్యలు! ఇదే సమయంలో… సీఎం జగన్ ను ఎదిరించి మాట్లాడగలిగే సత్తా వివేకాకు ఉండటంవల్లే హత్య చేశారంటూ సునీత కీలక కామెంట్లు చేశారు.ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు శనివారం సాయంత్రంతో ముగియనున్న నేపథ్యంలో ప్రచారకార్యక్రమాలు హోరెత్తిపోతున్నాయి.ఇదే సమయంలో క్లైమాక్స్ ని బలంగా ప్లాన్ చేస్తున్న అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్లూ తమ తమ ట్రంప్ కార్డులను బయటకు తీస్తున్నారు! ఆ సంగతి అలా ఉంటే… రాష్ట్రంలోని ఫైట్ అంతా ఒకెత్తు..కడప లోక్ సభ పరిధిలో ఫైట్ మరొకెత్తు అనే కామెంట్లు వినిపిస్తున్న నేపధ్యంలో తాజాగా వివేకా కుమార్తె సునీత..వైఎస్ భారతి పై సంచలన వ్యాఖ్యలు చేశారు! గతకొన్ని రోజులుగా వైఎస్ వివేకా హత్య కేసుపై మాట్లాడుతున్న క్రమంలో వైఎస్ అవినాష్,ఆయనకు టిక్కెట్ ఇచ్చిన జగన్ లపై విరుచుకుపడుతున్న సునీత.. ఈ మధ్య వైఎస్ భారతిపైనా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్ వివేకా హత్య జరిగి, గది మొత్తం రక్తసిక్తమైపోతే గుండేపోటు అని ప్రసారం చేసింది భారతి అంటూ షర్మిళ విమర్శలు చేసిన నేపథ్యంలో… సునీత మరింత ఘాటుగా స్పందించారు. ఇందులో భాగంగా…పులివెందులలో సింగల్ ప్లేయర్ గా ఉండాలనే ఉద్దేశ్యంతోనే వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేశారని మాట్లాడారు సునీత! ఇదే సమయంలో… “ఇంకా ఎవరినైనా హత్య చేయాలని అనుకుంటున్నారా” అని ప్రశ్నించిన ఆమె… భారతి.. “నన్ను నరికేస్తారో, లేక షర్మిలను నరికేస్తారో తెలియదు గానీ సింగిల్ ప్లేయర్ గా ఉండాలంటే అదొక్కటే పాజిబిలిటీ” అంటూ సంచలన కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో…సీఎం జగన్ ను ఎదిరించి మాట్లాడగలిగే సత్తా వివేకాకు ఉండటంవల్లే హత్య చేశారంటూ సునీత కీలక కామెంట్లు చేశారు. ఇదే క్రమంలో… తనకు కూడా ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని, అందుకే తన పిల్లలకు ఆస్తులు వీలునామా రాసేశానని, అన్నింటికీ తెగించే పోరాడుతున్నానని సునీత తెలిపారు. ఇదే సమయంలో… అవినాష్ రెడ్డి చెప్పిన మాటలు నమ్ముతున్నట్లు జగన్ చెప్పడం ఏమిటని ఆమె ఘాటుగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా… దేశమంతా ఎన్నికలు సాధారణంగా జరుగుతుంటే కడప ఎన్నికలకు మాత్రం ప్రత్యేకత ఉందని చెప్పిన సునీత… కడపలో న్యాయానికి, నిందితులకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని, అందుకే ప్రపంచం అంతా చూస్తుందని తెలిపారు. అదేవిధంగా… షర్మిలను ఎంపీగా చేయాలని వివేకానంద రెడ్డి అనుకున్నా కుదరలేదని..ఆయన కోరికను నెరవేర్చేందుకు ప్రజలంతా షర్మిళకు ఓటు వేసి న్యాయం వైపు నిలవాలని సునీత విజ్ఞప్తి చేశారు.

????కంటతడి పెట్టిన షర్మిల… జగన్ పై సంచలన వ్యాఖ్యలు!

ఈ క్రమంలో తాజాగా కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన షర్మిళ కంట తడి పెట్టుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఇంక 24గంటల వ్యవధి కూడా లేదు! ఈ సమయంలో ఏపీ రాజకీయం పీక్స్ కి చేరిపోతోంది! పార్టీల అధినేతలు, నేతలు ప్రచారాలతో హోరెత్తించేస్తున్నారు. అలుపెరగకుండా ప్రజలను కలుస్తున్నారు..వారి మనసు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.ఈ సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన షర్మిళ కంట తడి పెట్టారు. అవును… ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో మిగిలిన రాష్ట్రమంతా ఒకెత్తు, కడప లోక్ సభ పరిధిలో ఎన్నిక ఒకెత్తు అన్నట్లుగా పరిస్థితి మారిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ పోటీ చేసేది అవినాష్ అయినా… వ్యవహారం మాత్రం జగన్ వర్సెస్ భారతి అన్నట్లుగా మారిన పరిస్థితి. ఈ క్రమంలో తాజాగా కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన షర్మిళ కంట తడి పెట్టుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కాంక్షతోనే తాను కడపలో పోటీ చేస్తున్నానని జగన్‌ అంటున్నారని మొదలుపెట్టిన షర్మిళ… అసలు తనను రాజకీయాల్లోకి తెచ్చింది జగనన్న కాదా? అని ప్రశ్నించారు.జగన్ జైల్లో ఉన్నప్పుడు భర్త, పిల్లల్ని వదిలేసి వేల కి.మీల మేర పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు.ఈ క్రమంలోనే జగన్ భవిష్యత్‌ కోసం తన కాలికి గాయమైనా వెనక్కి తగ్గలేదని షర్మిళ తెలిపారు. వాస్తవానికి తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో వైసీపీ అంతా తన చుట్టే తిరిగిందని చెప్పిన షర్మిళ… తనకే గనుక రాజకీయ కాంక్ష ఉంటే పార్టీని హైజాక్‌ చేసేదాన్ని కాదా? అని ప్రశ్నించారు. ఇదే క్రమంలో… “మీ నుంచి పైసా సాయంకోరినట్టయినా నిరూపించగలరా?” అని సూటిగా ప్రశ్నించారు షర్మిళ! బైబిల్ పై ప్రమాణం చేసి చెప్పగలరా?:ఈ సందర్భంగా తనకు రాజకీయ కాంక్ష గానీ, డబ్బు కాంక్ష గానీ ఉందని మీ మనస్సాక్షిలో మీరు నిజంగానే నమ్ముతున్నారా? అని జగన్ ని సూటిగా ప్రశ్నించిన షర్మిళ…మీరు సీఎం అయ్యే వరకు అన్న అని మీకోసం ఎంతో చేసిన విషయం వాస్తవం కాదా? అని అడిగారు.ఇదే క్రమంలో…”నాకు రాజకీయ కాంక్ష గానీ, డబ్బు కాంక్షగానీ, మిమ్మల్ని పదవి అడగకుండా మీ కోసం నిస్వార్థంగా పనిచేశానని నేను..మనిద్దరం నమ్మే బైబిల్‌ మీద ఒట్టేసి నేను చెప్పగలను..మిమ్మల్ని పదవి అడిగానని మీరు అదే బైబిల్‌ పై ప్రమాణం చేయగలరా? అని షర్మిళ సవాల్ విసిరారు! ఇదే క్రమంలో…సోషల్‌ మీడియా ద్వారా తనపై దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడిన షర్మిళ… రాజన్న బిడ్డ అనే ఇంగితం కూడా లేకుండా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు అని అన్నారు. ఫలితంగా… తనపై వికృతంగా ప్రచారం చేయించినందుకు జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని చెప్పిన షర్మిళ.. మీ కోసం త్యాగం చేసిన చెల్లిని గౌరవించకపోగా మానసికంగా హింసిస్తారా? అని ప్రశ్నించారు. దొంగ ఎప్పుడైనా దొంగనని చెబుతాడా? ఇక వివేకా హత్య వ్యవహారంలో అవినాష్ చెబుతున్న వెర్షన్ లాజికల్ గా ఉందని చెబుతూ.. అతడు తప్పు చేయలేదని తాను నమ్ముతున్నట్లు జగన్ చెప్పిన విషయంపైనా షర్మిళ స్పందించారు! ఇందులో భాగంగా.. తాను నిర్దోషి అని అవినాష్ రెడ్డి నాలుగు ఇంటర్వ్యూల్లో చెబితే చూసి కన్విన్స్‌ అవ్వడానికి మీరెవరు..? రాజ్యాంగమా..? చట్టమా..? కన్విన్స్ అవ్వాల్సింది న్యాయ వ్యవస్థ అని షర్మిళ తెలిపారు.నిజంగా నిర్దోషులైతే సీబీఐ వస్తే ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారని ప్రశ్నించిన షర్మిళ…దొంగ ఎప్పుడైనా దొంగనని చెబుతాడా? దొంగ మాటలు పిచ్చోళ్లే నమ్ముతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

????ఎల్లప్పుడు గిద్దలూరు ప్రజల సంక్షేమం,కార్యకర్తల బాగోగులు చూసే తత్వం,నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా నాగార్జున రెడ్డి.. కోమలతా రెడ్డి..నియోజకవర్గ అభివృద్ధి కోసం తపన పడే నాగార్జున రెడ్డికి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు మద్దతుగా నిలవాలని కుందూరు నాగార్జున రెడ్డి మరదలైన కోమలత రెడ్డి కోరారు. శుక్రవారం ఆమె కంభం మండలం దర్గా గ్రామంలో, బేస్తవారిపేట మండలం జిబి కృష్ణాపురం గ్రామంలో  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. .మే 13న జరిగే ఎన్నికల్లో గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న కుందురు నాగార్జున రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.కార్యక్రమంలో ,కంభం మండలం ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ ఓబుల్ రెడ్డి జేబి.కేపురం సర్పంచ్ కంచర్ల వెంకట లక్ష్మమ్మ,దర్గా సర్పంచ్, వైయస్సార్ సీపీ ముఖ్య నాయకులు కంచర్ల తిరుపతయ్య ,బేస్తవారిపేట మండల మాజీ ఎంపీపీ వెంకట రాజు ,బేస్తవారిపేట మండల వైయస్సార్ సీపీ సీనియర్ నాయకులు బొల్లా బాలిరెడ్డి ,గ్రామ ముఖ్య నాయకులు,బేస్తవారిపేట మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు,మహిళా వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.????ఎన్నికల ప్రచారం లో భాగంగా గిద్దలూరు మండలం లోని కృష్ణంశెట్టి పల్లె

పంచాయతీ లోని ఆక్కలరెడ్డి పల్లె లో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి.. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*