వివేకం సినిమాపై సునీత వివాదాస్పద వ్యాఖ్యలు.. జగన్ కు భారీ షాక్.. విస్తృత ప్రచారంలో గిద్దలూరు వైసిపి,టిడిపి.. ఏసీబీ కి పట్టుబడ్డ ఎస్సై

అంతకు మించి… “వివేకం” సినిమాపై సునీత వ్యాఖ్యలు వైరల్!!!

అవును… వివేకానందరెడ్డి హత్య ఏపీ రాజకీయాల్లో ఎంత సంచలనమైన విషయంగా మారిందనే సంగతి తెలిసిందే. జగన్ ఇటీవల ప్రారంభించిన “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర సందర్భంగా వైఎస్ వివేకా మర్డర్ కేసుపై చేసిన వ్యాఖ్యల అనంతరం సునీత తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే.నాటి నుంచి మరి ఎక్కువగా సునీత నర్రెడ్డి.. ఏపీ సీఎం జగన్ ని వెంటాడుతున్నట్లు చెబుతున్నారు.నేరుగా వైసీపీ ఓటు వేయొద్దనే క్యాంపెయినింగ్ కూడా స్టార్ట్ చేసినంత పనిచేశారని అంటున్నారు!! ఈ సమయంలో తాజాగా “వివేకం” సినిమా స్పందించారు! అవును… వివేకానందరెడ్డి హత్య ఏపీ రాజకీయాల్లో ఎంత సంచలనమైన విషయంగా మారిందనే సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వంలో ఈయన హత్య జరిగినప్పటినుంచి నేటి వరకూ ఈ కేసు వార్తల్లో హాట్ టాపిక్ గానే నిలుస్తుంది! పైగా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో…ఈ వ్యవహారం మరింత వైరల్ గా మారింది.ఇదే సమయంలో వివేకా కుమార్తె సునీత చేస్తున్న కామెంట్లు మరింత వైరల్ గా మారుతున్నాయి.ఈ సమయంలో వివేకా జీవిత చరిత్రతో తెరకెక్కినట్లు చెబుతున్న “వివేకం” సినిమాపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా…”వివేకం” అనేది డాక్యుమెంటరీ అనాలో, సినిమా అనాలో తెలియడం లేదు” అని మొదలుపెట్టిన సునీత…ఎవరో కానీ..చాలా ధైర్యంగా ఆ సినిమా తీశారని తెలిపారు. ఆ సినిమాలో కొన్ని వ్యక్తిగత అంశాలో తేడా ఉంటే ఉండొచ్చు కానీ…చివరి అరగంట మాత్రం తనకు చాలా భయమేసిందని..ఆ సమయంలో తాను కళ్లు మూసుకున్నానని సునీత చెప్పారు! ఇదే సమయంలో… వివేకా మర్డర్ విషయంలో రియాలిటీని తలచుకొంటే మాత్రం “వివేకం” సినిమాను లైట్ గా తీశారని చెప్పారు. ఇదే సమయంలో..గత ఎన్నికల్లో తన తండ్రి హత్యను రాజకీయాలకు వాడుకున్నారని చెప్పిన సునీత..ఐదేళ్ల తర్వాత తిరిగి ఇప్పుడూ అదే చేస్తున్నారని అన్నారు.ఇక తానెప్పుడూ రాజకీయాల్లోకి రాలేదు కానీ.. తప్పు జరుగుతోంది కాబట్టి బయటకు వచ్చి ఐదేళ్లుగా పోరాడుతున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో…వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే వ్యక్తిగతంగా తనతో పాటు రాష్ట్రానికీ మంచిది కాదని చెప్పడం గమనార్హం! వైకాపా ప్రభుత్వం మళ్లీ వస్తే వ్యక్తిగతంగా నాతో పాటు ఈ రాష్ట్రానికీ మంచిది కాదు’’అని సునీత వ్యాఖ్యానించారు. కాగా…ఈ సినిమాపై వివేకా హత్యకేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తన స్టేట్ మెంట్ ఆధారంగా తీసిన సినిమాలో తన పేరు ఉందంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా ప్రదర్శనతో పాటు, సోషల్ మీడియాలో సర్క్యులేషన్ ని నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో చంద్రబాబు, లోకేష్ లను ప్రతివాదులుగా చేర్చారు.

????ఎన్నికల ముందు జగన్‍కు భారీ షాక్.*  అవును… సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో… ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఉన్నతాధికరులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇందులో భాగంగా… ముగ్గురు ఐఏఎస్ లతో పాటు ఆరుగురు ఐపీఎస్ లను ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి.. ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్ కుమార్ ఒక లేఖ రాశారు. ఇందులో భాగంగా… ముగ్గురు జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓ), ఐదుగురు సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ), ఒక ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) ని బదిలీ చేస్తున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నారు. ఇదే సమయంలో… బదిలీ అయిన వరికి 2024 సార్వత్రిక ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ విధుల్లో ఉండకూడదని ఆదేశాలు.

???? టంగుటూరు పోలీస్ స్టేషన్ లో ఏసీబి దాడులు..ఎస్సై నాగేశ్వరావు ఓ కేసు విషయం లో లంచం తీసుకుంటుండగా ఏసీబి డీ ఎస్పీ శ్రీనివాస్ కు పట్టు బడ్డ వైనం..ఓ సివిల్ వివాదం లో రూ1:70 వేలు కాకుటూరు పాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద డిమాండ్ చేసిన ఎస్సై నాగేశ్వరావు..70000 లంచం తీసుకుంటు ఏసీబి కి పట్టుబడ్డారు

????ముత్తుముల సమక్షంలో కంభం అంకాలమ్మ తిప్పకు చెందిన 17 కుటుంబాలు టిడిపిలోచేరిక .

గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో మంగళవారం కంభం పట్టణంలోని అంకాలమ్మ తిప్ప వీధిలో కంభం పట్టణ మహిళా అధ్యక్షురాలు తోట మహాలక్ష్మి.తోట శ్రీనివాసులు. ఓబుల్ రెడ్డి మాధవ ఆధ్వర్యంలో 17 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.

???? కంభంలో ప్రచారం నిర్వహించిన గిద్దలూరు వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ.నాగార్జున రెడ్డి..

గిద్దలూరు వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ.నాగార్జున రెడ్డి మంగళవారం పట్టణంలోని పలు వీధులలోని ముఖ్య నాయకులను కలిశారు. కోనేటి వీధిలో ముస్లిం మైనార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆయన వైకాపా హయాంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.

????అనంతరం ఆయనకు కంభం మండల మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు..ఈ సందర్భంగా కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ మాజీ సైనికుల సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు..కార్యక్రమంలో కంభం మండల పరిషత్ అధ్యక్షులు చేగిరెడ్డి తులసమ్మ,ఓబుల్ రెడ్డి, మండల జేసీఎస్ కన్వీనర్ డిష్ మున్నా,కంభం మండల కన్వీనర్ గొంగటి చెన్నారెడ్డి ,మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ నెమలిదిన్నె చెన్నారెడ్డి,సర్పంచులు,ఎంపీటీసీలు,ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

????ఎమ్మెల్యే అభ్యర్థి నాగార్జునను గెలిపించాలని కోరుతూ గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులో ప్రచారం చేసిన నాగార్జున రెడ్డి సతీమణి కల్పన రెడ్డి..గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నాగార్జునరెడ్డి సతీమణి కల్పన రెడ్డి గెలుపే లక్ష్యంగా గిద్దలూరు పట్టణంలో ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డుకు చెందిన నల్లబండ బజార్,పాములపల్లె రోడ్ లో ఇంటింటికి తిరిగి వైసీపీ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు.మే13వ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగార్జున రెడ్డిని,ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాను గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, పట్టణ కౌన్సిలర్లు, మహిళా కార్యకర్తలు కార్యకర్తలు పాల్గొన్నారు.

????సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయాలి..గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన ముత్తుముల సతీమణి పుష్పలీల*  గిద్దలూరు..నగర పంచాయతీ పరిధిలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రతినెల అందచేయుచున్న సామాజిక పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా అందచేయాలని గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ గారికి టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సతీమణి పుష్పలీల వినతి పత్రం అందజేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నేరుగా నగదు పంపిణీ చేసే కార్యక్రమాల నుండి వాలంటీర్ వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. వారికి ప్రభుత్వం అందించిన సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో, ప్రత్యామ్నాయంగా సచివాలయ సిబ్బంది వారి వార్డు పరిధిలోని పింఛన్ దారులకు ఇంటి వద్దకే వెళ్లి నగదు పంపిణీ చేయవలెనని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా వృద్ధులను ఇబ్బందులకు గురి చేయకుండా వారికీ సకాలంలో పెన్షన్ నగదును అందచేయాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు సయ్యద్ శానేశా వలి, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు పిడతల సరస్వతి, పట్టణ కౌన్సిలర్లు బిల్లా రమేష్, గడ్డం భాస్కర్ రెడ్డి, పాలుగుళ్ల చిన్న శ్రీనివాసరెడ్డి, కాపు నాయకులు దుత్తా బాల ఈశ్వరయ్య, బోయిలపల్లి కిషోర్, మండ్ల శ్రీను, ధనలక్ష్మి, బొంతా లక్ష్మీదేవి, సుశీలమ్మ, తదితరులు పాల్గోన్నారు*..

????విశాఖ :నగరంలో సుమారు కోటి రూపాయలు నగదు పట్టుకున్న పోలీసులు….నగరంలోని ద్వారకా నగర్ వద్ద సుమారు కోటి రూపాయలు నగదు పట్టుకున్న పోలీసులు….ఇద్దరు వ్యక్తులు స్కూటీలో నగదు తరలిస్తుండగా పక్కా సమాచారంతో పట్టుకున్న ద్వారకా నగర్ పోలీసులు..నగదుకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ద్వారక సి.ఐ పోలీసులు సిబ్బందిద్దరు వ్యక్తులతో పాటు నగదు సీజ్ చేసి ద్వారక పోలీస్ స్టేషన్ కు తరలింపు…..

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*