1000 కోట్ల వ్యవహారంపై షర్మిళ ఘాటు రియాక్షన్.. చంద్రబాబు భూ కబ్జాదారుడు.. సజ్జల.. విస్తృత ప్రచారంలో మాగుంట..ముత్తుముల కుందూరు కుటుంబాలు..టిడిపిలో చేరిన స్టార్ భాష.

1000 కోట్ల వ్యవహారంపై షర్మిళ ఘాటు రియాక్షన్! ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయం తీవ్రస్థాయిలో వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయం తీవ్రస్థాయిలో వేడెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో… వైఎస్ జగన్ వర్సెస్ షర్మిళ వ్యవహారం పీక్స్ కి చేరుతుంది. ఇందులో భాగంగా… రూ.1000 కోట్ల వ్యవహారం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో…షర్మిల అడిగిన రూ.1000 కోట్ల పనులు చేయకపోవడమే ఆమె తమతో విభేదించడానికి కారణమంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.అవును… ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ వైసీపీ వర్సెస్ షర్మిళ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతుంది.ఇందులో భాగం…రూ.1000 కోట్ల పనులు అడిగితే చేయలేదనే షర్మిళ తమతో విభేదించినట్లు వైసీపీ నేతలు చెబుతున్నవేళ… ఆమె రియాక్ట్ అయ్యారు.ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతానంటూ వైసీపీ నేతలకు షర్మిళ సవాల్ విసిరారు. దీంతో… ఈ వెయ్యి కోట్ల పనుల వ్యవహారం ఎన్నికల వేళ తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై మరింత స్పందించిన షర్మిళ… వివేకా హత్య కేసుపై మాట్లాడుతూ జగన్‌ అధికారంలో లేనప్పుడు సీబీఐ విచారణ కావాలని అడిగారు కానీ.. అధికారంలోకి రాగానే మాత్రం ఎందుకు వద్దన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.ఇదే సమయంలో…జగన్‌ ను చూసుకునే తెలంగాణ నేత రాఘవరెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇక రూ.వెయ్యి కోట్ల ఆరోపణలపై స్పందించిన షర్మిళ…ఆ వ్యవహారానికి సంబంధించి రుజువులు ఉంటే బయటపెట్టాలని కోరారు. ఇటీవల కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైనా షర్మిల స్పందించారు.ఇందులో భాగంగా… తన భర్త అనిల్‌ కుమార్‌ బీజేపీ నేతను ఎక్కడా కలవలేదు,కలవరని చెప్పారు. ఇదే క్రమంలో…అవినాష్‌ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు తెలియదని షర్మిల ఎద్దేవా చేశారు.అదేవిధంగా… బీజేపీతో కంటికి కనిపించని పొత్తును జగన్‌ కొనసాగిస్తున్నారని చెప్పిన షర్మిళ… అదానీ,అంబానీలకు ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టారని ఫైరయ్యారు.ఇదే సమయంలో… జగన్‌ బీజేపీకి దత్తపుత్రుడని నిర్మలా సీతారామన్‌ చెప్పారని..మోడీ వారసుడిగానే ఆయన ఉన్నారు తప్ప వైఎస్సార్‌ వారసుడిగా కాదని చెప్పుకొచ్చారు.ఇదే క్రమంలో… తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేరును సీబీఐ ఛార్జిషీట్‌ లో పెట్టించిన వారికి ఏఏజీ పదవి ఇచ్చారని షర్మిళ తీవ్ర విమర్శలు చేశారు!

????చంద్రబాబు నాయుడు లాంటి భూ కబ్జాదారులకు భూ హక్కు చట్టం ఉక్కు పాదం మోపనుంది, పేద సన్నకారు రైతులకి ఇది మేలు చేస్తుంది.

భూ హక్కు చట్టం చిన్న, సన్నకారు రైతులకు మేలు చేస్తుంది. చంద్రబాబు నాయుడు లాంటి స్వార్థ ప్రయోజనాలతో అక్రమంగా భూములు లాక్కుంటున్న వ్యక్తులకు ఇది పెద్ద దెబ్బ. అందుకే వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. మరిచిపోకండి,ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని నీతి ఆయోగ్ (కేంద్రం) ప్రతిపాదించింది.. *సజ్జల రామకృష్ణ రెడ్డి*

???? రేపల్లె ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్………….రాష్ట్రమనే పొలాన్ని జగన్ అనే రైతుకు ఐదేళ్ల క్రితం ఇచ్చారని అనుకుంటే,ఆ జగన్ అనే రైతు ఈ ఐదేళ్లలో రాష్ట్రం అనే పొలంలో పథకాలు, చేసిన మార్పులు, తెచ్చిన సంస్కరణలనే విత్తనాలను, మీ బిడ్డ పాలనలో రాష్ట్రంలోని ఇంటింటా సంక్షేమం,అభివృద్ధి, సంతోషం,మంచి భవిష్యత్ అనే మొక్కలను నాటారు. ప్రతి గ్రామం,పట్టణం, సామాజిక వర్గంలో నాటిన ఈ విత్తనాలన్నీ మరో 15 ఏళ్లలో వృక్షాలు అవుతాయి.నాణ్యమైన చదువులతో బయటికి వచ్చే మన పిల్లలతో పేదల బతుకులు,రాష్ట్రంలో పేదరికం అనే మాట మాటుమాయం అవుతుందని మీ బిడ్డ సగర్వంగా తెలియజేస్తున్నారు : రేపల్లె ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్????వాలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా.. పేదల పిల్లలకు మంచి చదువులు అందాలన్నా.. నాణ్యమైన వైద్యం అందాలన్నా.. మన గ్రామాల్లో వ్యవసాయం బాగుపడాలన్నా.. ఎన్నికల రోజు రెండు బటన్లు (ఓట్లు) ఫ్యాన్ గుర్తుపై నొక్కాలి. 177/175 ఎమ్మెల్యే స్థానాల్లో, 25/25 ఎంపీ స్థానాల్లో ఫ్యాన్ గెలవాలి. తగ్గేందుకు వీలే లేదు. దీని కోసం మీరంతా సిద్ధమేనా.. రేపల్లె ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్*

???? ఒంగోలు లోని క్లౌపేట లో రాయపాటి వినోద్ ఆధ్వర్యం లో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ అభ్యర్థి దామచర్ల జనార్దన్, జిల్లా జనసేన ఇంచార్జి షేక్ రియాజ్ సమక్షం లో 200మంది నేడు వై. యస్. ఆర్. సి. పి ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. కార్యక్రమంలో అయినాబత్తిన ఘన శ్యామ్ తాతా ప్రసాద్,మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయులు నిఖిల్ రెడ్డి, పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి మరియు పలువురు నాయకులు,టీడీపీ,జనసేన, బీజేపీ డివిజన్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

???? ఒంగోలు లో 33వ డివిజన్ లో దారావారికుంట లో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి మరదళ్లు శశికళ, సురేఖ,చెల్లెళ్లు సంధ్య, జ్యోత్స్న, మేనకోడలు కీర్తి, ఒంగోలు శాసనసభ అభ్యర్థి దామచర్ల జనార్దన్ మరదలు డా. హిమబిందు, అక్క మాధవి, కుమార్తె అనిషా లక్ష్మి ,కోడలు శ్రీమతి కీర్తన మరియు ఆత్మకూరి బ్రహ్మయ్య సాయిరాం కార్యక్రమం లో తెలుగుదేశం,జనసేన, బిజెపి నాయకులు, మహిళా కార్యకర్తలు,కార్యకర్తలు, నాయకులు,పాల్గొన్నారు ????మార్కాపురం నియోజకవర్గం పొదిలిలో గార్నెపూడి భాస్కర్ ఆధ్వర్యంలో లో జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు పలువురు ఆర్యవైశ్య నాయకులు తదితర నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ మండల నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

???? గిద్దలూరు నియోజకవర్గం గిద్దలూరు మండలం పొదలకుంటపల్లె గ్రామం లో తెలుగు దేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి సతీమణి చందన రెడ్డి గిద్దలూరు శాసనసభ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సతీమణి పుష్పలీల కార్యక్రమంలో కుప్పా రంగసాయి, జయరాం రెడ్డి,భాస్కర్ రెడ్డి, నారాయణ, గుర్రాల రాము కార్యక్రమం లో తెలుగుదేశం, జనసేన,బిజెపి  నాయకులు, మహిళా కార్యకర్తలు,నాయకులు ,పాల్గొన్నారు.

???? ఒంగోలు పట్టణం లో 25వ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరదళ్ళు సురేఖ, శశికళ చెల్లెలు వాణి,సంధ్య, మేనకోడలు కీర్తి, దామచర్ల జనార్దన్ అక్క మాధవి,కుమార్తె అనిషా లక్ష్మి,మరదలు డా.హిమ బిందు కోడలు ఆత్మకూరి బ్రహ్మయ్య,సాయి రామ్ తదితర నాయకులు తెలుగుదేశం,జనసేన,బీజేపీ నాయకులు,అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

????కాంగ్రెస్ మంత్రి పర్సనల్ సెక్రటరీ ఇంట్లో పట్టుబడ్డ నోట్ల కట్టల గుట్టలు!

జార్ఖండ్ కాంగ్రెస్ మంత్రి ఆలంగీర్ ఆలం పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించగా రూ 20 కోట్లు బయటపడ్డాయి. అతడి పనిమనిషి సాయంతోడబ్బును స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.

????ఇంటింటి ప్రచారంలో ముత్తుముల తనయుడు..

కొమరోలు మండలం గుండ్రేడ్డి పల్లె,నారాయణ పల్లె గ్రామలలో గిద్దలూరు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి తనయుడు ముత్తుముల దివ్యేష్ రెడ్డి సోమవారం ఉదయం ఇంటింటికి తిరిగి టీడీపీ, జనసేన, బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తుముల అశోక్ రెడ్డికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాస రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.*

????, BJP-TDP-JSP మోసపూరిత పొత్తుల ఎజెండాను మోడీ ప్రకటించాలని ఏపీ కోరుతుంది:

 1) 4% ముస్లిం OBC కోటాను ఉంచాలి

 2) వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు

 3) APలో CAA/NRC ఉండకూడదు.

4) ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి.

5) ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాం అని చెప్పగలగాలి.

ఇవి ప్రకటించక పోతే మీరు కపట నాటక సూత్రధారి అని, న్యాయంలేనివారు అని నిర్ధారణ అవుతుంది!..సంక్షేమ సారథి అయిన జగనన్నకు మద్దతు ఇద్దాం*….

కంభం మండలం ఎర్రబాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కుందూరు కృష్ణ మోహన్ రెడ్డి సతీమణి కోమలతా రెడ్డి ..*

కంభం మండలం ఎర్రబాలెం గ్రామంలో స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి మరదలు కోమలతా రెడ్డి..

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోనే కులమతాలకు,రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి నవరత్నల సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అందజేశారని తెలిపారు.

*సంక్షేమ సారథి అయిన జగనన్నకు మనం మద్దతు నిలిచి,మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని,ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు*…..

 కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు,మహిళ నాయకులు,అభిమానులు పాల్గొన్నారు.

????ఎన్నికల వేళ గిద్దలూరు వైసీపీలోకి వలస పర్వ

కుందూరు సమక్షంలో నరవ బయనపల్లెకు చెందిన 30 కుటుంబాలు టీడీపీకి గుడ్ బై..

గిద్దలూరు మండలం నరవ బయనపల్లి గ్రామానికి చెందిన దాదాపు 30 కుటుంబాలు* *గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి  సమక్షంలో టీడీపీకి గుడ్ బై చెప్తూ వైసీపీలోకి చేరిక*పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాధారంగా ఆహ్వానించిన కుందూరు నాగార్జున రెడ్డి.

 ????టీడీపీలో చేరిన కంభం మాజీ సర్పంచ్,.స్టార్ బాషా….కంభం పట్టణంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. గిద్దలూరు ఎన్డీయే కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో కంభం పట్టణ మాజీ సర్పంచ్, ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు స్టార్ భాషా వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి టిడిపి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.కొన్నాళ్ల కిందట ఆయన తన అనుచర వర్గంతో వైకాపాలో చేరారు. ప్రస్తుతం ఆయన తిరిగి టిడిపిలో చేరడం పట్ల సర్వత్రా చర్చ్యోపచర్చలు జరుగుతున్నాయి.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*