లోహ శాస్త్రవేత్త తిలోరెరెన్ కు సన్మానం.. గిద్దలూరు వైకాపాలో చేరికలు..ముత్తుములకు సన్మానం.. తర్లుపాడులో రాజకీయ వేదింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం ..

  • సుప్రసిద్ధ లోహ శాస్త్రవేత్త తిలోరెరెన్ ను ఘనంగా సన్మానించిన తెలంగాణ ఉద్యోగుల సంఘం..

జర్మనీకి చెందిన ప్రపంచ సుప్రసిద్ధ లోహ శాస్త్రవేత్త తిలోరెరెన్ తన పరిశోధనలో భాగంగా దక్షిణ భారతదేశాన్ని సందర్శించారు. మనదేశంలో యుద్ధాలలో వాడే ఆయుధాల గురించి ఫిరంగుల గురించి, వారసత్వ సంపద, ఆయుధాలు ఫిరంగులలో తయారీలో వినియోగించిన లోహాల గురించి అద్వయనంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగ సంఘం అధ్యక్షులు పద్మాచారి ఆధ్వర్యంలో ఆయనకు గ్రీన్ ల్యాండ్ లోని టూరిజం ప్లాజా లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వృత్తి రీత్యా విశ్వబ్రాహ్మణుడు అయిన ఆయన ఇటీవల భారతదేశం నిర్వహించిన సూర్యయాన్ చంద్రయాన్ యాత్రలలో రాకెట్లలో వెళ్లి అక్కడి వాతావరణ పరిస్థితులను, అక్కడి ఉష్ణోగ్రతను తట్టుకునే లోహాలను గురించి అనేక పరిశోధనలు నిర్వహించారు. అనేక దేవి దేవత విగ్రహాలను తయారు చేయడంతో పాటు విగ్రహాల తయారీలో ఎటువంటి లోహాలను వినియోగించాలన్న అంశాలపై పరిశోధన సాగిస్తుంటారు.తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన లోహ శాస్త్రవేత్త ప్రముఖ చరిత్రకారుడైన డాక్టర్ జై కిషన్ ఆహ్వానం మేరకు రేరెన్ తెలంగాణ సందర్శించారు.లోహ పరిశోధనలో ఆయన వద్ద 35 మంది డాక్టరేట్ పట్టాలు పొందారు. ఆయన వద్ద శిష్యరికం చేసిన వారందరూ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా తీలో రైరన్ ముంబైలోని తన శిష్యురాలైన డాక్టర్ మేఘనను కూడా కలిసి అనేక విషయాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఆర్థిక నేరాల విభాగం ఏసిపి కే కిరణ్ కుమార్ మాట్లాడుతూ తిలోరెన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ను కలవడం తన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తాను గతంలో పోలీసు డిపార్ట్మెంట్ లో పని చేస్తూ వివిధ దేశాలలో పోలీసుల పనితీరు గురించి చేసిన సందర్భంగా జర్మనీలో సైతం పర్యటించానని ఆ దేశం గురించి మంచి అవగాహన ఉందని, ప్రజల జీవనశైలి కర్తవ దీక్షలో పోలీసులు అధికారుల తీరు ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి బ్రహ్మశ్రీ వెంకటాచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు వడ్రంగి కమ్మరి శిల్పి, లోహ కారులు, స్వర్ణకారులు తమ సంప్రదాయ వృత్తులలో కొనసాగుతూనే సమాజానికి ఉపయోగపడే వారి వారి కులవృత్తులలో అత్యంత ప్రతిభను కనబరుస్తూ విశ్వకర్మజాతికి తలమానికంగా నిలుస్తున్నారని ఆయనను ప్రశంసించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ బ్రహ్మశ్రీ ఎల్ ఎన్ చారి, దుబ్బాక కిషన్ చారి, డాక్టర్ రవీంద్ర చారి, శ్రీరామోజు ప్రదీప్ సురేందర్ డాక్టర్ సుధాకర్, దేవరకొండ నరేంద్రచారి తదితరులు పాల్గొన్నారు.

*అర్దవీడు మండలంలో పట్టపగలే రెండు గృహాల్లో చోరీ*  పట్టపగలే రెండు గృహాల్లో చోరీ జరిగిన సంఘటన అర్దవీడు మండలం మోహిద్దీన్ పురం గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన దూదేకుల పెద్ద కాశయ్య, చిన్న కుమారుడు రంజాన్ గృహాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. పెద్దకాశయ్య దంపతులతో పాటు చిన్న కోడలు ఉదయాన్నే పొలం పనులకు వెళ్లారు. పదింటి సమయంలో దొంగలు రెండు ఇళ్ల తలు పులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. గ్రామం శివారు వరి మాగాణులకు సమీపంలో ఇళ్లు ఉండటంతో గమనించే వారు లేకపోయారు. దీంతో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు రెండు బీరువాల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడినట్టు సమాచారం. రెండు గృహాల్లో సుమారు 10 తులాల బంగారు రూ.50 వేల నగదు అపహరించినట్లు సమాచారం. పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి రావడంతో తలుపులు తెరచి ఉండటం పై దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై అనిత తమ సిబ్బందితో కలసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను పిలిపించి వేలి ముద్రలు సేకరించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించిన అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు…_

* ????ఆంధ్రా మిర్రర్ ప్రకాశం జిల్లా ..తర్లుపాడు.. వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్యా యత్నం…వైకాపా నాయకుడి వేధింపులే కారణమని బాధితుడి ఆరోపణ.. తర్లుపాడు మండలం కందల్లపల్లిలో వ్యక్తి ఆత్మహత్యా యత్నం..పురుగుమందు తాగిన తెదేపా కార్యకర్త బ్రహ్మతేజ కుమార్.మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు .వైకాపా నాయకుడి వేధింపులే కారణమని బాధితుడి వెల్లడి.తనకున్న చిన్నపాటి ఉద్యోగం తీసేయడంతో పాటు తన కుటుంబ సభ్యులను, కులాన్ని దూషించాడని బాధితుడి ఆవేదన.

???? వైకాపాల్లో చేరికలు..ఆంధ్ర మిర్రర్ ప్రకాశం జిల్లా..

గిద్దలూరు .. మండలంలోని ముల్లపాడు పంచాయతీలోని వెంకటాపురం గ్రామంలో దాదాపు 60 కుటుంబాలు టిడిపి నుండి వైసీపీలో చేరడం జరిగింది.వీరందరికీ గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త కేపీ నాగార్జున రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

????టిడిపి ఇన్చార్జి ముత్తుములను సన్మానించిన కంభం టిడిపి నాయకులు

గిద్దలూరు టిడిపి టికెట్  గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇన్చార్జి ముత్తుముల అశోక్ రెడ్డి కేటాయించడంతో శుక్రవారం రాత్రి మండల టిడిపి నాయకులు కార్యకర్తలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అనీష్ అహ్మద్, తోట శ్రీనివాసులు, గౌస్ బాషా, జీలాని, అల్లాబకాష్ తది తరులు పాల్గొన్నారు.

 

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*