కమ్యూనిస్టు వారసత్వాన్ని అందించిన మహనీయుడు వెంకటస్వామి మాజీ రాజ్యసభ సభ్యులు పి. మధు

కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని తాను ఆచరించడమే కాదు తాను నమ్మిన పార్టీకి వారసత్వాన్ని అందించిన ఘనత వెంకటస్వామికి దక్కుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పి మధు అన్నారు. సోమవారం మరిపూడి మండలంలోని కెల్లంపల్లి గ్రామంలో గ్రామ మాజీ సర్పంచి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తండ్రి వంకాయలపాటి వెంకటస్వామి సంతాప సభ జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు ఎం. రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మధు మాట్లాడుతూ భయంకరమైన కలరా వ్యాధి ప్రబలి గ్రామాలలో ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడిన కష్టకాలంలో కమ్యూనిస్టు పార్టీ పిలుపుమేరకు వైద్యం నేర్చుకొని పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించిన సేవా తత్పరత కల వ్యక్తి వెంకటస్వామి అన్నారు. గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలను ఐక్యం చేయడంలో ముందుండేవారన్నారు వెనకబడిన ప్రాంతంలో జన్మించిన విద్య ప్రాధాన్యతను గుర్తించి వెంకటస్వామి కుమారుడు శ్రీనివాసరావును ఉన్నత విద్యాభ్యాసం చదివించేందుకు కావలి జవహర్ భారతిలో చేర్పించారన్నారు. పార్టీ విభజన అనంతరం విద్యార్థి ఉద్యమ నాయకుడిగా నెల్లూరు జిల్లాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాసరావు అంచలంచలుగా కేంద్ర కమిటీ సభ్యులుగా నేడు రాష్ట్ర కార్యదర్శిగా ఎదుగుదలలో తన తండ్రి వెంకటస్వామి కృషి, శ్రమతో పాటు కుటుంబ సభ్యుల, బంధుమిత్రులు అక్కాచెల్లెళ్ల ప్రోత్సాహం చాలా గొప్పది అన్నారు. వెంకటస్వామి చాలా నిష్టగా ఓర్పుగా క్రమశిక్షణతో కుటుంబాన్ని నడిపించడంలో ఆదర్శంగా నిలిచాడు అన్నారు శ్రీనివాసరావు భార్య మరణించిన కుటుంబంలో ఎన్నో కష్టాలు వచ్చినా వెరవకుండా ముందుకు సాగారన్నారు. వెంకటస్వామి చేసిన సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకోవడమే ఆయనకు నిజమైన నివాళులు అర్పించినవారిమవుతామన్నారు. వృద్ధాప్యంలో వెంకటస్వామికి మనవరాలు ఆశాభారతి ప్రసాదు మునిమనవరాలు నక్షత్ర చేసిన సేవలు కమ్యూనిస్టుల నిబద్ధతకు నిదర్శనం అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు వై. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వెంకటస్వామి అభ్యుదయ విలువలు పాటించిన ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ గ్రామంలో సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించారన్నారు. అప్పట్లోనే భక్తి అనేది వ్యక్తిగతమని రాజకీయం ప్రజాసేవ అని స్పష్టంగా విభజన గీత గీసిన వెంకటస్వామి నేటి తరానికి ఆదర్శమన్నారు.తన వృద్ధాప్యం, అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా నిత్యం ఉత్సాహంగా ఉండేవారు అన్నారు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ కట్టుబాట్లతో కునారిల్లుతున్న వెనకబడిన ఈ గ్రామంలో ప్రజలను చైతన్యవంతం చేసేలా కుమారుడికి ఆదర్శ వివాహం జరిపించాడన్నారు. సిఐటియు రాష్ట్ర నాయకురాలు పి. రోజా మాట్లాడుతూ వెంకట స్వామి గారు మహిళలను ఎంత గౌరవించేవారో కుటుంబ సభ్యుల తీరును బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.ఎల్. నారాయణ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని వెనకబడిన పొదిలి తాలూకాలో వీరాస్వామి కాసిరెడ్డి తో కలిసి కమ్యూనిస్టు ఉద్యమాన్ని విస్తరించడంలో వెంకటస్వామి పాత్ర మరో లేనిదన్నారు.ఉమ్మడి పార్టీలో పొదిలి సమితి అధ్యక్షులుగా సానికొమ్ము కాసిరెడ్డి విజయానికి దోహదం చేసిన వ్యక్తి అన్నారు.సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర జాయింట్స్ కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మరణం అందరికీ సహజమని కానీ వెంకటస్వామి పార్టీ నిర్బంధంలో సైతం నిలబడటమే కాక చివరి వరకు కమ్యూనిస్టుగా జీవించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. తెలుగు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పొదిలి మాజీ ఏఎంసి చైర్మన్ మాట్లాడుతూ యర్రమోతు శ్రీనివాసులు మాట్లాడుతూ నాడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన మాలాంటి ప్రజాప్రతినిధులకు వెంకటస్వామి ప్రజాసభ ఎలా చేయాలో నేర్పించిన వ్యక్తి అన్నారు. సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు వై సిద్దయ్య మాట్లాడుతూ ఆత్మాభిమానం గల వ్యక్తిగా ప్రజల సమస్యల పరిష్కారం చేయడంలో తనదైన శైలిని చూపించారన్నారు. మరిపూడి మండల టిడిపి నాయకులు రేగుల వీరనారాయణ మాట్లాడుతూ గ్రామ రైతులను ప్రైవేటు బస్సు యజమానులు అవమానించగా రైతులను ఐక్యం చేసి ఏడాది పాటు ఆ బస్సులు ఎక్కకుండా ప్రజలను చైతన్యవంతం చేయడంలో వెంకటస్వామి పాత్ర మరో లేనిదన్నారు. గ్రామంలో మౌలిక వసతులు పొలాలకు కచ్చా రోడ్లు నిర్మాణం, టెలిఫోన్ సౌకర్యం అందుబాటులోకి రావడానికి వెంకటస్వామి కారణమన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ అనీఫ్ మాట్లాడుతూ కష్టకాలంలో ప్రజలకు సేవ చేయడంలో వెంకటస్వామి స్ఫూర్తిగా నిలిచారన్నారు. జిల్లాలో ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగించేందుకు ప్రతి ఒక్కరం కృషి చేయాలి అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీవ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, ప్రజాశక్తి ఎడిటర్ బి తులసీదాసు, సిఐటియు రాష్ట్ర నాయకురాలు కే సుబ్బారావమ్మ, సిపిఎం ఎన్టీఆర్, బాపట్ల జిల్లా కార్యదర్శులు డివి కృష్ణ, సిహెచ్ గంగయ్య, నెల్లూరు, పల్నాడు, గుంటూరు జిల్లా నాయకులు పి అజయ్ కుమార్, జి వెంకటేశ్వర్లు, జి చలమయ్య, బి బావ న్నారాయణ, సిపిఎం తెలంగాణ నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, ఆర్ వెంకట్ రాములు, ఎం శోభన్ నాయక్, కే రమేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జివి కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, ఎస్.కె మాబు, ఊస వెంకటేశ్వర్లు, డి సోమయ్య, వి ఆంజనేయులు, ఐద్వా పల్నాడు జిల్లా నాయకురాలు జి ఉమాశ్రీ,ఐద్వా ప్రకాశం జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి, సిపిఎం జిల్లా నాయకులు జి. రమేష్, బి సుబ్బారావు,బి. రఘురాం, కె సుబ్బారావు, ప్రజాశక్తి ఒంగోలు ఎడిషన్ మేనేజర్ ఎమ్.యల్.వి. ప్రసాద్ రావు, బ్యూరో ఎస్ వి బ్రహ్మం, పొదిలి పెద్ద చెరువు సాగర్ నీటి స్ఫూర్తి ప్రదాత మాకినేని వెంకటరమణయ్య ,సీనియర్ జర్నలిస్టు శ్రీరామ కోటేశ్వరరావు, సిహెచ్ కృష్ణారావు,జె వి వి నాయకులు కావూరి రఘచంద్,పోస్టల్ శాఖ నాయకులు జి శ్రీనివాసమూర్తి, గ్రామ మాజీ సర్పంచి వంకాయలపాటి వెంకయ్య, వెంకటస్వామి కుటుంబ సభ్యులు వి ఆశాభారతి, బి ప్రసాద్, నక్షత్ర, సిపిఎం నాయకులు ఎం వెంకటేశ్వరెడ్డి, పి బాలనర్సయ్య, ఏ. శ్రీనివాసులు,ఎ.బాదుల్లా, జి. నరసింహారావు పాల్గొన్నారు.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్