కారు,ఆటో ఢీ. ముగ్గురు మృతి. ముగ్గురికి తీవ్ర గాయాలు.. పరామర్శించిన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల.. ఏజీపీగా సంగీతరావు.. కోనసీమ జిల్లాలో చర్చికి నిప్పు

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఎదురుదురుగా వస్తున్న కారు ఆటో ఢీకొనగా ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా , ఇద్దరు ఆటోలో సజీవ దహనం అయ్యారు.కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ, ఆటో డ్రైవర్ కి తీవ్ర గాయాలు కాగా వీరిని మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించారు .మృతులు బెస్తవారిపేట మండలం బార్లకుంటకు చెందిన వెంకటేశ్వర్లు,చిన్న వెంకటేశ్వర్లు, శ్రీరాములుగా గుర్తించారు.ఈఘటనపై ఎస్త్సె నరసింహరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మార్కాపురం డి.ఎస్.పి బాల సుందర రావు కంభం సీఐ కే రామకోటయ్య సంఘటన స్థలానికి విచారణ చేపట్టారు  .

*బాధిత కుటుంబాలను పరామర్శించిన వైసీపీ ఇన్చార్జ్*..రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను గిద్దలూరు వైసిపి ఇన్చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి పరామర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పోలీసులు కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయాన్ని తెలుసుకున్న గిద్దలూరు వైసిపి ఇన్చార్జ్ మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి హుటాహుటిన కంభం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

*బాధిత కుటుంబాలను పరామర్శించిన తెలుగుదేశం పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి ముత్తుముల..ఈ సంఘటన గురించి తెలుసుకున్న  గిద్దలూరు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి ముత్తుముల అశోక్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హుటాహుటిన కంభం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు .ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

????ఏ.జీ.పీగా  దాసరి సంగీతరావు ..   

గిద్దలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులోనూతన అసిస్టెంట్ గవర్నమెంట్ న్యాయవాది (ఏ. జి.పి ) గా ప్రముఖ సీనియర్ న్యాయవాది దాసరి సంగీతరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గిద్దలూరు మండలం ఆదిముర్తిపల్లే పంచాయతి జమ్ముల్లపల్లే గ్రామానికి చెందిన సంగీతరావు సంజీవరాయునిపేటలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. గిద్దలూరులోని ఎస్. వి డిగ్రీ, పి. జి కళాశాలలో బి. ఏ, ఎం. ఏ అభ్యసించారు. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర విద్య ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం పూర్తి చేసి పట్టా అందుకున్నారు. 21 సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తూ గుర్తింపు పొందారు. ఇప్పటి వరకు ఏజీపీగా వ్యవహరించిన వల్లెల వెంకటరామిరెడ్డి నుండి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కోర్టులోని న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన సీ.ఎం వై యస్ జగన్మోహన్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు లు సజ్జల రామకృష్ణారెడ్డి , గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబులకు కృతజ్ఞతలు తెలిపారు.

???? చర్చి కి నిప్పు .. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న  దళితసంఘాలు..

డా.బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా: కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వద్దుపర్రు గ్రామంలో కాలువ రేవు ప్రక్కన గత 12 సంవత్సరాలుగా పాస్టర్ రెవరెండ్ దాసరి మోజేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బైబిల్ మిషన్ భేతెస్తే స్వస్థత శాలపై కొంతమంది దుండగులు ఆదివారం అర్ధరాత్రి తెల్లవారితే సోమవారం సుమారు ఒంటి గంట ప్రాంతంలో మందిరములోనికి ప్రవేశించి, విలువైన వస్తు సామాగ్రిని ధ్వంసం చేసి సుమారు మూడు లక్షల 50 వేల రూపాయలు విలువగల ఎలక్ట్రానిక్స్ పరికరాలను ధ్వంసం చేసి మందిరంలోపల పాత ఎక్సెల్ బండిని ఉంచి నిప్పంటించడం జరిగింది.దీంతోమందిరం పూర్తిగా మంటల్లో చిక్కుకుని దగ్ధమై బూడిద పాలయింది. ఈ విషయం తెలుసుకున్న ఆత్రేయపురం మండల పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులందరూ అక్కడకు చేరుకుని ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుని, ఈ దాడిలో నష్టపోయిన పాస్టర్ మోజేష్ ని అన్ని విధాలుగా ఆదుకోవాలని నినాదాలు చేస్తూ, స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పత్రాన్ని అందజేశారు.విషయం తెలుసుకున్న స్థానిక దళిత సంఘాలన్నీ అక్కడకు చేరుకుని పాస్టర్లకు మద్దతు తెలియజేశారు.ఈవిషయంలో ఎవరి పాత్ర ఉన్నా ఎంతటి వారైనా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేనియెడల పాస్టర్ కి న్యాయం చేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.

 

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*