బీజేపీ కొత్త బేరం..బాబుకు ఓకేనా…!? గిద్దలూరు వైసీపీకి భారీ షాక్..!!! పోలీసుల ప్రవర్తనావళి మారాలి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..!!!

  •  భారతీయ జనతా పార్టీతో పొత్తు టీడీపీకి ప్రాణ సంకటంగా మారుతోంది. ఒక విధంగా పులి మీద స్వారీగా ఉంది అంటున్నారు. పొత్తు ఉన్నా లేకపోయినా రెండూ ఇబ్బందిగానే ఉన్నాయి. పైగా కేంద్రంలో మూడవసారి బీజేపీ వస్తే టిడిపికి తిప్పలు తప్పవు.. బిజెపితో దోస్తీ తప్పనిసరి అని టిడిపి భావిస్తుంది.ఏపీలో టీడీపీ గెలవాలన్నా గెలిచి అయిదేళ్లు రాజ్యం చేయాలన్నా ఇపుడు బీజేపీ సాయం అవసరం అని అంటున్నారు. అందుకే బీజేపీ పెద్దలతో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి మాట్లాడి వచ్చారు. అమిత్ షాతో చర్చించిన తరువాత కూడా పది రోజులు ఇట్టే గడచిపోయాయి. కానీ అఫీషియల్ గా ఏమీ తేలలేదు, ఏ ప్రకటనా రాలేదు. దాంతో ఏమి జరుగుతోంది అన్న చర్చ కూడా ఉంది. ఇదిలా ఉంటే తమ పార్టీ ముఖ్యులతో చంద్రబాబు మాట్లాడుతూ బీజేపీతో పొత్తు విషయంలో సానుకూలంగా మాట్లాడారు అని అంటున్నారు. అంటే బీజేపీతో పొత్తు ఇష్టమే కానీ ఆ పార్టీ పెడుతున్న ప్రతిపాదనలే కొంత ఇబ్బందికరంగా ఉన్నాయని అంటున్నారు. అదే టైం లో ఏపీలో ఉన్న మొత్తం పాతిక పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఏడు సీట్లలో టీడీపీకి నాలుగు జనసేనకు రెండు బీజేపీకి ఒక సీటు అన్న ఫార్ములాతో అమిత్ షా బాబు వద్ద బేరం పెట్టారు అని అంటున్నారు. అయితే ఈ ప్రతిపాదన ప్రకారం చూస్తే టీడీపీ వంద సీట్లలో మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. జనసేనకు యాభై బీజేపీకి పాతిక సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోనే టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది అని అంటున్నారు. ఈ పొత్తు ప్రతిపాదన ఇలా ఉండగానే బహుశా టీడీపీ ఆలోచనలు పసిగట్టారో లేక ఎవరైనా చెప్పారో తెలియదు కానీ మరో ప్రతిపాదన బీజేపీ నుంచి లేటెస్ట్ గా వచ్చింది అని అంటున్నారు. ఆ ప్రతిపాదన ప్రకారం చూస్తే ఎమ్మెల్యే సీట్లు అయిదు బీజేపీ తగ్గించుకుంది అని అంటున్నారు. అంటే ఇరవై ఎమ్మెల్యే సీట్లు ఆరు దాకా ఎంపీ సీట్లు ఇస్తే పొత్తు ముందుకు వెళుతుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో కూడా పితలాటకం ఉందని అంటున్నారు. అదెలా అంటే బీజేపీ కోరుతున్న ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ టీడీపీ బలంగా ఉండే ప్రాంతాలలోనే అంటున్నారు. అదెలా ఉన్నాయంటే ఎంపీ స్థానాల్లో విశాఖపట్నం, నర్సాపురం, రాజమండ్రి, విజయవాడ, హిందూపురం, రాజంపేట లేదా తిరుపతి కోరుతున్నారు. అదే విధంగా 20 అసెంబ్లీ స్థానాల జాబితాను ప్రతిపాదించారు. అందులో రాజమండ్రి సిటీ, పి గన్నవరం (ఎస్సీ), కైకలూరు, విజయవాడ సెంట్రల్, గుంటూరు పశ్చిమ వంటి టీడీపీ కీలక స్థానాలు కూడా ఉన్నాయి. అలాగే తిరుపతి లేదా శ్రీకాళహస్తి, మదనపల్లె, విశాఖ ఉత్తరం, అరకు, శ్రీకాకుళం, నెల్లూరు సిటీ లేదా రూరల్, ఒంగోలు, నర్సరావుపేట, ప్రత్తిపాడు, బాపట్ల, కాకినాడ సిటీ, ఏలూరు, జమ్మలమడుగు, ధర్మవరం ఇవ్వాలనేది బీజేపీ తాజా ప్రతిపాదనగా ఉంది. అయితే బీజేపీ ప్రతిపాదన ఎలా ఉంది అంటే అయిదూళ్ళు చాలు అని కీలక స్థావరాలనే కోరినట్లుగా ఉంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఇప్పటికే చంద్రబాబు జనసేన బీజేపీకి ఇవ్వాల్సిన సీట్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు అని ప్రచారం సాగుతోంది. దానిని బట్టి చూస్తే కనుక జనసేనకు 25 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు ఎంపీ స్థానాలు అని అంటున్నారు. అలాగే బీజేపీకి పది ఎమ్మెల్యే, నాలుగు దాకా ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ ఓకేగా ఉంది అని అంటున్నారు. ఇవి కూడా టీడీపీ తాను సూచించిన సీట్లనే ఇచ్చేందుకే సిద్ధం అంటున్నారు. అంటే టీడీపీ చెప్పిన నంబర్ కి చూపించే సీట్లకు బీజేపీ అయినా జనసేన అయినా ఒప్పుకోవాలి అన్న మాట. మరి బీజేపీ అలా కాదూ కూడదు అంటే ఈ పొత్తు ఏమవుతుంది అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా జనసేనతో కొంత బాగానే ఉన్నా ఈసారి బీజేపీ నుంచే ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు. దీంతో బీజేపీని ఒప్పించే పనిలో పవన్ తొందరలో ఢిల్లీ టూర్ వేయనున్నారు అని ప్రచారం కూడా సాగుతోంది.

????పోలీసులు ఉన్నదే ప్రజల కోసం… పోలీస్ స్టేషన్‌కు ఎవరూ సరదాగా రారు.. తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..పోలీసుల ప్రవర్తనాశైలి మారాల్సి ఉందన్న హైకోర్టు..ఫిర్యాదుదారులను భయాందోళనలకు గురి చేస్తున్నారని వ్యాఖ్య..పోలీస్ విధులను గుర్తుచేసేలా అవగాహనా తరగతులు నిర్వహించాలని డీజీపీకి ఆదేశాలు..

పోలీసులపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఇకపై ఎవరూ కోర్టులకు రాకుండా చూడాలని పోలీసులకు సూచించింది. పోలీసుల ప్రవర్తనాశైలి మారాల్సి ఉందని సూచించారు. ఫిర్యాదుదారులను భయాందోళనలకు గురి చేస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులు ఉన్నదే ప్రజల కోసమని గుర్తించాలని పేర్కొంది. పోలీస్ విధులను గుర్తు చేసేలా అవగాహనా తరగతులు నిర్వహించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ స్టేషన్‌కు ఎవరూ సరదాగా రారని చురక అంటించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం ప్రజలకు చాలా కష్టంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

????ముత్తుముల సమక్షంలో వైసిపిని వీడి టీడీపిలో చేరిన 100 కుటుంబాలు..

గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీకి స్వంత పార్టీ నాయకులే దెబ్బ మీద దెబ్బ కొడుతూ భారీ షాక్ లు ఇస్తున్నారు. నియోజకవర్గంలో వైసిపిని వీడుతూ తెలుగుదేశం పార్టీలోకి క్యూలు కడుతున్నారు. గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపి ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో గిద్దలూరు మండలం, వెంగళరెడ్డిపల్లె గ్రామానికి చెందిన పార్శ రామలింగస్వామి  ఆధ్వర్యంలో గ్రామంలోని కాపు సోదరులు, వడ్డెర సోదరులు, మైనార్టీ సోదరులు, రజక సోదరులు, రెడ్డి సోదరులు మొత్తం 100 కుటుంబాలు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా అశోక్ రెడ్డి టీడీపి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*