పౌరసత్వ సవరణ చట్టంపై నోరు మెదపరేం???సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ..ఢిల్లీ రైతులకు మద్దతుగా సిఐటియు ప్రదర్శన.. గిద్దలూరు టిడిపి టికెట్ మాజీ ఎమ్మెల్యే ముత్తుములకు కేటాయింపు.. టిడిపిలోకి వలసలు 

 

ముస్లిం మైనార్టీల ఉనికిని దెబ్బకొట్టి వారి భవిష్యత్తును అంధకారబంధం చేస్తున్న సిఎఎ (పౌరసత్వ సవరణ చట్టానికి) రూల్స్‌ నోటిఫై చేసి దేశాన్ని ప్రమాదంలోకి నెట్టిన బిజెపి కుతంత్రాలపై రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ఎందుకు నోరు మెదపడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు. రాష్ట్రంలో సిఎఎను అమలు చేయబోమని వైసిపి ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.మైనారిటీలను ఉద్ధరిస్తానని రోజు రాగాలు తీసే సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

సిఏఏ ద్వారా ముస్లిం మైనార్టీల ఉనికిని దెబ్బతీయటంలో బిజెపిని బలపరచిన తెలుగుదేశం నేరస్థురాలు కాదా? రాష్ట్రంలో మైనార్టీలపై మెజార్టీ మతస్తులను రెచ్చగొట్టి ఉద్రిక్తతలను సృష్టించాలనుకుంటున్న బిజెపితో కలిసి తెలుగుదేశం లౌకికవాదం ఎలా కాపాడుతుంది? అని ప్రశ్నించారు.బిజెపి దురాగతాలను ప్రశ్నించకుండా వైసిపి మైనార్టీలను ఎలా రక్షిస్తుందో చెప్పాలనీ వి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం కులం, మతం, రంగు, జాతి, ప్రాంతం, భాష ఆధారంగా ఎవరిపట్ల వివక్ష ఉండకూడదు. కాని సిఎఎ మత ప్రాతిపదికన వివక్ష పాటిస్తుందన్నారు. రాజ్యాంగంలోని 19వ అధికరణం మతపరమైన స్వేచ్ఛ ఇస్తున్నప్పుడు ముస్లిములకు తప్ప ఇతరులకే పౌరసత్వం ఇస్తామని చెప్పడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? శ్రీలంకలో దశాబ్దాలుగా మతపరమైన హింసను ఎదుర్కొంటున్న శ్రీలంక హిందువులను ఎందుకు మినహాయించారని ప్రశ్నించారు.పొరుగు దేశాల్లో మతపరమైన హింసకు గురవుతున్న ప్రజలను ‘మానవతా దృష్టితో’ ఆదుకునేందుకే ఈ చట్టం తెచ్చినట్టయితే కేవలం మూడు దేశాలకే ఎందుకు పరిమితం చేయాల్సి వచ్చింది? మన పొరుగున ఉన్న మయన్మార్‌లో మైనార్టీల్కెన రొహింగ్యా ముస్లింలు, హిందువులు శ్రీలంకలో క్రైస్తవ తమిళులు తీవ్రమైన హింసాకాండకు గురయ్యారు.వారిని ఎందుకు ఈ చట్టంలో చేర్చలేదు అంటే ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. చివరికి పాకిస్తాన్‌ ముస్లింలలో అనేక మైనార్టీ తెగలు తీవ్రమైన హింసాకాండకు గురవుతున్నారు.మరి బిజెపి ప్రభుత్వ ‘మానవతా’ జాబితాలో వారు ఎందుకు చేరలేదు? వీటన్నిటి బట్టి చూస్తే దీని వెనుక ‘మానవత’ లేదనీ, ఒక రాజకీయ వ్యూహంతో ఇదంతా చేస్తున్నదనీ అర్ధమవుతోందన్నారు. వామపక్షల మద్దతుతో ఇండియా బ్లాక్‌ అధికారంలోకి వస్తే సిఎఎ అమల్లోకి రాదని.. అదే మైనార్టీలకు రక్ష.. మత సామరస్యానికి గ్యారెంటీ అని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.

???? ఢిల్లీ రైతులకు మద్దతుగా సిఐటియు ప్రదర్శన

ప్రకాశం జిల్లా పొదిలి..ఢిల్లీలో  540 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు మద్దతుగా గురువారం పొదిలిలో సిఐటియు నాయకులు ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ వ్యవసాయ నల్ల చట్టాల రద్దు సందర్భంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం 2021 డిసెంబర్లో రాత పూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఢిల్లీ బయలు దేరిన రైతాంగాన్ని నిలువరించి అత్యంత పాశవికంగా దాడి చేయడం ప్రభుత్వ దమనకాండ నిదర్శనం అన్నారు.రైతులను అడ్డుకుంటూ రోడ్లపై కందకాలు తవ్వడం మేకులు నాటడం బార్కెట్లు ముళ్లకంచెలు ఏర్పరచడం,వాటర్ క్యాన్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించడం,డ్రోన్ల ద్వారా విషవాయువులు చంపడంతో అనేకమంది రైతులు కంటిచూపు కోల్పోయి,చెవులు వినపడక ఇబ్బందులు పడ్డారన్నారు. పోలీస్ కాల్పుల్లో శుభకరం సింగన యువరైతు చనిపోవడంతో పాటు మరో ముగ్గురు రైతులు గుండె ఆగి చనిపోయారన్నారు.ఈ దాడుల్లో 200 ట్రాక్టర్ ధ్వంసం కాగా ప్రసార చానల్స్ నిలిపివేసి ఈ దురాగతాన్ని ప్రసారం కానేకుండా అడ్డుకున్నారని విమర్శించారు.ఈ కాలంలో నాలుగు సార్లు చర్చలు సాగించిన ఎటువంటి ప్రోగ్రామ్ లేకపోగా మంత్రులు ఇతర విషయాలు చర్చిస్తున్నారని మద్దతు ధర చట్టాన్ని గురించి గానీ హామీ ఇచ్చిన ఇతర అంశాల గురించి గానీ చర్చించడం లేదన్నారు.రెండు సంవత్సరాల నుండి రైతాంగానికి రాతపూర్వక ఇచ్చిన హామీలు అమలు పరచకుండా రద్దుచేసిన నల్ల చట్టాల విధానాలను దొడ్డిదారి అమలు చేసే కుట్ర జరుగుతుందన్నారు.మొత్తం వ్యవసాయ రంగాన్ని అదాని, అంబానీ ఇతర కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికే బిజెపి ప్రభుత్వం కంకణం కట్టుకుందని,ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులే నిదర్శనమన్నారు. ఎరువుల సబ్సిడీపై కోత పెంచడం, ఆహార భద్రత చట్టం అమలుకు నిధుల్లో కోత విధించడం,కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇవ్వడం ప్రభుత్వ కుటిలనీతికి అద్దం పడుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో మరొకసారి దేశవ్యాప్తంగా రైతాంగం, వ్యవసాయ కార్మికులు తమ కోర్కెలను గొంతు విప్పి వినిపించాలనే లక్ష్యంతో ఢిల్లీలో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చాయన్నారు. దేశంలో వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడుకోవాలంటే మోడీ వారి మిత్రులను ఓడించి కార్పొరేట్ విధానాలు వ్యతిరేకించాలన్నారు.అప్పుడే రైతాంగం కోరుతున్న చట్టాలను సాధించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు.

????రోడ్డు సైడ్ చిన్న వ్యాపారస్తులకు భద్రత కలిపిం చి వారికి షాపులు నిర్మించి ఇవ్వాలి సిపిఎం డిమాండ్*

కర్నూలు నగరంలోని రోడ్డు సైడ్ చిన్న వ్యాపారస్తుల సంఘం జనరల్ బాడీ సమావేశం ,పాతబస్తీలోని సుర్జిత్ భవన్ నందు, షేక్ మొహమ్మద్ షరీఫ్ అధ్యక్షతన జరిగింది .ఈ సమావేశానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు, కె ప్రభాకర్ రెడ్డి, సిపిఎం కర్నూల్ అసెంబ్లీ అభ్యర్థి డి గౌస్ దేశాయ్, నగర కార్యదర్శి ఎం రాజశేఖర్ లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు.కర్నూలు నగరంలోని రోడ్డు సైడ్ చిన్న వ్యాపారస్తుల అందరికీ, భద్రత కల్పించి ,వారికి షాపులు నిర్మించి ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు.కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న వైసిపి ప్రభుత్వం ,ఎటువంటి ఉపాధి, పరిశ్రమలు, ఉద్యోగాలు కల్పించడం లేదని ఈ 10 సంవత్సరాలలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలు ఉపాధి ,ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుపోవడం వల్ల సంవత్సరానికి వేలాదిమంది ఇంజనీరింగ్ కాలేజ్ నుండి యువకులు బైటికి వస్తా ఉన్నారని,వారికి ఉపాధి లేక రోడ్డును ఆసరాగా తీసుకొని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా, స్వయంగా తమ కాళ్ళపై తాము ,జీవిస్తూ తమ కుటుంబ పోషణ కోసం, దుమ్ము ,ధూళి, కాలుష్యాన్ని దిగా మింగుతూ తమ ఆరోగ్యాలు చెడిపోతా యాని తెలిసిన, ఉపాధి లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో జీవిస్తున్నారని, వారు తెలియజేశారు ఇటువంటి యువతకు కనీసం కొత్తగా ఏర్పడే ప్రభుత్వాలైన పరిశ్రమల ఉపాధి కోసం హామీ తీసుకోవాలని వారు కోరారు. కార్మికుల సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టారు.సిపిఎం పార్టీ అనునిత్యం కార్మికుల సమస్యలపై ,వారి సంక్షేమం కోసం కార్మికుల హక్కుల సాధన కోసం, నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే, సిపిఎం పార్టీ అభ్యర్థి అయినటువంటి డి గౌస్ దేశాయ్ ,సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై, ఓటు వేసి వేయించి ,గెలిపించాలని పిలుపునిచ్చారు.కార్మిక నాయకుడు గౌస్ దేశాయ్ విజయం మన పేద, బడుగు బలహీన వర్గాల,కార్మిక ,కర్షక, ఉద్యోగ ,ఉపాధ్యాయ విజయంగా భావించి,నేటి నుండి ఎన్నికల అయ్యేంతవరకు, ప్రజలను ఒప్పించి, మెప్పించి ,ప్రజల మన్నలను పొంది ,ఆ రకంగా ఓట్లు వేయించాలని వారు కోరారు. సమావేశంలో సంఘం నగర నాయకులు ఆర్ నరసింహులు ఈశ్వర రెడ్డి శివకుమార్ ఇలియాస్ లక్ష్మయ్య విజయ్ కుమార్ సల్కాపురం అక్బర్ బాషా షాషా ఇమ్రాన్ సాంబశివ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి గిద్దలూరు నియోజకవర్గ అభ్యర్థిగా ముత్తుముల అశోక్ రెడ్డి..

తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి గిద్దలూరు నియోజకవర్గ అభ్యర్థిగా ముత్తుముల అశోక్ రెడ్డిని అధిష్టానం నిర్ణయించింది. ఈ సందర్భంగా గిద్దలూరు పట్టణంలోనూ, కొమరోలు మండల ఇస్లాంపేట యూత్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆనందోత్సాహాలతో బాణాసంచా కాల్చి ముత్తుముల అశోక్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.*

**వైసీపీకి గుడ్ బై చెప్పిన పాపినేనిపల్లె ఎంపీటీసీ* ప్రకాశం జిల్లా,. గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండలం, పాపినేనిపల్లె గ్రామానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ సభ్యురాలు మీనిగే వెంకట సుబ్బమ్మ అధికార వైసీపీ పార్టీకి గుడ్ బై చెపుతూ టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.ఈ సందర్బంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువా కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు.

????ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన 40 బీసీ, మైనార్టీ కుటుంబాలు……ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇన్చార్జ్ మరియు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో కంభం మండలం, కందులాపురం గ్రామానికి చెందిన 20 యాదవ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు మరియు 20 మైనార్టీ కుటుంబాలు మొత్తం 40 కుటుంబాలు ఒంగోలు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కేతం శ్రీను ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టిడిపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.కార్యక్రమంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు మైలగాని రాజు యాదవ్, బొర్రా కిరణ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు కుక్క పులిభద్రుడు, మైనార్టీ నాయకులు షేక్ అలీ ముస్తఫా, గమిని రంగారావు, మొర్రి కాశయ్య, గమిని రంగస్వామి తదితరులు పాల్గోన్నారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*